అంతటి బలవంతుడైన గరుత్మంతుడు రెండోవ కుమారుడిగా జన్మించాడు అని చూసింది కద్రువ. అసూయ మరింత ప్రబలింది.
తన శరీరం లో పుట్టిన వ్రణం తన శరీరాన్నే పడగోడుతుంది, కానీ తన యందు పుట్టిన అసూయా తనతో పోదు, అది కులక్షయం చేస్తుంది. మొత్తం కుటుంభమే నశించి పోతుంది దాని వాల్ల, అందుకేనేమో చాలా చమత్కారమైన విషయాన్ని ఆవిష్కరించారు వ్యాస భగవానుడు. భుమిలోపలకి వెళ్ళిపోతాయి పాములు, ఆకాశం లో ఎగురుతాయి పక్షులు వీటి రెండింటికి శత్రుత్వం వచ్చింది. రెండిటికి చాలా వ్యత్యాసం వుంది , ఒకదానికి అసలు ఎగరడమే రాదు , పాము బిలాన్ని చూస్కొని ఎంత కిందకి వేల్లోచ్చో అంత కిందకి వెళ్తుంది. పక్షికి ఎగరటమే వచ్చు దిగడం అంటూ జరిగితే ఏ విశ్రాంతి కోసమోతప్ప , దాని పధము ఎప్పుడూ పైకే. పైకి వెళ్ళే ప్రాణులు ఎవరికి జన్మించాయి , ఎవరికి అసూయా లేదో వారికి జన్మించారు, దేవతాoస సంభూతు లు జన్మించారు. ఎవరికి కడుపులో అసూయా ఉందో , వారికి , అంటే అప్పటికి ప్రకటనము కాకపోయిన, అది లోపల రగులుకుంటుంది. అసూయా అంటూ ఉండడం పాములకు తల్లి కావడమే,అంటే కిందకు వెళ్ళిపోయే తతువంటి ప్రాణులకు జననము,ఇక్కడ పాముని దేవతా స్వరూపంగా కాని ఈశ్వరుని యొక్క ఆభరణం గా కానీ చూడకూడదు, అది కిందకు వెళ్ళిపోయేది , పది మంది చూసి భయపడే టటు వంటిది, అసహ్యించుకునేటటు వంటిది అయిన ప్రాణిగా మాత్రమే పరిగణింపబడుతుంది. అధోముఖం గా వెళ్ళిపోయేది పాము , అటువంటివి కొన్ని వేలు పుట్టాయి కద్రువకి, ఇద్దరే పుట్టారు , ఇద్దరు ఆకాశం లో తిరిగే వాళ్ళే , అపారమైన తెజోముర్తులు జన్మించారు, దేని వలన అంటే అసూయా అనేది లేకుండా ఉండడమే ప్రధానం. ఈ ఆదిపర్వo లో గరుడోత్పత్తి ఏదైతే ఉందొ అదే మిగిలిన భారత కధ కి సూచన గా ఉంటుంది. గాంధారి యందు ఈ అసూయా విశేషము ఉంది, ఆమె కి పుట్టిన వాళ్ళు నుర్గురు. ఈ అసూయ లేని కుంతీ మాద్రికి పుట్టిన వాళ్ళు అయిదుగురు. వాళ్ళు అయిదుగురు , దేవతంశసంభూతులు , వెళ్ళు నుర్గురు కలిపురుషునికి సంభoదించిన ప్రకోపాలు. అందుకే ఆ ఐదుగురిమీదా వాళ్ళెప్పుడు అసూయతోటే జీవించారు. అదే అసూయ కట్టి కుడిపేసింది, నూర్గురు కొడుకులున్న గాంధారికి చిట్ట చివరకు ఒక్క కొడుకు కూడా మిగలలేదు. ఐదుగురు కుమారులున్న పాండురాజు కి ఐదుగురు కొడుకులు మిగిలారు, ఎక్కడ ధర్మం ఉంటుందో , ఎక్కడ అసూయా లేకుండా ఉంటుందో, అక్కడ దేవతా శక్తులు నిలబడతాయి. మనిషి జీవితం లో పరిశీలన చేసుకోవలసినది ఏదైనా ఉంటె అది అసుయయే. అసూయ ని పొందటానికి ఎక్కడా శిక్షణ కానీ పుస్తకాలు చదుకోవటం కానీ చెయ్యనవసరం లేదు. అసుయని కలిగి ఉండటానికి గురువుగారి పాదములు పట్టుకోవలసిన అవసరం ఉండదు. అది
తనంత తాను గా ప్రబలుతుంది. అసూయా అన్న లక్షణం ఎక్కడ ఉందొ అది మెట్లు దింపుతుంది.
ఏది శాశ్వతమో అదే ఉంటుంది, ఏది ఆశస్వతమో అది పోతుంది. ఇప్పుడు దాస్యం అనేది తన కృతకమైన ప్రణాళిక తో వచ్చింది వినతకి, ఈస్వరనుగ్రహమ్ కలగానే పోతుంది. విడుదల పొందుతుంది వినత, నసింపచేసే దాన్ని పట్టుకుంటుంది కద్రువ. ఎ అతిశయం ఉందొ ఆ అతిశయం పోతోంది వినతకి దాస్యం చేత, కాబట్టి ఇప్పుడు ఆవిడ ఉన్నతి వైపు అడుగులు వేస్తుంది, కాబట్టి ఇప్పుడు ఒక చెడు గుణం పోతోంది. కానీ కద్రువ ప్రతి క్షణం అసుయని పెంచుకుంటోంది. మహాభారతం యొక్క సందేశం చాల ముఖ్యం ఆ సందేశాన్ని పట్టుకోగల్గితే చాలు. అది వ్యాసభగవానుడి యొక్క ఆర్తి. నన్నయ్య భట్టారకుని ఆర్తి, అందుకని మహాభారతాన్ని ఇచ్చింది.
ఇప్పుడు కద్రువ వినతకి నమస్కరించిన గరుత్మంతుణ్ణి చూసింది, తనకి కూడా కొడుకే అవుతాడు ఆయన, ప్రేమార కుగిలించుకోవచ్చు ,ముద్దుపెట్టుకోవచ్చు , తొడమీద కుర్చోపెట్టుకోవచ్చు, నాన్న ఎంతటి బాల పరక్రమవంతుడివి రా నీ వలన నేను మీ అమ్మ కూడా అభ్యున్నతి ని పొందాము. నీ పుట్టుకతో మీ అమ్మ కి ఒక కనుక ఇస్తున్నాను , ఇంకా దాసీ కాదు , మేము ఇద్దరం సహజం గా అక్కచెల్లెళ్ళం మధ్యలో వచ్చింది పందాలు వలన , అది శాస్వతం కాదు విడిచి పెట్టేస్తున్నాను అని ఉంటే , మహా భారతం ఇంకోలా ఉండేది. అలా అనలేకపోయింది , కడుపు మరింత మండిపోయింది , ఇటువంటి కుమారుడా అని. వెంటనే ఆవిడకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసాండి ,దాసికి చెందినది కూడా నాకు దాస్యమునకు ఉపయోగపడాలి. ఇది ఆవిడకి వచ్చిన ఆలోచన. వినత దాసీ అయితే వినతాపుత్రుడు కూడా నాకు దాస్యం చెయ్యవలసిన వాడు. ఇప్పుడు ఇది ఇంకా ఎంత దూరం వెళ్లిందంటే , ఈమె నాకు దాసీ అయితే వీడు నా పుత్రులకు దాస్యం చెయ్యాలి. అంటే ఎంత దూరం వెల్లిపొయిందో చుడండి ఆ వక్రమైన ఆలోచలన, ఎంత అసూయతో వెల్లిపొయిందో చుడండి. లోకమంత టికీ అంటే మునులకి ఋషులకి స్తోత్రం చెయ్యవలసిన గొప్పతనం గరుత్మన్తునిలో కనపడింది, కద్రువకి కనపడలేదు. ఇది ఏమాత్రమూ గరుత్మన్తునికి తక్కువ తనం మాత్రం కాదు. ఇది మనం లౌకికమ్ గా కూడా అన్వయం చెయ్య గలిగితే మీరు హాయిగా జీవనం చెయ్యగలిగిన స్థితి వస్తుంది. మీరు ప్రేమతో అందరితో కలిసి ఉన్నారనుకోండి , వాళ్ళ బలం మీ బలం అవుతుంది.
ఇప్పుడు కద్రువ వినతకి నమస్కరించి నించున్న గరుత్మంతుని చూసి అంది, నా పిల్లల్ని నీ వీపు మీద ఎత్తుకొని ఆడిస్తూ ఉండు అంది. అంత వేగంగా తిరగగలవు కదూ, నీ బలం ఎందుకు పనికిరావాలంటే నా పిల్లల్ని ఆడించేందుకు కావలి, అంత కన్నా ఇంకెందుకు పనికి రాకోడదు సుమా ! అసూయ హద్దు మీరితే ఎంత పైసచికత్వనికైన వెళ్ళిపోతుంది. నువ్వు పిల్లల్ని మొసి తిప్పి తీస్కొచి అక్కడ వదిలేసి వేల్లిపోతవేమొ, ఏమో ఇంత బలం ఉన్న వాడు ఏ వేదమొ చదవటానికి బయలుదేరితే, ఏ అస్త్ర విద్యో నేర్చుకుంటే, అది ఆవిడా భయం. వాళ్ళని అలా తిప్పి తీస్కొచి కూర్చోపెట్టి నువ్వు వెళ్ళిపోవటం కాదు , 1000 మందిలో ఎవరు ఏ పని చెప్పినా నోరెత్త కుండా చెయ్యి అన్నది. దానికి ఆయన ఏమి అనలేదు, ఎందుకు అనలేదో మీరు గమనించాలి , ఏమైనా అనగలడు అయినా అనలేదు , ఎందుకంటే బిడ్డలకు ఉన్న పరానుకరణము, బిడ్డలకి ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది అదే అనుకరించడము, ఈ అనుకరించడానికి వాళ్ళు ఎంచుకునే మొదటి వస్తువు ఏంటంటే అమ్మా ! అమ్మ ఏమి చేస్తుందో అదే చేస్తారు. ఆ అనుకరించే విషయం లో వాడి సమర్థతా అసమర్థతా మర్చిపోతాడు. అమ్మ అన్న పదం ఈ లోకం లో లేకపోతే ఈ సృష్టి ఆగి పోతుంది. ప్రతిక్షణం దిద్దు తుంది అమ్మ . అలా చెప్పగా చెప్పగా వాడు పరిణితి పొందుతాడు. అమ్మ ఏమి మాట్లాడకుండా నిలబడింది కాబట్టి నేను కూడా అలానే చెయ్యాలి అని అనుకున్నాడు గరుత్మంతుడు, అందుకని ఏమి మాట్లాడలేదు. అంత బలం ఉన్నవాడు కద్రువ చెప్తే చేసాడు అంటే వినత చేసింది కాబట్టి చేసాడు. అంటే అమ్మాయే అనుకరణకి ప్రధానమైన అంశం గా పిల్లలకి ఉంటుంది. ఇది వ్యాస భగవానుడు , నన్నయ్య గారు చెప్పకుండా చెప్పిన విశేషం. ఈ సమాజం లో ఉత్తమ పుత్రుడు తయారు అవుతున్నాడు అంటే కారణం తల్లి మాత్రమే . అందుకే గర్భాలయమే, అది ఆలయమే, ఆమె వలన తయారు అవుతాడు మహా పుత్రుడు.
శివాజీ కి చిన్నతనం లో నేర్పింది తల్లి. సనాతన ధర్మం అనే మాట మీద గౌరవమ్ నేర్పింది. స్త్రీ అంటే ఏమిటో నేర్పింది. తరవాత కలం లో ఆయనకీ మహమ్మదీయ స్త్రీలు తనకి ఖైదిలు గా దొరికినప్పుడు, వారిని వెంటనే పరదాల తో కూడిన పల్లకిలలో కూర్చోబెట్టి శత్రువు లకి అప్పచేప్పేసాడు తప్ప పొరపాటున కూడా పర స్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు, ఎక్కడి నించి వచ్చింది , శివాజీకి ఆ శక్తి? తల్లి భోద నించి వచ్చింది. అమ్మ చిన్నతనం లో మాట ఏదైతే ఉందొ అదే తర్వాతి కాలంలో పిల్లవాణ్ణి తీర్చి దిద్దుతుంది.
ఇప్పుడు గరుత్మంతుడు 1000 పాముల్ని వీపుమీద ఎక్కించుకుని రండి మిమ్మల్ని అందరూ తిప్పి తీస్కోచ్చేవాడు. ఒక్కసారి అలా ఎగిరాడంటే ఒక దండకారణ్యం అయిపోతుంది. అలా నాలుగు కులపర్వతములు, అష్ట దిక్పాల పురములు, ఇవన్ని తిప్పే వాడు. ఆ పిల్లలకి గరుత్మంతుడు తమ్ముడిగా లభించడం వలన కలిగిన అదృష్టం ఏమిటంటే వాళ్ళు , భూమినంతా చూసేసారు. పిల్లలకి పాడై పోవటానికి ఇంత కన్నా అదృష్టమైన వస్తువు ఇంకోటి లేదు. ఇంత కన్నా కావాల్సింది ఏమిటి , సాధించాను అనుకుంటోoది కద్రువ. ఒకరోజు ఈ పిల్లలందరూ తమని సూర్యుని వైపుకి తీస్కుపోమ్మన్నారు గరుత్మంతుని, ఆయన్దేమి పోయింది తీస్కుపోతున్నాడు, ఆయన తట్టుకుoటాడు , వీళ్ళు ఎక్కడ తట్టుకోగలరు. సూర్య మండలానికి దగ్గరగా తీస్కు పోతున్నాడు గరుత్మంతుడు, ఆయన కి ఏమి హాయిగా వెళ్తున్నాడు. ఈ పిల్లలేమైయ్యరంటే సుబ్బరంగా మాడి మసిఅయిపోయి కింద పడిపోయారు, అందులో బతికిన వాడు లేడు, చచ్చిపోయి కింద పడిపోయారు. చిత్రo ఏమిటంటే , ఆవిడ తప్పు పట్టింది గరుత్మంతుణ్ణి. ఎంత బుద్దిలేని వాడివిరా నీకు బుద్ది ఉండొద్దు అంది. అసలు నిజంగా ఎంత ఆశ్చర్యం గా ఉంటాయో ఇవన్నీ. అది గడుసు తనం అనుకుంటారు, కానీ ఇలా మాట్లాడ కూడదు, ఇలా జీవిoచ కూడదు అనే పరిస్థితి ఉండదు కొంత మంది దగ్గర. కాబట్టి ఇప్పుడు ఆవిడా గరుత్మంతుణ్ణి తప్పు పట్టింది, పిల్లలు అడిగితే మాత్రం నువ్వు తీస్కెళ్ళటం ఏమిటి , మరి ఆవిడే గా చెప్పింది , వాళ్ళు చెప్పింది చేయ్యమని. పిల్లందరూ చచ్చిపోయారు నువ్వు బుద్ధి హీనుడవు అని నింద చేసి ఆవిడా దేవేంద్రుని ప్రార్థన చేసింది.
ఇంద్రుణ్ణి స్తోత్రం చేస్తూ ఓ మహానుభావా దేవతలు ,కిన్నేరులు, కింపురుషులు మొద లైన వారందరూ కూడా నిన్ను సేవించి నీయందు భక్తితో ఉంది నీ శాసనాన్ని అవుదల దాల్చి, అభ్యున్నతి ని పొందుతూ ఉంటారు , ఇవాళ నా కుమారులు సూర్య మండలం వైపు వెళ్ళ బోయి ఆయన తీవ్రమైన వేడి చేత, శరీరము లని విడిచిపెట్టి మరణిoచా రు , నువ్వు వారిని బ్రతికించ వలసినది అని ఆయన కి శరణాగతి చేసి ఆయన్ని ప్రార్థించింది. త్రికరణ సుద్దిగా ప్రార్థన చేసినప్పుడు పలకడం దేవతల యొక్క లక్షణం. కాబట్టి ఎప్పుడైనా ఈస్వరనిగ్రహమ్ కలగలేదు అంటే మీరు పూర్తిగా ఈశ్వరుణ్ణి నమ్మి పూజించలేదు అని అర్థం తప్ప ఈశ్వరుని యందు దోషము ఉన్నది అనకూడదు.
తనంత తాను గా ప్రబలుతుంది. అసూయా అన్న లక్షణం ఎక్కడ ఉందొ అది మెట్లు దింపుతుంది.
ఏది శాశ్వతమో అదే ఉంటుంది, ఏది ఆశస్వతమో అది పోతుంది. ఇప్పుడు దాస్యం అనేది తన కృతకమైన ప్రణాళిక తో వచ్చింది వినతకి, ఈస్వరనుగ్రహమ్ కలగానే పోతుంది. విడుదల పొందుతుంది వినత, నసింపచేసే దాన్ని పట్టుకుంటుంది కద్రువ. ఎ అతిశయం ఉందొ ఆ అతిశయం పోతోంది వినతకి దాస్యం చేత, కాబట్టి ఇప్పుడు ఆవిడ ఉన్నతి వైపు అడుగులు వేస్తుంది, కాబట్టి ఇప్పుడు ఒక చెడు గుణం పోతోంది. కానీ కద్రువ ప్రతి క్షణం అసుయని పెంచుకుంటోంది. మహాభారతం యొక్క సందేశం చాల ముఖ్యం ఆ సందేశాన్ని పట్టుకోగల్గితే చాలు. అది వ్యాసభగవానుడి యొక్క ఆర్తి. నన్నయ్య భట్టారకుని ఆర్తి, అందుకని మహాభారతాన్ని ఇచ్చింది.
ఇప్పుడు కద్రువ వినతకి నమస్కరించిన గరుత్మంతుణ్ణి చూసింది, తనకి కూడా కొడుకే అవుతాడు ఆయన, ప్రేమార కుగిలించుకోవచ్చు ,ముద్దుపెట్టుకోవచ్చు , తొడమీద కుర్చోపెట్టుకోవచ్చు, నాన్న ఎంతటి బాల పరక్రమవంతుడివి రా నీ వలన నేను మీ అమ్మ కూడా అభ్యున్నతి ని పొందాము. నీ పుట్టుకతో మీ అమ్మ కి ఒక కనుక ఇస్తున్నాను , ఇంకా దాసీ కాదు , మేము ఇద్దరం సహజం గా అక్కచెల్లెళ్ళం మధ్యలో వచ్చింది పందాలు వలన , అది శాస్వతం కాదు విడిచి పెట్టేస్తున్నాను అని ఉంటే , మహా భారతం ఇంకోలా ఉండేది. అలా అనలేకపోయింది , కడుపు మరింత మండిపోయింది , ఇటువంటి కుమారుడా అని. వెంటనే ఆవిడకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసాండి ,దాసికి చెందినది కూడా నాకు దాస్యమునకు ఉపయోగపడాలి. ఇది ఆవిడకి వచ్చిన ఆలోచన. వినత దాసీ అయితే వినతాపుత్రుడు కూడా నాకు దాస్యం చెయ్యవలసిన వాడు. ఇప్పుడు ఇది ఇంకా ఎంత దూరం వెళ్లిందంటే , ఈమె నాకు దాసీ అయితే వీడు నా పుత్రులకు దాస్యం చెయ్యాలి. అంటే ఎంత దూరం వెల్లిపొయిందో చుడండి ఆ వక్రమైన ఆలోచలన, ఎంత అసూయతో వెల్లిపొయిందో చుడండి. లోకమంత టికీ అంటే మునులకి ఋషులకి స్తోత్రం చెయ్యవలసిన గొప్పతనం గరుత్మన్తునిలో కనపడింది, కద్రువకి కనపడలేదు. ఇది ఏమాత్రమూ గరుత్మన్తునికి తక్కువ తనం మాత్రం కాదు. ఇది మనం లౌకికమ్ గా కూడా అన్వయం చెయ్య గలిగితే మీరు హాయిగా జీవనం చెయ్యగలిగిన స్థితి వస్తుంది. మీరు ప్రేమతో అందరితో కలిసి ఉన్నారనుకోండి , వాళ్ళ బలం మీ బలం అవుతుంది.
ఇప్పుడు కద్రువ వినతకి నమస్కరించి నించున్న గరుత్మంతుని చూసి అంది, నా పిల్లల్ని నీ వీపు మీద ఎత్తుకొని ఆడిస్తూ ఉండు అంది. అంత వేగంగా తిరగగలవు కదూ, నీ బలం ఎందుకు పనికిరావాలంటే నా పిల్లల్ని ఆడించేందుకు కావలి, అంత కన్నా ఇంకెందుకు పనికి రాకోడదు సుమా ! అసూయ హద్దు మీరితే ఎంత పైసచికత్వనికైన వెళ్ళిపోతుంది. నువ్వు పిల్లల్ని మొసి తిప్పి తీస్కొచి అక్కడ వదిలేసి వేల్లిపోతవేమొ, ఏమో ఇంత బలం ఉన్న వాడు ఏ వేదమొ చదవటానికి బయలుదేరితే, ఏ అస్త్ర విద్యో నేర్చుకుంటే, అది ఆవిడా భయం. వాళ్ళని అలా తిప్పి తీస్కొచి కూర్చోపెట్టి నువ్వు వెళ్ళిపోవటం కాదు , 1000 మందిలో ఎవరు ఏ పని చెప్పినా నోరెత్త కుండా చెయ్యి అన్నది. దానికి ఆయన ఏమి అనలేదు, ఎందుకు అనలేదో మీరు గమనించాలి , ఏమైనా అనగలడు అయినా అనలేదు , ఎందుకంటే బిడ్డలకు ఉన్న పరానుకరణము, బిడ్డలకి ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది అదే అనుకరించడము, ఈ అనుకరించడానికి వాళ్ళు ఎంచుకునే మొదటి వస్తువు ఏంటంటే అమ్మా ! అమ్మ ఏమి చేస్తుందో అదే చేస్తారు. ఆ అనుకరించే విషయం లో వాడి సమర్థతా అసమర్థతా మర్చిపోతాడు. అమ్మ అన్న పదం ఈ లోకం లో లేకపోతే ఈ సృష్టి ఆగి పోతుంది. ప్రతిక్షణం దిద్దు తుంది అమ్మ . అలా చెప్పగా చెప్పగా వాడు పరిణితి పొందుతాడు. అమ్మ ఏమి మాట్లాడకుండా నిలబడింది కాబట్టి నేను కూడా అలానే చెయ్యాలి అని అనుకున్నాడు గరుత్మంతుడు, అందుకని ఏమి మాట్లాడలేదు. అంత బలం ఉన్నవాడు కద్రువ చెప్తే చేసాడు అంటే వినత చేసింది కాబట్టి చేసాడు. అంటే అమ్మాయే అనుకరణకి ప్రధానమైన అంశం గా పిల్లలకి ఉంటుంది. ఇది వ్యాస భగవానుడు , నన్నయ్య గారు చెప్పకుండా చెప్పిన విశేషం. ఈ సమాజం లో ఉత్తమ పుత్రుడు తయారు అవుతున్నాడు అంటే కారణం తల్లి మాత్రమే . అందుకే గర్భాలయమే, అది ఆలయమే, ఆమె వలన తయారు అవుతాడు మహా పుత్రుడు.
శివాజీ కి చిన్నతనం లో నేర్పింది తల్లి. సనాతన ధర్మం అనే మాట మీద గౌరవమ్ నేర్పింది. స్త్రీ అంటే ఏమిటో నేర్పింది. తరవాత కలం లో ఆయనకీ మహమ్మదీయ స్త్రీలు తనకి ఖైదిలు గా దొరికినప్పుడు, వారిని వెంటనే పరదాల తో కూడిన పల్లకిలలో కూర్చోబెట్టి శత్రువు లకి అప్పచేప్పేసాడు తప్ప పొరపాటున కూడా పర స్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు, ఎక్కడి నించి వచ్చింది , శివాజీకి ఆ శక్తి? తల్లి భోద నించి వచ్చింది. అమ్మ చిన్నతనం లో మాట ఏదైతే ఉందొ అదే తర్వాతి కాలంలో పిల్లవాణ్ణి తీర్చి దిద్దుతుంది.
ఇప్పుడు గరుత్మంతుడు 1000 పాముల్ని వీపుమీద ఎక్కించుకుని రండి మిమ్మల్ని అందరూ తిప్పి తీస్కోచ్చేవాడు. ఒక్కసారి అలా ఎగిరాడంటే ఒక దండకారణ్యం అయిపోతుంది. అలా నాలుగు కులపర్వతములు, అష్ట దిక్పాల పురములు, ఇవన్ని తిప్పే వాడు. ఆ పిల్లలకి గరుత్మంతుడు తమ్ముడిగా లభించడం వలన కలిగిన అదృష్టం ఏమిటంటే వాళ్ళు , భూమినంతా చూసేసారు. పిల్లలకి పాడై పోవటానికి ఇంత కన్నా అదృష్టమైన వస్తువు ఇంకోటి లేదు. ఇంత కన్నా కావాల్సింది ఏమిటి , సాధించాను అనుకుంటోoది కద్రువ. ఒకరోజు ఈ పిల్లలందరూ తమని సూర్యుని వైపుకి తీస్కుపోమ్మన్నారు గరుత్మంతుని, ఆయన్దేమి పోయింది తీస్కుపోతున్నాడు, ఆయన తట్టుకుoటాడు , వీళ్ళు ఎక్కడ తట్టుకోగలరు. సూర్య మండలానికి దగ్గరగా తీస్కు పోతున్నాడు గరుత్మంతుడు, ఆయన కి ఏమి హాయిగా వెళ్తున్నాడు. ఈ పిల్లలేమైయ్యరంటే సుబ్బరంగా మాడి మసిఅయిపోయి కింద పడిపోయారు, అందులో బతికిన వాడు లేడు, చచ్చిపోయి కింద పడిపోయారు. చిత్రo ఏమిటంటే , ఆవిడ తప్పు పట్టింది గరుత్మంతుణ్ణి. ఎంత బుద్దిలేని వాడివిరా నీకు బుద్ది ఉండొద్దు అంది. అసలు నిజంగా ఎంత ఆశ్చర్యం గా ఉంటాయో ఇవన్నీ. అది గడుసు తనం అనుకుంటారు, కానీ ఇలా మాట్లాడ కూడదు, ఇలా జీవిoచ కూడదు అనే పరిస్థితి ఉండదు కొంత మంది దగ్గర. కాబట్టి ఇప్పుడు ఆవిడా గరుత్మంతుణ్ణి తప్పు పట్టింది, పిల్లలు అడిగితే మాత్రం నువ్వు తీస్కెళ్ళటం ఏమిటి , మరి ఆవిడే గా చెప్పింది , వాళ్ళు చెప్పింది చేయ్యమని. పిల్లందరూ చచ్చిపోయారు నువ్వు బుద్ధి హీనుడవు అని నింద చేసి ఆవిడా దేవేంద్రుని ప్రార్థన చేసింది.
ఇంద్రుణ్ణి స్తోత్రం చేస్తూ ఓ మహానుభావా దేవతలు ,కిన్నేరులు, కింపురుషులు మొద లైన వారందరూ కూడా నిన్ను సేవించి నీయందు భక్తితో ఉంది నీ శాసనాన్ని అవుదల దాల్చి, అభ్యున్నతి ని పొందుతూ ఉంటారు , ఇవాళ నా కుమారులు సూర్య మండలం వైపు వెళ్ళ బోయి ఆయన తీవ్రమైన వేడి చేత, శరీరము లని విడిచిపెట్టి మరణిoచా రు , నువ్వు వారిని బ్రతికించ వలసినది అని ఆయన కి శరణాగతి చేసి ఆయన్ని ప్రార్థించింది. త్రికరణ సుద్దిగా ప్రార్థన చేసినప్పుడు పలకడం దేవతల యొక్క లక్షణం. కాబట్టి ఎప్పుడైనా ఈస్వరనిగ్రహమ్ కలగలేదు అంటే మీరు పూర్తిగా ఈశ్వరుణ్ణి నమ్మి పూజించలేదు అని అర్థం తప్ప ఈశ్వరుని యందు దోషము ఉన్నది అనకూడదు.