ఇప్పుడు పందెం వెయ్యి అన్నది కద్రువ , ఇంకే లొంగిపోయింది వినత, నువ్వు చెప్పినట్టు గుర్రం తోకమీద నలుపు ఉన్నదో నేను నీకు దాసీ ని, తెల్లగా ఉన్నదో నువ్వు నాకు దాసీ వి. ఏమిటి ఆవిడ ధైర్యం, పద చూద్దాం దగ్గరకి వెళ్దాం అంది వినత, కద్రువ కి తెలీదా దగ్గరకి వెళ్తే గుర్రం తెల్లగా ఉంటుంది అని? ఆవిడ మనసు యందు కుటిలమైన ఆలోచన ఉన్నది, వినత యందు అతిశయం ఉన్నా స్వచ్చమైన మనసు ఉంది, ఆవిడ లో కుట్రలు లేవు కుతంత్రాలు లేవు, కాకపోతే అతిశయ భావం ఉంది, నేను తెలివైన దానిని అని, నేనే మంచి నిర్ణయాలు చేస్తూ ఉంటాను అనుకుంటుంది, అది బలహీనత గా పట్టుకుంటుంది. ఇప్పుడు కద్రువ అన్దీ మళ్ళి ఇప్పుడే వెళదాo అనటానికి వీలు లేకుండా,వెనక్కి తీసుకు వెళ్లిపోవాలి, భర్తకి సేవ చెయ్యవలసిన సమయం ఆసన్నమైంది. అంటే ఇప్పుడాయన అగ్నికార్యం చెయ్యటానికి ఇంటికి వస్తాడు స్నానం చేసి, మన ఇద్దరి కర్తవ్యమ్ పత్నులుగా , ఆయనకి మదినీళ్ళు పెట్టడం, కావాల్సిన సమిధలు అందించడం వారి కర్తవ్యమ్. మనం భర్తని అనువర్తించాలి. కాబట్టి రేపోద్దాం ఎక్కడికిపోతుంది గుర్రం ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. చెప్పను కదూ వినత పడిపోతుంది, సరే వెళ్దాం అన్నది వినత. ఒక రాత్రి సమయాన్ని ఎందుకు అట్టిపెట్టుకుంది కద్రువ అంటే , కేవలం వినత ని మోసం చెయ్యడం కోసమే పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడా తన బిడ్డలందరినీ సమావేశ పరిచింది. ఆవిడ బిడ్డలన్ని పాములు, పాములన్నీ నల్లగానే ఉంటై, కాబట్టి పాములన్నీటిని సమావేశ పరిచింది. కద్రువ కొడుకుల వంక చూసి ఒక మాట అంది, గుర్రం తెల్లగా ఉంది అన్న విషయం నాకు తెలుసు, గుర్రం తోక నల్లగా ఉంది అని పందెం కాసాను వినత తోటి, పందెం కూడా అవువంటి ఇటువంటి పందెం కాదు, నేను వోడిపోతే వినతకు దాసి నైపోతాను. మీరు కొడుకులు అమ్మ ని రక్షించాలి , కాబట్టి మీరు ఏమిచేస్తారంటే, మీలో కొంతమంది వెళ్లి ఆ గుర్రం తోక నల్లగా కనపడుతుంది, నల్లగా కనపడేటట్టు చుట్టుకోండి, మీరు కామ రూపులు పైగా. పాములా ఉబ్బెత్తుగా ఉండవలసిన అవసరం కుడలేదు, తోకతో సమానం గా చుట్టుకోగలరు, ఎందుకంటే చుట్టుకోగాలిగిన దేహం ఉంది మీకు. తోక పైనించి కింద వరకి పడుకుని, తలలు ఆ కుచ్చు లోకి పెట్టేసాయి అనుకోండి, తోక నల్లగానే కనిపిస్తుంది. కాబట్టి మీరు వెళ్ళి ఆ గుర్రం తోక పట్టుకోండి, పట్టుకుంటే వినత నాకు దాసీ అవుతుంది. ఎందుకు అసలు వినత దాసీ అవ్వాలి, అసలు ఎందుకు ఆవిడ కి ఆ కడుపులో బాధ? నన్నయ్య గారిని అడగక్కరలేదు మనం, ఆమె లోపల ఉన్న అసూయ ఆమె చేత ఆ మాటలు అనిపించింది. తన బిడ్డల దగ్గర కి వెళ్లి తల్లి పనికిమాలిన మాటలు చెప్పినా, చిట్ట చివరకు కట్టి కుడిపేస్తుంది. అమ్మ ఏమి చేస్తుంటే, పిల్లలు వెనక అది చేస్తారు, మీరు గమనించండ, పిల్లలకి ఉండే లక్షణం అదే, అసలు అమ్మని విడిచి వేరేది చెయ్యాలని అనుకోరు. వాళ్ళకి సమస్తం అమ్మే. ఎంతమంది చెప్పని, అమ్మ చెప్పిందే వేదం పిల్లలికి. అమ్మ చెప్పినది ఏదో అదే బుర్రకి ఎక్కుతుంది. అమ్మ స్థానం అంత గొప్పది. ప్రత్యేకించి చిన్నప్పుడు చెప్పిన మాటలు గుండెకి హత్తుకుటై పిల్లలకి. కాబట్టి తల్లి పరిణితితో మాట్లాడాలి పిల్లలతో.
ఇప్పుడు ఆ కద్రువ పిల్లలు అన్నారు ఎందుకు పిన్నమ్మ నీకు దాసీ కావాలి అని అడిగారు, ఆవిడ మనసులో ఈర్ష్య తప్పితే ఏముంది. అమ్మ తప్పుకదా అలా చెయ్యొచ్చా ? అన్నారు వాళ్ళు. కొడుకుకి అమ్మ ఏదైనా చెప్తే , కొడుకు తిరిగి ధర్మం చెప్తే అంతే ఎక్కడలేని కోపం వస్తుంది.
అపారమైన కోపం తో అనరాని మాట ఒకటి నోటివెంట వచ్చేసిన్దనుకోండి, ఆ తర్వాత పరిణామములు భయంకరంగా ఉంటై. అయ్యో కోపం లో అనేసనండి అంటే కోపం పోతుందేమో , ఆ వాక్కు యొక్క ప్రభావం పోదు. అందుకే మనవాళ్ళు కోపం లో కూడా మంగళ ప్రదమైన తిట్టు తిట్టనిచ్చే వారుతప్ప మంగళ ప్రదం కాని తిట్టు తిట్టనిచ్చే వారు కాదు నీ అమ్మ కడుపు మాడ అని తిట్టేవారు. అది ఎందుకు తిట్టేవారంటే , నీ అమ్మ కడుపునా నీలాగే అనేమంది బిడ్డలు ప్రసవించి, నీ అమ్మ పత్యం చేసి కడుపు కాలుతున్నా పిల్లలకి పాలిచ్చి అనేకమంది పిల్లలకు తల్లి అయి అందరు దీర్ఘయుష్వంతులై నువ్వు నీ పిల్లలు, నీ అమ్మ నాన్న సుఖముగా ఉండెదరు గాక! అని అర్థం.
అసూయ లోనించి అపారమైన కోపం వచ్చేసింది కద్రువకి, కోపం వచ్చి అన్నది , మీరు నేను చెప్పిన మాట వినలేదు, జనమేజయుడు అనేటటువంటి రాజు చేసే సర్ప యాగం లో ఈ పాములన్నీ పడి కాలి చచ్చిపోవును గాక !
ఎంత కష్టపడి వరాలు కోరి కన్నది పిల్లల్ని, ఆ పిల్లలు ఆమె మాట వినలేదని, నాది తప్పా పిల్లలది తప్పా అని విచారణ చేసి ఉంటె ఎంత గొప్ప పిల్లలు అని మీ ధార్మికత కు మెచ్చు కుంటున్నాను అని పదికాలాల పాటు ఇలాగే ఉండండి అని గబ గబా వినత దగ్గరకి వెళ్లి లేదు ఆ గుర్రం తెలుపే నన్ను మన్నిచమ్మ అని ఒక్క మాట అనగలిగి ఉంటె ఈ ఆఖ్యానం ఇంకోలా ఉండేది. ఆ రెండు మాటలు అనడం చేత కాలేదు, అసూయ యే నిలబడింది. తన బిడ్డలు చనిపోవాలని తానే శాపం ఇచ్చేసింది.
ఇదే అసూయ గాంధారి దృతరాస్ట్రుల యందు కూడా ప్రవేశించి, పిల్లల కు దుర్బుద్ధులు చెప్పి, తన బిడ్డలు , తన వంశం నశించేటట్టు ద్రుతరాస్ట్రుడు, గాంధారి చేస్కున్నారు.
ఇప్పుడు కద్రువ అంత పెద్ద శాప వాక్యాన్ని విడిచిపెడితే పాములన్నీ కలవార పడ్డాయి. అమ్మ శాపానికి మనం వశులం అయిపోతే చచ్చిపోతాం , కాబట్టి అమ్మ మాట విందామా , ధర్మానికి కట్టుబదదామా ? బతకడానికి అమ్మ మాటే విందాం.
అమ్మ మాట ఎంత దూరం అయినా తీసుకు వెళ్తుంది. గాంధారి మాట ఎంత దూరమైనా తీసుకెళ్ళింది మహాభారతాన్ని. అందుకని కర్కోటకుడు మొదలైన పాములన్నీ వెళ్లి సన్నగా తీగల్లా ఆ ఉఛైస్రవము ( తెల్ల గుర్రం ) యొక్క తోక నల్లగా ఉండేలాగా చుట్టుకున్నాయి. తరువాత వినత ను ఆ ఉఛైస్రవము దగ్గరకు తీస్కువెళ్లి అదిగో దాని తోక నల్లగా ఉంది నువ్వు ఓడిపోయవు అన్నది కద్రువ. అంటే వెర్రి వినత అంగీకరించింది. అంగీకరించిన ఉత్తర క్షణం నించి వినత కద్రువ కు దాసీ అయిపొయింది. ఇంక వినత సంతోషము గా ఉండటం అన్న మాట ఉంటుందా వినతకు ఉండదు. ఒకే ఒక్క మాట అతివిశ్వాసం తో పందెం దాకా వెళ్ళిపోవడం. అయినదానికి కాని దానికి పందెం ఎందుకండీ , అప్పటి నించి ఇప్పటివరకు ఈ బెట్టింగులు జీవితాలను పాడుచేస్తూనే ఉన్నాయి. అందుకే మహాభారతాన్ని పిల్లలకు వినిపిస్తే పిల్లలకి ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది.
ఇప్పుడు వినత కద్రువకి దాసీ అయిపోయింది ఆ దాస్యం అలా నడుస్తోంది. 500 సంవత్సరముల కాలం గడిచింది. హాయిగా కశ్యప ప్రజాపతి పత్ని గా అంత సంతోషం గా ఉండవలసింది ,తొందర పడి అతివిశ్వాసం తో చేసిన పనికి అంత తేజోవంతుడైన కొడుకు శాప వాక్కు విడిచిపెట్టి రధ సారధి గా సూర్య భగవానుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇంకొక కొడుకు పుట్ట లేదు. ఆ గుడ్డు అలాగే ఉంది. కద్రువకి 1000 పిల్లలు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. దాసి అంటే చెయ్యవలసిందే చాలా ఉంటుంది. 1000 మంది పిల్లల్ని సాకడం అంటే మాటలా? ఏ పాపాని ఇలా చేస్తుంది , కేవలం అతిసేయం వలన మాత్రమే. ఇప్పుడు 500 సంవత్సరములు నిండాయి , ఆవిడ అదృష్టం పండింది.
ఆయన పుట్టీ పుడుతూనే పైకి ఎగరడానికి ఇలా రెక్కలు విప్పి అల్లర్చి పైకి ఎగిరితే ఆయన రెక్కల లోనించి వచ్చిన గాలికి కుల పర్వతాలు ఎగిరిపోతాయేమో అనుకున్నారుట. అంత పెద్ద ఝంఝా మరుతాన్ని సృష్టిoచిన రెక్కలు అల్లార్చి ఒక్కసారి అలా ఆకాశం లోకి ఎగిరితే ఆయన శరీరానికి ఆయన కాంతికి ఒక్కసారి భూమండలం అంత తిరిగాడు, తిరిగి ఎవరు మా అమ్మ అని చూసి, నా తల్లి వినత , ఈవిడకి నేను నమస్కరించాలి అని ఆకాశం లోంచి గబాలున వచ్చి భూమి మీద వాలి, నిలబడితే భూమి మీద ఉన్న ప్రాణులు, దేవతలు అందరు ఇలా చూసి ఇదేమిరా సూర్యుడు ఇలా ఎగురుతున్నాడు ఏమిటి అనుకున్నారు ట. అటువంటి కొడుకుని వినత చూసి అబ్బా ఇటువంటి జవం ఉన్నవాడు , నా రెండో కొడుకు పుట్టేశాడు. కాబట్టి రెండో కొడుకు పుట్టిన తరువాత దాస్యం పోతుంది అనుకుని , ఇంత గొప్ప కొడుకుకి తల్లి అయ్యాను, ఇన్ని కష్టాలు పడితే పడ్డాను కాని ఇంత గొప్ప కొడుకుకి తల్లిని అయ్యాను చాలు అని ఎంత సంతోష పడి పోయిoదో వినత. మనః ప్రీతి పొందింది వినత అన్నారు నన్నయ్య గారు. లోకo లో ఏ తల్లైన అంతే సంతోషిస్తుంది, తల్లికి మాత్రమే ఉండే అదృష్టం.
దేవతలు ,ఋషులు అనుకున్నారుట , ఓహో ప్రళయ కాలం వచేసినట్టుంది అనుకున్నారుట ఆయన వేగంగా అలా ఆకాశం లో ఎగురుతుంటే. అగ్నిహోత్రుడు విజ్రుమ్భిస్తున్నాడు అని రక్ష చెయ్యి రక్ష చెయ్యి అని అగ్ని సూత్రములతో ప్రార్థన చేసారుట. తెలుగు భారతం భారతం లేదు కాని అగ్నిహోత్రుడు ఉద్భవించి చెప్తాడు నేను కాదయ్యా గరుత్మంతుడు ఉద్భవించాడు అన్నాడుట.
ఆయన ఆకాశం లో తిరిగి నా తండ్రి ఎవరు అనలేదుట , మాతృదేవోభవ అని తన తల్లికి నమస్కారం చేసాడుట. తల్లి గౌరవమ్ తెలిసిన వాడికి లోకం లో ఏదైనా పోయింది అని ఏడవ వలిసి వస్తే అది తల్లి పోయిన రోజు. దేవేంద్రుని వద్ద ఉన్న వజ్రాయుధం కూడా ఆయన రెక్కకి ఉన్న ఈకని కూడా ఏమి చెయ్యలేదు. అంతటి బలవంతుడు గరుత్మంతుడు. అటువంటి వంటివాడు అమ్మ వంక చుసీ ఆమె పాదాల మీద తల ఉంచి , అమ్మ వంక చూస్తూ నమస్కరించాడుట గరుత్మంతుడు. ఆ తల్లి పొంగిపోయింది ట కొడుకుని చూస్కొని ఎంత గొప్ప కొడుకు నా కొడుకు అని అనుకుంది ట.
ఎంత కష్టపడి వరాలు కోరి కన్నది పిల్లల్ని, ఆ పిల్లలు ఆమె మాట వినలేదని, నాది తప్పా పిల్లలది తప్పా అని విచారణ చేసి ఉంటె ఎంత గొప్ప పిల్లలు అని మీ ధార్మికత కు మెచ్చు కుంటున్నాను అని పదికాలాల పాటు ఇలాగే ఉండండి అని గబ గబా వినత దగ్గరకి వెళ్లి లేదు ఆ గుర్రం తెలుపే నన్ను మన్నిచమ్మ అని ఒక్క మాట అనగలిగి ఉంటె ఈ ఆఖ్యానం ఇంకోలా ఉండేది. ఆ రెండు మాటలు అనడం చేత కాలేదు, అసూయ యే నిలబడింది. తన బిడ్డలు చనిపోవాలని తానే శాపం ఇచ్చేసింది.
ఇదే అసూయ గాంధారి దృతరాస్ట్రుల యందు కూడా ప్రవేశించి, పిల్లల కు దుర్బుద్ధులు చెప్పి, తన బిడ్డలు , తన వంశం నశించేటట్టు ద్రుతరాస్ట్రుడు, గాంధారి చేస్కున్నారు.
ఇప్పుడు కద్రువ అంత పెద్ద శాప వాక్యాన్ని విడిచిపెడితే పాములన్నీ కలవార పడ్డాయి. అమ్మ శాపానికి మనం వశులం అయిపోతే చచ్చిపోతాం , కాబట్టి అమ్మ మాట విందామా , ధర్మానికి కట్టుబదదామా ? బతకడానికి అమ్మ మాటే విందాం.
అమ్మ మాట ఎంత దూరం అయినా తీసుకు వెళ్తుంది. గాంధారి మాట ఎంత దూరమైనా తీసుకెళ్ళింది మహాభారతాన్ని. అందుకని కర్కోటకుడు మొదలైన పాములన్నీ వెళ్లి సన్నగా తీగల్లా ఆ ఉఛైస్రవము ( తెల్ల గుర్రం ) యొక్క తోక నల్లగా ఉండేలాగా చుట్టుకున్నాయి. తరువాత వినత ను ఆ ఉఛైస్రవము దగ్గరకు తీస్కువెళ్లి అదిగో దాని తోక నల్లగా ఉంది నువ్వు ఓడిపోయవు అన్నది కద్రువ. అంటే వెర్రి వినత అంగీకరించింది. అంగీకరించిన ఉత్తర క్షణం నించి వినత కద్రువ కు దాసీ అయిపొయింది. ఇంక వినత సంతోషము గా ఉండటం అన్న మాట ఉంటుందా వినతకు ఉండదు. ఒకే ఒక్క మాట అతివిశ్వాసం తో పందెం దాకా వెళ్ళిపోవడం. అయినదానికి కాని దానికి పందెం ఎందుకండీ , అప్పటి నించి ఇప్పటివరకు ఈ బెట్టింగులు జీవితాలను పాడుచేస్తూనే ఉన్నాయి. అందుకే మహాభారతాన్ని పిల్లలకు వినిపిస్తే పిల్లలకి ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది.
ఇప్పుడు వినత కద్రువకి దాసీ అయిపోయింది ఆ దాస్యం అలా నడుస్తోంది. 500 సంవత్సరముల కాలం గడిచింది. హాయిగా కశ్యప ప్రజాపతి పత్ని గా అంత సంతోషం గా ఉండవలసింది ,తొందర పడి అతివిశ్వాసం తో చేసిన పనికి అంత తేజోవంతుడైన కొడుకు శాప వాక్కు విడిచిపెట్టి రధ సారధి గా సూర్య భగవానుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇంకొక కొడుకు పుట్ట లేదు. ఆ గుడ్డు అలాగే ఉంది. కద్రువకి 1000 పిల్లలు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. దాసి అంటే చెయ్యవలసిందే చాలా ఉంటుంది. 1000 మంది పిల్లల్ని సాకడం అంటే మాటలా? ఏ పాపాని ఇలా చేస్తుంది , కేవలం అతిసేయం వలన మాత్రమే. ఇప్పుడు 500 సంవత్సరములు నిండాయి , ఆవిడ అదృష్టం పండింది.
ఆయన పుట్టీ పుడుతూనే పైకి ఎగరడానికి ఇలా రెక్కలు విప్పి అల్లర్చి పైకి ఎగిరితే ఆయన రెక్కల లోనించి వచ్చిన గాలికి కుల పర్వతాలు ఎగిరిపోతాయేమో అనుకున్నారుట. అంత పెద్ద ఝంఝా మరుతాన్ని సృష్టిoచిన రెక్కలు అల్లార్చి ఒక్కసారి అలా ఆకాశం లోకి ఎగిరితే ఆయన శరీరానికి ఆయన కాంతికి ఒక్కసారి భూమండలం అంత తిరిగాడు, తిరిగి ఎవరు మా అమ్మ అని చూసి, నా తల్లి వినత , ఈవిడకి నేను నమస్కరించాలి అని ఆకాశం లోంచి గబాలున వచ్చి భూమి మీద వాలి, నిలబడితే భూమి మీద ఉన్న ప్రాణులు, దేవతలు అందరు ఇలా చూసి ఇదేమిరా సూర్యుడు ఇలా ఎగురుతున్నాడు ఏమిటి అనుకున్నారు ట. అటువంటి కొడుకుని వినత చూసి అబ్బా ఇటువంటి జవం ఉన్నవాడు , నా రెండో కొడుకు పుట్టేశాడు. కాబట్టి రెండో కొడుకు పుట్టిన తరువాత దాస్యం పోతుంది అనుకుని , ఇంత గొప్ప కొడుకుకి తల్లి అయ్యాను, ఇన్ని కష్టాలు పడితే పడ్డాను కాని ఇంత గొప్ప కొడుకుకి తల్లిని అయ్యాను చాలు అని ఎంత సంతోష పడి పోయిoదో వినత. మనః ప్రీతి పొందింది వినత అన్నారు నన్నయ్య గారు. లోకo లో ఏ తల్లైన అంతే సంతోషిస్తుంది, తల్లికి మాత్రమే ఉండే అదృష్టం.
దేవతలు ,ఋషులు అనుకున్నారుట , ఓహో ప్రళయ కాలం వచేసినట్టుంది అనుకున్నారుట ఆయన వేగంగా అలా ఆకాశం లో ఎగురుతుంటే. అగ్నిహోత్రుడు విజ్రుమ్భిస్తున్నాడు అని రక్ష చెయ్యి రక్ష చెయ్యి అని అగ్ని సూత్రములతో ప్రార్థన చేసారుట. తెలుగు భారతం భారతం లేదు కాని అగ్నిహోత్రుడు ఉద్భవించి చెప్తాడు నేను కాదయ్యా గరుత్మంతుడు ఉద్భవించాడు అన్నాడుట.
ఆయన ఆకాశం లో తిరిగి నా తండ్రి ఎవరు అనలేదుట , మాతృదేవోభవ అని తన తల్లికి నమస్కారం చేసాడుట. తల్లి గౌరవమ్ తెలిసిన వాడికి లోకం లో ఏదైనా పోయింది అని ఏడవ వలిసి వస్తే అది తల్లి పోయిన రోజు. దేవేంద్రుని వద్ద ఉన్న వజ్రాయుధం కూడా ఆయన రెక్కకి ఉన్న ఈకని కూడా ఏమి చెయ్యలేదు. అంతటి బలవంతుడు గరుత్మంతుడు. అటువంటి వంటివాడు అమ్మ వంక చుసీ ఆమె పాదాల మీద తల ఉంచి , అమ్మ వంక చూస్తూ నమస్కరించాడుట గరుత్మంతుడు. ఆ తల్లి పొంగిపోయింది ట కొడుకుని చూస్కొని ఎంత గొప్ప కొడుకు నా కొడుకు అని అనుకుంది ట.
No comments:
Post a Comment