ఆదిపర్వం లో గరుదోత్పత్తి ఆ ఆఖ్యానం ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.
నన్నయ గారు దానికి ఫలశ్రుతి చెప్పారు, అది అనేక విధాలుగా ,మంత్ర రహస్యం గా దివ్యమైన దర్శనం గా. అనితర సాధ్యమైన బాల పరాక్రమముల తో జన్మించిన ఒక దివ్య పురుషుని గాధ గా, తల్లి ని దాస్యం నించి విడిపించిన కుమారుని యొక్క చరిత్ర గా విశేషించి మహాభారతం కధ అంతా సుక్ష్మీకరింస్తుంది. మహాబారతం ఎందుకు వచ్చిందో, గరుడోత్పత్తి లోనే ఉంటుంది. వినతా కద్రువ కశ్యప ప్రజాపతి, వారి కధే నించే మహాబారతం నిర్మాణం చెయ్య బడినది. ఆ కధలోనే మనిషి దేనివలన పాడు అవుతాడో, దేని వలన ఉద్దతి ని పొందుతాడో,ఒక చెట్టు తొర్ర లో ప్రారంభం అయిన అగ్ని హోత్రం చిట్ట చివరకు ఆ చెట్టు ని ఎలా కల్చేస్తుందో. మానని సంతోషింప చేసే గుణం మానని మనల్ని ఆశ్రయించిన వారిని కూడా చిట్ట చివరకు నశింప చేస్తుందో,అటువంటి విశేషములతో కూడిన ఆఖ్యానం ఈ గరుడోత్పత్తి. ముందు భాగం లో చేపున్నాము, నీ తండ్రి యొక్క శిష్యుడైన అస్తీకుని వలన జనమేజయ సర్ప యాగం ఆగింది అని అన్న మాటని సహస్రపాదుడు చెప్పిన కారణం చేత రురుడు పాముల్ని చంపడం పక్కన పెట్టి ఒక ఉత్తముడైన బ్రాహ్మణుడు ఎలా జీవనం చెయ్యాలో అలా జీవిoచడo ప్రారంభం చేసాడు. మీరు పురాణ కధలని వింటే బ్రాహ్మణుడి గురించే చెప్తారు. తప్పు చేసినా బ్రహ్మనున్నే ఎత్తి చూపిస్తారు, మంచి చేసినా బ్రహ్మనున్నే శ్లాఘిస్తారు. బ్రాహ్మణుడు సమాజమును నడిపించ గలిగిన వాడై ఉంటాడు, ఆయన నిరంతరం అధ్యయన శీలి అయి ఉండాలి. తాను నిరంతరం ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందుతూ , ఆ అనుగ్రహముచేత తానూ పలికే వాక్కు చేత వ్యక్తులు తమనితాము పర్సీలించు కునేలాగా ఉండాలి. అందుకే ఎప్పుడు బ్రహ్మనుణ్నే వేలెత్తి చూపిస్తారు, ఆ బ్రహ్మణుడు మంచి వాడైతే ఆయనని కాపాడమని శాస్త్రం చెప్తుంది. నన్నయ్య గారు గరుడోత్పత్తి ని ప్రారంభం చేస్తూ చెప్తున్నారు. కృత యుగం లో కశ్యప ప్రజాపతి అనేకమంది భార్యల తో ఉండే వారు, మళ్ళి అదో గమ్మత్తు బ్రాహ్మణునకు నలుగు వర్ణముల వారిని భార్యలు గా స్వీకరించుటకు అధికారం ఉంది. అయితే దానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్తితులు ఉంటై , ఆయ పరిస్తితుల ల యందు స్వీకరించాలి తప్ప,అధికారం ఉంది కదా అని స్వీకరించకూడదు. ఏక పత్ని వ్రతమే అన్నిటికన్నా సర్వో త్కృష్ట మైన వ్రతం , కానీ కొన్ని కొన్ని కారణముల చేత నాలుగు వర్ణముల వారిని వివాహం చేసుకొనుట , బ్రాహ్మణుడికి శాస్త్రం లో అంగీకరింప బడిన సిద్ధాంతం.
కశ్యప ప్రజాపతి అంత మంది భార్యల ని స్వీకరించాడు అంటే కారణం ఓక్కటే చతుర్ముఖ బ్రహ్మ గారు ఆయనని ఆదేశించారు. ఈ భూమి మీద ఎన్నో ప్రాణి జాతుల ఉత్పత్తి జరిగేటట్టు గా చాలా గొప్ప తేజస్సు కల వాడివి కనుక ,నీవు ప్రజపతివి కనుక , నా పుత్రుడివి కనుక ,ప్రజల ఉత్పత్తి కొరకు అనేకమైన ప్రాణులను ఉత్పత్తి కొరకు నీవు తగిన పరిశ్రమ చేయవలసింది అని ఆజ్ఞాపిస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక రకములైన ప్రాణులు , పాములతో సహా, అన్ని కూడా కశ్యప ప్రజాపతి బిడ్డలే ,ఆ మాట కొస్తే ఈ భూమి కూడా కశ్యప ప్రజపతిదే. అందుకే కశ్యప ప్రజాపతి స్పర్స లేకుండా మీకు ఎక్కడా ఏది ఉండదు, అంతటి మహాపురుషుడు. ఆ కశ్యప ప్రజాపతికి ఉన్న భార్యలలో కద్రువ , వినత కూడా ఆయన భార్యలు. ఈ కధకు కశ్యప ప్రజాపతి యొక్క ఆ ఇద్దరి భార్యలే ప్రాముఖ్యం కనుక ఆ ఇద్దరి భార్యల గురించి ప్రస్తావన చేస్తున్నారు. వారు భర్త ని ప్రార్థన చేసారు, మీ తేజస్సు వలన మేము సంతానమును పొందాలని అనుకున్నాము అన్నారు. ఇలా అడిగే ముందు కొన్ని వేల సంవత్సరములు ఆయనకి పరిచర్య చేసారు. ధర్మ బద్ధమైన సంతానమును పొందుట కొరకే వివాహం అనే ప్రక్రియ వచ్చింది. ధర్మ పత్ని అని కామాన్ని ధర్మం తో ముడి వేసేస్తారు. ముడివేసి స్త్రీ ని తీస్కొచి పక్కన కూర్చో పెడతారు. ఇప్పుడు ఆయన ఆమె యందు అనురక్తుడై ఉంటె ఏమి తప్పు లేదు. కామము ని ధర్మము తో ముడి పెడితే, కొడుకు అనే అర్థం వచ్చింది. సంతానము కొరకు మాత్రమే వివాహం. ఇది సనాతన ధర్మము. కొడుకు కనడం తో సరికాదు ,ఆ కొడుకు సరైన బుద్ధి ని నేర్పించడం కూడా తండ్రి యొక్క కర్తవ్యమ్. సరియైన భార్య లభించక పోతే ఆ జన్మ పోతుంది. సరియైన కొడుకు లభించక పోతే , తనతో పోదు , ఏడు తరాలు చేసిన పుణ్యం పోతుంది. కద్రువ , వినత లు కశ్యప ప్రజాపతిని అడిగారు నీ వలన మేము సంతానం పొందాలని అనుకుంటున్నాం, ఆపుడు కశ్యప ప్రజాపతి అన్నాడు , తప్పకుండా మీకు ఎటువంటి సంతానమును పొందుదాము అని ఉందొ నాకు చెప్పండి. ఆయన తన వాక్కు చేత నిర్ణయించ గలిగిన మహాత్ముడే, కాని ఆయన నిర్ణయించలేదు , ఆయన తామరాకు మీద నీటి బొట్టు లాంటి వారు, రాక్ష సులు ఆయన బిడ్డలే, దేవతలు ఆయన బిడ్డలే కాని ఆయన మాత్రం ఎప్పుడు బ్రహ్మ జ్ఞానం లో రమిస్తూ ఉంటాడు. ఆయన దేనినీ అంటి పెట్టుకుని ఉండే వాడు కాదు. సంసరమునందు ఉంది తరించిన మహాపురుషులే సనాతన ధర్మము నందు ఎక్కువ. కశ్యప ప్రజాపతి అటువంటి వాడు కనుక మీకు ఎటువంటి కుమారులు కావలి అని అడిగాడు అంటే కద్రువ మొట్ట మొదట కోరుకుంది. అగ్ని హోత్రం తో సమానమైన తేజస్సు కలవాళ్ళు , విశేషమైన బలం ఉన్న వాళ్ళు, చాలా పోడుగైనతువంటి దేహం కలిగిన వాళ్ళు , చాలా సత్వం ఉన్నటువంటి వాళ్ళు,నాకు అనేకమంది సంతానం కావలి అంది , ఆయన ఒక చిరునవ్వు నవ్వాడు , ఇలా వినత వంక తిరిగాడు , ఇందులో మనస్థితి అని ఒకటి ఉంటుంది, ఎంత అక్క చెల్లెళ్ళయిన తోడికోడళ్ళు , అందుకని ఇప్పుడు వీరిద్దరికి ఒకరికి పుట్టే బిడ్డల కన్నా బలవంతులు ఉండాలని,కద్రువ ముందేమని కోరుకుదంటే 1000 మంది పిల్లలు కావలి , దీర్ఘ దేహులు అంత పొడుగు శరీరం ఉన్న వాళ్ళు , అంత తేజస్సు ఉన్న వాళ్ళు ,అంత బలం ఉన్న వాళ్ళు నేను కోరుకున్నాను. ఇప్పుడు ఆవిడ మనసులో ఏదైనా కొంచం కోపం ఉందా అంటే ఉంది అని చెప్పడం కష్టం ఎందుకంటే ఆవిడ కోరిక కోరుకుంది. వెంటనే కశ్యప ప్రజాపతి వినత వంక చూసాడు , అప్పుడు వినత ఈవిడ ఎంత బలవంతులైన పిల్లలు కావలి అని కోరుకుందో అంతకంటే బలవంతులైన పిల్లలు కావలి అని కోరుకుంది. ఇప్పుడు ఏమవుతుంది కద్రువకి , అమ్మ బాబోయి దీని మనసులో ఇంత ఉండనమాట అని పిస్తుందా లేదా , అనిపిస్తుంది. ఈవిడ ఎంత బలవంతులు కావాలని కోరుకుందో అంత కన్నా బలవంతులు కావలి ,సుపుత్రులు కావలి ,ఒక తండ్రి సంతోషించ దగిన మాట అక్కడ వేసింది. సుపుత్రుడు అంటే తల్లి కీర్తి కన్నా తండ్రిని బాగా ఉన్నతమైన స్తానం లో నిలబెడతాడు. వినత యొక్క అదృష్టము చేత ఆమె నోట వెంట ఆ మాట వచ్చింది . తల్లి నీ ఆనంద పరుస్తాడు , ఆ పుత్రునివలన ముందు పేరు వచ్చేది ఎవరికీ అంటే ముందు తండ్రికి. కాబట్టి అపారమైన బల పరాక్రమములు కలిగిన వారు, కద్రువ కి పుట్టబోయే బిడ్డల కన్నా బలవంతులు, సుపుత్రులు ఇద్దరు కావలి అని అడిగింది. కశ్యప ప్రజాపతి అలాగే తదాస్తు, అలాంటి బిడ్డలే కలుగుతారు అన్నాడు . ఇప్పుడు ఆయన ఏమి చెయ్యాలి, వాళ్ళు కోరుకున్న బిడ్డలు ఎలాంటి బిడ్డలు కావాలని కోరుకున్నారో అలంటి బిడ్డలే కావాలంటే దైవానుగ్రహాన్ని సంపాదించాలి. అందుకని ఆయన పుత్రా కామేష్టి చేసాడు.
ఒకడికి కలిసొచ్చి కోట్లు వచ్చాయి అంటే అది వాడి గొప్ప కాదు. వాళ్ళ వంశం లో అంతకు ముందు అందరు కోట్లు ఉన్న వారు కారు, పరమ పేద వారు ఉంటారు , కాని ఆ వంశం లో తండ్రో తాతో ఎప్పుడో అప్పుడు వళ్ళంతా చెమట పట్టేoత కష్ట పడి సంపాదించుకున్న నాలుగు నూకల లో విశాల హృదయం తో ఎక్కడో అతిధి కో పరమ ప్రేమతో భగవంతుడికో, భగవద్ భక్తుడికో ,తెలిసో తెలియకో దానం చేసాడు. ఆయన చేసిన దానం ఉండే అది కోట్ల కోట్ల రెట్లై కూర్చుంటుంది. ఆ కూర్చున్న పుణ్యం ఏదైతే ఉందొ దాన్ని ఈయన అనుభవిస్తాడు. దాన్ని కేవలం దాచుకోవటమే వచ్చిందనుకొండి , క్రమం గా క్షయమై పోతుంది. అలా కాకుండా దానము ధర్మము అందులో ఒడుపెరిగి దానము, దానము ధర్మమూ ,గురువుగారిని సంప్రదించి చెయ్యవలసి ఉంటుంది. అలా కాకుండా మీ అంత మీరుగా దానం చేసరునుకోండి , అపాత్ర దానం జరిగితే దాని వాళ్ళ ఎంత మందికి ప్రమాదాలు వచ్చాయో దానికి కారణం మీరై కూర్చుంటారు.
అందువలన వాళ్ళడిగినటు వంటి బిడ్డలు కలగడం కోసం ఆయన పుత్రా కామేష్టి యాగం చేసాడు. అసలు మంచి బిడ్డలు కలగడానికి ఎవరైనా కూడా చెయ్య వలసినది , ఈస్వరారధానమే. దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇప్పుడు ఆ అనుగ్రహ కారణం చేత ఆయన తేజస్సు ఇద్దరి భార్యలలోకి ప్రవేశించింది. ఇప్పుడు వారి గర్భములు అందములు గా మారాయి, అపరిమిత బలపరాక్రములు కలిగిన బిడ్డలు కావాలని కోరింది వినత, మహా తేజోవంతులు అపారమైన పొడుగు ఉన్నవాళ్లు అనేకురు బిడ్డలు కావాలండి కద్రువ, ఇప్పుడు ఇంతమంది బిడ్డల్ని ఒక గర్భం లో మొయ్యడం చాలా కష్టం అందుకే ఆ దేవతల అనుగ్రహం కలిగితే ఎంత చమత్కారం అయిన జరగోచ్చు. కాబట్టి అండములుగా చేసి ఈశ్వరుడు వాటిని బయటికి వచ్చే టట్టు గా ఏర్పాటు చేసాడు. దాని వలన ఒక పక్షి గుడ్లు ఎలా పెడుతుందో వాళ్లిద్దరు గుడ్లను ప్రసవించారు. కద్రువకి వెయ్యి గుడ్లు కలిగాయి, వినతకి రెండు గుడ్లు కలిగాయి ఇప్పుడు ఈ గుడ్లు పోద గ బడాలి. తమంత తాముగా పొదగబడ డానికి ఏర్పాటు చేసి ఆ గోరువెచ్చని వాతావరణంలో ఈ గుడ్లని పెట్టారు. 500 ల సంవత్సరములు ఎదురు చూసారు. 500 సంవత్సరములు పొదగబడిన తరువాత, అంత తేజోవంతులైన బిడ్డలు కలగాలి అంటే, వారి అండవాసము అన్ని రోజులు జరిగింది. అన్ని రోజుల తరువాత కద్రువ ప్రసవించిన అండములలో నుంచి, పాములు బయటకి వచ్చాయి, అందులో ఆదిశేషుడు, తక్షకుడు, ఐరావతుడు మొదలైన వారు ఒక్కొక పాము పుట్టుకొచ్చాయి. వేయి పడగలతో ఈ భూమండలాన్ని అంతా మొయగలిగిన ఆదిశేషుడి అంతటి తెజోవంతులు అయిన 1000 మంది బిడ్డలు. కాకిపిల్ల కాకికి ముద్దు, ఆవిడా అలా కోరుకుంది కాబట్టి ఆవిడ సంతోషించింది.
పాములు పుడితే భయపడలేద అన్న ప్రశ్నలకి తావుండదు. మీకు ఈ సందర్భముగా ఒక విషయం చెప్పవలసి ఉన్నది. ఒక యదార్థ సంఘటన, ఒక ఆవిడకి పాము పుట్టింది , ఒకప్పుడు నిజంగా . చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పీఠాధి పత్యం లో ఉన్నపుడు, ఈ సంఘటన గురించి ప్రస్తావన చేశారు ఆయన, ఆమెకి పాము పుడితే ఆమె తల్లితనం తో ఆ పాముని ఎంతో ప్రేమతో పెంచుకుంది. ఆ పాముపిల్ల వచ్చి ఆమె పక్కలో పడుకునేది, ఆ పాము కి ఆకలేసి అమ్మ వాళ్ళో తిరుగుతుంటే , ఆమె గోరువెచ్చని పాలు , రోటి కన్నం లో పోసేది, ఈ పాము ఆ రోటి కన్నం లోకి ఎక్కి పాలు తాగుతూ ఉండేది. ఒకనుకోప్పుడు ఈవిడ పుట్టింట్లో ఏదో ఒక శుభకార్యానికి వెళ్ళవలసి వచ్చింది. ఈ పిల్ల ని తీసుకువెళ్తే అందరు విచిత్రంగా చూస్తారేమో, అల చుస్తే తనకి చిన్నతనం కాదు, అంతమంది ని చూసి తన బిడ్డడు భయపడతాడు అని అదీ తల్లిప్రేమ , ఆవిడ ఆ పాముని తీస్కేల్లటం మానేసి ఆవిడా ఒక్కర్తే వెళ్ళింది, వెళ్ళేముందు , వాళ్ళింట్లో ఒక వృద్దురాలికి , నా బిడ్డకి ఆకలేస్తే కొంచం పాలుపోయి, నా బిడ్డ కి ఆకలేస్తే ఒకటే గుర్తు, దానికి ఆకలేస్తే చుట్టూ తిరుగుతుంది, అప్పుడు రోట్లో కొంచం పాలు పోస్తే , పాలు తాగి పడుకుంటుంది అనిచెప్పి వెళ్ళింది. ఈ పాము వచ్చి గిర గిర తిరుగుతుంది ఆవిడ భయపడిపోయింది, భయపడిపోయి తొందరగా పోయ్యకపోతే ఏమిచేస్తుందో అని భయపడిపోయి, మరుగు పాలు తీస్కుపోయి ఆ రోటి కన్నం లో పోసింది. ఆ పాము గబ గబా వెళ్లి నోరు పెట్టింది, నోరు కాలింది. ఆ నోరుకలిందని తన్నుకోవటం లో రోటి కన్నం లో పడి పోయి శరీరం విడిచిపెట్టిoది. విడిచిపెట్టి తల్లికి కలలో కనిపించి అమ్మా నేను చనిపోయనమ్మ , రోటిలో వేడి వేడి పాలు పోసేసింది నా తర్వాత పుట్టే పిల్లల్ల కి నా పేరు పెట్టుకొవా అని అడిగింది. యదార్ధం గా జరిగిన సంఘటన ఇది. అసలు యదార్ధం ఏమిటంటే అన్ని ఉన్న పిల్లల మీద తల్లి ప్రేమ కన్నా అవకరలున్న పిల్లల మీదే తల్లి ప్రేమ ఎక్కువ.
కనుక కద్రువ పరమ ప్రేమతో ఆ బిడ్డల్ని పెంచుతుంది, వినత చూసింది, ఆవిడ అతిశయము కలిగినటువంటి స్త్రీ, అతిశయము అన్న మాట కి అర్థం ఏమిటంటే అతి విశ్వాసము, నా బుద్ధి తో నేను అలోచించి చెప్పేది ఏదైతే ఉందొ దానికి తిరుగులేదు, ఇది ప్రమాదకారి, ఇది ఎక్కడో అక్కడ పప్పులో కాలేయిస్తుంది. వేయించి నప్పుడు ఎలాఉంటుందో తెలుసండి , ఏదో చిన్నా చితకా తో పోదు, పట్టిన అహంకారం అంతా వదిలిపోయేటట్టు గా జాడిన్చేస్తుంది అతివిశ్వాసం. అతివిశ్వాసం తోటి పడ్డాడా గోతిలో , ఇక మళ్ళి లేవటానికి చాలా చాలా సమయం పడుతుంది , మీరు లోకం లో ఎక్కడైనా చుడండి. ఇదొక్కటే ఆవిడ తో ఉన్న పెద్ద సమస్య, అంత కన్నా ఏమి పెద్ద సమస్యలు లేవు. నేను బాగా ఆలోచించ గలను అందుకనే కద్రువ పిల్లల కంటే నాకే బలవంతులైన పిల్లలు కావలి అని కోరుకుంది. 500 సంవత్సరముల నుండి ఎదురు చూస్తుంది. అక్కడ పుట్టే పిల్లల కన్నా ముంది క్కడ పుడతరన్న ఆశ. ఎందుకంటే వీలేక్కువ బలవంతులు కదా అనుకుంది. 500 సంవత్సరముల తరువాత అక్కడ 1000 మంది పుట్టేసారు , ఇక్కడ ఒక్క గుడ్డు పగలలేదు. ఆవిడకి సిగ్గు కలిగింది అది విచిత్రం. నన్నయ గారు వాడిన మటేమిటంటే , లజ్జనోంది అంటే సిగ్గుచేంది. సిగ్గు వలన దుఖమును పొందింది. అది చిత్ర విచిత్రం గా బిడ్డలని పొందే విధానం కాబట్టి వాళ్ళ కన్నా బలవంతులని అడిగింది కాబట్టి ఇంకొంచం ఎక్కువ సమయం పట్టొచ్చు, ఎదురు చూడాలి, కానీ ఆమె దేనికి సిగ్గు అంటే అన్నిటిలో ఆమె కన్నా నేను ముందు ఉంటాను అనుకుంది. కానీ కద్రువ ముందు తల్లైంది ఇక్కడ ఎక్కడో నా విశ్వాసం దెబ్బ తిన్నది , నేను ఇంకా బాగా అలోచించ లేక పోయాను ఇది ఆవిడా సిగ్గుకి కారణం, ఇప్పుడు ఆవిడ సిగ్గులో దుఖం వచ్చింది. దేనికి పిల్లలులేరని ఏడవడం దేనికి గుడ్లు ఉన్నాయ్ గా ఇవ్వాళ కాకపోతే రేపు వస్తారుగా పిల్లలు. ఆవిడ ఎందుకు ఎద్చిందంటే , నేను తెలివైన దాన్ని తెలివైన దాన్ని అనుకున్న నా తెలివి తెల్లవారింది అని ఏడిచింది. అందరిముందు ఏడిస్తే తను బాగుపడింది అని గుర్తు , తనొక్కత్తే ఏడిస్తే ఇంకా ఆ గోరోజనం తగ్గలేదు అని గుర్తు. తగినంత పరిణితి ఏర్పడని జీవితాలు ఎలా ఉంటాయో మీరు చుడండి. ఇప్పుడు ఆవిడ ఏడిచి ఏడిచి సిగ్గు పొంది ఎలాగైనా నేనే తెలివైన దాన్ని అని అనిపించుకోవాలి అని నేను తల్లిని అయిపోయాను అనిపించేస్కోవాలన్న తాపత్రయం తో ఒక గుడ్డు పగలగోట్టేస్కుంది. ఒక గుడ్డు పగలగొట్టే టప్పటికి అందులోంచి ఒక పక్షి బయటకి వచ్చింది,ఆయన కి నడుం దగ్గర నించి పైన ఉండవలసిన శరీరం ఉంది, కింద ఉండవలసిన శరీరము లేదు. మహా తేజోమూర్తి ,గొప్ప సునిశిత బుద్ధి శాలి. అటువంటి వాడు పుడుతూనే పేరుతో పుట్టాడు , అరుణుడు ఆయన అమ్మ వంక చూశాడు , అతి విశ్వాసం నీది, అతి విశ్వాసం వలన సిగ్గుపడింది నువ్వు,ఆ సిగ్గు వలన ఏడిచింది నువ్వు, కద్రువ ఎదురు చూసింది గుడ్లలోనించి పిల్లలు వచ్చేంత వరకు. ఎంత సేపు కద్రువ అడిగిన వాటిని ద్రుష్టి లో పెట్టుకుని నీ తెలివిని ప్రదర్శించు కోవాలన్న అతిశయమ్ తో ప్రవర్తించవు, నేను పూర్తిగా శరీరం ఏర్పడకుండా ఇంత అంగవైకల్యం తో పుట్టేటట్టు చేశావు కనుక 500 సంవత్సలముల పాటు కద్రువ కు దాసి వగుదువు గాక! అని శపించాడు ఎక్కడ పడిందో చూసారా గోతిలో , ఇప్పుడు ఒక్కసారి బెంగ వచ్చింది , ఏమిటి బెంగ , ఇన్నాళ్ళు తాను చాలా తెలివైన దానిని అనుకుని ఎవరిమీద తాను పెత్తనం చేశాను అనుకుందో ఆవిడకి భయపడవలసిన రోజు వచ్చింది. 500 రోజుల తరువాత నీకు ఈ అతిశయం విరిగిపోతుంది అని అనుగ్రహం ఇచ్చాడు కొడుకు. ఈ అతిశయం ఇలా ఉండిపోతే ఇంకా ఎన్ని ప్రమాదాలు వస్తాయో అని , అమ్మా తొందరపడి ఒక గుడ్డుని పగలగొడితే కొట్టావు, కానీ రెండో గుడ్డుని మాత్రం పగల కొట్టవద్దు అని చెప్పాడు. అందులోంచి మహా తేజోమూర్తి ఉద్భవిస్తాడు , అతడు నిన్ను దాస్యం నుంచి విడుదల చేస్తాడు. అని చెప్పు మహానిభావుడైన అరుణుడు సూర్య భగవానుడికి రధ సారధి గా వెళ్ళిపోయాడు.
అలా కొంత కాలం అయిపోయింది. వినత కద్రువ ఇద్దరు కలిసి పాల సముద్రం దగ్గరకి వెళ్లారు . ఈ లోపల దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పొందాలి అన్న ఆశ కలిగింది. దేవతలు రాక్షసులు కలిసి క్షీర సాగర మదనం చేస్తే అందులోనించి అమృతం వస్తుంది. కాబట్టి వారు మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకటం కోసం ఆ పర్వతాన్ని దింపారు. ఆ మందర పర్వతం పాల సముద్రం లో మునిగిపొకూడదాని శ్రీ మహా విష్ణువుని ప్రార్థన చేస్తే, ఆయన ఆదికుర్మం అయి నిలబడితే ఆ తాబేటి డొప్ప పైన మందర పర్వతాన్ని నిలబెడితే , వాసుకిని పర్వతానికి చుట్టి , రాక్షసులు దేవతలు కలిసి క్షీర సాగరాన్ని చిలికారుట. చిలికితే ఆ మందర పర్వతం ఆయన వీపుకి వోరుసుకుంది , అప్పుడు ఆయన ఎప్పటి నించో విపు కొంచం దురదగా ఉంది అనుకున్నట్ట అది తీరింది ఆయనకీ అప్పుడు. చిలికేటప్పుడు శబ్దం వస్తుంది. చాలా పెద్ద శబ్దం వస్తే ఎక్కడో తపస్సు చేస్తున్న చతుర్ముక్ఖ బ్రహ్మ గారు ఏమిటి రా ఆ చప్పుడు ఏమిచేస్తున్నారా పిల్లలు అని ఒక్కసారి బయటకి వచ్చి చూసాడoట బ్రహ్మ గారు. అంత పెద్ద చప్పుడు వచిందంట. సరే అందులోంచి అమృతం వస్తుంది అనుకుంటే హాలాహలం వచ్చింది ముందు, మహానుభావుడు పరమేశ్వరుడు లోకములకు తండ్రి కాబట్టి ఆ హాలాహలమును ఆయన లోపలకి పుచ్చుకున్నాడు. తరువాత ఉచ్చెస్రవము అవి వచ్చాయి అవి ఇంద్రుడు పుచుకున్నాడు, కౌస్తుభమ్ వచ్చింది శ్రీ మహా విష్ణువు పుచ్చుకున్నాడు. శ్రీ మహా లక్ష్మి వచ్చింది శ్రీ మహా విష్ణువు ని వరించింది. తరువాత ధన్వంతరి అమృత పాత్ర తో బయటకి వచ్చాడు. ఇప్పుడు దేవతలు , దానవులు కలిసి ఈ అమృతాన్ని ఎక్కడ దాచాలి అని ఆలోచించారు, ఇంద్రుడికి అప్పచెప్దాం ఇంద్రుడు దాస్తాడు జాగ్రత్త గా అని ఇంద్రుడికి ఇచ్చారు, ఆ ఇంద్రుడు తీస్కెళ్ళి దాచుకుని అట్టే పెట్టాడు, దాచడం అంటే అన్ని వేళలా పుచ్చుకుని దాచడం అంటే చాలా కష్టం. దాచడం అంటే వెయ్యి కళ్ళతో చుస్తూ ఉండాలి అది తన ఒక్కడి సొత్తు కాదు కాబట్టి అందరుకలిసి పాల సముద్రం చిలికితే వచ్చిన అమృతం. అలా చాలా కాలం గడిచిన తరువత , ఈ క్షీరసాగర మదనం లో పుట్టిన ఒక తెల్లటి గుర్రం, ఈ పాల సముద్రం వొడ్డు దగ్గర మచ్చ లేని తెల్ల గుర్రం తిరుగుతుంది. తిరుగుతుండగా వినత కద్రువా విహరంగా అలా వచ్చారు. ఇప్పుడు కడుపులో మంట ఎవరికీ బయలుదేరిందంటే కద్రువకిబయలుదేరింది . ఎందుకంటే నేను 1000 పిల్లలు కావలి అన్నాను ,నా పిల్లల కంటే బలవంతులు కావలి అన్నది ఈ వినత. 500 సంవత్సరములు పొదగ బడ్డ తరువాత నా బిడ్డలు బయటకి వచాయి , అసలు ఇంకా పూర్తిగా పొదగ బడకుండా నే గుడ్డు బద్దలు కొడితే బయటకి వచ్చిన అరుణుడు సూర్యునికి రధసారధి అయ్యాడు , అంతటి తేజస్సు కలవాడు. ఇప్పుడు మరి ఒక 500 సంవత్సరముల తరువాత పుట్టే కుమారుడు మరింత తేజోవంతుడు రాబోతున్నాడు, ఇద్దరు కొడుకులు ఇంతటి తేజోవంతుల ముందు నా కొడుకులు ఏమి నిలబడతారు. దీనికి ఎన్ని తెలివితేటలు రా ఎంత గొప్ప కోరిక కోరింది రా ఇది. ఎలాగైనా ఈవిడని ఇబ్బంది పెట్టాలి అంటే అసూయ ప్రబలింది. ఎంత ప్రమాద కరమైన లక్షణమో అసూయ అన్నది. మీకు మహా భారతం తీర్పు చెప్పబోతున్నది. గాంధారి ఇదే , అక్కడే మొదలైంది భారతం. ఆవిడా అంతే కడుపు బాదుకుంది , అప్పుడు గర్భస్రావమై ఆ కడుపులో బిడ్డలు బయటకి వస్తే నేతి కుండలో పెట్టి పెంచితే , నూర్గురు పుత్రులు పుట్టారు.
ఎంత బలం ఉన్నదైన నేను చెప్పే మాట వినేటట్టుగా నా దగ్గర పడేసి ఉంచితే,ఆ బలం అంతా నాకోసం పనికొచ్చేదే కాని ఆ బలం సొంతానికి పనికిరాడుగా అప్పుదేమిచేస్తుంది. కాబట్టి ఎలాగైనా ఈ వినత ని నాకు దాసీ ని చేస్కోవాలి. ఇది ఆవిడ కడుపులో ఉంది ఆలోచన, అదును కోసం ఎదురుచుస్తుంది. ఇద్దరు ఆ పాల సముద్రం వొడ్డుకి వెళ్లారు , ఆ పాల సముద్రం చాలా గొప్పదైన స్థితిలో దాని కెరటములు , పాల నురగలు అందులోంచి వచ్చే తుంపరలు మంచి సంతోషం గా ఉంది. ఇద్దరు విహరిస్తున్నారు. కద్రువ అక్కడ ఉన్న తెల్లటి గుర్రం ని చూసింది , ఆవిడకి తెలుసు అది తెల్లటి గుర్రం పాల సముద్రం నించి వాచినది , దాని కి ఎక్కడా నల్లటి మచ్చ ఉండదు అని. వినత కి అతిశయం ఎక్కువ , తనుఅనుకున్నది , తను నమ్మినది తిరుగులేనిది అనుకుంటుంది, నమ్మితే అలా ఇలా నమ్మాదు , నా నమ్మకం అంత గొప్పది అని నమ్మేస్తుంది, అది ఆమె బలహీనత, ఈ అతిశయాన్ని అడ్డుపెట్టుకొనే పడగొట్టాలి వినతని, కాబట్టి ఇప్పుడు కద్రువ అన్నది చెల్లి చూసావా ఆ ఉచైస్రవన్ని చూసావా , పౌర్ణమి నాటి చంద్ర బింబాని కి నల్ల మచ్చ ఎలా ఉంటుందో అంత తెల్ల గుర్రానికి తోక దగ్గర ఉన్న ఆ నల్ల మచ్చ చూసావా అన్నది. వినత ఫక్కున నవ్వి అక్కా ఏ కన్నులతో చూస్తున్నవే అన్నది. అది మహాత్ముని యొక్క మచ్చ లేని కీర్తి ఎలాఉంటుందో అలా ఉంది ఆ తెల్లగుర్రం అంది, నువ్వు మచ్చ ఉంది అంటావేంటి , తెలుసు కద్రువకి ఈ అతిశయం దగ్గరే పడిపోతుంది వినత అని. ఈ అతిశయం తో అవతల వల్లుచేస్తున్న పన్నాగాన్ని గమనించలేదు. గమనించ కుండా అతిగా విశ్వసించి దెబ్బతింటుంది.
పాములు పుడితే భయపడలేద అన్న ప్రశ్నలకి తావుండదు. మీకు ఈ సందర్భముగా ఒక విషయం చెప్పవలసి ఉన్నది. ఒక యదార్థ సంఘటన, ఒక ఆవిడకి పాము పుట్టింది , ఒకప్పుడు నిజంగా . చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పీఠాధి పత్యం లో ఉన్నపుడు, ఈ సంఘటన గురించి ప్రస్తావన చేశారు ఆయన, ఆమెకి పాము పుడితే ఆమె తల్లితనం తో ఆ పాముని ఎంతో ప్రేమతో పెంచుకుంది. ఆ పాముపిల్ల వచ్చి ఆమె పక్కలో పడుకునేది, ఆ పాము కి ఆకలేసి అమ్మ వాళ్ళో తిరుగుతుంటే , ఆమె గోరువెచ్చని పాలు , రోటి కన్నం లో పోసేది, ఈ పాము ఆ రోటి కన్నం లోకి ఎక్కి పాలు తాగుతూ ఉండేది. ఒకనుకోప్పుడు ఈవిడ పుట్టింట్లో ఏదో ఒక శుభకార్యానికి వెళ్ళవలసి వచ్చింది. ఈ పిల్ల ని తీసుకువెళ్తే అందరు విచిత్రంగా చూస్తారేమో, అల చుస్తే తనకి చిన్నతనం కాదు, అంతమంది ని చూసి తన బిడ్డడు భయపడతాడు అని అదీ తల్లిప్రేమ , ఆవిడ ఆ పాముని తీస్కేల్లటం మానేసి ఆవిడా ఒక్కర్తే వెళ్ళింది, వెళ్ళేముందు , వాళ్ళింట్లో ఒక వృద్దురాలికి , నా బిడ్డకి ఆకలేస్తే కొంచం పాలుపోయి, నా బిడ్డ కి ఆకలేస్తే ఒకటే గుర్తు, దానికి ఆకలేస్తే చుట్టూ తిరుగుతుంది, అప్పుడు రోట్లో కొంచం పాలు పోస్తే , పాలు తాగి పడుకుంటుంది అనిచెప్పి వెళ్ళింది. ఈ పాము వచ్చి గిర గిర తిరుగుతుంది ఆవిడ భయపడిపోయింది, భయపడిపోయి తొందరగా పోయ్యకపోతే ఏమిచేస్తుందో అని భయపడిపోయి, మరుగు పాలు తీస్కుపోయి ఆ రోటి కన్నం లో పోసింది. ఆ పాము గబ గబా వెళ్లి నోరు పెట్టింది, నోరు కాలింది. ఆ నోరుకలిందని తన్నుకోవటం లో రోటి కన్నం లో పడి పోయి శరీరం విడిచిపెట్టిoది. విడిచిపెట్టి తల్లికి కలలో కనిపించి అమ్మా నేను చనిపోయనమ్మ , రోటిలో వేడి వేడి పాలు పోసేసింది నా తర్వాత పుట్టే పిల్లల్ల కి నా పేరు పెట్టుకొవా అని అడిగింది. యదార్ధం గా జరిగిన సంఘటన ఇది. అసలు యదార్ధం ఏమిటంటే అన్ని ఉన్న పిల్లల మీద తల్లి ప్రేమ కన్నా అవకరలున్న పిల్లల మీదే తల్లి ప్రేమ ఎక్కువ.
కనుక కద్రువ పరమ ప్రేమతో ఆ బిడ్డల్ని పెంచుతుంది, వినత చూసింది, ఆవిడ అతిశయము కలిగినటువంటి స్త్రీ, అతిశయము అన్న మాట కి అర్థం ఏమిటంటే అతి విశ్వాసము, నా బుద్ధి తో నేను అలోచించి చెప్పేది ఏదైతే ఉందొ దానికి తిరుగులేదు, ఇది ప్రమాదకారి, ఇది ఎక్కడో అక్కడ పప్పులో కాలేయిస్తుంది. వేయించి నప్పుడు ఎలాఉంటుందో తెలుసండి , ఏదో చిన్నా చితకా తో పోదు, పట్టిన అహంకారం అంతా వదిలిపోయేటట్టు గా జాడిన్చేస్తుంది అతివిశ్వాసం. అతివిశ్వాసం తోటి పడ్డాడా గోతిలో , ఇక మళ్ళి లేవటానికి చాలా చాలా సమయం పడుతుంది , మీరు లోకం లో ఎక్కడైనా చుడండి. ఇదొక్కటే ఆవిడ తో ఉన్న పెద్ద సమస్య, అంత కన్నా ఏమి పెద్ద సమస్యలు లేవు. నేను బాగా ఆలోచించ గలను అందుకనే కద్రువ పిల్లల కంటే నాకే బలవంతులైన పిల్లలు కావలి అని కోరుకుంది. 500 సంవత్సరముల నుండి ఎదురు చూస్తుంది. అక్కడ పుట్టే పిల్లల కన్నా ముంది క్కడ పుడతరన్న ఆశ. ఎందుకంటే వీలేక్కువ బలవంతులు కదా అనుకుంది. 500 సంవత్సరముల తరువాత అక్కడ 1000 మంది పుట్టేసారు , ఇక్కడ ఒక్క గుడ్డు పగలలేదు. ఆవిడకి సిగ్గు కలిగింది అది విచిత్రం. నన్నయ గారు వాడిన మటేమిటంటే , లజ్జనోంది అంటే సిగ్గుచేంది. సిగ్గు వలన దుఖమును పొందింది. అది చిత్ర విచిత్రం గా బిడ్డలని పొందే విధానం కాబట్టి వాళ్ళ కన్నా బలవంతులని అడిగింది కాబట్టి ఇంకొంచం ఎక్కువ సమయం పట్టొచ్చు, ఎదురు చూడాలి, కానీ ఆమె దేనికి సిగ్గు అంటే అన్నిటిలో ఆమె కన్నా నేను ముందు ఉంటాను అనుకుంది. కానీ కద్రువ ముందు తల్లైంది ఇక్కడ ఎక్కడో నా విశ్వాసం దెబ్బ తిన్నది , నేను ఇంకా బాగా అలోచించ లేక పోయాను ఇది ఆవిడా సిగ్గుకి కారణం, ఇప్పుడు ఆవిడ సిగ్గులో దుఖం వచ్చింది. దేనికి పిల్లలులేరని ఏడవడం దేనికి గుడ్లు ఉన్నాయ్ గా ఇవ్వాళ కాకపోతే రేపు వస్తారుగా పిల్లలు. ఆవిడ ఎందుకు ఎద్చిందంటే , నేను తెలివైన దాన్ని తెలివైన దాన్ని అనుకున్న నా తెలివి తెల్లవారింది అని ఏడిచింది. అందరిముందు ఏడిస్తే తను బాగుపడింది అని గుర్తు , తనొక్కత్తే ఏడిస్తే ఇంకా ఆ గోరోజనం తగ్గలేదు అని గుర్తు. తగినంత పరిణితి ఏర్పడని జీవితాలు ఎలా ఉంటాయో మీరు చుడండి. ఇప్పుడు ఆవిడ ఏడిచి ఏడిచి సిగ్గు పొంది ఎలాగైనా నేనే తెలివైన దాన్ని అని అనిపించుకోవాలి అని నేను తల్లిని అయిపోయాను అనిపించేస్కోవాలన్న తాపత్రయం తో ఒక గుడ్డు పగలగోట్టేస్కుంది. ఒక గుడ్డు పగలగొట్టే టప్పటికి అందులోంచి ఒక పక్షి బయటకి వచ్చింది,ఆయన కి నడుం దగ్గర నించి పైన ఉండవలసిన శరీరం ఉంది, కింద ఉండవలసిన శరీరము లేదు. మహా తేజోమూర్తి ,గొప్ప సునిశిత బుద్ధి శాలి. అటువంటి వాడు పుడుతూనే పేరుతో పుట్టాడు , అరుణుడు ఆయన అమ్మ వంక చూశాడు , అతి విశ్వాసం నీది, అతి విశ్వాసం వలన సిగ్గుపడింది నువ్వు,ఆ సిగ్గు వలన ఏడిచింది నువ్వు, కద్రువ ఎదురు చూసింది గుడ్లలోనించి పిల్లలు వచ్చేంత వరకు. ఎంత సేపు కద్రువ అడిగిన వాటిని ద్రుష్టి లో పెట్టుకుని నీ తెలివిని ప్రదర్శించు కోవాలన్న అతిశయమ్ తో ప్రవర్తించవు, నేను పూర్తిగా శరీరం ఏర్పడకుండా ఇంత అంగవైకల్యం తో పుట్టేటట్టు చేశావు కనుక 500 సంవత్సలముల పాటు కద్రువ కు దాసి వగుదువు గాక! అని శపించాడు ఎక్కడ పడిందో చూసారా గోతిలో , ఇప్పుడు ఒక్కసారి బెంగ వచ్చింది , ఏమిటి బెంగ , ఇన్నాళ్ళు తాను చాలా తెలివైన దానిని అనుకుని ఎవరిమీద తాను పెత్తనం చేశాను అనుకుందో ఆవిడకి భయపడవలసిన రోజు వచ్చింది. 500 రోజుల తరువాత నీకు ఈ అతిశయం విరిగిపోతుంది అని అనుగ్రహం ఇచ్చాడు కొడుకు. ఈ అతిశయం ఇలా ఉండిపోతే ఇంకా ఎన్ని ప్రమాదాలు వస్తాయో అని , అమ్మా తొందరపడి ఒక గుడ్డుని పగలగొడితే కొట్టావు, కానీ రెండో గుడ్డుని మాత్రం పగల కొట్టవద్దు అని చెప్పాడు. అందులోంచి మహా తేజోమూర్తి ఉద్భవిస్తాడు , అతడు నిన్ను దాస్యం నుంచి విడుదల చేస్తాడు. అని చెప్పు మహానిభావుడైన అరుణుడు సూర్య భగవానుడికి రధ సారధి గా వెళ్ళిపోయాడు.
అలా కొంత కాలం అయిపోయింది. వినత కద్రువ ఇద్దరు కలిసి పాల సముద్రం దగ్గరకి వెళ్లారు . ఈ లోపల దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పొందాలి అన్న ఆశ కలిగింది. దేవతలు రాక్షసులు కలిసి క్షీర సాగర మదనం చేస్తే అందులోనించి అమృతం వస్తుంది. కాబట్టి వారు మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకటం కోసం ఆ పర్వతాన్ని దింపారు. ఆ మందర పర్వతం పాల సముద్రం లో మునిగిపొకూడదాని శ్రీ మహా విష్ణువుని ప్రార్థన చేస్తే, ఆయన ఆదికుర్మం అయి నిలబడితే ఆ తాబేటి డొప్ప పైన మందర పర్వతాన్ని నిలబెడితే , వాసుకిని పర్వతానికి చుట్టి , రాక్షసులు దేవతలు కలిసి క్షీర సాగరాన్ని చిలికారుట. చిలికితే ఆ మందర పర్వతం ఆయన వీపుకి వోరుసుకుంది , అప్పుడు ఆయన ఎప్పటి నించో విపు కొంచం దురదగా ఉంది అనుకున్నట్ట అది తీరింది ఆయనకీ అప్పుడు. చిలికేటప్పుడు శబ్దం వస్తుంది. చాలా పెద్ద శబ్దం వస్తే ఎక్కడో తపస్సు చేస్తున్న చతుర్ముక్ఖ బ్రహ్మ గారు ఏమిటి రా ఆ చప్పుడు ఏమిచేస్తున్నారా పిల్లలు అని ఒక్కసారి బయటకి వచ్చి చూసాడoట బ్రహ్మ గారు. అంత పెద్ద చప్పుడు వచిందంట. సరే అందులోంచి అమృతం వస్తుంది అనుకుంటే హాలాహలం వచ్చింది ముందు, మహానుభావుడు పరమేశ్వరుడు లోకములకు తండ్రి కాబట్టి ఆ హాలాహలమును ఆయన లోపలకి పుచ్చుకున్నాడు. తరువాత ఉచ్చెస్రవము అవి వచ్చాయి అవి ఇంద్రుడు పుచుకున్నాడు, కౌస్తుభమ్ వచ్చింది శ్రీ మహా విష్ణువు పుచ్చుకున్నాడు. శ్రీ మహా లక్ష్మి వచ్చింది శ్రీ మహా విష్ణువు ని వరించింది. తరువాత ధన్వంతరి అమృత పాత్ర తో బయటకి వచ్చాడు. ఇప్పుడు దేవతలు , దానవులు కలిసి ఈ అమృతాన్ని ఎక్కడ దాచాలి అని ఆలోచించారు, ఇంద్రుడికి అప్పచెప్దాం ఇంద్రుడు దాస్తాడు జాగ్రత్త గా అని ఇంద్రుడికి ఇచ్చారు, ఆ ఇంద్రుడు తీస్కెళ్ళి దాచుకుని అట్టే పెట్టాడు, దాచడం అంటే అన్ని వేళలా పుచ్చుకుని దాచడం అంటే చాలా కష్టం. దాచడం అంటే వెయ్యి కళ్ళతో చుస్తూ ఉండాలి అది తన ఒక్కడి సొత్తు కాదు కాబట్టి అందరుకలిసి పాల సముద్రం చిలికితే వచ్చిన అమృతం. అలా చాలా కాలం గడిచిన తరువత , ఈ క్షీరసాగర మదనం లో పుట్టిన ఒక తెల్లటి గుర్రం, ఈ పాల సముద్రం వొడ్డు దగ్గర మచ్చ లేని తెల్ల గుర్రం తిరుగుతుంది. తిరుగుతుండగా వినత కద్రువా విహరంగా అలా వచ్చారు. ఇప్పుడు కడుపులో మంట ఎవరికీ బయలుదేరిందంటే కద్రువకిబయలుదేరింది . ఎందుకంటే నేను 1000 పిల్లలు కావలి అన్నాను ,నా పిల్లల కంటే బలవంతులు కావలి అన్నది ఈ వినత. 500 సంవత్సరములు పొదగ బడ్డ తరువాత నా బిడ్డలు బయటకి వచాయి , అసలు ఇంకా పూర్తిగా పొదగ బడకుండా నే గుడ్డు బద్దలు కొడితే బయటకి వచ్చిన అరుణుడు సూర్యునికి రధసారధి అయ్యాడు , అంతటి తేజస్సు కలవాడు. ఇప్పుడు మరి ఒక 500 సంవత్సరముల తరువాత పుట్టే కుమారుడు మరింత తేజోవంతుడు రాబోతున్నాడు, ఇద్దరు కొడుకులు ఇంతటి తేజోవంతుల ముందు నా కొడుకులు ఏమి నిలబడతారు. దీనికి ఎన్ని తెలివితేటలు రా ఎంత గొప్ప కోరిక కోరింది రా ఇది. ఎలాగైనా ఈవిడని ఇబ్బంది పెట్టాలి అంటే అసూయ ప్రబలింది. ఎంత ప్రమాద కరమైన లక్షణమో అసూయ అన్నది. మీకు మహా భారతం తీర్పు చెప్పబోతున్నది. గాంధారి ఇదే , అక్కడే మొదలైంది భారతం. ఆవిడా అంతే కడుపు బాదుకుంది , అప్పుడు గర్భస్రావమై ఆ కడుపులో బిడ్డలు బయటకి వస్తే నేతి కుండలో పెట్టి పెంచితే , నూర్గురు పుత్రులు పుట్టారు.
ఎంత బలం ఉన్నదైన నేను చెప్పే మాట వినేటట్టుగా నా దగ్గర పడేసి ఉంచితే,ఆ బలం అంతా నాకోసం పనికొచ్చేదే కాని ఆ బలం సొంతానికి పనికిరాడుగా అప్పుదేమిచేస్తుంది. కాబట్టి ఎలాగైనా ఈ వినత ని నాకు దాసీ ని చేస్కోవాలి. ఇది ఆవిడ కడుపులో ఉంది ఆలోచన, అదును కోసం ఎదురుచుస్తుంది. ఇద్దరు ఆ పాల సముద్రం వొడ్డుకి వెళ్లారు , ఆ పాల సముద్రం చాలా గొప్పదైన స్థితిలో దాని కెరటములు , పాల నురగలు అందులోంచి వచ్చే తుంపరలు మంచి సంతోషం గా ఉంది. ఇద్దరు విహరిస్తున్నారు. కద్రువ అక్కడ ఉన్న తెల్లటి గుర్రం ని చూసింది , ఆవిడకి తెలుసు అది తెల్లటి గుర్రం పాల సముద్రం నించి వాచినది , దాని కి ఎక్కడా నల్లటి మచ్చ ఉండదు అని. వినత కి అతిశయం ఎక్కువ , తనుఅనుకున్నది , తను నమ్మినది తిరుగులేనిది అనుకుంటుంది, నమ్మితే అలా ఇలా నమ్మాదు , నా నమ్మకం అంత గొప్పది అని నమ్మేస్తుంది, అది ఆమె బలహీనత, ఈ అతిశయాన్ని అడ్డుపెట్టుకొనే పడగొట్టాలి వినతని, కాబట్టి ఇప్పుడు కద్రువ అన్నది చెల్లి చూసావా ఆ ఉచైస్రవన్ని చూసావా , పౌర్ణమి నాటి చంద్ర బింబాని కి నల్ల మచ్చ ఎలా ఉంటుందో అంత తెల్ల గుర్రానికి తోక దగ్గర ఉన్న ఆ నల్ల మచ్చ చూసావా అన్నది. వినత ఫక్కున నవ్వి అక్కా ఏ కన్నులతో చూస్తున్నవే అన్నది. అది మహాత్ముని యొక్క మచ్చ లేని కీర్తి ఎలాఉంటుందో అలా ఉంది ఆ తెల్లగుర్రం అంది, నువ్వు మచ్చ ఉంది అంటావేంటి , తెలుసు కద్రువకి ఈ అతిశయం దగ్గరే పడిపోతుంది వినత అని. ఈ అతిశయం తో అవతల వల్లుచేస్తున్న పన్నాగాన్ని గమనించలేదు. గమనించ కుండా అతిగా విశ్వసించి దెబ్బతింటుంది.