Tuesday, July 29, 2014

ఆదిపర్వం 11

అంతటి బలవంతుడైన గరుత్మంతుడు రెండోవ కుమారుడిగా జన్మించాడు అని చూసింది కద్రువ. అసూయ మరింత ప్రబలింది.
 తన  శరీరం లో పుట్టిన వ్రణం తన శరీరాన్నే పడగోడుతుంది, కానీ తన యందు పుట్టిన అసూయా తనతో పోదు, అది కులక్షయం  చేస్తుంది. మొత్తం  కుటుంభమే నశించి పోతుంది దాని వాల్ల, అందుకేనేమో చాలా చమత్కారమైన విషయాన్ని ఆవిష్కరించారు వ్యాస భగవానుడు. భుమిలోపలకి వెళ్ళిపోతాయి పాములు, ఆకాశం లో ఎగురుతాయి పక్షులు వీటి రెండింటికి శత్రుత్వం వచ్చింది. రెండిటికి చాలా వ్యత్యాసం వుంది , ఒకదానికి అసలు ఎగరడమే రాదు , పాము బిలాన్ని చూస్కొని ఎంత కిందకి వేల్లోచ్చో అంత కిందకి వెళ్తుంది. పక్షికి ఎగరటమే వచ్చు దిగడం అంటూ  జరిగితే ఏ విశ్రాంతి కోసమోతప్ప , దాని పధము ఎప్పుడూ పైకే. పైకి వెళ్ళే ప్రాణులు ఎవరికి జన్మించాయి , ఎవరికి అసూయా లేదో వారికి జన్మించారు, దేవతాoస సంభూతు లు జన్మించారు. ఎవరికి కడుపులో అసూయా ఉందో , వారికి , అంటే అప్పటికి ప్రకటనము కాకపోయిన, అది లోపల రగులుకుంటుంది. అసూయా అంటూ ఉండడం పాములకు తల్లి కావడమే,అంటే కిందకు వెళ్ళిపోయే తతువంటి ప్రాణులకు జననము,ఇక్కడ పాముని దేవతా స్వరూపంగా కాని ఈశ్వరుని యొక్క ఆభరణం గా కానీ చూడకూడదు, అది కిందకు వెళ్ళిపోయేది ,  పది  మంది చూసి భయపడే టటు వంటిది, అసహ్యించుకునేటటు వంటిది అయిన ప్రాణిగా మాత్రమే పరిగణింపబడుతుంది. అధోముఖం గా వెళ్ళిపోయేది పాము , అటువంటివి కొన్ని వేలు పుట్టాయి కద్రువకి, ఇద్దరే పుట్టారు , ఇద్దరు ఆకాశం లో తిరిగే వాళ్ళే , అపారమైన తెజోముర్తులు జన్మించారు,  దేని   వలన అంటే  అసూయా  అనేది   లేకుండా ఉండడమే ప్రధానం. ఈ ఆదిపర్వo  లో గరుడోత్పత్తి ఏదైతే ఉందొ అదే మిగిలిన భారత కధ కి సూచన గా ఉంటుంది.  గాంధారి యందు ఈ అసూయా విశేషము ఉంది, ఆమె కి పుట్టిన వాళ్ళు నుర్గురు. ఈ అసూయ లేని కుంతీ మాద్రికి పుట్టిన వాళ్ళు అయిదుగురు. వాళ్ళు అయిదుగురు , దేవతంశసంభూతులు , వెళ్ళు నుర్గురు కలిపురుషునికి  సంభoదించిన ప్రకోపాలు. అందుకే ఆ ఐదుగురిమీదా వాళ్ళెప్పుడు అసూయతోటే జీవించారు. అదే అసూయ కట్టి కుడిపేసింది, నూర్గురు కొడుకులున్న గాంధారికి చిట్ట చివరకు ఒక్క కొడుకు కూడా మిగలలేదు. ఐదుగురు కుమారులున్న పాండురాజు కి ఐదుగురు కొడుకులు మిగిలారు, ఎక్కడ ధర్మం ఉంటుందో , ఎక్కడ అసూయా లేకుండా ఉంటుందో, అక్కడ దేవతా శక్తులు  నిలబడతాయి. మనిషి జీవితం లో పరిశీలన చేసుకోవలసినది ఏదైనా ఉంటె అది అసుయయే. అసూయ ని పొందటానికి ఎక్కడా శిక్షణ కానీ పుస్తకాలు చదుకోవటం కానీ చెయ్యనవసరం లేదు. అసుయని కలిగి ఉండటానికి గురువుగారి పాదములు పట్టుకోవలసిన అవసరం ఉండదు. అది
తనంత తాను గా ప్రబలుతుంది.  అసూయా అన్న లక్షణం ఎక్కడ ఉందొ అది మెట్లు దింపుతుంది.
ఏది శాశ్వతమో అదే ఉంటుంది, ఏది ఆశస్వతమో అది పోతుంది. ఇప్పుడు దాస్యం అనేది తన కృతకమైన ప్రణాళిక తో వచ్చింది వినతకి, ఈస్వరనుగ్రహమ్ కలగానే పోతుంది. విడుదల పొందుతుంది వినత, నసింపచేసే దాన్ని పట్టుకుంటుంది కద్రువ. ఎ అతిశయం ఉందొ ఆ అతిశయం పోతోంది వినతకి దాస్యం చేత, కాబట్టి ఇప్పుడు ఆవిడ ఉన్నతి వైపు అడుగులు వేస్తుంది, కాబట్టి ఇప్పుడు ఒక చెడు గుణం పోతోంది. కానీ కద్రువ ప్రతి క్షణం అసుయని పెంచుకుంటోంది. మహాభారతం యొక్క సందేశం చాల ముఖ్యం ఆ సందేశాన్ని పట్టుకోగల్గితే చాలు. అది వ్యాసభగవానుడి యొక్క ఆర్తి.  నన్నయ్య భట్టారకుని ఆర్తి, అందుకని మహాభారతాన్ని ఇచ్చింది.
ఇప్పుడు కద్రువ వినతకి నమస్కరించిన గరుత్మంతుణ్ణి చూసింది, తనకి కూడా కొడుకే అవుతాడు ఆయన, ప్రేమార కుగిలించుకోవచ్చు ,ముద్దుపెట్టుకోవచ్చు , తొడమీద కుర్చోపెట్టుకోవచ్చు, నాన్న ఎంతటి బాల పరక్రమవంతుడివి రా నీ వలన నేను మీ అమ్మ కూడా అభ్యున్నతి ని పొందాము. నీ పుట్టుకతో మీ అమ్మ కి ఒక కనుక ఇస్తున్నాను , ఇంకా దాసీ కాదు , మేము ఇద్దరం సహజం గా అక్కచెల్లెళ్ళం మధ్యలో వచ్చింది పందాలు వలన , అది శాస్వతం కాదు విడిచి పెట్టేస్తున్నాను అని ఉంటే , మహా భారతం ఇంకోలా ఉండేది. అలా అనలేకపోయింది , కడుపు మరింత మండిపోయింది , ఇటువంటి కుమారుడా అని. వెంటనే ఆవిడకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసాండి ,దాసికి చెందినది కూడా నాకు దాస్యమునకు ఉపయోగపడాలి. ఇది ఆవిడకి వచ్చిన ఆలోచన.  వినత దాసీ అయితే వినతాపుత్రుడు కూడా నాకు దాస్యం చెయ్యవలసిన వాడు. ఇప్పుడు ఇది ఇంకా ఎంత దూరం వెళ్లిందంటే , ఈమె నాకు దాసీ అయితే వీడు నా పుత్రులకు దాస్యం చెయ్యాలి. అంటే ఎంత దూరం వెల్లిపొయిందో చుడండి ఆ వక్రమైన ఆలోచలన, ఎంత అసూయతో వెల్లిపొయిందో చుడండి. లోకమంత టికీ అంటే మునులకి ఋషులకి స్తోత్రం చెయ్యవలసిన  గొప్పతనం గరుత్మన్తునిలో కనపడింది, కద్రువకి కనపడలేదు.  ఇది ఏమాత్రమూ గరుత్మన్తునికి తక్కువ తనం మాత్రం కాదు. ఇది మనం లౌకికమ్ గా కూడా అన్వయం చెయ్య గలిగితే మీరు హాయిగా జీవనం చెయ్యగలిగిన స్థితి వస్తుంది. మీరు ప్రేమతో అందరితో కలిసి ఉన్నారనుకోండి , వాళ్ళ బలం మీ బలం అవుతుంది.
ఇప్పుడు కద్రువ వినతకి నమస్కరించి నించున్న గరుత్మంతుని చూసి అంది, నా   పిల్లల్ని  నీ వీపు మీద ఎత్తుకొని ఆడిస్తూ ఉండు అంది. అంత వేగంగా తిరగగలవు కదూ, నీ బలం ఎందుకు పనికిరావాలంటే నా పిల్లల్ని ఆడించేందుకు కావలి, అంత కన్నా ఇంకెందుకు పనికి రాకోడదు సుమా ! అసూయ హద్దు మీరితే ఎంత పైసచికత్వనికైన వెళ్ళిపోతుంది.  నువ్వు పిల్లల్ని  మొసి తిప్పి తీస్కొచి అక్కడ వదిలేసి వేల్లిపోతవేమొ, ఏమో ఇంత బలం ఉన్న వాడు ఏ వేదమొ చదవటానికి బయలుదేరితే, ఏ అస్త్ర విద్యో నేర్చుకుంటే, అది ఆవిడా భయం. వాళ్ళని అలా తిప్పి తీస్కొచి కూర్చోపెట్టి నువ్వు వెళ్ళిపోవటం కాదు , 1000 మందిలో ఎవరు ఏ పని చెప్పినా నోరెత్త కుండా చెయ్యి అన్నది. దానికి ఆయన ఏమి అనలేదు, ఎందుకు అనలేదో మీరు గమనించాలి , ఏమైనా అనగలడు అయినా అనలేదు , ఎందుకంటే బిడ్డలకు ఉన్న పరానుకరణము, బిడ్డలకి ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది అదే అనుకరించడము, ఈ అనుకరించడానికి వాళ్ళు ఎంచుకునే మొదటి వస్తువు ఏంటంటే అమ్మా ! అమ్మ ఏమి చేస్తుందో అదే చేస్తారు. ఆ అనుకరించే విషయం లో వాడి సమర్థతా అసమర్థతా మర్చిపోతాడు. అమ్మ అన్న పదం ఈ   లోకం లో  లేకపోతే ఈ  సృష్టి ఆగి పోతుంది. ప్రతిక్షణం దిద్దు తుంది అమ్మ . అలా చెప్పగా చెప్పగా వాడు పరిణితి పొందుతాడు. అమ్మ  ఏమి మాట్లాడకుండా నిలబడింది కాబట్టి  నేను కూడా అలానే చెయ్యాలి అని అనుకున్నాడు గరుత్మంతుడు, అందుకని ఏమి మాట్లాడలేదు.  అంత బలం ఉన్నవాడు కద్రువ చెప్తే చేసాడు అంటే వినత చేసింది కాబట్టి చేసాడు. అంటే అమ్మాయే అనుకరణకి ప్రధానమైన అంశం గా పిల్లలకి ఉంటుంది. ఇది వ్యాస భగవానుడు , నన్నయ్య గారు చెప్పకుండా చెప్పిన విశేషం. ఈ సమాజం లో ఉత్తమ పుత్రుడు తయారు అవుతున్నాడు అంటే కారణం తల్లి మాత్రమే . అందుకే గర్భాలయమే, అది ఆలయమే, ఆమె వలన తయారు అవుతాడు మహా పుత్రుడు.
శివాజీ కి  చిన్నతనం లో నేర్పింది తల్లి.  సనాతన ధర్మం అనే మాట మీద గౌరవమ్ నేర్పింది. స్త్రీ అంటే ఏమిటో నేర్పింది. తరవాత కలం లో ఆయనకీ మహమ్మదీయ స్త్రీలు తనకి ఖైదిలు గా దొరికినప్పుడు, వారిని వెంటనే పరదాల తో కూడిన పల్లకిలలో కూర్చోబెట్టి శత్రువు లకి అప్పచేప్పేసాడు తప్ప పొరపాటున కూడా పర స్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు, ఎక్కడి నించి వచ్చింది , శివాజీకి  ఆ శక్తి? తల్లి భోద నించి వచ్చింది. అమ్మ చిన్నతనం లో మాట ఏదైతే ఉందొ అదే తర్వాతి కాలంలో పిల్లవాణ్ణి తీర్చి దిద్దుతుంది.
ఇప్పుడు గరుత్మంతుడు 1000 పాముల్ని వీపుమీద ఎక్కించుకుని రండి మిమ్మల్ని అందరూ తిప్పి తీస్కోచ్చేవాడు. ఒక్కసారి అలా ఎగిరాడంటే ఒక దండకారణ్యం అయిపోతుంది. అలా నాలుగు కులపర్వతములు, అష్ట దిక్పాల పురములు, ఇవన్ని తిప్పే వాడు. ఆ పిల్లలకి గరుత్మంతుడు తమ్ముడిగా లభించడం వలన కలిగిన అదృష్టం ఏమిటంటే వాళ్ళు , భూమినంతా చూసేసారు. పిల్లలకి పాడై పోవటానికి ఇంత కన్నా అదృష్టమైన వస్తువు ఇంకోటి లేదు. ఇంత కన్నా కావాల్సింది ఏమిటి , సాధించాను అనుకుంటోoది కద్రువ. ఒకరోజు ఈ పిల్లలందరూ తమని సూర్యుని వైపుకి తీస్కుపోమ్మన్నారు గరుత్మంతుని, ఆయన్దేమి పోయింది తీస్కుపోతున్నాడు, ఆయన తట్టుకుoటాడు , వీళ్ళు ఎక్కడ తట్టుకోగలరు. సూర్య మండలానికి దగ్గరగా తీస్కు పోతున్నాడు గరుత్మంతుడు, ఆయన కి ఏమి హాయిగా వెళ్తున్నాడు. ఈ పిల్లలేమైయ్యరంటే సుబ్బరంగా మాడి మసిఅయిపోయి కింద పడిపోయారు, అందులో బతికిన వాడు లేడు, చచ్చిపోయి కింద పడిపోయారు. చిత్రo ఏమిటంటే , ఆవిడ తప్పు పట్టింది గరుత్మంతుణ్ణి. ఎంత బుద్దిలేని వాడివిరా నీకు బుద్ది ఉండొద్దు అంది. అసలు నిజంగా ఎంత ఆశ్చర్యం గా ఉంటాయో ఇవన్నీ.  అది గడుసు తనం అనుకుంటారు, కానీ ఇలా మాట్లాడ కూడదు, ఇలా  జీవిoచ కూడదు అనే  పరిస్థితి ఉండదు కొంత మంది దగ్గర. కాబట్టి ఇప్పుడు ఆవిడా గరుత్మంతుణ్ణి తప్పు పట్టింది, పిల్లలు అడిగితే మాత్రం నువ్వు తీస్కెళ్ళటం ఏమిటి , మరి ఆవిడే గా చెప్పింది , వాళ్ళు చెప్పింది చేయ్యమని. పిల్లందరూ చచ్చిపోయారు నువ్వు బుద్ధి హీనుడవు అని నింద చేసి ఆవిడా దేవేంద్రుని ప్రార్థన చేసింది.
ఇంద్రుణ్ణి స్తోత్రం చేస్తూ ఓ మహానుభావా దేవతలు ,కిన్నేరులు, కింపురుషులు  మొద లైన వారందరూ కూడా నిన్ను సేవించి నీయందు భక్తితో ఉంది నీ శాసనాన్ని అవుదల దాల్చి, అభ్యున్నతి ని పొందుతూ ఉంటారు , ఇవాళ నా కుమారులు సూర్య మండలం వైపు వెళ్ళ బోయి ఆయన తీవ్రమైన వేడి చేత, శరీరము లని విడిచిపెట్టి  మరణిoచా రు , నువ్వు  వారిని  బ్రతికించ వలసినది అని ఆయన కి శరణాగతి చేసి ఆయన్ని ప్రార్థించింది. త్రికరణ సుద్దిగా ప్రార్థన చేసినప్పుడు పలకడం దేవతల యొక్క లక్షణం. కాబట్టి ఎప్పుడైనా ఈస్వరనిగ్రహమ్ కలగలేదు అంటే మీరు పూర్తిగా ఈశ్వరుణ్ణి నమ్మి పూజించలేదు అని అర్థం తప్ప ఈశ్వరుని యందు దోషము ఉన్నది అనకూడదు.









Thursday, July 24, 2014

ఆదిపర్వం 10

ఇప్పుడు పందెం వెయ్యి అన్నది కద్రువ , ఇంకే లొంగిపోయింది వినత, నువ్వు చెప్పినట్టు గుర్రం తోకమీద నలుపు ఉన్నదో నేను నీకు దాసీ ని, తెల్లగా ఉన్నదో నువ్వు నాకు దాసీ వి. ఏమిటి ఆవిడ ధైర్యం, పద చూద్దాం దగ్గరకి వెళ్దాం అంది వినత, కద్రువ కి తెలీదా దగ్గరకి వెళ్తే గుర్రం తెల్లగా ఉంటుంది అని? ఆవిడ మనసు యందు కుటిలమైన ఆలోచన ఉన్నది, వినత యందు అతిశయం ఉన్నా స్వచ్చమైన మనసు ఉంది, ఆవిడ లో కుట్రలు లేవు కుతంత్రాలు లేవు, కాకపోతే అతిశయ భావం ఉంది, నేను తెలివైన దానిని అని, నేనే మంచి నిర్ణయాలు చేస్తూ ఉంటాను అనుకుంటుంది, అది బలహీనత గా పట్టుకుంటుంది. ఇప్పుడు కద్రువ అన్దీ మళ్ళి ఇప్పుడే వెళదాo అనటానికి వీలు లేకుండా,వెనక్కి తీసుకు వెళ్లిపోవాలి, భర్తకి సేవ చెయ్యవలసిన సమయం ఆసన్నమైంది. అంటే ఇప్పుడాయన అగ్నికార్యం చెయ్యటానికి ఇంటికి వస్తాడు స్నానం చేసి, మన ఇద్దరి కర్తవ్యమ్ పత్నులుగా , ఆయనకి మదినీళ్ళు పెట్టడం, కావాల్సిన సమిధలు అందించడం వారి కర్తవ్యమ్. మనం భర్తని అనువర్తించాలి. కాబట్టి రేపోద్దాం ఎక్కడికిపోతుంది గుర్రం ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. చెప్పను కదూ వినత పడిపోతుంది, సరే వెళ్దాం అన్నది వినత. ఒక రాత్రి సమయాన్ని ఎందుకు అట్టిపెట్టుకుంది కద్రువ అంటే , కేవలం వినత ని మోసం చెయ్యడం కోసమే పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడా తన బిడ్డలందరినీ సమావేశ పరిచింది. ఆవిడ బిడ్డలన్ని పాములు, పాములన్నీ నల్లగానే ఉంటై, కాబట్టి పాములన్నీటిని సమావేశ పరిచింది. కద్రువ కొడుకుల వంక చూసి ఒక మాట అంది, గుర్రం తెల్లగా ఉంది అన్న విషయం నాకు తెలుసు, గుర్రం తోక నల్లగా ఉంది అని పందెం కాసాను వినత తోటి, పందెం కూడా అవువంటి ఇటువంటి పందెం కాదు, నేను వోడిపోతే వినతకు దాసి నైపోతాను.  మీరు కొడుకులు అమ్మ ని రక్షించాలి , కాబట్టి మీరు ఏమిచేస్తారంటే, మీలో కొంతమంది వెళ్లి ఆ గుర్రం తోక నల్లగా కనపడుతుంది, నల్లగా కనపడేటట్టు చుట్టుకోండి, మీరు కామ రూపులు పైగా. పాములా ఉబ్బెత్తుగా ఉండవలసిన అవసరం కుడలేదు, తోకతో సమానం గా చుట్టుకోగలరు, ఎందుకంటే చుట్టుకోగాలిగిన దేహం ఉంది మీకు. తోక పైనించి కింద వరకి పడుకుని, తలలు ఆ కుచ్చు లోకి పెట్టేసాయి అనుకోండి, తోక నల్లగానే కనిపిస్తుంది. కాబట్టి మీరు వెళ్ళి ఆ గుర్రం తోక పట్టుకోండి, పట్టుకుంటే వినత నాకు దాసీ అవుతుంది.  ఎందుకు అసలు వినత దాసీ అవ్వాలి, అసలు ఎందుకు ఆవిడ కి ఆ కడుపులో బాధ? నన్నయ్య గారిని అడగక్కరలేదు మనం, ఆమె లోపల ఉన్న అసూయ ఆమె చేత ఆ మాటలు అనిపించింది. తన బిడ్డల దగ్గర కి వెళ్లి తల్లి పనికిమాలిన మాటలు చెప్పినా, చిట్ట చివరకు కట్టి కుడిపేస్తుంది. అమ్మ ఏమి చేస్తుంటే, పిల్లలు వెనక అది చేస్తారు, మీరు గమనించండ, పిల్లలకి ఉండే లక్షణం అదే, అసలు అమ్మని విడిచి వేరేది చెయ్యాలని అనుకోరు. వాళ్ళకి సమస్తం అమ్మే.  ఎంతమంది చెప్పని, అమ్మ చెప్పిందే వేదం పిల్లలికి. అమ్మ చెప్పినది ఏదో అదే బుర్రకి ఎక్కుతుంది. అమ్మ స్థానం అంత గొప్పది. ప్రత్యేకించి చిన్నప్పుడు చెప్పిన మాటలు గుండెకి హత్తుకుటై పిల్లలకి. కాబట్టి తల్లి పరిణితితో మాట్లాడాలి పిల్లలతో.
ఇప్పుడు ఆ కద్రువ పిల్లలు అన్నారు ఎందుకు పిన్నమ్మ నీకు దాసీ కావాలి అని అడిగారు, ఆవిడ మనసులో ఈర్ష్య తప్పితే ఏముంది. అమ్మ తప్పుకదా అలా చెయ్యొచ్చా ? అన్నారు వాళ్ళు.  కొడుకుకి అమ్మ ఏదైనా చెప్తే , కొడుకు తిరిగి ధర్మం చెప్తే అంతే ఎక్కడలేని కోపం వస్తుంది. 
అపారమైన కోపం తో అనరాని మాట ఒకటి నోటివెంట వచ్చేసిన్దనుకోండి, ఆ తర్వాత పరిణామములు భయంకరంగా ఉంటై. అయ్యో కోపం లో అనేసనండి అంటే కోపం పోతుందేమో , ఆ వాక్కు యొక్క ప్రభావం పోదు. అందుకే మనవాళ్ళు కోపం లో కూడా మంగళ ప్రదమైన తిట్టు తిట్టనిచ్చే వారుతప్ప మంగళ ప్రదం కాని తిట్టు తిట్టనిచ్చే వారు కాదు నీ అమ్మ కడుపు మాడ అని తిట్టేవారు. అది ఎందుకు తిట్టేవారంటే , నీ అమ్మ కడుపునా నీలాగే అనేమంది బిడ్డలు ప్రసవించి, నీ అమ్మ పత్యం చేసి కడుపు కాలుతున్నా పిల్లలకి పాలిచ్చి అనేకమంది పిల్లలకు తల్లి అయి అందరు దీర్ఘయుష్వంతులై నువ్వు నీ పిల్లలు, నీ అమ్మ నాన్న సుఖముగా ఉండెదరు గాక! అని అర్థం.  
అసూయ లోనించి అపారమైన కోపం వచ్చేసింది కద్రువకి, కోపం వచ్చి అన్నది , మీరు నేను చెప్పిన మాట వినలేదు, జనమేజయుడు అనేటటువంటి రాజు చేసే సర్ప యాగం లో ఈ పాములన్నీ పడి కాలి చచ్చిపోవును గాక !
ఎంత కష్టపడి వరాలు కోరి కన్నది పిల్లల్ని, ఆ పిల్లలు ఆమె మాట వినలేదని, నాది తప్పా పిల్లలది తప్పా అని విచారణ చేసి ఉంటె ఎంత గొప్ప పిల్లలు అని మీ ధార్మికత కు మెచ్చు కుంటున్నాను అని పదికాలాల పాటు ఇలాగే ఉండండి అని గబ గబా వినత దగ్గరకి వెళ్లి లేదు ఆ గుర్రం తెలుపే నన్ను మన్నిచమ్మ అని ఒక్క మాట అనగలిగి ఉంటె ఈ ఆఖ్యానం ఇంకోలా ఉండేది. ఆ రెండు మాటలు అనడం చేత కాలేదు, అసూయ యే నిలబడింది. తన బిడ్డలు చనిపోవాలని తానే శాపం ఇచ్చేసింది.
ఇదే అసూయ గాంధారి దృతరాస్ట్రుల యందు కూడా ప్రవేశించి, పిల్లల కు దుర్బుద్ధులు చెప్పి, తన బిడ్డలు , తన వంశం నశించేటట్టు ద్రుతరాస్ట్రుడు, గాంధారి చేస్కున్నారు.
ఇప్పుడు కద్రువ అంత పెద్ద శాప వాక్యాన్ని విడిచిపెడితే పాములన్నీ కలవార పడ్డాయి. అమ్మ శాపానికి మనం వశులం అయిపోతే చచ్చిపోతాం , కాబట్టి అమ్మ మాట విందామా , ధర్మానికి కట్టుబదదామా ? బతకడానికి అమ్మ మాటే విందాం.
అమ్మ మాట ఎంత దూరం అయినా తీసుకు వెళ్తుంది. గాంధారి మాట ఎంత దూరమైనా తీసుకెళ్ళింది మహాభారతాన్ని. అందుకని కర్కోటకుడు మొదలైన పాములన్నీ వెళ్లి సన్నగా తీగల్లా ఆ ఉఛైస్రవము ( తెల్ల గుర్రం ) యొక్క తోక నల్లగా ఉండేలాగా చుట్టుకున్నాయి.  తరువాత  వినత ను ఆ ఉఛైస్రవము దగ్గరకు తీస్కువెళ్లి అదిగో దాని తోక నల్లగా ఉంది నువ్వు ఓడిపోయవు అన్నది కద్రువ. అంటే వెర్రి వినత అంగీకరించింది. అంగీకరించిన ఉత్తర క్షణం నించి వినత కద్రువ కు దాసీ అయిపొయింది. ఇంక వినత సంతోషము గా ఉండటం అన్న మాట ఉంటుందా వినతకు ఉండదు. ఒకే ఒక్క మాట అతివిశ్వాసం తో పందెం దాకా వెళ్ళిపోవడం. అయినదానికి కాని దానికి పందెం ఎందుకండీ , అప్పటి నించి ఇప్పటివరకు ఈ బెట్టింగులు జీవితాలను పాడుచేస్తూనే ఉన్నాయి. అందుకే మహాభారతాన్ని పిల్లలకు వినిపిస్తే పిల్లలకి ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది.
ఇప్పుడు వినత కద్రువకి దాసీ అయిపోయింది ఆ దాస్యం అలా నడుస్తోంది. 500 సంవత్సరముల కాలం గడిచింది. హాయిగా కశ్యప ప్రజాపతి పత్ని గా అంత సంతోషం గా ఉండవలసింది ,తొందర పడి అతివిశ్వాసం తో చేసిన పనికి అంత తేజోవంతుడైన కొడుకు శాప వాక్కు విడిచిపెట్టి రధ సారధి గా సూర్య భగవానుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇంకొక కొడుకు పుట్ట లేదు. ఆ గుడ్డు అలాగే ఉంది. కద్రువకి 1000 పిల్లలు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. దాసి అంటే చెయ్యవలసిందే చాలా ఉంటుంది. 1000 మంది పిల్లల్ని సాకడం అంటే మాటలా?  ఏ పాపాని ఇలా చేస్తుంది , కేవలం అతిసేయం వలన మాత్రమే. ఇప్పుడు 500 సంవత్సరములు నిండాయి , ఆవిడ అదృష్టం పండింది.
 ఆయన పుట్టీ పుడుతూనే పైకి    ఎగరడానికి ఇలా రెక్కలు విప్పి అల్లర్చి పైకి ఎగిరితే ఆయన రెక్కల లోనించి వచ్చిన  గాలికి  కుల పర్వతాలు  ఎగిరిపోతాయేమో అనుకున్నారుట.  అంత పెద్ద ఝంఝా మరుతాన్ని సృష్టిoచిన రెక్కలు అల్లార్చి ఒక్కసారి అలా ఆకాశం  లోకి ఎగిరితే ఆయన శరీరానికి ఆయన కాంతికి ఒక్కసారి భూమండలం అంత తిరిగాడు, తిరిగి ఎవరు మా అమ్మ అని చూసి, నా తల్లి వినత , ఈవిడకి నేను నమస్కరించాలి అని ఆకాశం లోంచి గబాలున వచ్చి భూమి మీద వాలి, నిలబడితే భూమి మీద ఉన్న ప్రాణులు, దేవతలు అందరు ఇలా చూసి ఇదేమిరా సూర్యుడు ఇలా ఎగురుతున్నాడు ఏమిటి అనుకున్నారు ట.  అటువంటి కొడుకుని వినత చూసి అబ్బా ఇటువంటి జవం ఉన్నవాడు , నా రెండో కొడుకు పుట్టేశాడు. కాబట్టి రెండో కొడుకు పుట్టిన తరువాత దాస్యం పోతుంది అనుకుని , ఇంత గొప్ప కొడుకుకి తల్లి అయ్యాను, ఇన్ని కష్టాలు పడితే పడ్డాను కాని ఇంత గొప్ప కొడుకుకి తల్లిని అయ్యాను చాలు అని ఎంత సంతోష పడి పోయిoదో  వినత. మనః ప్రీతి పొందింది వినత అన్నారు నన్నయ్య గారు. లోకo లో ఏ తల్లైన అంతే సంతోషిస్తుంది, తల్లికి మాత్రమే ఉండే అదృష్టం.



 దేవతలు ,ఋషులు అనుకున్నారుట , ఓహో ప్రళయ కాలం వచేసినట్టుంది అనుకున్నారుట ఆయన వేగంగా అలా ఆకాశం లో ఎగురుతుంటే. అగ్నిహోత్రుడు విజ్రుమ్భిస్తున్నాడు అని రక్ష చెయ్యి రక్ష చెయ్యి అని అగ్ని సూత్రములతో ప్రార్థన చేసారుట. తెలుగు భారతం భారతం లేదు కాని అగ్నిహోత్రుడు ఉద్భవించి చెప్తాడు నేను కాదయ్యా గరుత్మంతుడు ఉద్భవించాడు అన్నాడుట.
ఆయన ఆకాశం లో తిరిగి నా తండ్రి ఎవరు అనలేదుట , మాతృదేవోభవ అని తన తల్లికి నమస్కారం చేసాడుట. తల్లి గౌరవమ్ తెలిసిన వాడికి లోకం లో ఏదైనా పోయింది అని ఏడవ వలిసి వస్తే అది తల్లి పోయిన రోజు. దేవేంద్రుని వద్ద ఉన్న వజ్రాయుధం కూడా ఆయన రెక్కకి ఉన్న ఈకని కూడా ఏమి చెయ్యలేదు. అంతటి బలవంతుడు గరుత్మంతుడు. అటువంటి వంటివాడు అమ్మ వంక చుసీ ఆమె పాదాల మీద తల ఉంచి , అమ్మ వంక చూస్తూ నమస్కరించాడుట గరుత్మంతుడు. ఆ తల్లి పొంగిపోయింది ట కొడుకుని చూస్కొని ఎంత గొప్ప కొడుకు నా కొడుకు అని అనుకుంది ట.