శంకర భగవత్ పాదుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు అమ్మా నీ దగ్గరకి వచ్చిన వాళ్ళందరూ కోరిన కోర్కెలు తీర్చ గలిగిన ఓ పరదేవతా! హరి నిన్ను మోహించి జగన్మోహిని రూపాన్ని పొందాడు, ఇక్కడవరకు బానే ఉంది అప్పుడు మనకి ఏమి గుర్తొస్తుంది అలా జగన్మోహిని రూపం ధరించడం వల్లనే దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచటం లో రాక్షసులకి దక్కకుండా, లోకాన్ని కాపాడి అంటాం, అక్కడే శంకరా చార్యుల వారు ఏమి చేసారంటే , మన అందరినీ పక్కకి తోసేసి ఇంకోవైపుకి వెళ్లారు.
శంకరాచార్యులు అన్నారు అమ్మా శ్రీమహా విష్ణువు నిన్ను ఉపాసన చేసారు, నువ్వేమి చేసావు , లోకం లోక్కెల్లా నువ్వే అందగాత్తెవి త్రిపురసుందరివి నీ అందాన్ని శ్రీమహావిష్ణువు కి ఇచ్చావు ఇప్పుడు ఆయన జగన్మోహిని అయ్యాడు, అమృతం గురించి చెప్తే బానే ఉండేది, కానీ శంకరాచార్యులు ఏమ్మన్నారంటే అప్పుడు ఏమైందో తెలుసా అమ్మా , మీ ఆయన పరువు బజారున పడింది అన్నారు. పరమ శివుడు ఆ జగన్మోహిని వెంట పడ్డాడు అన్నాడు.
పురములు కాల్చిన పరమేశ్వరుని లో కామము బయలుదేరి, ఆయన ఆ జగ్నమొహిని అవతారం పొందిన ఆ విష్ణువు వెంట పడ్డారు. అమ్మా ఎంత పని చేశావమ్మా మరి ఇంకా ఊరుకున్నావా? ఆ పరమ శివుడు మన్మదున్ని కల్చేసాడు. కలచేస్తే ఇంకేముంది జననం లేదు మరణం లేదు. ఎవరి మీద కాముడు బాణాలు వెయ్యటం లేదు హాయి. సుఖం గా ఉన్నారు అందరు , అని మనం అనుకుందాం కాసేపు, అమ్మవారు ఏమి చేసింది మన్మదున్ని బతికించింది. బతికించి పైగా ఏమి చేసింది ఎవ్వరికి కనపడవు రా !, ఒక్క మీ ఆవిడకే కనపడతావు అంది.
కానీ ఇప్పుడు ఎటువైపు నుంచి వచ్చి బాణాలు వేస్తాడో , ఎంత నిష్ట గా ఉన్నవాడు ఆ బాణాలకి ఏమైపోతాడో ఎవరికీ తెలీదు. అమ్మా దీని వల్ల ఏమైంది అంటే , ముక్కు ముస్కుని , హిమాలయ పర్వతాల లో జపం చేస్కునే వాళ్ళు కూడా బయపడుతున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కుడా కామానికి వశులై పోతున్నారు. కాబట్టి అమ్మా ఇంత గొప్ప పని చేసిన నీకొక నమస్కారం అంటారు శంకరులు.
ఇది పైకి బావుందేమో , మీరు కొంచం జాగ్రత్త గా ఆలోచిస్తే, ఇంత గొప్ప అందాన్ని శ్రీమహావిష్ణువు కి ఇచ్చి పరమ శివుని ప్రతిష్ట బజారున పారెయ్యటం , పతివ్రతా లక్షణమా?
రెండు ఆ కాముడు లేకపోతే ఈ చావులేదు పుట్టుకా లేదు, ఏ గొడవా లేదు. ఆ కాముడికి ప్రాణం పోసింది ఆవిడ , ఆ మన్మధుడు బతక బట్టి మన అందరికి ఈ అల్లరి వచ్చింది. పుట్టటం , చావటం , పుట్టటం ,చావటం. పోనీ ఊరుకుందా ఆ మన్మధున్ని బాణాలు ఎవరిమీద వెయ్యటానికి కూడా అధికారం ఇచ్చేసింది, ఒరేయి తపస్సు చేకుంటున్న ఋషుల మీద కూడా వేస్తె వెయ్యి నేనేమి అనను అన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా భయ పడిపోతున్నారు. అమ్మా ఇన్ని చేసిన నీకు ఒక నమస్కారం.
ఇది స్తోత్రమా ? నిందా ? భయపడకుండా గుండెలమీద చెయ్యేసుకుని ఆలోచించండి. ఇందులో నిజాయితీ గా త్రికరణ శుద్దిగా అమ్మవారిని అబ్బా ఏమి అమ్మవారు అని స్తోత్రం చెయ్యటం ఏమైనా ఉందా ? ఏమీ లేదు , మరి ఏమిలేని దానికి శంకరా చార్యుల వారు సౌందర్య లహరి లో శ్లోకం ఎందుకు ఇచ్చినట్టు.
ఎవరు చట్టాన్ని చేసారో , వారు ఆ చట్టాన్ని తెసేసే అధికారం కలిగి ఉంటారు. ఇక్కడ వరకు అంగీకరిస్తారా? ఇంకా రెండు మీరు మేము ఇంకా బెంగ పెట్టుకున్నది దేని కొరకు అయ్యయ్యో ఆ చచ్చి పొయిన మన్మధున్ని అమ్మవారు మళ్ళి ఎందుకు బ్రతికించింది అని.
అమ్మవారు మనమధున్ని పుట్టించలేదు అనుకోండి, మన్మధ బాణములు లోకంలో పడలేదు అనుకోండి. సృష్టి ఆగిపోయింది గా , సృష్టి ఆగిపోతే మనం చేసిన పాప పుణ్యాలు పోయేది ఎప్పుడు. ఈ శరీరం ఉంటె కదా పాప పుణ్యాలు పోయేది? ఈ శరీరం పోయిన తరువాత జీవుడు మళ్ళి పుట్టాలి , మీతో నేను కొంచం కటినంగా ఉన్నా ఎదార్థం చెప్తున్నాను.
గరుడ పురాణం చెప్తుంది, శరీరం లేకుండా దక్షిణ దిక్కున పిత్రులోకం అంటారు , అక్కడ నిలబడి పోయారు అనుకోండి, అప్పుడు ఏడుస్తాడు. శరీరం ఉంటె పుణ్య కర్మ చెయ్యొచ్చు , పాపాన్ని పోగొట్టుకోవచ్చు. శరీరం లేదు జీవుడు ఉండిపోయాడు, అప్పుడు ఏడుస్తాడు, నాకు ఏదో ఒక శరీరం ఇవ్వు ఈశ్వరా, శరీరం అంటూ ఉంటె నేను మళ్ళి నిన్ను శరీరం తో సేవిస్తాను అంటాడు. కానీ ఏ శరీరం పడితే అది ఇస్తే ఏమీ చెయ్యలేదు, మనుష్య శరీరం ఇస్తేనే చెయ్యగలడు.
ఇప్పుడు ఈ మనుష్య శరీరం కావలి, కావాలంటే ఎలా వస్తుంది? తల్లి తండ్రుల మీద మన్మధ బాణాలు పడితేనే నా ఈ శరీరం వస్తుంది. ఈ శరీరం వస్తేనే నా మీరు మళ్ళి పాప పుణ్యాలు పోగొట్టుకోవటానికి ఈశ్వరుని సేవ చేస్తారు? కాబట్టి ఇప్పుడు అమ్మవారు , కామున్ని బ్రతికించటం వలన , మనకి ఈ శరీరాలని పొందటానికి అవకాశం వచ్చిందా లేదా ?అమ్మవారి అనుగ్రహం లేదు అందులో.
నేను మీతో ఇంకో మాట మనవి చేస్తాను మీతో, అమ్మవారు కమున్ని ఎప్పుడైతే బ్రతికిన్చిందో కామము బ్రతికింది. కామము బ్రతికితే బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి ? నీ కామము ధర్మ బద్దం అయితే నువ్వు పితృ ఋణం నించి బయట పడి పోయావు. ధర్మ బద్దమైన కామం తో ధర్మ పత్ని యందు కామం పెట్టుకున్నావ్. సంతానాన్ని కనడం తో పితృ ఋణం నించి బయట పడ్డావు.
కాబట్టి నీకు కాముడు ఉంటె బెంగ ఎందుకు , పితృ ఋణం తీరింది. ధార్మికమైన కామం అనుభవించ లేక పోతున్నాను, అప్పుడూ బెంగ లేదు, ఈ విషయం అమ్మవారికి చెప్పు , అమ్మా నువ్వు కమున్ని ఇచ్చావు , కామాన్ని ఇచ్చావ్ , కానీ వచ్చిన పెద్ద చిక్కల్లా , కామాన్ని ధర్మం తో ముడి వెయ్యలేక పోతున్నాను ఆ ముడి వెయ్యలేక పోవటం వాళ్ళ నేను పడైపోతున్నాను అని అమ్మవారితో చెప్పు , ఎవరు చట్టం చేసారో వాళ్ళే చట్టాన్ని రద్దు చేసినట్టు, నువ్వు అమ్మవారి పదాలు పట్టుకుంటే , అమ్మ కమున్ని పిలిచి వాడి జోలికి వేళ్ళకు అంటుంది.
మీకు ఇంకో విషయం చెప్తాను , మహాత్ములైన వారు ఉన్నారు, వారికి కామ స్పర్స ఉండదు, ఆయన అస్కలిత బ్రహ్మచారి , ఆయనకి అసలు ఎట్టి పరిస్థితులలో కామం అనే స్పర్స అంటదు, ఇప్పడు ఆయన శరీరం తో ఉండి పోతాడా? నాకు చెప్పండి, ఎంతటి మహాత్ముడైన కానివ్వండి , ఆయన శరీరము ఒక ప్రత్యేకమైన దేశ కాలము యందేనా ఉంటుంది? ఎప్పటికి ఉండిపోతుందా ? చంద్రశేకర భారతీ స్వామివారే అయినా , శంకర భగవత్ పాదులే అయిన శరీరాలని విడిచి పెట్టేసారు, వెళ్లి పోతారు. మరి శరీరం వెళ్ళిపోతే ఒక పెద్ద ఇబ్బంది ఒకటి ఉంది. మళ్ళి ఇంకో మహాత్ముడు శరీరం లోకి వచ్చి కూర్చుంటే మీకు భోధ ఉంటుంది. లేకపోతే ఆగిపోతుంది.
కాబట్టి మహాత్ముల పరంపర నడవాలి , మళ్లి మళ్ళి మళ్ళి మహాత్ములు రావాలి, ఇప్పుడు కుడా మనకు మహాత్ములు ఉండాలి. ఉండి వాళ్ళు మాట్లాడితేనే , మన తప్పులు మనం తెలుసుకుని ,మనం ధర్మ మార్గం లోకి వెళ్తాం. కానీ అలా చెప్పి మాట్లాడే మహాత్ముడు ఎలా వస్తాడు? ఆయన శరీరం లోకి రావాలంటే ఆయన తల్లి తండ్రుల మీద కాముడి బాణాలు పడవలసిందే. పరిపూర్ణమైన మనసుతో భార్యాభర్త లు ఇద్దరు సంగమించక పోతే , పరిపూర్ణమైన ఆరోగ్యం తో శిశువు పుట్టడు. విముఖులై సంఘమిస్తే తేజోవంతమైన , ఆరోగ్యవంతమైన శిశువు పుట్టదు. అలా కలవలేదు కాబట్టే వ్యాసుడే సంఘమించినా సత్సంతానం కలగలేదు, భారతం లో. వెల వేల బోతే పాండురాజు పుట్టాడు , కళ్ళు మూసుకుంటే ద్రుతరాస్త్రుడు పుట్టాడు.
పరిపూర్ణ హృదయం తో ఒక మహాపురుషుడు, ఒక స్త్రీతో సంగమిస్తే తప్ప, ఆయన వీర్యం స్కలనం అవ్వాలంటే ఆయనకి కామం కలిగి తీరాలి, ఆయనకీ కామం కలిగితేనే ఆయన తేజస్సు వేరొక స్త్రీలోకి వెళ్తుంది. వెళితేనే ఇంకో మహాత్ముడు పుడతాడు, పుడితేనే తప్ప మీకు మాట్లాడేవాడు లేడు. మీకు రాసేవాడు లేడు , చెప్పేవాడు లేడు. అప్పుడు లోకం ఏమై పోవాలి , కాబట్టి ఇప్పుడు ఒక మహాత్ముడు పుట్టాలి అంటే అంతకంటే మహా పురుషుని లో కామం కలగాలి, ఆయనకి కామం కలగదు, ఎందుకని అంటే ఆయన మహా పురుషుడండి, పరాశరుడికి కామం ఎందుకు కలుగుతుంది, ఒక్కనాటికి కలగదు.
పరాశర మహర్షి వంటి మహా పురుషుని తేజస్సుని పట్టగలిగే క్షేత్రం ఉండాలి. కారణ జన్మురాల్ని సృష్టించాలి. కారణజన్ముడైన పురుషుడు పుట్టాలి అంటే ఉపరిచర వసువు వంటి మహా పురుషుని వీర్యం గిరిక లోకి వెళ్ళ వలసినది, శాప విమోచనం కావలిసిన అద్రికలోకి వెళ్లి అద్రిక నుండి మత్యగoధి పుట్టి, మత్యగంది వంటి ఉపరిచర వసువు వల్ల పుట్టిన గొప్ప క్షేత్రం లోకి పరాసరుని తేజస్సు ప్రవేశిస్తే, ఈ క్షేత్ర భీజ సంపర్కం చేత వేరొక మహా పురుషుడైన వేదవ్యాసుడు, పుడతాడు. ఆయన పుడితే మీరు నేను తరిస్తాం.
ఇప్పుడు పరాశర మహార్శిలో కామo కలగాలి , ఆయనకి కలుగుతుందా ఒక్కనాటికి కలగదు, సత్యవతి ని చూడగానే ఆయనకీ కామం కలిగితే తప్ప వ్యాసుడు రాడు. వ్యాసుడు వస్తే తప్ప మీకూ నాకు భారతం లేదు. వేద విభాగం లేదు, అష్టాదశ పురాణములు లేవు. ఇప్పుడు అంతటి మహా పురుషుని మనసుని కదప గలిగినది ఎవరు?
ఎవరు చట్టం చెయ్యగలరో ఎవరు రద్దు చెయ్య గలరో వారే చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు పరదేవత ఏమి చెయ్యాలి , అంతటి మహాపురుషుని మనసు , కామ ప్రచోదనం కలిగేటట్టు చెయ్యాలి.
కాబట్టి ఎవరు చేసింది అని గుర్తు, పరాశక్తి చేస్తుంది , ఈ కదలికలన్నీ ఆయన మనసు సత్యవతి యందు లగ్నం అయితే సత్య గర్భమున వేదవ్యాసుడు పుడతాడు. అందుకని ఆయనలో కామ ప్రచోదనం ఎంత వరకు అవసరమో అంత వరకే చేసింది , పరాశక్తి. ఒక్క వ్యాస జననం వరకే ఇంకా ఆ తరువాత , పరాశరుడికి ఎప్పుడూ కామం లేదు. మహాపురుష జననం ఎందుకు జరుగుతుంది, పరాశక్తి నిర్ణయం చేస్తుంది. అందుకే మహా పురుష జననములను విచారణ చెయ్యవద్దు అని అన్నారు.
మహాపురుష జననము నందు నువ్వు వెకిలి నవ్వు నవ్వితే , నీకు పాపం వస్తుంది. అందువలన శాస్త్రం ఏమి అన్నదంటే, ఒకవేళ నీకు అర్థం కాకా పోతే ఊరుకుండి పో విచారణ చెయ్యొద్దు. మహాపురుష జననము , నది యొక్క ప్రారంభ స్థానమును విచారణ చెయ్యవద్దు, నది ఉంది స్నానం చెయ్యి అంతే. ఎక్కడ పుట్టింది అని అడగకు.
మహపురుషుని వలన నీకు వాంగ్మయం వచ్చింది. నువ్వు వాంగ్మయం చదువుకో ఆయన అలా ఎలా పుట్టాడు అని అడుగ వద్దు.
పరదేవతనుగ్రహం కలిగింది, వ్యాస భగవానుడు పుట్టాలి, ద్వాపర యుగం అయిపోతోంది, కాళీ యుగం ప్రారంభం అవుతుంది, కలియుగం లో కలిపురుషుడు విజ్రుమ్భిస్తాడు. ధర్మం చెప్పేవాడు లేడు, ఆయుర్దాయం తగ్గిపోతుంది. వేదాన్ని అంతటిని ఎవరూ చదవలేరు, వేదాన్ని అంతటిని విభాగం చేసి, ఉన్న ఆయుర్దాయం లో వేదాన్ని చదువుకునే వాడు ఉండాలి, అష్టాదశ మహాపురనములను ఇవ్వగలిగిన వాడు ఉండాలి. భారతం చెప్పగలిగిన వాడు ఉండాలి, శిష్యుల్ని తానె తాయారు చేస్కో గలగాలి. మహా పురుషుడై స్వార్థ త్యాగి అయిన వాడు కావలి, అటువంటి వాడు పుట్టాలి అంటే ఎంతటి మహాత్ముడి తేజస్సు కదలాలి.
అటువంటి మహాపురుషుడి తేజస్సు కదిలినా అంతటి తేజస్సు పట్ట గలిగిన క్షేత్రం ఏది, అందుకని ఆ క్షేత్రాన్ని కుడా పరదేవతే సిద్దం చేసింది. వేరొక మహాపురుషుడి తేజస్సు కదిపి అది అద్రిక మింగి, అది అద్రిక కడుపులో పెరిగితే అద్రికకి శాప విమోచనం అవుతుంది. అప్సరస గర్భం నుండి బయటకి వచ్చింది కాబట్టి , దాశ రాజు దగ్గర పెరిగితే, యమునా నది దాటుతున్న అప్పుడు ఆయన హృదయము ఆమె యందు నిలబడింది. మనకొరకు ఆయన మనసు ఎంత వరకు కదలాలో అంతవరకు కదిలేలా చేసిన పరదేవతనుగ్రహాన్ని మీరుచదువుతున్నరని గుర్తు.
అందుకే ఆదిపర్వం లో మహాపురుషుల జననం వింటే, సాక్షాత్తుగా దేవతల యొక్క రాక్షసుల యొక్క, పరదేవత యొక్క ఇంతమంది యొక్క అనుగ్రహము కలిగేస్తుంది . మహా పురుష జననం వెనకాల పరదేవత యొక్క అనుగ్రహం నడుస్తోంది.
ఇప్పుడు తీర్థ యాత్ర కి వెళ్తున్న ఆ పరాశరుడు యమునా నది పైన పడవ నడుపుతున్న ఆ యోజన గ్రంధి ని చూసి ఆయనకీ అసలు మదము లేదు మత్సరము లేదు, లేని వాడికి ఎలా కలిగింది , మనకోసం కల్పించింది పరదేవత. నీ తేజస్సు జారితే కాని రాదు వ్యాసుడు అని. ముడులోకముల చేత స్తోత్రం చెయ్య బడే వాడు, వసిష్టుని యొక్క మనవడు, శక్తి మహర్షి యొక్క కుమారుడు, పాపములు నశించిపోయే టట్టు గా ఘోరమైన తపస్సులు చేసిన వాడు,మంచి వ్రతం తో తీర్థ యాత్ర కి వెళ్ళే వాడు.
వొంటినిండా యోజనం దూరం వరకు చేపల కంపుకొట్టే ఆ స్త్రీ ని చూసాడు, ఇందులో ఒక విచిత్రం ఉంది, పొగ ఎక్కడ మొదలైందో అక్కడకి వెళ్లి కూర్చుంటే, పొగ ఉండదు. కంపు ఎక్కడ మొదలైందో అక్కడకి వెళ్తే కంపు ఎక్కువ వస్తుంది. ఇంత మహాన్వితుడు అంత దుర్వాసన వస్తున్నా మత్యగంది దగ్గరకి వెళ్లి చుస్తాడండి ఆయన? మరి చూసాడు అంటే మన కోసం చూసాడు అని చెప్పాలి. పరదేవతానుగ్రహం గా చూసాడు అని చెప్పాలి. చూసి ఆమె యొక్క పొందు కోరాడు.
కోరితే ఆ మాత్య గంధి అంది నేను కన్యని , నా కన్యాత్వం పోతే నా తండ్రి నన్ను గడపలో అడుగుపెట్ట నిస్తాడా ? అటువంటి తప్పుడు పనిచేసి ఇంటికి వస్తావా అంటాడు. కాబట్టి నువ్వు ఎంతటి మహా పురుషుడవైనా కావొచ్చు నీతో సంఘమం నాకు ఎలా కుదురుతుంది.
అంటే ఆయన అన్నాడు ఇది బహుశః పరదేవత అనుగ్రహం లేకపోతే నా మనసు నీయందు నిలబడటం ఏమిటి, నీకు వరం ఇస్తున్నాను. నీ శరీరము చేపల వాసన కదూ వస్తోంది అని అంటున్నావు, ఇక నించి నువ్వు యోజన గంది వి అవుతావు, మత్యగంధి వి కావు, నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడ నించి యోజనం దూరం సువాసనలు వచ్చి ఆకర్షిస్తాయి. అదే ఎదర భరత వంశానికి వరం అయ్యింది. ఊరికినే ఋషి నోటివెంట ఏమాటా రాదండి. అమ్మవారు పలికిస్తోంది. యోజన గంధి వి అవుతావు, ఆ వాసన లే శంతన మహారాజుని తీస్కువచ్చాయి.
నీ కన్యత్వం చెడదు, 9 నెలలో 10 నెలలో నువ్వు గర్భం ధరించక్కర్లేదు, సత్య గర్భం గా ఇప్పుడే మహాత్ముడు జన్మిస్తాడు నీ కడుపున, నీవు కన్య గానే ఉంటావు నేను నీకు వరం ఇస్తున్నాను. పగటివేళ మంచుతెరలు సృష్టిస్తున్నాను నా యొక్క తపస్సు చేత, పరాశర మహర్షి యొక్క సంఘమ ఫలితంగా పరమేష్టి సమానుడైన పరాశర మహర్షి అనుగ్రహం చేత సద్యో గర్భం లో సాక్షాత్తు సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు, పుట్టుకతోనే నాలుగు వేదములు నేర్చుకుని పుట్టిన వాడు. సాక్షాత్తు నారాయణుడు పుట్టాడు. సకల మునులకు మొట్ట మొదటి వాడు. పుట్టుకతోనే మహా జ్ఞానం తో పుట్టాడు మహానుభావుడు.
వచశ్రీమంతుడు పుట్టాడు, పుట్టీ పుడుతూ నే నల్లటి వర్ణం తో పుట్టి మహానుభావుడు ఆ యమునా నది ఒడ్డున అమ్మా నేను తపస్సు చేస్కోవటానికి వెళ్ళిపోతున్నాను అమ్మా , తండ్రి పరాశర మహర్షి తన సహజ స్థితి లోకి వెళ్లి పోయాడు ,పుట్టిన బిడ్డడు ఆయన వెళ్ళిపోయాడు. ఇటువంటి మహాపురుష సంపర్కం చేత మహాపురుష జననం చేత ఆమె కన్యత్వం చెడలేదు, ఎదర భారత వంశం నిలబడటానికి ప్రాతిపదిక పడింది.
శుభ క్షణం లేకపోతే అసలు కౌరవ పాండవులు పుట్టే అవకాసం లేదు. భీష్ముడితో సరి, ఆ భీష్ముడి సంతతి పెరిగితే ఏమో కధ ఎలా ఉండేదో. భీష్మ ప్రతిజ్ఞ చేయించి ఆ భీస్మున్ని అలా నిలబెట్టింది. మళ్ళి భీష్ముడు అలా నిలబడక పోతే, దీర్ఘాయుషుమంతుడు కాక పోతే వశిష్టుడి శాపం నిలబడదు, వసిష్ట మహర్షి యొక్క వాక్కు నిలబడ టానికి ఇదిగో ఈ మహాత్ముడు ఇప్పుడు పుట్టాడు. పుట్టి ఆయన తపస్సు చేస్కోవటానికి వెళ్తుంటే ఆయన్ని , కృష్ణ ద్వైపాయనుడు అని పిలిచారు. అక్క వనం లో పుట్టి వెంటనే వెళ్ళిపోయాడు కాబట్టి ద్వీపంలో కృష్ణ ద్వైపాయనుడు అని పేరు వచ్చింది.
నాయనా ! నువ్వు నన్ను అడిగావు కదా అసలు ఎందుకు జరిగింది భారత యుద్ధం , అసలు ఎందుకు చెప్పిన మాట వినలేదు అని కదా నువ్వు అడిగావు. ఈ భూమికి భారం పెరిగిపొయింది పాపుల చేత, భారం పెరిగిపోతే భూదేవి ఏడ్చింది. ఈలోకంలో పాపభారం పెరిగిపోతుంది , దీన్ని నిర్మూలించ టానికి దేవతంశలు రావాలి , శ్రీమన్నారాయణుడు కదిలి రావాలి, వచ్చి పాప భారాన్ని అంత పోగొట్టాలి అన్నారు, అంటే తప్పకుండా అలాగే అని వరం ఇచ్చారు .
ఇప్పుడు ఎంత పాపభారం పెరిగి ఉన్నదో తెలుసాoడి ఆ సమయం లో, అది పోగొట్టటానికి ఒక్క పరమేశ్వరుడు వస్తే సరిపోదు, దేవతలు అందరు అంశాలతో కదిలి రావాలి , అందుకని దేవతలు అందరూ కదిలి వచ్చారు. దేవతంశలలో వచ్చిన వారు కొందరు, రాక్షసంసలలో పుట్టేసినవారు కొందరు, ఇప్పుడు రాక్షస అంశలలో పుట్టిన వాళ్ళు అందరూ దేవతంశాలలో పుట్టిన వాళ్ళ వల్ల చచ్చిపోవాలి. చచ్చిపోతే భూ భారం తీరుతుంది.
భారతం లో గమత్తు ఏమిటో తెలుసా , దేవతంశలలో వచ్చిన వారు రాక్షసాంసలలో పుట్టిన వారి దగ్గర నించొని యుద్ధం చేసారు. భీష్ముడు దేవతాంస, ద్రోణుడు దేవతాంస బృహస్పతి అంశ వీళ్ళు కౌరవుల పనుపున యుద్ధం చేసారు. అలా ఎందుకు చేసారు? ఒక పెద్ద ధర్మ సంభందమైన అనుమానం కదండి!
ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పా వలసి ఉంటుంది. మంట రాజుకోవాలి అంటే ఏమి చేస్తాం ,మీరు ముందు మీ కళ్ళ కి మంట కలిగినా , ఖేదం కలిగినా ఆ పొగ ని భరిస్తూ ఒక గొట్టం పట్టుకుని, మంట దగ్గర కి వెళ్లి ఊదాలి, మీరు ఊదితే రాజుకుంటుంది, రాజుకుని మంట పుట్టింది అనుకోండి, ఇంకా ఆ తర్వాత అన్నం వండుకోవచ్చు, నీలు కాగాబెట్టుకోవచ్చు, ముందు కష్ట పడాల వద్దా , దుర్యోధనుడు యుద్దానికి వచ్చి నిలబడాలి అనుకోండి, భీష్ముడు ,ద్రోణుడు , కృపుడు అందరు అటువెళ్లి పోయారు అనుకోండి, ఇక దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు, పన్నాగాలు పన్నుతూ నే ఉంటాడు. ఇంక ఎలా రక్షసాంస లు పోవటం.
రక్షసాంసలు దేవతంస ల తో తలపడాలంటే వాడికి ధైర్యం కలగటానికి కొన్ని దేవతంసలు తమ స్వరూపమునందు మార్పు లేకుండా నే వెళ్లి అక్కడ నించోవాలి. అందుకు నించున్నాడు, భీష్ముడు , ద్రోణుడు. అది మహా భారతం లో అత్యంత చమత్కారం. అందుకని నించున్నారు తప్ప ,చేత కాకో , దుర్యోదనుడి మోచేతి నీళ్ళ కోసమో కాదు. ఊదటం కోసం పొయ్యిని ,నించున్నారు. అందుకని వాళ్ళు అక్కడ నిలబడక పోతే ఆ యుద్ధం లో వాళ్ళు పడరు,
రాక్షసులు , అందుకని కొంతమందిని అక్కడ నించోపెట్ట వలసి వచ్చింది కృష్ణ భగవానుడు.
కాబట్టి ఒక్కొక్కళ్ళు ఎలా జన్మించారంటే, ఎన్నడూ దుఖం లేని పరమాత్మా ఈలోకం లో ధర్మాన్ని స్థాపించడం కోసం , దేవకీ వసుదేవులకి కుమారుడిగా పుట్టాడు. ప్రలంభుడు మొదలైన రాక్షసులని సంహరించటానికి , ఆదిశేషుడు యొక్క అంస , బలరాముడి గా రోహిణి వసుదేవులకు జన్మించింది. సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా వచ్చాడు. పదహారువేల మంది అప్సరసలు గోపికలుగా వచ్చారు.
దేవతలే యదు , భోజ, అంధక వంశాలలో రాజులుగా వచ్చారు. వసువులలో ప్రభాసుడు అనే ఒక గొప్ప వసువు భీశ్మాచార్యుడి గా వచ్చాడు. దేవతల గురువైన బృహస్పతి ద్రోణాచార్యుడి గా వచ్చాడు, కామము క్రోధము కలగలిసి ఉంటె ఎంతో ప్రమాదం, ఈ రెండిటిని కలకలిస్తే పుట్టిన వాడు అస్వర్థామ. ఏకాదశ రుద్రుల అంశలో పుట్టిన వాడు కృపాచార్యుడు. అందుకే కురుక్షేత్ర యుద్దంలో అందరూ మడిసి పోయిన, ఎప్పటికీ గురుత్వం వహించాడు కృపాచార్యుడు..
సూర్యుని యొక్క అంశ లో వచ్చిన వాడు కర్ణుడు, హంసుడు అనే గంధర్వుడు ద్రుతరాస్త్రుడిగా వచ్చాడు. మతి గాంధారి గా వచ్చింది. కలి పురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు. పౌలస్త్యభాత్రు వంశం అంతా కుడా రాక్షసులు అంతా కలిసి దుర్యోధనుని యొక్క సోదరులుగా వచ్చారు. హిరణ్య కశ్యపుడు శిశుపాలుడి గా పుట్టాడు ,సమ్హలాదుడు శల్యుడిగా పుట్టాడు, విప్పలా దుడు జరసందుడిగా పుట్టాడు.
కాలనేమి కంసుడిగా పుట్టాడు, శ్రీమహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది. స్త్రీ పుంస స్వరూపము రెండు కలిసి ఉండే ఒక దేవత శిఖండి గా పుట్టాడు. మరుత్గణాoశ తో పుట్టిన వాడు పాండురాజు, మండవ్యుని శాపం వలన యమధర్మ రాజు మళ్ళి పుట్ట వలసి వస్తే విదురుడిగా పుట్టాడు , సిద్ది బుద్ది ఇద్దరు , కుంతీ మాద్రిగా పుట్టారు. అనేకమైన దేవతల అనుగ్రహం తో యమధర్మ రాజు అంశగా ధర్మరాజు, వాయుదేవుని అంశలో భీముడు, ఇంద్రుని అంశలో అర్జనుడు , అశ్వినీ దేవతల యొక్క అంశలలో నకుల సహదేవులు, అలాగే సాక్షాత్తు శ్రీ రూపం గా లక్ష్మీ స్వరూపం గా , సంపద రూపంగా యాజ్ఞ సేని జన్మించింది. యాజ్ఞ సేని అంటే ద్రౌపది , ద్రౌపది దేవి యజ్ఞం లోనించి ఆవిర్భవించింది. అగ్ని ద్రుస్తాజ్మ్నుని గా వచ్చాడు
మరుత్యకి ద్రుపద , విరాట లుగా వచ్చారు , ఇంతమంది దేవతలు కాకుండా ఇంకా ఎంత మంది , ఈ భూమి మీద రాక్షసంసలతో జన్మించిన వారిని మత్తు పెట్టటానికి, దేవతలందరూ ఇన్ని అంశలలో జన్మించారు. శ్రీమహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా ఆవిర్భవించారు.
రాక్షసంస లలో ఉన్నవాళ్లు కనుక మాట వినలేదు. అందుకని వచ్చింది భారత యుద్ధం అంతాను, వాళ్ళని మట్టు పెట్టటానికి భూభారం తగ్గించటానికి వచ్చింది. అంటే జనమేజయుడు అడిగాడు అసలు మా వంశం ఎక్కడ ప్రారంభం , భరతుని యొక్క వంశం ఎక్కడ ప్రారంభం అయ్యింది. దాని యొక్క విశేషం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు.
వైశంపాయనుడు , వ్యాసుడు దొరికినప్పుడు కదండీ చెప్పించుకోవటం , లేనప్పుడు ఎవరిని అడుగుతాం. కాబట్టి చెప్పండి అన్నాడు.
అంటే ఆయన ఎక్కడికి తీస్కెళ్ళి ప్రారంభం చేసాడంటే , పూర్వం దేవతల గురువు అయిన బృహస్పతి, ఆయన యొక్క కుమారుడు కచుడు. రాక్షసులందరికి గురువు శుక్రాచార్యుల వారు, శుక్రాచార్యుల వారికి ఒక్కత్తే కూతురు ఆమె పేరు దేవయాని, దేవతల గురువైన బృహస్పతి యొక్క కుమారుడైన కచుడి దగ్గరకి దేవతలందరూ వెళ్లి ప్రార్ధన చేసారు , ఏమని అంటే
శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవనీ విద్య ఉంది, ఆయన వృష పర్వుడు అనే రాక్షసుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు బ్రాహ్మణుడి గా ఉన్నాడు ఆయన పురోహితుడు. ఆయనకి మృత సంజీవనీ విద్య వున్న కారణం చేత దేవతలకి , రాక్షసులకి యుద్ధం జరిగితే, చచ్చిపోయిన రాక్షసులని అందరినీ మృతసంజీవని విద్య తో బ్రతికించే స్తాడు దేవతలని బ్రతికించే వాళ్ళు లేరు.
కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని విద్య తెలుసుకోవాలి, శుక్రాచార్యుల వారు ఇంత గొప్ప విద్యా ఎందుకు ఇస్తారు, తక్కరితనం తో నేర్చుకున్నరనుకోండి, గురువుగారి దగ్గర విద్య, తెలిసిన తరువాత గురువుగారు ఆ విద్య నీకు పనికిరకుండు గాక అంటాడు. అందువలన గురువుల్ని మోసం చేసి తెలుసుకోలేరు, గురువుగారి అనుగ్రహం తోనే తెలుసుకోవాలి.
గురువు ఎందుకు వచ్చినా సరే ఎందుకు అనుగ్రహించేస్తాడు, గురు సుశ్రుష త్రికరణ శుద్ధి గా చేస్తే గురువు అనుగ్రహించేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్లి చెప్పు నేను దేవ గురువు బృహస్పతి యొక్క కుమారుడిని అని చెప్పు , చెప్పి నువ్వు బాగా సుక్రచార్యులవారి సేవ చెయ్యి, శుక్రాచార్యుల వారి ఒక్కరి కి సేవ చేస్తే సరిపోదు , శుక్రుడి ప్రీతీ అంతా తన ఒక్క కూతురు దేవయాని మీద ఉంది, దేవయాని ప్రేమకూడా నువ్వు చొరగొను , ఇప్పుడు నువ్వు దేవయాని ప్రేమ నువ్వు పొందితే , దేవయాని చెప్తే ఎదోక కారణం చేత నీకు మృత సంజీవనీ విద్య నీకు దొరుకుతుంది.
కాబట్టి త్రికరణ శుద్ధి గా ఇద్దరినీ సేవించి , గురువుగారిని , గురువుగారి కూతుర్ని కూడా. అంటే తప్పకుండ చేస్తాను అని కచుడు శుక్రాచార్యుల వారిదగ్గరకి వెళ్ళాడు. వెళ్లి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు , శుక్రాచార్యుల వారితో, ఆయన అన్నాడు నేను చాల నియమములు కలిగినట్టి వాడిని , దేవగురువైన బృహస్పతి కుమారున్ని, నన్ను కచుడు అంటారు , నేను నీకు సేవ చేసి నీదగ్గర , విద్య నేర్చుకోవాలని వచ్చాను. కాబట్టి మీకు సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వండి అని అడిగాడు.
అడిగితే గురువు అన్నవాడి హృదయం ఎంత గొప్పగా ఉంటుందో చుడండి, శుక్రాచార్యులవారు అన్నారు , బృహస్పతి మహానుభావుడు , బృహస్పతి కి నమస్కరించటం ఒకటి , నిన్ను శిష్యుని గా స్వీకరించటం ఒకటి కాదు, కాబట్టి నాయనా సంతోషంగా రా , నీ మాటలు మృదు వచనములు నాకు ఎంతగానో నచ్చాయి. చక్కగా ఆశ్రమం లో ఉండి నా దగ్గర విద్యలు అన్ని నేర్చుకో అన్నాడు. అది ఆయన సహృదయం అంటే .
ఆ వెళ్ళిన కచుడు త్రికరణ శుద్ధి గా సేవ చేయ సాగాడు. ఫలములు తెమ్మంటే ఫలములు తెచ్చాడు, సమిధలు తెమ్మంటే సమిధలు తెచ్చారు, పుష్పములు తెమ్మంటే పుష్పములు తెచ్చారు. వాళ్ళిద్దరి అపారమైన ప్రీతిని పొందాడు, ఇప్పుడు వాళ్ళిద్దరి అపారమైన ప్రీతిని పొందిన కుడా మృత సంజీవనీ ఆయన చేతికి వచ్చే లోపల కధ ఎన్ని మలుపులు తిరగాలో, ఆ భారత వంశం ఎలా రావాలో, ఎన్ని ధర్మాలు ఉంటాయో, ఎంత ఆశ్చర్యమో చూద్దాం.
శంకరాచార్యులు అన్నారు అమ్మా శ్రీమహా విష్ణువు నిన్ను ఉపాసన చేసారు, నువ్వేమి చేసావు , లోకం లోక్కెల్లా నువ్వే అందగాత్తెవి త్రిపురసుందరివి నీ అందాన్ని శ్రీమహావిష్ణువు కి ఇచ్చావు ఇప్పుడు ఆయన జగన్మోహిని అయ్యాడు, అమృతం గురించి చెప్తే బానే ఉండేది, కానీ శంకరాచార్యులు ఏమ్మన్నారంటే అప్పుడు ఏమైందో తెలుసా అమ్మా , మీ ఆయన పరువు బజారున పడింది అన్నారు. పరమ శివుడు ఆ జగన్మోహిని వెంట పడ్డాడు అన్నాడు.
పురములు కాల్చిన పరమేశ్వరుని లో కామము బయలుదేరి, ఆయన ఆ జగ్నమొహిని అవతారం పొందిన ఆ విష్ణువు వెంట పడ్డారు. అమ్మా ఎంత పని చేశావమ్మా మరి ఇంకా ఊరుకున్నావా? ఆ పరమ శివుడు మన్మదున్ని కల్చేసాడు. కలచేస్తే ఇంకేముంది జననం లేదు మరణం లేదు. ఎవరి మీద కాముడు బాణాలు వెయ్యటం లేదు హాయి. సుఖం గా ఉన్నారు అందరు , అని మనం అనుకుందాం కాసేపు, అమ్మవారు ఏమి చేసింది మన్మదున్ని బతికించింది. బతికించి పైగా ఏమి చేసింది ఎవ్వరికి కనపడవు రా !, ఒక్క మీ ఆవిడకే కనపడతావు అంది.
కానీ ఇప్పుడు ఎటువైపు నుంచి వచ్చి బాణాలు వేస్తాడో , ఎంత నిష్ట గా ఉన్నవాడు ఆ బాణాలకి ఏమైపోతాడో ఎవరికీ తెలీదు. అమ్మా దీని వల్ల ఏమైంది అంటే , ముక్కు ముస్కుని , హిమాలయ పర్వతాల లో జపం చేస్కునే వాళ్ళు కూడా బయపడుతున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కుడా కామానికి వశులై పోతున్నారు. కాబట్టి అమ్మా ఇంత గొప్ప పని చేసిన నీకొక నమస్కారం అంటారు శంకరులు.
ఇది పైకి బావుందేమో , మీరు కొంచం జాగ్రత్త గా ఆలోచిస్తే, ఇంత గొప్ప అందాన్ని శ్రీమహావిష్ణువు కి ఇచ్చి పరమ శివుని ప్రతిష్ట బజారున పారెయ్యటం , పతివ్రతా లక్షణమా?
రెండు ఆ కాముడు లేకపోతే ఈ చావులేదు పుట్టుకా లేదు, ఏ గొడవా లేదు. ఆ కాముడికి ప్రాణం పోసింది ఆవిడ , ఆ మన్మధుడు బతక బట్టి మన అందరికి ఈ అల్లరి వచ్చింది. పుట్టటం , చావటం , పుట్టటం ,చావటం. పోనీ ఊరుకుందా ఆ మన్మధున్ని బాణాలు ఎవరిమీద వెయ్యటానికి కూడా అధికారం ఇచ్చేసింది, ఒరేయి తపస్సు చేకుంటున్న ఋషుల మీద కూడా వేస్తె వెయ్యి నేనేమి అనను అన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా భయ పడిపోతున్నారు. అమ్మా ఇన్ని చేసిన నీకు ఒక నమస్కారం.
ఇది స్తోత్రమా ? నిందా ? భయపడకుండా గుండెలమీద చెయ్యేసుకుని ఆలోచించండి. ఇందులో నిజాయితీ గా త్రికరణ శుద్దిగా అమ్మవారిని అబ్బా ఏమి అమ్మవారు అని స్తోత్రం చెయ్యటం ఏమైనా ఉందా ? ఏమీ లేదు , మరి ఏమిలేని దానికి శంకరా చార్యుల వారు సౌందర్య లహరి లో శ్లోకం ఎందుకు ఇచ్చినట్టు.
ఎవరు చట్టాన్ని చేసారో , వారు ఆ చట్టాన్ని తెసేసే అధికారం కలిగి ఉంటారు. ఇక్కడ వరకు అంగీకరిస్తారా? ఇంకా రెండు మీరు మేము ఇంకా బెంగ పెట్టుకున్నది దేని కొరకు అయ్యయ్యో ఆ చచ్చి పొయిన మన్మధున్ని అమ్మవారు మళ్ళి ఎందుకు బ్రతికించింది అని.
అమ్మవారు మనమధున్ని పుట్టించలేదు అనుకోండి, మన్మధ బాణములు లోకంలో పడలేదు అనుకోండి. సృష్టి ఆగిపోయింది గా , సృష్టి ఆగిపోతే మనం చేసిన పాప పుణ్యాలు పోయేది ఎప్పుడు. ఈ శరీరం ఉంటె కదా పాప పుణ్యాలు పోయేది? ఈ శరీరం పోయిన తరువాత జీవుడు మళ్ళి పుట్టాలి , మీతో నేను కొంచం కటినంగా ఉన్నా ఎదార్థం చెప్తున్నాను.
గరుడ పురాణం చెప్తుంది, శరీరం లేకుండా దక్షిణ దిక్కున పిత్రులోకం అంటారు , అక్కడ నిలబడి పోయారు అనుకోండి, అప్పుడు ఏడుస్తాడు. శరీరం ఉంటె పుణ్య కర్మ చెయ్యొచ్చు , పాపాన్ని పోగొట్టుకోవచ్చు. శరీరం లేదు జీవుడు ఉండిపోయాడు, అప్పుడు ఏడుస్తాడు, నాకు ఏదో ఒక శరీరం ఇవ్వు ఈశ్వరా, శరీరం అంటూ ఉంటె నేను మళ్ళి నిన్ను శరీరం తో సేవిస్తాను అంటాడు. కానీ ఏ శరీరం పడితే అది ఇస్తే ఏమీ చెయ్యలేదు, మనుష్య శరీరం ఇస్తేనే చెయ్యగలడు.
ఇప్పుడు ఈ మనుష్య శరీరం కావలి, కావాలంటే ఎలా వస్తుంది? తల్లి తండ్రుల మీద మన్మధ బాణాలు పడితేనే నా ఈ శరీరం వస్తుంది. ఈ శరీరం వస్తేనే నా మీరు మళ్ళి పాప పుణ్యాలు పోగొట్టుకోవటానికి ఈశ్వరుని సేవ చేస్తారు? కాబట్టి ఇప్పుడు అమ్మవారు , కామున్ని బ్రతికించటం వలన , మనకి ఈ శరీరాలని పొందటానికి అవకాశం వచ్చిందా లేదా ?అమ్మవారి అనుగ్రహం లేదు అందులో.
నేను మీతో ఇంకో మాట మనవి చేస్తాను మీతో, అమ్మవారు కమున్ని ఎప్పుడైతే బ్రతికిన్చిందో కామము బ్రతికింది. కామము బ్రతికితే బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి ? నీ కామము ధర్మ బద్దం అయితే నువ్వు పితృ ఋణం నించి బయట పడి పోయావు. ధర్మ బద్దమైన కామం తో ధర్మ పత్ని యందు కామం పెట్టుకున్నావ్. సంతానాన్ని కనడం తో పితృ ఋణం నించి బయట పడ్డావు.
కాబట్టి నీకు కాముడు ఉంటె బెంగ ఎందుకు , పితృ ఋణం తీరింది. ధార్మికమైన కామం అనుభవించ లేక పోతున్నాను, అప్పుడూ బెంగ లేదు, ఈ విషయం అమ్మవారికి చెప్పు , అమ్మా నువ్వు కమున్ని ఇచ్చావు , కామాన్ని ఇచ్చావ్ , కానీ వచ్చిన పెద్ద చిక్కల్లా , కామాన్ని ధర్మం తో ముడి వెయ్యలేక పోతున్నాను ఆ ముడి వెయ్యలేక పోవటం వాళ్ళ నేను పడైపోతున్నాను అని అమ్మవారితో చెప్పు , ఎవరు చట్టం చేసారో వాళ్ళే చట్టాన్ని రద్దు చేసినట్టు, నువ్వు అమ్మవారి పదాలు పట్టుకుంటే , అమ్మ కమున్ని పిలిచి వాడి జోలికి వేళ్ళకు అంటుంది.
మీకు ఇంకో విషయం చెప్తాను , మహాత్ములైన వారు ఉన్నారు, వారికి కామ స్పర్స ఉండదు, ఆయన అస్కలిత బ్రహ్మచారి , ఆయనకి అసలు ఎట్టి పరిస్థితులలో కామం అనే స్పర్స అంటదు, ఇప్పడు ఆయన శరీరం తో ఉండి పోతాడా? నాకు చెప్పండి, ఎంతటి మహాత్ముడైన కానివ్వండి , ఆయన శరీరము ఒక ప్రత్యేకమైన దేశ కాలము యందేనా ఉంటుంది? ఎప్పటికి ఉండిపోతుందా ? చంద్రశేకర భారతీ స్వామివారే అయినా , శంకర భగవత్ పాదులే అయిన శరీరాలని విడిచి పెట్టేసారు, వెళ్లి పోతారు. మరి శరీరం వెళ్ళిపోతే ఒక పెద్ద ఇబ్బంది ఒకటి ఉంది. మళ్ళి ఇంకో మహాత్ముడు శరీరం లోకి వచ్చి కూర్చుంటే మీకు భోధ ఉంటుంది. లేకపోతే ఆగిపోతుంది.
కాబట్టి మహాత్ముల పరంపర నడవాలి , మళ్లి మళ్ళి మళ్ళి మహాత్ములు రావాలి, ఇప్పుడు కుడా మనకు మహాత్ములు ఉండాలి. ఉండి వాళ్ళు మాట్లాడితేనే , మన తప్పులు మనం తెలుసుకుని ,మనం ధర్మ మార్గం లోకి వెళ్తాం. కానీ అలా చెప్పి మాట్లాడే మహాత్ముడు ఎలా వస్తాడు? ఆయన శరీరం లోకి రావాలంటే ఆయన తల్లి తండ్రుల మీద కాముడి బాణాలు పడవలసిందే. పరిపూర్ణమైన మనసుతో భార్యాభర్త లు ఇద్దరు సంగమించక పోతే , పరిపూర్ణమైన ఆరోగ్యం తో శిశువు పుట్టడు. విముఖులై సంఘమిస్తే తేజోవంతమైన , ఆరోగ్యవంతమైన శిశువు పుట్టదు. అలా కలవలేదు కాబట్టే వ్యాసుడే సంఘమించినా సత్సంతానం కలగలేదు, భారతం లో. వెల వేల బోతే పాండురాజు పుట్టాడు , కళ్ళు మూసుకుంటే ద్రుతరాస్త్రుడు పుట్టాడు.
పరిపూర్ణ హృదయం తో ఒక మహాపురుషుడు, ఒక స్త్రీతో సంగమిస్తే తప్ప, ఆయన వీర్యం స్కలనం అవ్వాలంటే ఆయనకి కామం కలిగి తీరాలి, ఆయనకీ కామం కలిగితేనే ఆయన తేజస్సు వేరొక స్త్రీలోకి వెళ్తుంది. వెళితేనే ఇంకో మహాత్ముడు పుడతాడు, పుడితేనే తప్ప మీకు మాట్లాడేవాడు లేడు. మీకు రాసేవాడు లేడు , చెప్పేవాడు లేడు. అప్పుడు లోకం ఏమై పోవాలి , కాబట్టి ఇప్పుడు ఒక మహాత్ముడు పుట్టాలి అంటే అంతకంటే మహా పురుషుని లో కామం కలగాలి, ఆయనకి కామం కలగదు, ఎందుకని అంటే ఆయన మహా పురుషుడండి, పరాశరుడికి కామం ఎందుకు కలుగుతుంది, ఒక్కనాటికి కలగదు.
పరాశర మహర్షి వంటి మహా పురుషుని తేజస్సుని పట్టగలిగే క్షేత్రం ఉండాలి. కారణ జన్మురాల్ని సృష్టించాలి. కారణజన్ముడైన పురుషుడు పుట్టాలి అంటే ఉపరిచర వసువు వంటి మహా పురుషుని వీర్యం గిరిక లోకి వెళ్ళ వలసినది, శాప విమోచనం కావలిసిన అద్రికలోకి వెళ్లి అద్రిక నుండి మత్యగoధి పుట్టి, మత్యగంది వంటి ఉపరిచర వసువు వల్ల పుట్టిన గొప్ప క్షేత్రం లోకి పరాసరుని తేజస్సు ప్రవేశిస్తే, ఈ క్షేత్ర భీజ సంపర్కం చేత వేరొక మహా పురుషుడైన వేదవ్యాసుడు, పుడతాడు. ఆయన పుడితే మీరు నేను తరిస్తాం.
ఇప్పుడు పరాశర మహార్శిలో కామo కలగాలి , ఆయనకి కలుగుతుందా ఒక్కనాటికి కలగదు, సత్యవతి ని చూడగానే ఆయనకీ కామం కలిగితే తప్ప వ్యాసుడు రాడు. వ్యాసుడు వస్తే తప్ప మీకూ నాకు భారతం లేదు. వేద విభాగం లేదు, అష్టాదశ పురాణములు లేవు. ఇప్పుడు అంతటి మహా పురుషుని మనసుని కదప గలిగినది ఎవరు?
ఎవరు చట్టం చెయ్యగలరో ఎవరు రద్దు చెయ్య గలరో వారే చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు పరదేవత ఏమి చెయ్యాలి , అంతటి మహాపురుషుని మనసు , కామ ప్రచోదనం కలిగేటట్టు చెయ్యాలి.
కాబట్టి ఎవరు చేసింది అని గుర్తు, పరాశక్తి చేస్తుంది , ఈ కదలికలన్నీ ఆయన మనసు సత్యవతి యందు లగ్నం అయితే సత్య గర్భమున వేదవ్యాసుడు పుడతాడు. అందుకని ఆయనలో కామ ప్రచోదనం ఎంత వరకు అవసరమో అంత వరకే చేసింది , పరాశక్తి. ఒక్క వ్యాస జననం వరకే ఇంకా ఆ తరువాత , పరాశరుడికి ఎప్పుడూ కామం లేదు. మహాపురుష జననం ఎందుకు జరుగుతుంది, పరాశక్తి నిర్ణయం చేస్తుంది. అందుకే మహా పురుష జననములను విచారణ చెయ్యవద్దు అని అన్నారు.
మహాపురుష జననము నందు నువ్వు వెకిలి నవ్వు నవ్వితే , నీకు పాపం వస్తుంది. అందువలన శాస్త్రం ఏమి అన్నదంటే, ఒకవేళ నీకు అర్థం కాకా పోతే ఊరుకుండి పో విచారణ చెయ్యొద్దు. మహాపురుష జననము , నది యొక్క ప్రారంభ స్థానమును విచారణ చెయ్యవద్దు, నది ఉంది స్నానం చెయ్యి అంతే. ఎక్కడ పుట్టింది అని అడగకు.
మహపురుషుని వలన నీకు వాంగ్మయం వచ్చింది. నువ్వు వాంగ్మయం చదువుకో ఆయన అలా ఎలా పుట్టాడు అని అడుగ వద్దు.
పరదేవతనుగ్రహం కలిగింది, వ్యాస భగవానుడు పుట్టాలి, ద్వాపర యుగం అయిపోతోంది, కాళీ యుగం ప్రారంభం అవుతుంది, కలియుగం లో కలిపురుషుడు విజ్రుమ్భిస్తాడు. ధర్మం చెప్పేవాడు లేడు, ఆయుర్దాయం తగ్గిపోతుంది. వేదాన్ని అంతటిని ఎవరూ చదవలేరు, వేదాన్ని అంతటిని విభాగం చేసి, ఉన్న ఆయుర్దాయం లో వేదాన్ని చదువుకునే వాడు ఉండాలి, అష్టాదశ మహాపురనములను ఇవ్వగలిగిన వాడు ఉండాలి. భారతం చెప్పగలిగిన వాడు ఉండాలి, శిష్యుల్ని తానె తాయారు చేస్కో గలగాలి. మహా పురుషుడై స్వార్థ త్యాగి అయిన వాడు కావలి, అటువంటి వాడు పుట్టాలి అంటే ఎంతటి మహాత్ముడి తేజస్సు కదలాలి.
అటువంటి మహాపురుషుడి తేజస్సు కదిలినా అంతటి తేజస్సు పట్ట గలిగిన క్షేత్రం ఏది, అందుకని ఆ క్షేత్రాన్ని కుడా పరదేవతే సిద్దం చేసింది. వేరొక మహాపురుషుడి తేజస్సు కదిపి అది అద్రిక మింగి, అది అద్రిక కడుపులో పెరిగితే అద్రికకి శాప విమోచనం అవుతుంది. అప్సరస గర్భం నుండి బయటకి వచ్చింది కాబట్టి , దాశ రాజు దగ్గర పెరిగితే, యమునా నది దాటుతున్న అప్పుడు ఆయన హృదయము ఆమె యందు నిలబడింది. మనకొరకు ఆయన మనసు ఎంత వరకు కదలాలో అంతవరకు కదిలేలా చేసిన పరదేవతనుగ్రహాన్ని మీరుచదువుతున్నరని గుర్తు.
అందుకే ఆదిపర్వం లో మహాపురుషుల జననం వింటే, సాక్షాత్తుగా దేవతల యొక్క రాక్షసుల యొక్క, పరదేవత యొక్క ఇంతమంది యొక్క అనుగ్రహము కలిగేస్తుంది . మహా పురుష జననం వెనకాల పరదేవత యొక్క అనుగ్రహం నడుస్తోంది.
ఇప్పుడు తీర్థ యాత్ర కి వెళ్తున్న ఆ పరాశరుడు యమునా నది పైన పడవ నడుపుతున్న ఆ యోజన గ్రంధి ని చూసి ఆయనకీ అసలు మదము లేదు మత్సరము లేదు, లేని వాడికి ఎలా కలిగింది , మనకోసం కల్పించింది పరదేవత. నీ తేజస్సు జారితే కాని రాదు వ్యాసుడు అని. ముడులోకముల చేత స్తోత్రం చెయ్య బడే వాడు, వసిష్టుని యొక్క మనవడు, శక్తి మహర్షి యొక్క కుమారుడు, పాపములు నశించిపోయే టట్టు గా ఘోరమైన తపస్సులు చేసిన వాడు,మంచి వ్రతం తో తీర్థ యాత్ర కి వెళ్ళే వాడు.
వొంటినిండా యోజనం దూరం వరకు చేపల కంపుకొట్టే ఆ స్త్రీ ని చూసాడు, ఇందులో ఒక విచిత్రం ఉంది, పొగ ఎక్కడ మొదలైందో అక్కడకి వెళ్లి కూర్చుంటే, పొగ ఉండదు. కంపు ఎక్కడ మొదలైందో అక్కడకి వెళ్తే కంపు ఎక్కువ వస్తుంది. ఇంత మహాన్వితుడు అంత దుర్వాసన వస్తున్నా మత్యగంది దగ్గరకి వెళ్లి చుస్తాడండి ఆయన? మరి చూసాడు అంటే మన కోసం చూసాడు అని చెప్పాలి. పరదేవతానుగ్రహం గా చూసాడు అని చెప్పాలి. చూసి ఆమె యొక్క పొందు కోరాడు.
కోరితే ఆ మాత్య గంధి అంది నేను కన్యని , నా కన్యాత్వం పోతే నా తండ్రి నన్ను గడపలో అడుగుపెట్ట నిస్తాడా ? అటువంటి తప్పుడు పనిచేసి ఇంటికి వస్తావా అంటాడు. కాబట్టి నువ్వు ఎంతటి మహా పురుషుడవైనా కావొచ్చు నీతో సంఘమం నాకు ఎలా కుదురుతుంది.
అంటే ఆయన అన్నాడు ఇది బహుశః పరదేవత అనుగ్రహం లేకపోతే నా మనసు నీయందు నిలబడటం ఏమిటి, నీకు వరం ఇస్తున్నాను. నీ శరీరము చేపల వాసన కదూ వస్తోంది అని అంటున్నావు, ఇక నించి నువ్వు యోజన గంది వి అవుతావు, మత్యగంధి వి కావు, నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడ నించి యోజనం దూరం సువాసనలు వచ్చి ఆకర్షిస్తాయి. అదే ఎదర భరత వంశానికి వరం అయ్యింది. ఊరికినే ఋషి నోటివెంట ఏమాటా రాదండి. అమ్మవారు పలికిస్తోంది. యోజన గంధి వి అవుతావు, ఆ వాసన లే శంతన మహారాజుని తీస్కువచ్చాయి.
నీ కన్యత్వం చెడదు, 9 నెలలో 10 నెలలో నువ్వు గర్భం ధరించక్కర్లేదు, సత్య గర్భం గా ఇప్పుడే మహాత్ముడు జన్మిస్తాడు నీ కడుపున, నీవు కన్య గానే ఉంటావు నేను నీకు వరం ఇస్తున్నాను. పగటివేళ మంచుతెరలు సృష్టిస్తున్నాను నా యొక్క తపస్సు చేత, పరాశర మహర్షి యొక్క సంఘమ ఫలితంగా పరమేష్టి సమానుడైన పరాశర మహర్షి అనుగ్రహం చేత సద్యో గర్భం లో సాక్షాత్తు సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు, పుట్టుకతోనే నాలుగు వేదములు నేర్చుకుని పుట్టిన వాడు. సాక్షాత్తు నారాయణుడు పుట్టాడు. సకల మునులకు మొట్ట మొదటి వాడు. పుట్టుకతోనే మహా జ్ఞానం తో పుట్టాడు మహానుభావుడు.
వచశ్రీమంతుడు పుట్టాడు, పుట్టీ పుడుతూ నే నల్లటి వర్ణం తో పుట్టి మహానుభావుడు ఆ యమునా నది ఒడ్డున అమ్మా నేను తపస్సు చేస్కోవటానికి వెళ్ళిపోతున్నాను అమ్మా , తండ్రి పరాశర మహర్షి తన సహజ స్థితి లోకి వెళ్లి పోయాడు ,పుట్టిన బిడ్డడు ఆయన వెళ్ళిపోయాడు. ఇటువంటి మహాపురుష సంపర్కం చేత మహాపురుష జననం చేత ఆమె కన్యత్వం చెడలేదు, ఎదర భారత వంశం నిలబడటానికి ప్రాతిపదిక పడింది.
శుభ క్షణం లేకపోతే అసలు కౌరవ పాండవులు పుట్టే అవకాసం లేదు. భీష్ముడితో సరి, ఆ భీష్ముడి సంతతి పెరిగితే ఏమో కధ ఎలా ఉండేదో. భీష్మ ప్రతిజ్ఞ చేయించి ఆ భీస్మున్ని అలా నిలబెట్టింది. మళ్ళి భీష్ముడు అలా నిలబడక పోతే, దీర్ఘాయుషుమంతుడు కాక పోతే వశిష్టుడి శాపం నిలబడదు, వసిష్ట మహర్షి యొక్క వాక్కు నిలబడ టానికి ఇదిగో ఈ మహాత్ముడు ఇప్పుడు పుట్టాడు. పుట్టి ఆయన తపస్సు చేస్కోవటానికి వెళ్తుంటే ఆయన్ని , కృష్ణ ద్వైపాయనుడు అని పిలిచారు. అక్క వనం లో పుట్టి వెంటనే వెళ్ళిపోయాడు కాబట్టి ద్వీపంలో కృష్ణ ద్వైపాయనుడు అని పేరు వచ్చింది.
నాయనా ! నువ్వు నన్ను అడిగావు కదా అసలు ఎందుకు జరిగింది భారత యుద్ధం , అసలు ఎందుకు చెప్పిన మాట వినలేదు అని కదా నువ్వు అడిగావు. ఈ భూమికి భారం పెరిగిపొయింది పాపుల చేత, భారం పెరిగిపోతే భూదేవి ఏడ్చింది. ఈలోకంలో పాపభారం పెరిగిపోతుంది , దీన్ని నిర్మూలించ టానికి దేవతంశలు రావాలి , శ్రీమన్నారాయణుడు కదిలి రావాలి, వచ్చి పాప భారాన్ని అంత పోగొట్టాలి అన్నారు, అంటే తప్పకుండా అలాగే అని వరం ఇచ్చారు .
ఇప్పుడు ఎంత పాపభారం పెరిగి ఉన్నదో తెలుసాoడి ఆ సమయం లో, అది పోగొట్టటానికి ఒక్క పరమేశ్వరుడు వస్తే సరిపోదు, దేవతలు అందరు అంశాలతో కదిలి రావాలి , అందుకని దేవతలు అందరూ కదిలి వచ్చారు. దేవతంశలలో వచ్చిన వారు కొందరు, రాక్షసంసలలో పుట్టేసినవారు కొందరు, ఇప్పుడు రాక్షస అంశలలో పుట్టిన వాళ్ళు అందరూ దేవతంశాలలో పుట్టిన వాళ్ళ వల్ల చచ్చిపోవాలి. చచ్చిపోతే భూ భారం తీరుతుంది.
భారతం లో గమత్తు ఏమిటో తెలుసా , దేవతంశలలో వచ్చిన వారు రాక్షసాంసలలో పుట్టిన వారి దగ్గర నించొని యుద్ధం చేసారు. భీష్ముడు దేవతాంస, ద్రోణుడు దేవతాంస బృహస్పతి అంశ వీళ్ళు కౌరవుల పనుపున యుద్ధం చేసారు. అలా ఎందుకు చేసారు? ఒక పెద్ద ధర్మ సంభందమైన అనుమానం కదండి!
ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పా వలసి ఉంటుంది. మంట రాజుకోవాలి అంటే ఏమి చేస్తాం ,మీరు ముందు మీ కళ్ళ కి మంట కలిగినా , ఖేదం కలిగినా ఆ పొగ ని భరిస్తూ ఒక గొట్టం పట్టుకుని, మంట దగ్గర కి వెళ్లి ఊదాలి, మీరు ఊదితే రాజుకుంటుంది, రాజుకుని మంట పుట్టింది అనుకోండి, ఇంకా ఆ తర్వాత అన్నం వండుకోవచ్చు, నీలు కాగాబెట్టుకోవచ్చు, ముందు కష్ట పడాల వద్దా , దుర్యోధనుడు యుద్దానికి వచ్చి నిలబడాలి అనుకోండి, భీష్ముడు ,ద్రోణుడు , కృపుడు అందరు అటువెళ్లి పోయారు అనుకోండి, ఇక దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు, పన్నాగాలు పన్నుతూ నే ఉంటాడు. ఇంక ఎలా రక్షసాంస లు పోవటం.
రక్షసాంసలు దేవతంస ల తో తలపడాలంటే వాడికి ధైర్యం కలగటానికి కొన్ని దేవతంసలు తమ స్వరూపమునందు మార్పు లేకుండా నే వెళ్లి అక్కడ నించోవాలి. అందుకు నించున్నాడు, భీష్ముడు , ద్రోణుడు. అది మహా భారతం లో అత్యంత చమత్కారం. అందుకని నించున్నారు తప్ప ,చేత కాకో , దుర్యోదనుడి మోచేతి నీళ్ళ కోసమో కాదు. ఊదటం కోసం పొయ్యిని ,నించున్నారు. అందుకని వాళ్ళు అక్కడ నిలబడక పోతే ఆ యుద్ధం లో వాళ్ళు పడరు,
రాక్షసులు , అందుకని కొంతమందిని అక్కడ నించోపెట్ట వలసి వచ్చింది కృష్ణ భగవానుడు.
కాబట్టి ఒక్కొక్కళ్ళు ఎలా జన్మించారంటే, ఎన్నడూ దుఖం లేని పరమాత్మా ఈలోకం లో ధర్మాన్ని స్థాపించడం కోసం , దేవకీ వసుదేవులకి కుమారుడిగా పుట్టాడు. ప్రలంభుడు మొదలైన రాక్షసులని సంహరించటానికి , ఆదిశేషుడు యొక్క అంస , బలరాముడి గా రోహిణి వసుదేవులకు జన్మించింది. సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా వచ్చాడు. పదహారువేల మంది అప్సరసలు గోపికలుగా వచ్చారు.
దేవతలే యదు , భోజ, అంధక వంశాలలో రాజులుగా వచ్చారు. వసువులలో ప్రభాసుడు అనే ఒక గొప్ప వసువు భీశ్మాచార్యుడి గా వచ్చాడు. దేవతల గురువైన బృహస్పతి ద్రోణాచార్యుడి గా వచ్చాడు, కామము క్రోధము కలగలిసి ఉంటె ఎంతో ప్రమాదం, ఈ రెండిటిని కలకలిస్తే పుట్టిన వాడు అస్వర్థామ. ఏకాదశ రుద్రుల అంశలో పుట్టిన వాడు కృపాచార్యుడు. అందుకే కురుక్షేత్ర యుద్దంలో అందరూ మడిసి పోయిన, ఎప్పటికీ గురుత్వం వహించాడు కృపాచార్యుడు..
సూర్యుని యొక్క అంశ లో వచ్చిన వాడు కర్ణుడు, హంసుడు అనే గంధర్వుడు ద్రుతరాస్త్రుడిగా వచ్చాడు. మతి గాంధారి గా వచ్చింది. కలి పురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు. పౌలస్త్యభాత్రు వంశం అంతా కుడా రాక్షసులు అంతా కలిసి దుర్యోధనుని యొక్క సోదరులుగా వచ్చారు. హిరణ్య కశ్యపుడు శిశుపాలుడి గా పుట్టాడు ,సమ్హలాదుడు శల్యుడిగా పుట్టాడు, విప్పలా దుడు జరసందుడిగా పుట్టాడు.
కాలనేమి కంసుడిగా పుట్టాడు, శ్రీమహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది. స్త్రీ పుంస స్వరూపము రెండు కలిసి ఉండే ఒక దేవత శిఖండి గా పుట్టాడు. మరుత్గణాoశ తో పుట్టిన వాడు పాండురాజు, మండవ్యుని శాపం వలన యమధర్మ రాజు మళ్ళి పుట్ట వలసి వస్తే విదురుడిగా పుట్టాడు , సిద్ది బుద్ది ఇద్దరు , కుంతీ మాద్రిగా పుట్టారు. అనేకమైన దేవతల అనుగ్రహం తో యమధర్మ రాజు అంశగా ధర్మరాజు, వాయుదేవుని అంశలో భీముడు, ఇంద్రుని అంశలో అర్జనుడు , అశ్వినీ దేవతల యొక్క అంశలలో నకుల సహదేవులు, అలాగే సాక్షాత్తు శ్రీ రూపం గా లక్ష్మీ స్వరూపం గా , సంపద రూపంగా యాజ్ఞ సేని జన్మించింది. యాజ్ఞ సేని అంటే ద్రౌపది , ద్రౌపది దేవి యజ్ఞం లోనించి ఆవిర్భవించింది. అగ్ని ద్రుస్తాజ్మ్నుని గా వచ్చాడు
మరుత్యకి ద్రుపద , విరాట లుగా వచ్చారు , ఇంతమంది దేవతలు కాకుండా ఇంకా ఎంత మంది , ఈ భూమి మీద రాక్షసంసలతో జన్మించిన వారిని మత్తు పెట్టటానికి, దేవతలందరూ ఇన్ని అంశలలో జన్మించారు. శ్రీమహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా ఆవిర్భవించారు.
రాక్షసంస లలో ఉన్నవాళ్లు కనుక మాట వినలేదు. అందుకని వచ్చింది భారత యుద్ధం అంతాను, వాళ్ళని మట్టు పెట్టటానికి భూభారం తగ్గించటానికి వచ్చింది. అంటే జనమేజయుడు అడిగాడు అసలు మా వంశం ఎక్కడ ప్రారంభం , భరతుని యొక్క వంశం ఎక్కడ ప్రారంభం అయ్యింది. దాని యొక్క విశేషం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు.
వైశంపాయనుడు , వ్యాసుడు దొరికినప్పుడు కదండీ చెప్పించుకోవటం , లేనప్పుడు ఎవరిని అడుగుతాం. కాబట్టి చెప్పండి అన్నాడు.
అంటే ఆయన ఎక్కడికి తీస్కెళ్ళి ప్రారంభం చేసాడంటే , పూర్వం దేవతల గురువు అయిన బృహస్పతి, ఆయన యొక్క కుమారుడు కచుడు. రాక్షసులందరికి గురువు శుక్రాచార్యుల వారు, శుక్రాచార్యుల వారికి ఒక్కత్తే కూతురు ఆమె పేరు దేవయాని, దేవతల గురువైన బృహస్పతి యొక్క కుమారుడైన కచుడి దగ్గరకి దేవతలందరూ వెళ్లి ప్రార్ధన చేసారు , ఏమని అంటే
శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవనీ విద్య ఉంది, ఆయన వృష పర్వుడు అనే రాక్షసుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు బ్రాహ్మణుడి గా ఉన్నాడు ఆయన పురోహితుడు. ఆయనకి మృత సంజీవనీ విద్య వున్న కారణం చేత దేవతలకి , రాక్షసులకి యుద్ధం జరిగితే, చచ్చిపోయిన రాక్షసులని అందరినీ మృతసంజీవని విద్య తో బ్రతికించే స్తాడు దేవతలని బ్రతికించే వాళ్ళు లేరు.
కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని విద్య తెలుసుకోవాలి, శుక్రాచార్యుల వారు ఇంత గొప్ప విద్యా ఎందుకు ఇస్తారు, తక్కరితనం తో నేర్చుకున్నరనుకోండి, గురువుగారి దగ్గర విద్య, తెలిసిన తరువాత గురువుగారు ఆ విద్య నీకు పనికిరకుండు గాక అంటాడు. అందువలన గురువుల్ని మోసం చేసి తెలుసుకోలేరు, గురువుగారి అనుగ్రహం తోనే తెలుసుకోవాలి.
గురువు ఎందుకు వచ్చినా సరే ఎందుకు అనుగ్రహించేస్తాడు, గురు సుశ్రుష త్రికరణ శుద్ధి గా చేస్తే గురువు అనుగ్రహించేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్లి చెప్పు నేను దేవ గురువు బృహస్పతి యొక్క కుమారుడిని అని చెప్పు , చెప్పి నువ్వు బాగా సుక్రచార్యులవారి సేవ చెయ్యి, శుక్రాచార్యుల వారి ఒక్కరి కి సేవ చేస్తే సరిపోదు , శుక్రుడి ప్రీతీ అంతా తన ఒక్క కూతురు దేవయాని మీద ఉంది, దేవయాని ప్రేమకూడా నువ్వు చొరగొను , ఇప్పుడు నువ్వు దేవయాని ప్రేమ నువ్వు పొందితే , దేవయాని చెప్తే ఎదోక కారణం చేత నీకు మృత సంజీవనీ విద్య నీకు దొరుకుతుంది.
కాబట్టి త్రికరణ శుద్ధి గా ఇద్దరినీ సేవించి , గురువుగారిని , గురువుగారి కూతుర్ని కూడా. అంటే తప్పకుండ చేస్తాను అని కచుడు శుక్రాచార్యుల వారిదగ్గరకి వెళ్ళాడు. వెళ్లి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు , శుక్రాచార్యుల వారితో, ఆయన అన్నాడు నేను చాల నియమములు కలిగినట్టి వాడిని , దేవగురువైన బృహస్పతి కుమారున్ని, నన్ను కచుడు అంటారు , నేను నీకు సేవ చేసి నీదగ్గర , విద్య నేర్చుకోవాలని వచ్చాను. కాబట్టి మీకు సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వండి అని అడిగాడు.
అడిగితే గురువు అన్నవాడి హృదయం ఎంత గొప్పగా ఉంటుందో చుడండి, శుక్రాచార్యులవారు అన్నారు , బృహస్పతి మహానుభావుడు , బృహస్పతి కి నమస్కరించటం ఒకటి , నిన్ను శిష్యుని గా స్వీకరించటం ఒకటి కాదు, కాబట్టి నాయనా సంతోషంగా రా , నీ మాటలు మృదు వచనములు నాకు ఎంతగానో నచ్చాయి. చక్కగా ఆశ్రమం లో ఉండి నా దగ్గర విద్యలు అన్ని నేర్చుకో అన్నాడు. అది ఆయన సహృదయం అంటే .
ఆ వెళ్ళిన కచుడు త్రికరణ శుద్ధి గా సేవ చేయ సాగాడు. ఫలములు తెమ్మంటే ఫలములు తెచ్చాడు, సమిధలు తెమ్మంటే సమిధలు తెచ్చారు, పుష్పములు తెమ్మంటే పుష్పములు తెచ్చారు. వాళ్ళిద్దరి అపారమైన ప్రీతిని పొందాడు, ఇప్పుడు వాళ్ళిద్దరి అపారమైన ప్రీతిని పొందిన కుడా మృత సంజీవనీ ఆయన చేతికి వచ్చే లోపల కధ ఎన్ని మలుపులు తిరగాలో, ఆ భారత వంశం ఎలా రావాలో, ఎన్ని ధర్మాలు ఉంటాయో, ఎంత ఆశ్చర్యమో చూద్దాం.
No comments:
Post a Comment