Wednesday, April 23, 2014

ఆదిపర్వము 3

వేంగి దేశాన్ని , రాజమహేంద్ర వరాన్ని  రాజధాని గా చేస్కొని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని కోర్కేమేరకు నన్నయ్య భట్టారకుడిని    (భట్టారక అన్న శబ్దం గౌరవన్ని సూచిస్తుంది. లలితా పరా భట్టారక, క్రోధ భట్టారక, శృంగార భట్టారక అలాగే నన్నయ్య భట్టారక అంటే గౌరవనీయమైన వ్యక్తి, పూజనీయమైన వ్యక్తిఅని అర్థం ) ప్రార్థన చేస్తే ఆయన అత్యంత వినయం  తో   దేవతా స్వరూపాలన్నిటికి నమస్కారం చేసి , వ్యాస వాల్మీకులకు నమస్కారం చేసి మహా భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేసారు. ఆయన ఆ మహా భారతాన్ని   ప్రారంభం చేసిన సందర్భం లో మహా భారతం చెప్పబడిన విధానం గురించి ప్రారంభం చేస్తారు . ఆంధ్ర మహా భారతాన్ని పరిశీలనం చేస్తే మొట్ట మొదట చెప్పటం మొదలు పెట్టినటువంటి వాడు శౌతి, తర్వాత కధ కొంత దూరం వెళ్ళినాక జనమేజయ సర్పయాగం  పూర్తై పోయిన తరువాత మళ్ళి కధా భాగం చెప్పటం మొదలుపెట్టే వాడు వైశంపాయనుడు. మొదసల
మహా భారతం ఎక్కడ మొదటి సారి భూమండలం మీద జరిగిందో, ఎక్కడ మొదటి భారత ప్రవచనం జరిగిందో, అటువంటి ప్రదేసమేదో దాని గురించి నన్నయ్య గారు ప్రారంభం చేస్తున్నారు. మొట్ట మొదట ప్రవచనం  నైమిశారణ్యం అనే ప్రదేశం లో జరిగింది .  మనకి అత్యంత ప్రఖ్యాతమైన ప్రదేశములు భారత దేశం లో  అనేకం ఉన్నాయ్. భూమండలం లో భారత దేశం మినహా మరే ఇతర ప్రాంతములలో , అరణ్యం లోకి వెళ్ళడం అక్కడ ఉండడం అనేది ఉండదు కానీ  ఒక్క  భారత  దేశం లో మాత్రం ఋషులు  కోరి కోరి  అరణ్యం లో ఉంటుంటూ  ఉంటారు. అక్కడ 
ఆశ్రమము ఏర్పరుచుకొని , పరమ ప్రశాంతమైన వాతావరణం లో తపస్సు చేస్తూ , శిష్యుల్ని పోషిస్తూ ,వారికి విద్య నేర్పుతూ , వారు అరణ్యం లో నివసించిన కారణం చేత అరణ్యం లోని క్రూర మృగాలు కూడా ఒకదాని యందు ఉన్న క్రూర స్వభాన్ని మరచి అత్యంత ప్రేమతో మెలిగ గలిగే తపో వైభవాన్ని ప్రకటించి, అసలు అరణ్యము అన్న మాటకి ఒక కొత్త శోభని ఆవిష్కరించారు. అందు కే  పౌరాణిక వాగ్మయాన్ని పరిశీలనం చేస్తే , పరమ పవిత్రమైన కొన్ని అరణ్యముల పేర్లు వినబడతాయి, అందులో ప్రత్యేకించి దండకారణ్యము, అది రామాయణ కాలం లో శ్రీరామ చంద్ర మూర్తి ఎందరో మహా ఋషులని దర్శనం  చేసారు. దండకారణ్యము,  ధర్మా రణ్యము , చంపా రణ్యం , సైo ధవారణ్యం, పుష్కరా రణ్యం,  నైమిశారణ్యం ఇలా ఎన్నో అరణ్యములు. ఈ అరణ్యాలు అన్ని ఋషి స్పర్స కలిగి ఉంటాయి. (ఒక సారి శంకరాచార్యుల వారు శ్రుంగగిరి కి వెళ్ళినప్పుడు, ఒక పాము కప్పకి పడగ పట్టి ఉండడం  చూశారు, పరస్పర  శత్రుత్వం కలిగిన కప్పా పాము ఇలా ఉండటం ఏమిటి అని వారు అంతర్ముఖులై ఆలోచించారుఆయన  ఒకసారి దివ్యద్రుష్టి  తో చూసారు, దివ్య ద్రుష్టి అని ఒక మాట తరచూ వినపడుతూ ఉంటుంది, ద్రుష్టి అన్నది  మాంస నేత్రము ఎంత వరకు చూడ గలదో అంత  వరకు చూడడం , అది సాధారణం గా మనుష్యులందరికి ఒకే విధం గా ఉంటుంది కాని మనుష్య ప్రాణికి ఎటువంటి ద్రుష్టి ఉంటుందో అన్ని ప్రాణులకి అలాగే ఉంటుంది అని చెప్పటానికి వీలు ఉండదు ఎందుకంటే ఎక్కడో దూరంగా ఎగురుతున్న గ్రద్దకి నేలమీద ఎక్కడో ఉన్న కోడిపిల్ల కనపడి ఇలా నిటారుగా వచ్చి కొడితే ఈ కోడి పిల్ల నాకు దొరుకుతుంది అని ఆకాశం లోనించి ఒక్కసారి భూమండలం మీదకి రాగలదు. ఒక్కక్కదని ద్రుష్టి ఒకలా ఉంటుంది. బాహ్య నేత్రం తో చూసేది సామాన్య ద్రుష్టి, దివ్య ద్రుష్టి అంటే ఒక్కసారి ఈ బాహ్య నేత్రాన్ని మూసి దేనిగురించి ఆలోచిస్తున్నారో దాని మీద ద్రుష్టి పెడితే ఎక్కడ ఏది జరిగింది అన్నది ఇతరులకి అందని విషయం, కన్నులు మూసుకున్న వ్యక్తికి గోచారం అవుతుoది. అలా చూడగలిగిన శక్తి తపస్సు చేత సాధింపబడుతుంది. అది అందరికి సాధ్యం అయ్యే విషయం కాదు. అది అటువంటు తపోశాలులైన మహర్షులకు, భ్రూ మధ్యమున ద్రుష్టి ని కేంద్రీకరించి, ఏమి జరిగింది అని వారు కన్నులు మూస్కుంటే , ఏది జరిగిందో వారికి కరతలామలకం అయ్యేది, కంచి కామకోటికి పీతధిపత్యమ్ చేసి నడిచే దేవుడు అని పేర్గాంచిన చంద్రశేకరేంద్ర సరస్వతి స్వామివారు ఒక్క సారి ఇలా కన్నులు మూస్కొని ఉంటె , తన దగ్గరకి ప్రసాదం పట్టుకు వచ్చిన వ్యక్తీ , ఎక్కడో ఒక చోట చేయించుకున్న రుద్రాభిషేకం లో ఏ బ్రాహ్మణున్ని అవమానం చేసారో, ఆ బ్రాహ్మణుడు దేవాలయం లో  ఈశ్వరునికి ఏమి చెప్పుకున్నాడో , ఆ  చెప్పుకున్నయన ఎంత బాధ పడి ప్రాణం విదిచిపెట్టేసాడో కూడా ఆయన తెలుసుకుని ఆ పూట భిక్ష కూడా వదిలిపెట్టేసిన రోజులున్నాయి. మహాత్ములు తమ తప్పస్శక్తి తో బాహ్య నేత్రములు మూసి,  అంత: నేత్రం తో చూడగలరు దాన్ని దివ్య ద్రుష్టి అంటారు. ఇప్పుడు శంకరాచర్యుల వారు దివ్య ద్రుష్టి తో చుస్తే ఆయనకి అర్థమైంది , ఎప్పుడో త్రేతాయుగం లో అక్కడ ఋష్యశృంగుల వారు అక్కడ తపస్సు చేసారని, త్రేతాయుగం లో ఋష్యశ్రుంగ మహర్షి తపస్సు కారణం చేత , కలియుగం లో శంకర భగవత్ పాద చార్యుల నడవటం చేత ఆ తపస్సు యొక్క ప్రకంపనల చేత తత్ ప్రభావం చేత అక్కడ ఉండే ప్రాణులు కూడా సహజం గా ఉండే శత్రుత్వాన్ని కూడా మరచి తిరగ గలిగాయి. అంటే ఒక్కొక్క మహానుభావుడు తపస్సు మూలం చేత ఆ అరణ్యములు యుగము మారిపోయినా కుడా శోభస్కరములు గా నిలబడిపోయాయి, ఇది అనన్య సామాన్య మైన ప్రక్రియ. ఇది ఒక్క భారత దేశం లో ఋషులకి మాత్రమే సoబoదిoచిన సంప్రదాయం. అటువంటి సంప్రదయమునకి మనము వారసులము). అందునా ప్రత్యేకించి  నైమిశారణ్యం వెళ్లి తపస్సు చేయటం వాళ్ళ అటువంటి శక్తి పొందింది కాదు, కలియుగ ప్రారంభం లో మహర్షులు వెళ్లి అడిగారు, చతుర్ముఖ బ్రహ్మ గారిని, నువ్వు సృష్టి కర్తవి నీకు యుగ లక్షణం అంతా కూడా తెలుసు. భూమండలం అంతా కూడా కలియోక్క ప్రభావం ఉంటుంది. కలి ప్రభావం ప్రధానం గా ఎవరి మీద ఉంటుంది, కలికి లొంగి పోయిన వాడికి, కలి తన ప్రభావం చూపక్కరలేదు. కలికి లొంగ కుండా ఎవరైతే ఈశ్వరుని పాదాలు పట్టుకున్నాడో, అతని మీద కలి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి భూమండలం లో ఎక్కడ కూర్చొని తపస్సు చేసినా కలి ప్రభావం మామీద ఉంటుoది, తపస్సు అసలు నిలబడుతుంది అన్న ధైర్యం లేదు. కాబట్టి మహానుభావ భూమండలం లో ఎక్కడ మేము కలి ప్రభావానికి వశులం కాని ప్రదేశం ఉన్నదో,అటువంటి ప్రదేశాన్ని మాకు ఎరుక పరచవలసినది అని ప్రార్ధన చేసారు. బ్రహ్మ గారు ఒక చక్రాన్ని ఒక దాన్ని మనసా  నిర్మించి, విడిచిపెట్టారు, దీని వెంట వెళ్ళండి, ఇది దోర్లుకుoటూ వెళ్తుంది, వెళ్లి వెళ్లి వెళ్లి ఎక్కడ దీని నేమి  ఆగిపోతుందో దీని ఇరుసు శిధిలం అయిపోతుందో , ఆ పడిపోయిన ప్రదేశం లో కలి పురుషుని యొక్క ప్రభావం ఉండదు. కాబట్టి మీరు అక్కడ తపస్సు చెయ్యండి అన్నారు. అదిగో అప్పుడు వచ్చింది   నైమిశారణ్యం,అక్కడ ఆ చక్రం యొక్క నేమి శిధిలం అయి పడిపోయిoది. ఆ రోజుల్లో మహర్షులు అక్కడ తపస్సు కి కూర్చుంటే, మహాత్ములైన వారు తపోనిష్టాగరిస్టులు అక్కడ కూర్చున్నారని 88000 మంది ఋషులు చేరారంట
 నైమిశారణ్యం లోకి ప్రారభం లో. అంత మంది మహర్షుల యొక్క పాద ధూళి చేత పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం,అక్కడ సాక్షాత్తు గా శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించారు ఒక ప్రత్యేక కారణానికి, రాక్షస సంహారానికి,ఆ ప్రదేశంలోనే అనేక మంది ఋషులు కూర్చొని వాళ్ళు సరస్వతీ దేవి ని ధ్యానం చేశారు. ఆ ధ్యానం చేసినందుకు సంతోషించి "కాంచనాక్షి " అన్న పేరుతో ప్రవహించింది అక్కడ  నైమిశారణ్యంలో. అందుకే ఇప్పటికి అక్కడ ఉన్న గోమతి నది యందు ధర్మ చక్రం తిరిగింది అని చెప్తారు. ధర్మమూ ఒకలా ఉండదు, అస్తమానం మారిపోతుంది. నేను ఇప్పుడు వేదిక మీద కూర్చుంటే నాదొక ధర్మం, వేదిక దిగిపోతే నాదొక ధర్మం. నేను వేదిక మీద
ఉన్నపుడు మీరు నాతో ఒకలా ఉండాలి, వేదిక దిగి మాట్లాడితే ఒకలా మాట్లాడాలి. నేను నా భార్య తో ఉంటే నాది  భత్రు ధర్మం , నేను నా అక్క దగ్గర నిలబడితే నాది సోదర ధర్మం, నేను నా కూతురు దగ్గర నిలబడితే పితృ ధర్మం, నేను నా తండ్రి దగ్గర నిలబడితే పుత్ర ధర్మం, నేను కార్యాలయానికి వెళ్తే ఉద్యోగి ధర్మం, ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు తొందరగా పారణ ధర్మం, ఎక్కడి ధర్మం అక్కడే , ధర్మం ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది, మీరున్న   పరిస్థి తి ని  బట్టి మారిపోతుంది. ఆ ధర్మాన్ని పట్టుకుని , ధర్మానుస్టానం చేసిన వాడు చివరికి ఏది పొందుతాడు,ఏది కదలని పరమ సత్యమో, దేనికి మార్పు లేదో,ఏది షడూర్ము ల  కతీతమో షడ్వికారముల కతీత మొ అటువంటి సత్యమైన ఆత్మా ఎరుకలోకి వస్తుంది ,ఆత్మ కొత్తగా దర్శనం అవ్వటం ఉండదు. ఆత్మ ఉన్నది తెలియబడుతుంది. ఆ ఆత్మ తెలియ బడి  అద్వైతాను భూ తి  యందు ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ ధర్మ చక్రము అక్కడ ఉన్నటువంటి గొమతీ నది జలములలో తిరిగిందిట. అందుకే ఆ గోమతీ నదీ జలాలతో స్నానం చేసి అక్కడ పురాణ ప్రవచనం వింటారు, కారణం మేమిటంటే ఆ నైమిశారణ్యo యొక్క శక్తి అటువంటిది . నన్నయ్య గారు చెప్తున్నారు ... అక్కడ శౌనకుడు  అనబడే కులపతి ఉన్నారు. కులపతి అన్న మాట అర్థం, నాలుగు వేదములను స్వరంతో గురువుగారి దగ్గర నేర్చుకున్న వాడై, వేదం యొక్క ఉపాంగములైన టు వంటి కల్పము , జ్యోతిషము , నిరుత్తము ,  శిక్షా, వ్యాకరణము, ఇటువంటి 6 టినీ కూడా ,వేదములు వేదాంగములు అంటారు ,వేదంగాములతో కూడినటువంటి నాలుగు వేదములు చదువుకున్న వాడై ప్రతిరోజూ 10000 మందికి భోజనం పెడుతూ పోషిస్తూ వేద పాఠాలు చెప్పటానికి అవకాశాన్ని ,వ్యవస్థ ని కలిపించిన వాడెవరో ఆయనకి కులపతి అని పేరు.  అక్కడ శౌనకుడు అనే కులపతి ఉన్నాడు. అంటే ఆయన నాలుగు వేదములు చదువుకుని  6 వేదాంగములు చదువుకున్న వాడు, ఇన్ని చదువుకున్న వాడు కాబట్టి పరమ మౌని, మౌనమ్ గా ఉండే వాడు . ఎప్పుడూ తనలో తానూ మననం  చేస్తూ ఉండేవాడు .  అది చాలా గొప్ప విషయం ఎందుకంటే మననం చేత మాత్రమే ధారణ ఏర్పడుతుంది. మననం చేత పుస్తకం లోని విద్య మీ విద్య గా మారుతుంది. పుస్తకం లో ఉన్న విద్య మీ విద్య కాదు. ఎందుకంటే పద్యం  కావాలంటే    మీరు చుస్తే దోషం కాదు, కానీ అసలు ధర్మం ఏది అన్న ప్రశ్న వచ్చి నప్పుడు అన్నిటికి పుస్తకమే చూడాలండి అని మీరంటే అసలు మీరు అనుస్టించ గలిగింది పోతుంది. కాబట్టి  పుస్తకం లో ఉన్నది మీరుగా మారిపోవాలంటే అలా మార్చగలిగే ప్రక్రియకి మననమే కారణం. ఎంత లోపల తిప్పుతాడో, విన్న దాన్ని ఎంత పరిశీలనం చేస్తాడో, ఎంత జ్ఞాపకం తెచ్చుకుంటాడో అంత బాగా పట్టుకుంటుంది.  అందుకే దేవతలు బ్రహ్మ విద్యని సాధించారు, ఈ బహ్మ విద్య రాక్షసులకు అందకూడదు పాడు చేసేస్తారు, కాబట్టి ఎక్కడ దాచాలి దీన్ని అని అడిగారు . పట్టుకెళ్ళి దదీచి మహర్షి దగ్గర దాచండి అన్నారు. బ్రహ్మ విద్యని అంతటిని పట్టుకెళ్ళి దధీచికి ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడ దాచాలి. ఆయన ఆ బ్రహ్మ విద్యని మననం చేసి మననం చేసి అస్తిగతం చేసేసాడు, ఆయన యముకలలోకి పెట్టేస్కున్నాడు. ఇప్పుడు ఆయన ఎముకలతో చెయ్యబడిన వజ్రాయుధాన్ని ఇంద్రుడు పట్టుకుంటాడు. అంటే ఇంద్రుడి చేతిలో ఉన్నదేది అంటే, బ్రహ్మ విద్య ఆయన చేతిలో ఉంటుంది. జాగ్రత్తగా విద్యని దాచడం అంటే అర్థం ఏంటో తెలుసాండి మీలో పెట్టేస్కోవటం. ఐశ్వర్యాన్ని మీదిగా చేస్కోవటానికి అర్థం ఏమిటో తెలుసా, దానం చెయ్యటమే . దేన్నీ ఎదిచేస్తే మీది అవుతుందో తెలుసుకొని ఉండడమే శాస్త్రం. మీరు ఒకలా అనుకుని చేసినది మీకు అభ్యున్నతి ని ఇవ్వదు. శాస్త్రం ఏది చెప్పిందో అది చేస్తే అది మీదవుతుంది. కాబట్టి విద్య మీది కావటం అంటే విద్యని నిరంతర మననం చెయ్యాలి. ఎప్పుడో  ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో చెప్తానండి కాదు, ఎప్పుడూ లోపల తిరుగుతూ వుండాలి. ప్రయత్నపూర్వకం గా కాదు, అది అలవాటుగా మారాలి, మననం చేత ఆ విద్య కరతలామలకం అవుతుంది, అది  స్పురణ  లో నిలబడి  ఉంటుంది, ఆ నిలబడింది ఏదైతే ఉందొ అది అంతిమ శ్వాస యందు స్మరణ దానియందు నిలబడుతుంది, అది అభ్యన్నతి కారణం అవుతుంది. తన వారియందు వ్యామోహం పెట్టుకున్నా , తన శత్రువు యందు వ్యామోహం పెట్టుకున్న తిర్యక్కు గా  అంటే వెన్నుపాము అడ్డం గా ఉండే ప్రాణి గా వెళ్ళిపోతాడు, ఇంక మనిషిగా ఉండదు, ఏ కుక్క గా నో పిల్లిగానో పందిగానో ఉంటాడు. ఎవడు శాస్త్రము ని నిరంతరం తలుచుకుంటూ ఉంటాడో, ఎందుకని స్మరణ మనసు మీద ఆధార  పడుతుంది, మనసు ఊపిరి మీద ఆధార  పడుతుంది, ఊపిరిని కనక మీరు నియంత్రించ గలిగితే, మనసు నియంత్రింప పడుతుంది, అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేస్తారు. అందుకే  ప్రాణాయామం ఎందుకు చేస్తారు అంటే, మనసుని నియంత్రించబడుతుంది, మనసు నియంత్రింపబడి   సంకల్ప వికల్పములు ఆగుతాయి,   సంకల్ప వికల్పములు ఆగితే ఆందోళనలు ఆగుతాయి, ఆందోళనలు ఆగితే ఒత్తిడి ఆగుతుంది, ఒత్తిడి ఆగితే ఆరోగ్యం నిలబడుతుంది. అందుకు ప్రాణాయమం వచ్చింది. మీరు చుడండి, మనసుని విడిచిపెట్టారుఅనుకోండి, ఎన్నిటినో సృష్టిస్తుంది, అంతే ఎక్కడ లేని ఆందోళన పుడుతుంది, ఈ ఆందోళన ఆరోగ్యానికి భంగకరం అవుతుంది. ప్రాణాయామము మనసుని నియంత్రించే సాధనముగా ఆరోగ్య కారకము.  భారతం లాంటి పురాణాలని మీరు పరిశీలనగా చదివినా విన్నా, ఇది చెప్పండి అని ఎంత మర్యాదగా అడగాల్సి ఉంటుందో, మీకు అర్థం అవుతుంది, చదవకపోతే ప్రవర్తన యందు దోషం ఉంటే ఎక్కడ ఏది ఏ విధం గా అడగాలో తెలియదు. నైమిశారణ్యం న సునకుడైన పరమ మౌని, రోజూ 11000 మందికి భోజనం పెట్టి, వేదములు చదివించే వాడు, బ్రహ్మర్షుల  తో కుడి ఉన్న వాడు, ఆయన చేస్తున్నదేమిటి , అంటే 12 సంవత్సరములు కొనసాగేటటువంటి  సత్ర యాగాన్ని చేస్తున్నాడట. యాగములు అనేకమైన యాగములు ఉంటై, అందులో సత్ర యాగము అనే ఒక యాగము, ఈ సత్ర యాగం చాలా గమత్తుగ ఉంటుంది, బ్రహ్మణు న్ని  దానం పట్టమని చెప్పింది శాస్త్రం, ఏమి బ్రాహ్మణుడే ఎందుకు దానం పుచుకోవటం, అంటే ఇచ్చిన పంచాల చాపల్లా తానూ కట్టేసుకోకూడదు. పంచాల చాపులు పుచ్చుకుoటే, ఒక ఐదో ఆరో తను కట్టుకోవటానికి ఉంచుకుని, మిగిలిన పంచాల చాపులు తీస్కెళ్ళి వేరే ఉంచాలి, ఉంచి దేవాలయాల్లో శారదా నవరాత్రులు జరుగుతున్నాయి అన్నారనుకోండి, దీక్షా  వస్త్రాలు గా కట్టుకోండి అని ఒక 10-15 పంచాల చాపులు తీస్కొచి ఇచ్చేసే య్యాలి. బ్రాహ్మణుడు తెలుసుకోవలిసిన మొదటి లక్షణం ఏమిటంటే కేవలం తానూ అనుభవించుట కాదు,వైదిక సంస్కారం పెరగటానికి , తనకు వచ్చిన దాన్ని తిరిగి పెట్టుబడి గా ఇస్తూ ఉండాలి. అందుకే బ్రాహ్మణుడి జీవితం నిరాడంబరం గా ఉండాలి అని శాస్త్రాలు చెప్పడానికి కారణాలు అవే. సత్ర యాగము అన్న మాట కి అర్థం ఏమిటంటే దానికి యజమానులు ఉండరు. యజమాని ఉంటాడు చేయించే వాళ్ళు ఉంటారు. యజమాని అంటే కోర్కె ఆయనది, ఆయన కొరకు యాగం జరుగుతూ ఉంటుంది, దశరధ మహారాజుకి పిల్లలు లేరు, దశరధ మహారాజు వశిష్టున్ని ఆశ్రయించాడు, వశిష్టుడు అన్నారు, అశ్వమేధ యాగం చెయ్యాలి అని, వశిష్టుడి కి ఏమి కలగదు, సంతానము కలగకుండా  ఏ దోషం ప్రదిభందకం గా దాశరధ మహారాజు కి అడ్డం వచ్చి నిలబడిందో ఆ దోషము తొలగి పోతుంది, ఇప్పుడు ఆ దోషము తొలగటానికి కి ఈ యాగం చెయ్యవలసి ఉంటుంది అని వశిష్టుడు చెప్పాడు, కాబట్టి ఆ యాగం  చేశాడు, ప్రతిబంధకం పోయింది, ఇప్పుడు సత్పుత్రులు కలగాలి, కాబట్టి పుత్రకమేష్టి  చేసాడు, పయసపాత్ర పట్టుకుని యజ్ఞ పురుషుడు బయటికి వచ్చాడు. యాగము , హోమము , బలి అని మూడు ఉంటై వాటిని కొంచం జాగ్రత్త గా మీరు పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది. యాగము యాగ శాల అని ఉంటై, యాగ శాలా ప్రవేశేమే అద్భుతమైన విషయం, అసలు ఆ దీక్షా వస్త్రాలు కట్టుకొని మంగళవాయిద్యాలతో వెళ్తారు, అందరు యాగ శాల లోకి వెళ్ళకూడదు, యాగ శాల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి మనం అందరం, యాగ  శాల లోకి ఋత్విక్కులు వెళతారు, వెళ్లి అగ్ని ముఖంగా హవిస్సులు ఇచ్చి దేవతలని పట్టుకెళ్ళ మని చెప్తారు, అంటే వాళ్ళకి అన్నం పెడతారు, అగ్ని ముఖం గా  వాళ్ళు ఆ అన్నం తింటారు, వాళ్ళా అన్నం తినటానికి వచ్చి కూర్చుంటారు , ఇవాళ్ళమనని పిలుస్తారు అనం పెడతారు అని, మనం పిలిచాం అనుకోండి భోజనానికి రండి అంటాం , తప్పు దేవతార్చనకి రండి అనాలి, వచ్చి కూర్చుంటే అయ్యా వడ్డించేస్తున్నాం  కూర్చోండి అంటారు . అలాగే  యాగశాల నిర్మాణం చేసేసి నాంది ప్రస్తావన చేసేస్తే , దేవతలు వచ్చి కూర్చుంటారు, హవిస్సులు ఇస్తారు అని, అందుకని యాగ శాల లోకి అందరూ వెళ్లారు, దానికి తగిన నియమ పాలన చేసేవాళ్ళు, దీక్షితులు అందుకే యాగం చేస్తేనే దీక్షా అన్న పేరు వచ్చింది. దీక్షా  వస్త్రాలు కట్టుకుని వాళ్ళు యాగ శాల లోకి వెళతారు. అటువంటి హోమగుండం , హవిస్సులు, ఋత్విక్కులు , దేవతలు, అందరూ ఆ యాగ శాల లో కూర్చున్నారు కాబట్టి,అటువంటి యాగాశాలకి ప్రదక్షిణం చేసేస్తారు,కాబట్టి దేవతలకి ప్రదక్షిణం అయిపోతుంది, వారిని కుడి భుజం వైపున ఉంచుకుని తిరిగాడు, ప్రదక్షిణం అన్న మాటకి అర్థం ఏమిటంటే, మీరు ఇటువైపు నుండి అటువైపు వచ్చినా ఈ మధ్యలో  ఉన్న వస్తువు మీ ఎడం భుజం వైపు రాకూడదు, ఎడమ భుజం వైపు ఉన్నది అంటే పూజనీయత తరిగి పోతుంది. కుడి భుజం వైపు ఉన్నది అంటే పూజనీయత పెరుగుతుంది. ప్రదక్షిణ ఎందుకు చేస్తారు అంటే గుండ్రం గా తిరిగి వస్తున్నా ఈ వస్తువు మాత్రం నా కుడి భుజం వైపే ఉండాలి, అంటే ఇది పరమ  పవిత్రం అని అర్థం ఏమిటంటే కుడి భుజం దీనివైపు ఉండాలి, ఇది ఇంత పవిత్రమైనది కాబట్టి దీని చుట్టూ నేను తిరిగినప్పుడు దీనిలోని శక్తి నాలోకి ప్రసరిస్తుంది, ప్రసరించి నాకు అభ్యున్నతి ని ఇస్తుంది. మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, దేవతా మూర్తి కింద ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్రం తన శక్తిని చిమ్ముతూ ఉంటుంది చుట్టును, మీరు మౌనమ్ గా ప్రదక్షిణ చెయ్యాలి, ఊసుపోని కబుర్లు చెప్తూ ప్రదక్షిణ చేస్తే మీకు ఫలితం రాదు, పైగా దేవాలయాలకి  మళ్ళి  మళ్ళి కుమ్భాభిషేకాలు చెయ్యాల్సొస్తుంది. కాబట్టి కలియుగం లో దేవాలయాల కున్న శక్తి క్షీణిo చి  పోవటానికి  కారణం  అదే,  అమర్యాద  తో కూడిన నడవడి దేవాలయం లో. మీరు రామాయణ మహా  కావ్యం చదివితే, ప్రతి చోటా ఎక్కడెక్కడ పూజనీయమైన వస్తువు కనపడితే అక్కడక్కడ ప్రదక్షిణం చేసివేళతాడు శ్రీ రామచంద్ర మూర్తి, అప్రదక్షిణ  గా వెళ్ళడు. మహాభారతం లో విరాట పర్వము లో అర్జునుడు యుద్ద భూమి లోకి వచ్చి నిలబడితే, ఆ సారధి ఉత్తర కుమారిడి తో చెప్తాడు, నీవు రథం నడిపెటప్పుడు , ద్రోణాచార్యుల వారికి కాని భీష్మా చార్యుల వారికి కాని నా యడం భుజం వైపు వాళ్ళ రధాలు ఉండేటట్టు తొలకు సుమా !   వారు మహానుభావులు, వారు పూజనీయులు, వారు నాకు గురువు, వారు నాకు పరమేశ్వర స్వరూపము, వారు నాకు ఎడమ భుజం వైపుకు ఉండరాదు, ఎప్పుడు నా రధం వెళ్ళినా , వారు నారధానికి కుడివైపు  ఉండేటట్టు చూడు అంటాడు. అంతటి ధర్మైక మూర్తులు కాబట్టే వాళ్ళు అంత విజయాన్ని సాధించారు. అంతటి మహోజ్వలమైన స్థితి ని పొంద గలిగారు. కాబట్టి ఆచరనత్మకమై ఉంటుంది, అదే ధర్మమూ అన్న మాటకి అర్థము.  కాబట్టి ఆయన (శౌనకుడు) సత్ర యాగం చేసాడు, సత్ర యాగం యజమాని కొరకు చెయ్యరు, ఎవరు ఋత్విక్కులు గా ఉన్నారో వారే యజమానులుగా ఉంటారు. వారే చేస్తారు, వారే కోరికలు కోరతారు. ఇప్పుడు శౌనకుడికి కోరికేమి ఉంటుంది,  శౌనకుడితో  చేరినవారుకి కోరికేమి ఉంటుంది. వారందరు కలిపురుషుని  యొక్క ప్రభావం తమపై ఉండకూడదని, ఈశ్వరుని అనుగ్రహం మాకు కావలి అని అక్కడ కూర్చున్న వాళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళు విచారించ వలసి వస్తే దేనిగురించి విచారిస్తారు , అయ్యో మేము అంటే  ఇక్కడ నైమిశారణ్యం చేరుకున్నాం ఇక్కడ  కుర్చుని జపం చేస్కున్తున్నాం, పురాణ కధలు వింటున్నాం, కానీ పాపం ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు సంసారం లో మగ్గిపోతున్న వాళ్ళు,ఈ భూమండలం  కలిపురుషుని యొక్క ఉద్దతి కి వాళ్ళు వశులై పోతున్నారు, ఇప్పుడు లోకం కొరకు, లోకం అంతా కూడా శాంతి గా ఉండాలి, కలిపురుషుని యొక్క ఉద్దతి తో బాధ పడకూడదు, కాబట్టి ఇప్పుడు వాళ్ళు యాగం చేస్తే వాళ్ళకి కోరిక లేదు , యజమాని లేడు , కోరికా లేదు, కాబట్టి ఋత్విక్కులే యజమానులుగా ఉంది 12 సం॥ దీర్గ సత్ర యాగం చేస్తున్నాడు శౌనకుడు, ఆ అరణ్యం ఎటువంటిది, ఆ ప్రదేశం ఎటువంటిది, అక్కడ ఉన్న మహాత్ములు ఎటువంటి వారు, అసలు వాళ్ళ  మనసులు ఎటువంటివి, వాళ్ళు చేస్తున్న యాగం ఎటువంటిది అక్కడికి వెళ్ళాడు మహానుభావుడైన సౌతి , నన్నయ ఆయన్ని సౌతి , కధకుడు అని ఈరెండు పేర్ల తో పిలుస్తూ ఉంటారు. మళ్ళి  వైశంపాయనుడు వచ్చేంతవరకు కధ లో అలాగే పిలుస్తూ తీస్కొని వెళ్తారు. ఆయన రోమహర్షుని కుమారుడు  ఉగ్రశ్రవసుడు ఆయన పేరు ఆయన్ని సౌతి అంటారు. ఆ సౌతి ఆ యొక్క  నైమిశారణ్యనికి వచ్చాడు. అక్కడికి  ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే అక్కడికి వచ్చిన ఉగ్రస్రవసుని యొక్క తండ్రిగారి పేరు రోమహర్షనుడు. ఆయనకి అసలా రోమహర్షనుడు అన్న పేరెందుకు వచ్చింది సూతుడన్న పేరెందుకు వచ్చింది,  సూతుడన్న పేరు సాధారణం గా సారధికి అన్వయం చేస్తూ ఉంటారు, లేదా జన్మ చేత కొంత మందిని సూత అనే శబ్దం తో  పిలుస్తారు. ఇక్కడ రోమహర్షనుడు సుతుడు అని ఎందుకు అంటున్నారో తెలుసాండి, అది ఈ జాతి సంబందమైన అన్వయం కాదు. మీకు కాశి ఖండం లో దీనికి సంబంధించిన ప్రస్తావన చేస్తారు.
పృధు మహారాజు ఒకానొకప్పుడు ఒక పెద్ద యజ్ఞం చేసాడు, ఆ యజ్ఞగుండం లోంచి ఒక మహా పురుషుడు ఆవిర్భవించాడు, ఆయన్ని పిలిచారందరూ "అగ్నికుండ  సముద్భుతా " అగ్ని గుండం లోనించి జన్మించిన వాడా "నిర్మలమనసా " నిర్మలమైన మనసు కలవాడా  అని పిలిచారు. ఈయన వేదవ్యాసునకి శిష్యుడైయ్యాడు.  శిష్యుడై, పురాణ వగ్మయాలు అన్నిటిని కూడా , అష్టాదస పురాణాలూ అన్నింటినీ కుడా వేద వ్యాసుల  నుండి ఉపదేశం గా  పొందాడు, పొంది ఈ పురాణముల అన్నిటిని కూడా ప్రవచనము చెయ్యటం తన ధ్యేయం గా పెట్టుకున్నాడు. ఎందుకలా పెట్టుకోవాలి ఆయన అంటే ఆయనకేదో ఊసు పోక చెప్పినటువంటి వాడు కాదు, ఆయన  చెప్పేటప్పుడు ట పొంగిపోయి, ఆ కధ లో తానూ లీనమై పోయి ఎంత పరవశించి  పోయేవాడoటే లోపల తాను  ఏ  ఘట్టాన్ని వర్నిస్తున్నాడో ఆ ఘట్టాన్ని తాను దర్సనం చేసి పరవశించి చెప్పెవాడు  ట, అంత పరవశించి ఆయన  చెప్పే వాడు కాబట్టి సభలో కూర్చున్న వాళ్ళందరికి కూడా ఆనందంతో పులకలు వచ్చి వెంట్రుకలు నిక్కపొడుచుకునే లాగా  వినేవారు ట  అందరు ఆయన చెప్పే ప్రవచనాన్ని, అంత భక్తి కుదురుకునేది ట ఆయన మాట్లాడితే. అలా మాట్లాడాడు కాబట్టి ఆయనని రోమ హర్షణుడు అని పిలిచారు.  అగ్ని గుండం లో నించి ఉద్భవించాడు కాబట్టి సుతా అని పిలిచారు. అటువంటి రోమహర్షుని కుమారుడు  ఉగ్రశ్రవసుడు, ఈయనకీ తండ్రి పోలికే వచ్చింది. ఈయనకి కూడా ఏమిటి పని అంటే పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. పురాణ ప్రవచనము భూతద్దం పెట్టి వస్తువుని చూపించడం అంటుంది శాస్త్రం. వేదము రాజ శాసనం ఎలా ఉంటుందో అలా మాట్లాడుతుంది "సత్యం  వధ ధర్మం చర "అంటుంది. ఇప్పుడు వేదంలో ఉండే సమస్త ఆచార కాండ ని స్మృతులు చెప్తాయి . స్మృతి అంటే ఏ ఋషి  వాటిని అన్నింటినీ వేదం లో నించి  తీసి క్రోడీకరించారో  ఆ ఋషి పేరు ఆ స్మృతికి  వస్తుంది. యాజ్ఞవల్కుడు క్రోడీ కరించాడు అనుకోండి యగ్నవల్క స్మృతి. గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి. మనువు క్రోడీకరిస్తే మను స్మృతి. ఈ స్మృతి
కి ఆధారం శ్రుతే, వేదమే వేదంలోనించే తీస్తారు కాబట్టే  "శ్రుతే రివార్థం స్మ్రుతిరన్వ గఛత్ " అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ ఎలా వెళ్తుందో శ్రుతి వెంట స్మృతి వెళ్తుంది అని కాలిదాస మహాకవి రఘువంశ మహాకావ్యం లో వర్ణన చేస్తాడు. వేదాలు ఏమేమి చెప్పినవో అవే స్మృతులు చెప్తాయి. కాని అకడక్కడ  చెప్పిన విషయాలు తీసి ఋషి క్రోడీకరిస్తాడు. దాన్ని స్మృతి అంటారు. ఇప్పుడు ఈ శ్రుతి స్మృతి ఈ రెండు ఏమి చెప్తాయి అంటే మనం ఎలా  ప్రవర్తించాలో ప్రామాణి కం గా మనకు చెప్తాయి, ఈశ్వర వాక్కు కాబట్టి, కానీ దాని మీద మనకి బాగా బుద్ధి కుడురుకోవాలి అనుకోండి,పురాణం వినాలి. పురాణం వింటే నువ్వు శ్రుతిని స్మృతిని విన్నట్టే ఎందుకని "ధర్మం చేర " నువ్వు ధర్మం నే అనుస్టించు , ధర్మమే అనుస్టిస్తే ఏమవుతుందoడి, రామాయణం  విను నీకు అర్థం అవుతుంది ధర్మం అంటే ఏమిటో , ఎలా రక్షిస్తుందో. ఇప్పుడు వేదం లో ధర్మం చెర అన్న మాటని రామాయణ మహాకావ్య రామచంద్ర మూర్తి యొక్క జీవితం గా సమర్ధించి చూపించి మీకు ధర్మము నందు పూనిక కల్పిస్తుంది. అయితే పురాణానికి చరిత్రకి మళ్ళి ఒక తేడ ఉంటుంది. ప్రధానమైన వేత్యాసం ఎక్కడ ఉంటుంది అంటే, ఒక వ్యక్తి పుట్టుక , జీవితం, మరణం వారికే చరిత్ర మాట్లాడుతుంది. కృష్ణ దేవరాయలు ఎప్పుడు పుట్టారు ఎలా పెరిగారు, ఎన్ని విజయాలు సాధించారు, వెంకట రమణున్ని ఎలా సేవించారు ఎలా మరణించారు ఇవి చెప్తుంది చరిత్ర, అది పురాణం చెప్పిందనుకోండి కృష్ణ దేవరాయల వారి జీవుడు కృష్ణ దేవరాయలగా  వచ్చి ఆంధ్రభోజుడన్న కీర్తి ఎలా పొందాడో చెప్తుంది, కృష్ణ దేవరాయల  దేహం పడిపోయినప్పుడు , కృష్ణ దేవరాయల జీవుడు ఏమైయ్యడో కూడా చెప్తుంది అందుకే "సర్గాస్చ ప్రతిసర్గాస్చ మన్వత రా నిచ "  అక్కడ  సర్గ ప్రతిసర్గ నియమం తో వంశాన్ని అంతటిని , మన్వంతరముల  అన్నిటిని వర్ణిస్తూ, జీవుడు ఎలా వైక్లావ్యలని పొంది , శరీరాలని మార్చుకొని చిట్ట చివరకు ఈశ్వరుణ్ణి చేరాడు అన్న  విషయాన్నీ వర్ణిస్తుంది.  భరతుడు , అంతా అరణ్యానికి వెళ్లి ఒక లేడి మీద వ్యామోహం పెట్టుకున్నందుకు మళ్ళి దేనిగా పుట్టాడు , అప్పుడు ఆ వ్యామోహం ఎలా పోయింది, అదే చరిత్ర అనుకోండి ఆయన ఒక శరీరం లో ఉన్న అంత వరకు మాత్రమే చరిత్ర మాట్లాడుతుంది. అందుకని చరిత్ర అతోధరణ కొరకు హేతువుగా నిలబడుతుంది అని చెప్పటానికి కష్టం. కాని పురాణం మాత్రం అతోధరణ కొరకు హేతువు అవుతుంది. శ్రుతి యందు స్మృతి యందు ఉన్న దాన్ని భూతద్దం లో పెట్టి చూపిస్తుంది. శ్రుతి వింటే నాకు అర్థం అయ్యిందండి అని అందరు చెప్పాలేరు , కానీ వేదాన్ని వినడమే చాలు. స్మృతి  వింటే నాకు అర్థం అయ్యిందండి అని అందరు చెప్పగలరా అంటే చెప్పటం కష్టం. పురాణం వింటే నాకు అర్థం కాలేదండి అనటానికి ఏమీ ఉండదు. ప్రవచనం అంటే ప్రకృష్ట వచనం , బాగా కర్ర పాతుకుందో లేదో అని ఆయనే బాగా ఊపి చూస్తాడుఒకసారి . అలా పుర్వపర విచారణ  చేస్తూ కధ ని సమర్ధిస్తూ  సృతితో స్మృతితో అనుసంధానం చేస్తూ  జరిగిన మాట తేలికగా మన మనసులో ధర్మం నిలబడే లాగా చేస్తుంది. మనం ధర్మము నందు అనురాక్తులం అయ్యేటట్టుగా చేస్తుంది. అందుకని ప్రవచనం చేసారు. రోమహర్షనుడైన సూతుడు చేసినా ఆయన కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు చేసినా దేనికి కొరకు చేసారంటే , వాళ్ళకేదో ఊసు పోక , కాలక్షేపo లేక అదేపనిగా చెప్పుకుంటూ  వెళ్ళిన వాళ్ళు కాదు , అందుకే మీకు ఈ పురాణం ప్రవచనం అనే ప్రక్రియ , ప్రపంచ పటం లో ఏ ప్రదేశం లో ఏ సంప్రదాయం లో ఏ విశ్వాసం లో మీకు కనపడదు. పురాణం ప్రవచనం చెయ్యటం అనేది కేవలం సనాతన ధర్మము నందే ఉన్నది.
మీకొక యదార్ధం చెప్తాను, దేవాలయానికి పెద్దలైన వారు వచ్చి నప్పుడు ఒక విషయం అడుగుతారు, ఇక్కడ ఎప్పుడైనా రామాయణం చెప్పరా అని, ఇక్కడ రామాయణం చెప్పారండి అన్నారంటే, ఆ ప్రాంగణానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అన్నిటికన్నా ఒక ప్రాంతం పునీతమైంది అని ఎప్పుడు చెప్తారoటే అక్కడ భారతం చెప్పి ఉంటె. దేవాలయ ప్రాంగణం లో కుర్చుని భారత చెప్పినా ,విన్నా అది సర్వోత్క్రుస్ట మైన స్థితి ని కల్పిస్తుంది. దేవాలయ ప్రాంగణం లో ఈశ్వరుని సముఖం లో   భారతం వినడం అంటే కొన్ని కోట్ల కోట్ల జన్మలకి కాని ఆ అదృష్టం జీవుడికి ఇవ్వరు అది శాస్త్రములు  తెగేసి చెప్తున్నై, ఎందుకని అంటే మహా భారతాన్ని వినడమే అంత గొప్ప, ఎందుకని అంటే ప్రతి చోట, ప్రతిమాట  ధర్మ సుక్ష్మ సమన్వయమే. అంత గొప్పగా ధర్మమూ అనే పతకాన్ని ఎగర వేస్తుంది మహాభారతం.

ఇప్పుడు అక్కడికి ఉగ్రశ్రవసుడు వచ్చారు. ఆయన  ప్రవచనం చేయుట యందు దిట్ట. ఆయన  కి ఎవరు కనపడ్డారు, శౌనకుడు , బ్రహ్మర్షులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందు నమస్కారం చెయ్యాలి. ఉగ్రస్రవాసుల వినయం ఏమిటంటే ఆయనే బ్రహ్మర్షులు కి నమస్కారం చేసారు. నమస్కారం చేసి కూర్చుంటే వాళ్ళందరూ గబగబా ఆయన చుట్టూ చేరారు. ఒక మహాత్ముడు కన్పించినపుడు ఆయన తో ఏది మాట్లాడాలో , ఎలా మాట్లాడాలో తెలిసుండి మాట్లాడిన వాడు ధన్యత ని పొందిన వాడు తప్ప ఎవరిదగ్గర ఏది మాట్లాడాలో తెలియని వాడు అవకాసం వచ్చిన జారవిడుచుకున్న వాడు. ఆయన్ని వాళందరూ కూడా ప్రశ్న  వేశారు , అయ్యా మేమందరం ఇక్కడ నైమిశారణ్యం చేరాము , 12 సంవత్సరములు కోన సాగే సత్ర యాగాన్ని నిర్వర్తిస్తున్నాం , మేము అందరమూ కూడా భగవంతుని యొక్క పుణ్య కధలు వినడం యందు అనురాక్తులం అయిన వాళ్ళం, నీవు మాకు ఏమైనా  భగవథ్ సంబంధమైన కధలు చెప్ప  వలసింది.  నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, నువ్వు ఈ మధ్య కాలం లో ఏమి చూసావు , ఏ తీర్థముల యందు స్నానం చేసావ్, ఏ క్షేత్రములు దర్శించావు అని అడిగారు. తీర్థ యాత్ర అని అంటారు. ప్రకృష్టమై అనేకమైన పేర్ల తో తీర్థములు ఉంటై. ఒక వెంకటాచల క్షేత్రం  ఉండనుకోoడి,  ఎన్నో  తీర్థములు  ఉంటాయి . తీర్థము అంటే దానియందు స్నానం చేస్తే ఒక యజ్ఞం చేసిన పలితాన్ని మీ ఖాతా లో వేస్తారు. యజ్ఞం చేస్తే సోమయాజి అంటారు. గృహస్తాశ్రమం లో కి ప్రవేసించేది ఎందుకు అంటే యజ్ఞం చెయ్యటం కోసం. యజ్ఞ యాగాదులు జరిగినప్పుడు ఆర్థికం గా ఆదుకోవటం కోసం, వాడి బలాన్ని దానికి దాపుగా పెట్టి రక్షించడం కోసం, ఏది చెయ్య గలిగితే అది చెయ్యాలి, యజ్ఞ యాగాది క్రతువుల కోసం , కానీ కలియుగం లో మానవుడు అన్ని చెయ్యలేక పోతున్నా డెమో అని ఈశ్వరుడు  తీర్థము లని ప్రవేశపెట్టాడు. తీర్థం వేరు నది వేరు, తీర్థం లో స్నానం చేస్తే యజ్ఞం చేసిన పలితం ఇస్తారు , వేదం లో చెప్పారు ఈ మాట. తీర్థ యాత్ర చేస్తే తీర్థములో స్నానం చేయ్యాలి. అప్పుడు తీర్థ యాత్ర చేసిన వాడు అంటే యజ్ఞం చేసిన వాడుతో సమానం. అందుకు వచాయి. అందుకు తీర్థాలకి కి వెళ్తే స్నానం చేస్తారు.

కాబట్టి వారందరూ నువ్వు పురాణ వాగ్మయం అంతా చదువుకున్నావు, కాబట్టి ఎక్కడ ఏ తీర్థం ఉందొ తెలుసు, ఎక్కడ ఏ క్షేత్రం ఉందొ తెలుసు, కాస్త పెద్దాయన తో ఎందుకు వెళ్తారు యాత్రకి అంటే ఎవరు కాస్త తెలిసున్న వాడో ఆయన పెట్టె వీళ్ళందరూ పట్టుకుంటారు, ఎందుకు అంటే ఆయనకి తెలుసు, ఆయన  నాలుగు మాటలు చెప్పి చూపిస్తాడు అని తాపత్రయం. వెళ్ళలేని వాళ్ళు , అయ్యా ఏమి చూసారు అని అడిగి తెలుసుకుని సంతోష పడతారు. మీరు ఏమేమి చూసారు , మీకన్ని తెలుసు కదు కాబట్టి చెప్పండి.

తీర్థ యాత్ర చేసి వచ్చిన వారి  ఇంటికి వెళ్తే అడగ వలశి న ప్రశ్న ఇది. వాళ్ళు కూడా ఏమి మాట్లాడాలి అంటే వాళ్ళు తీర్థ యాత్ర ప్రారంభం దగ్గర నించి మననం చేస్కోవాలి . ఎక్కడెక్కడికి వెళ్ళాం అక్కడ ఏమేమి చూసాం, ఏయే గుళ్ళోకి వెళ్ళాం , అక్కడ స్థల పురాణం ఏమిటి, దాన్ని గొప్పతనం ఏమిటి, ఏమి స్నానం చేసాం , అక్కడ ఏ మహాత్ములు గురించి మనం విన్నాం, వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని ఇంటికి వచ్చిన వాడికి చెప్పుకుంటూ పోతే, ఆ చెప్పటం చేత విన్న వాడు తరిస్తాడు, వీళ్ళకి మననం అవుతుంది, మళ్ళి మళ్ళి  తీర్థముల పేర్లు మళ్ళి మళ్ళి క్షేత్రముల పేర్లు స్మరించడం చేత ప్రాసంగిక పుణ్యం పడిపోతుంది, అందుకే తీర్థ యాత్ర అన్న మాట మీద అన్ని విషయాలు పేర్కొన్నాయి శాస్త్రాలు.

కాబట్టి అందుకు అడగటం , నైమిశారణ్యం లో ఉన్న వాళ్ళు చేత కాక ఆ ప్రశ్న వేశారు అని మీరు అనుకోకూడదు, మహా భారతం ధర్మ సుక్ష్మ సమన్వయము, మహా భారతం వింటే మనం ఏమి చెయ్యాలో మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఊంచు కోవటానికి భారతం తప్పా , నన్నయ్య గారు బాగా రాసారు అని సర్టిఫికేట్ ఇవ్వటానికి భారతం చదవక్కర్లా, ఆయనికి  సర్టిఫికెట్లు మీరు నేను ఇవ్వకరలేదు ఆయన తరించిపోయారు. మనం తరించడం నేర్చుకోవటానికి భారతం చదవాలి. ఇప్పుడు వాళ్ళందరారికి ఆయన (ఉగ్రశ్రవసుడు / సౌతి ) నమస్కరించారు, అక్కడ బ్రహ్మర్షులు అందరూ ఆయన్ని ప్రశ్న వేసారు. అప్పుడు ఆయన అన్నారు శమంతక పంచాకాన్ని చూసొచ్చాను, ఎందుకు ఈ మాట వచ్చింది , వాళ్ళు ప్రశ్న వేసే లోపే , వాళ్ళకి చెప్పాలి అన్న ఉత్సాహం పెల్లుబుకుతుంది ఆయనలో .  అంటే అన్నీ తెలిసున్న వాడు ఇది చెప్తే బావుండు అనుకున్నాడు అంటే అది ప్రయోజన కరమైన విషయము అని మీరు నమ్మ వలసి ఉంటుంది కదా లేకపోతే ఆయన కి ఆ పొంగు ఎందుకు వస్తుంది. కాబట్టి ఆయనకి ఏమి జ్ఞాపకం వచ్చిందంటే , శమంతక పంచకం జ్ఞాపకం వచ్చింది, అక్కడ పరశురాముడు 21 మార్లు ఈ భూమండలం అంతా కూడా దండ యాత్ర చేసి , క్షత్రియుల్ని తెగటార్చి వారి రక్తం తోటి 5 సరోవారాల్ని ఏర్పాటు చేసి, ఆ రక్తం తోటి పితృదేవతలకి తర్పణం ఇచ్చాడు , అప్పుడు వాళ్ళు అయ్యాబాబోయి ఇలాంటి అలజడి వద్దురా నాయనా ఇంక క్షత్రియ సంహారం చెయ్యకు అన్న తరువాత ఆయన శాంతించాడు, అదిగో అంత గొప్ప ప్రదేశం ఆ శమంతక పంచకాన్ని,  కురుక్షేత్రాన్ని, జనమేజయున్ని , యాగాన్ని ఇవన్నీ చుసోస్తున్నాను , అంటే వాళ్ళన్నారు మేము ఏది వింటే బావుంటుంది, ఇది అడగాల్సింది , మీరు వేదిక మీదకి వచ్చిన వ్యక్తికి ఇలా ఒక కాయితం ఇచ్చి ఇది చెప్పండి అని అడగ కూడదు, ఏది మీకు చెప్పాలో వేదిక మీద కూర్చున్న వాడికి తెలిసి ఉంటుంది అని మీరు నమ్మాలి , అది వినయం . ఆ వినయం లేని వాడికి వినే అర్హత ఉండదు. ఆ వినయం ముందు నేర్చుకోవాలి.  కాబట్టి మాకు మీరు ఏది చెప్పలనుకున్తున్నారు, ఏది చెప్తే బావుంటుంది, ఏది మాకు పురషార్థాన్ని కలిపిస్తుంది మాకు అటువంటి గ్రంధాన్ని అటువంటి ఇతిహసాన్ని , అటువంటి విషయాన్ని మాకు ప్రవచనం చెయ్యవలసింది మహానుభావా అని వాళ్ళు ప్రార్థన చేస్తే,
ఆయన అన్నారు మా గురువు మహానుభావుడు , వేదమంతా ఒక రాశిగా పడిపోయి ఉంటె , కలియుగం లో ఉండేటటువంటి ఆయుర్థయన్ని దృష్టిలో పెట్టుకుని  వేదములను చదవ గలిగిన వాళ్ళు ఉండరని , వేదమును విభాగం చేసి "రుక్" "యజుర్" "సామ" "అథర్వణ" వేదము అని నాలుగు విభాగములు చేసి 18 పురాణములు వెలయించిన తరువాత పంచమ వేదమైనటువంటి  మహాభారతాన్ని రచన చేసారు, అందులో లేనటువంటి ధర్మ సుక్ష్మం లేదు , భారతం అంతా కూడా రచన చేసిన తరువాత వేదవ్యసుడే అన్నాడు నీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా , ఏది తెలుసుకోవాలన్నా భారతమే ఆధారం ఇంత కన్నా ఇంకోటి ఏది ఉందొ నాకు చెప్పు అన్నాడు , కాబట్టి నీకు జవాబు లేనిది లేదు మహాభారతం లో అన్ని ఉన్నాయ్. నీకు వెతుక్కోవటం రావాలి, తెలుసు కోవటం రావాలి , ఇది కాకుండా వేరొకటి కొత్తగా తెలుసుకోవటానికి వేరేది ఉండదు, అన్ని భారతం లోనే ఉన్నాయ్.
అన్ని ఆఖ్యానములతో అన్ని ఉపాఖ్యానములతో  అన్ని విసేషాలతో  భారత రచన చేశానని మా గురువైన వేద వ్యాసుడు పేర్కొన్నాడు. అటువంటి మహాభారతం ను

"ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబనియు ఆధ్యాత్మ వేదులు  వేదంతమనియు నీతి విచక్షణులు  నీతి శాస్త్రంబని కవివృ ష భులు  మహా కావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష సంగ్రహమని అయితి హసకులు ఇతిహసమనియు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయంబు అని  మహి కొనియాడుచుండ  వివిధ వేద తత్వ వేది  వేదవ్యసుడాది ముని పరశారత్మజుండు, విష్ణు సన్నిభుoడు , విశ్వ జానీనమై పరగుచుoచేసే భారతంబు"

సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన టు వంటి వేదవ్యాసుడు రచన చేసినటు వంటి ఆ మహాభారతం ఉందే దాన్ని ధర్మమునందు నిష్ణాతులైన వారు ఇదే ధర్మ శాస్త్రం అని మహా భారతాన్ని పిలుస్తారు. ఆ ధర్మమునే భోధ చెయ్యటానికే సమస్త   వాంగ్మయం వచ్చింది , " ఆధ్యాత్మ వేదులు  వేదంతమనియు" వేదాంతములు అంటే వేదముల చివరన ఉండేవి ఉపనిషత్తులు , ఆ ఉపనిషత్తుల యందు శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తాడు, ప్రశ్న వేస్తే గురువు మాట్లాడుతాడు, మాట్లాడితే ఆ జ్ఞానము వలన మళ్లి పుట్టే అవసరము లేని, పునరావ్రుత్త రహిత శాశ్వత శివసాయుజ్య స్థితి ఏర్పడుతుంది, అటువంటి మోక్ష కారకమైనటువంటి వేదంతము ఏది ఉన్నదో ఆ వేదంతమే మహా భారతం అని వేదాంతులు చెప్తారు "నీతి విచక్షణులు  నీతి శాస్త్రంబని " లోకంలో  నీతి మాట్లాడే వాళ్ళందరూ మహా భారతం కన్నా నీటి శాస్త్రం లేదు అంటారు. కాబట్టి మహాభారతం గురించి మాట్లాడిన మహాభారతం లోని ఏ వ్యక్తి గురించి పుస్తకాలు రాసిన ఆ కోణం లో నే చూసి రాయాలి, ఆ కోణం లోనే మహాభారతాన్ని రాయాలి, తప్ప ఇంకొకలా చూసి కవిత్వ పరంగా అన్వయం చేసి రాసే అధికారం  ఎవరికీ ఉండదని తీర్పు. "నీతి శాస్త్రంబని కవివృ ష భులు  మహా కావ్యమనియు" గొప్ప కవులు దాన్ని మహా కావ్యం అని పిలిచారు ఇంతకన్నా కావ్యం ఉండదు లోకంలో "లాక్షణికులు సర్వలక్ష సంగ్రహమని" లాక్షణికులు ఇంతకన్నా గొప్ప లక్ష్య శాస్త్రం వేరొకటి లేదు అని అన్నారు  " అయితి హసకులు ఇతిహసమనియు" యదర్ధముగా  జరిగిన గాధ ఇంత కన్నా గొప్పగా చెప్పటం వ్యాసునికి తప్ప అన్యులకి సాధ్యం కాదు. "పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయంబు" పురాణం చదివిన వారు మహాభారతం లో లేనటువంటి పురాణం లేదు , అన్ని పురాణములలో ఉన్న విశేషాలు మహాభారతం లో వస్తాయి అని మహాభారతానికి పెద్ద పీట  వేసి పొగుడుతారు.  "మహి కొనియాడుచుండ  వివిధ వేద తత్వ వేది" అనేకమైన వేదముల యొక్క  తత్వముల కంతటికీ పుట్ట ఆ మూల కంద మైన వేదవ్యాస మహర్షి ఉన్నారే ఆది ముని  మొదటి ముని , మహనుభావుడు పరసరాత్మజుడు  పరసరుని యొక్క కుమారుడు , సాక్షాత్తు విష్ణు స్వరూప మైన టు వంటి వాడు " వ్యాసో  నారాయణ స్వయం "అటువంటివాడు రాసిన మహాభారతం , నేను దాని గురించి ప్రవచనం చేస్తాను , చక్కగా మీరందరూ వినండి అని
అక్షౌహిణి  అన్న మాటకి అర్థమేమిటో, పర్వము అంటే ఏమిటో మహాభారతం లో ఎని పర్వాలు ఉన్నాయో ఆ పర్వాలలో ఉండే సారాంశం ఏమిటో ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో , పద్దెనిమిది పర్వాలు గురించి విహంగ వీక్షణం గా ఒక్కసారి చెప్పాడు , సంక్షేప రామాయణం అంటారు చూసారా అలా ఒక్కసారి చెప్పాడు, ఇలా ఎందుకు చెప్తారంటే జిజ్ఞాసువు అయిన వాడితే అమ్మో ఇన్ని విషయాలు ఉన్నాయ్, మనకి ఇది ఎలా అందుతుంది రా ఇలా ఆయన చెప్పి వెళ్ళిపోవటం కాదు  వివరం గా విందాం అని , బాగా నాకు వివరించి  చెప్పండి అని అడుగుతారు. వివరించి చెప్పమని అడగటం శిష్యునకు ఉండవలసిన లక్షణం, ఒకసారి పైపైన చదివేసి, వివరం గా తెలుసుకుందాం అని జిజ్ఞాస లేకపోతే వాడు సరియైన అధికారి కాలేదు అని అర్థం చదవటంలో.  కాబట్టి ఆ ఉత్సాహం ఉన్నవాళ్ళేనా  నాకేనా మహాభారతం చెప్పటం సంతోషం వీలు వింటారా ఒక్కసారి సంక్షేపం గా చెప్పాడు ఆయన , వాళ్ళన్నారు కాదు కాదు మాకు అంతా వివరంగా కావలి అందులో ఎన్నో విషయములు , అగ్ని హోత్రపు నెగడు దగ్గరకి వెళ్లి కర్రతో కట్టెలు లోపలకి తోస్తే నిప్పురవ్వలు చిందినట్టు నువ్వు చెప్పిన ఆదిపర్వం కధ  వింటే మా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేసాయో అసలు ఆ శంతన మహారాజు ఏమిటి , భీష్ముడు ఏమిటి, పిల్లాడేమిటి ఆ ప్రతిజ్ఞ చెయ్యటం ఏమిటి, గంగ ఏమిటి అష్ట వసువులు ఏమిటి , వాళ్ళ శాపం ఏమిటి , వాళ్ళు భూమీ మీద పుట్టడం ఏమిటి గంగ పట్టుకెళ్ళి గంగ లో పారెయ్యటం ఏమిటి , ఎనిమిదో వాడు మహా  పురుషుడు అవ్వటం ఏమిటి , దీర్గ కాలం ఉండటం ఏమిటి, పెళ్లి చేస్కోక పోవటం ఏమిటి,అది ధర్మ విరుధం కదా ఇవన్ని ఎలా జరిగాయి , మాకు వివరంగా చెప్పు అలా ఏదో చెప్పెశానంటే కుదరదు, అంటే వాళ్ళకి జిజ్ఞాస ఉంది ,   చాలా సంతోషిoచాడు  ఆయన , సంతోషిoచి మీకు నేను అలానే చెప్తాను అని జనమేజయుడి దగ్గర నించి ప్రారంభం చేసాడు, ఎందుకని  అప్పుడే కదా జనమేజయుడి యాగ శాల నించి వచ్చాను అని చెప్పాడు.  అప్పుడు నైమిశారణ్యం లో మొట్ట మొదటి సారి మహాభారతం ప్రవచనం చేసే సరికి అప్పుడే ఆయన చూసి వచ్చిన ఆ యజ్ఞ శాల యొక్క ఘట్టాల గురించి చెప్తూ ప్రారంబం చేసాడు

ఆయన అన్నాడు : జనమేజయుడు అనే వాడు చంద్ర వంశం లో పాండవుల వారసుడు గా జన్మించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేసాడు, ఆ యజ్ఞం లో ఆయన తనకి అని కోరిక కోరుకోని చేసిన వాడు కాదు ఆ యజ్ఞాన్ని, ఆయన   దేని కొరకు చేసాడు ఆ యజ్ఞాన్ని అంటే ప్రజల యొక్క సంక్షేమం కొసo , తన రాజ్యం లో ఉండే ప్రజల యొక్క అభ్యున్నతి కోసం చేసాడు, అంటే ఇక్కడ ఒకటి గమనిo చాలి , వేదము యొక్క ప్రమనమును నమ్మి ప్రజలయోక్క సంక్షేమం కోరే ప్రభువు సింహాసనం మీద ఉన్నాడు ,కాబట్టి ఆ రాజు కారణం గా  నెలకోక వాన పడుతుంది.









Monday, April 21, 2014

ఆదిపర్వము 2

మహా భారతాన్ని తరువాత ఆంధ్రీకరించిన  తిక్కన సోమయాజి మొదలైన వారికి మార్గ దర్శకుడి గా నిలిచి, తర్వాతి కాలం లో ఆంధ్ర దేశం లో వచ్చిన రచనా  ప్రక్రియలకు కావలసినటువంటి విధి విధానములకు కావలసిన సౌకర్యన్ని మహా భారతం లో తాను ఆంధ్రీకరించిన విధానo చూపిస్తుంది.
నన్నయ్య గారు మహా భారతం ఆంధ్రీకరించడం లో వచ్చిన మొదటి పర్వమే "ఆది పర్వము ".
ఆది అను శబ్దమునకు అర్థము మొదటిది అని. సంస్కృత భారతం లో కూడా ఆది పర్వమే. ఆయా పర్వాల పేర్లు
అలగే ఉన్నాయ్.
మహా భారతాన్ని ఆంధ్రీకరించిన సమయం లో నన్నయ్య గారి నోటి నుంచి వచ్చిన మొట్ట మొదట పద్యం. ఆ పద్యాన్ని ఆయన తెలుగు లో రచించలేదు. దానికి కారణo ఒక్కటే, మనకి దేవతారాధన అని ఒక మాట ఉంది, అంటే భగవంతుణ్ణి ఆరాధించుట.  ఏమి మనమే జాతీయ భాషా అని ఒక బాషని పెట్టుకున్తున్నమే, రాష్ట్ర బాష అని రాష్ట్రానికి ఒక బాషని పెట్టుకుoటుoన్నాయే. ఎవరి బాష మీద వాళ్ళకి అంతంత మక్కువ ఉంటుందే. అలాగే ఈశ్వరుడు కూడా ఒక నిర్ణయం చేసాడు.   ఆరాధన యందు నామాలు చెప్పుకోవటం లోను, భగవంతుణ్ణి స్మరించడం లోను , భజన చేయడంలోనూ మీరు ఎందులో చేస్తున్నారు అన్న దాంతో సంబంధం ఉండదు. కానీ
వై దికమైన ఆరాధన ప్రక్రియ యందు సంస్కృత బాష ను మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి "శ్వేత వరాహ కల్పే "అంటాం తప్ప "తెల్ల పంది కల్పే " అని అనువాదం చేసి పూజ లో ఎక్కడా ఉపయోగించరు. సంస్కృత బాష లోనే ఉంటుంది.
భారతాన్ని ఆంధ్రీ కరించడం అనే ట టువంటి మహోజ్వలమైన ప్రక్రియని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు దేవతా మూర్తుల ఆరాధన, త్రిమూర్తుల యొక్క అనుగ్రహం నాకు కలగాలి అని సంస్కృతం లో నే ప్రారంభం చేసారు. సంస్కృతం లో ప్రారంభించడం, తెలుగు కి ఏదో తక్కువ చేసినట్టు భావించకూడదు.  సంస్కృతం తల్లి వంటిది, తాను ఎంత గోప్పవా డై నా కావోచ్చుకానీ తనను కన్న తల్లి తాను చదువుకున్నo త  చదువుకున్నది కాక పోవచ్చు, తాను ఇప్పుడు ఎంత ఐశ్వర్య వంతుడో ఆమె అంత ఐశ్వర్య వంతురాలు కాకపోవచ్చు , తానూ ఇప్పుడు ఎంత అందంగా ఉన్నడో ఆమె అంత అందం తో శరీర సౌస్ట వం తో లేకపోవచ్చు కానీ అమ్మ అమ్మే. అసలు అమ్మ కనపడితే నమస్కరించడం అసలు అవతల వారి వ్యక్తిత్వానికి నిదర్శనం.
కాబట్టి సంస్కృతం లో ఆ త్రిమూర్తులను స్తోత్రం చేసి ఆ త్రిమూర్తుల యొక్క శక్తి స్వరూపాలని కూడా స్తోత్రం చెయ్యడం నన్నయ్య గారి యొక్క పరిణితి కి నిదర్శనం. కాబట్టి అయన మొట్ట మొదటి పద్యాన్ని ప్రారంభం చేస్తూ

    "శ్రీ వాణీగిరిజా శ్చిరాయ దధ తో వక్షోముఖాంగేషు యే
     లోకానాం  స్థితి మావహన్త్య విహతాం  స్త్రీపుంసయోగోద్భవాం
     తే వేదత్రయ మూర్తయ స్త్రిపురషా స్సంపూజితా వ స్సురై :
    ర్భూ యా సు: పురుషోత్తమా మ్బు జభవ శ్రీ క న్ద రా శ్శ్రే యసే"

అంటూ మొదలు పెట్టారు అందులో శ్రీ , వాణి , గిరిజ
శ్రీ అంటే లక్ష్మి, కవితా పరం గా శ్రీ కారం  తో ప్రారంభం చెయ్యటం చాలా చక్కటి సంప్రదాయం, శుభ ప్రద మైన టువంటి ప్రారంభం.  శ్రీ -->లక్ష్మీ దేవి  వాణి -->సరస్వతి  గిరిజ -->పార్వతి దేవి ఈ ముగ్గురు, ముగ్గురమ్మలు గా మూడు శక్తులకు ప్రతీకలు.
వాణి ,సరస్వతి  ఆమె కవనశక్తి కి ప్రతీక ,ఒకరిలో ఉన్న ప్రజ్ఞ ఆయన లోనే ఉండిపోతే స్వార్థం తో అంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు లోకంలో అందుకే నీరు ఒకచోటే ఉంటె వాసన వస్తుంది. ప్రజ్ఞా తనతోనే ప్రకాశించి తన తోనే అంతరించి పోతే అంతకన్నా ఘోరమైన నేరం ఇంకోటి లేదు. సరస్వతి నది ,ప్రవహిస్తూనే ఉంటుంది ప్రవహించటానికి ఏ ప్రతిఫలాన్ని , ఏ పారితోషికాన్ని కోరకూడదు, ఎవరినించి ప్రవహించాలని అడిగారు , పురుషసూక్తం చేస్తూ వేదం లో "బ్రాహ్మణో స్య ముఖమాసిత్ "
వేదం చదువుకునేవాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ప్రయత్న పూర్వకం గా పేదరికాన్ని అనుభవించ మని చెప్తుంది వేదం. బ్రాహ్మణుడు నిరాడంభర జీవితాన్ని గడపాలి తప్పా ఎన్ని తనకి కలిసొచ్చినా అవసరమునకు మించి భోగ లాలస బ్రాహ్మణునికి ఉండరాదు. బ్రాహ్మణు డైన వాడి జీవితం ఒక్కరోజు ఎలా ఉంటుందో ,వైదికమైన బ్రాహ్మణు ని జీవితం మీరు చుస్తే మీరు తెల్లబోతారు. దాదాపుగా  70 సంవత్సరాలు పైచిలుకు వచ్చిన క్రిష్ణావధానులు గారు తన జీవితం మొత్తం లో చొక్కా వేసుకున్న పర్యాయములు మూడే మూడుసార్లు, అంటే ఎంత నిష్టాగరిస్టులై  వాళ్ళు జీవితాన్ని గడిపారో చుడండి. అంత నిష్ట తో గడించిన జ్ఞానమును ఏ ఆపేక్షా లేకుండా లోకమునకు అందించడమే తమ కర్తవ్యము అని భావించి దానివలన వారి శ్వాస ఖేద పడినా , వారియొక్క హృదయము తల్లడిల్లినా ,వాళ్ళు డస్సి పోయినా , ఆయుర్దాయం తగ్గిపోయిన, అదేపనిగా మాట్లాడటం వలన ఊపిరులు ఖర్చై పోతే ఆయుర్దాయం క్షీణించి పోతుంది. అయుర్ధయమే క్షిణి o చిన  దేని కొరకు మాట్లాడాలి అని అడిగారు, నీలో ఉండిపోయి విద్య నశించిపోయి నువ్వు మరణిoచేకన్నా నీ ఆయుర్దాయము తగ్గిపోయిన  నువ్వు పది మందికి భోధ చేసి ప్రాణం విడిచి పెట్టు ట మేలు. కాబట్టి త్యాగము తో జీవించు, స్వార్థము తో బ్రతకవద్దు. కాబట్టి సరస్వతి ప్రవాహము , అది ప్రవహించాలి ఒకరి నుండి ఒకరి ప్రవహించి వెళ్ళిందా ఉపయుక్త మవుతుంది, ప్రవహించలేదా ఎవరికీ పనికిరాదు. గోదావరి ప్రవాహించినదా కొన్ని వేల ఎకరాలు సాగు అవుతాయి, కొన్ని లక్షల మంది దాహం తీరుతుంది. గోదావరి ఒక్కచోట ఉండిపోయిందా కొన్ని లక్షల మందికి అన్నం దొరకదు, కొన్ని కోట్లమంది దాహం తీరదు. లక్ష్మి సంపద భోగమును అనుభవించ గలిగినటు వంటి ధారుడ్యం.
కాబట్టి ఈ మూడు శక్తులు ఏవైతే ఉన్నాయో, వీటి ని మూగ్గురు మూర్తులు తమ శరీరము లలో మూడు చోట్ల ధరించి ఉన్నారు ఎక్కడెక్కడ? వక్షో ముఖాంగేషు  శ్రీ -->లక్ష్మి ని (వక్షో ) గుండెల్లో పెట్టుకున్నాడు ఒకాయన వాణి (సరస్వతి) ని ముఖా , ముఖా అంటే సంస్కృతం లో నోరు అని అర్థం , కాబట్టి నోటి యందు నాలుక చివరన నిలుపుకున్నాడు ఒకాయన,  శరీరము (అంగేషు) లో సగ భాగం ఇచ్చాడు లేదా శరీరం ఇచ్చేశాడు పరమేశ్వరుడు పార్వతీ దేవి కి కాబట్టి ఈ మూడు శక్తులను తమ శరీరములో మూడు అవయములలో నిలుపుకున్న త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు సశక్తి యుతులై ఉన్నారు. ఇది నన్నయ్య గారి యొక్క ప్రార్ధనా శ్లోకం 




మనకి సంప్రదాయము అని ఒక మాట ఉంది, వేదం లో ఆచారము అని మనవి చేశాను.  పూజ చేసేటప్పుడు శక్తియుతుడైన పరమాత్మ కి చేస్తాం.  అందుకే రాముడికి కూడా రాముడిగా పూజ లేదు శ్రీ రాముడిగా  పూజ చేస్తాం. ఆ శ్రీ కరం తో కలవాలి, నారాయణు న్ని నారాయణుడిగా లక్ష్మి ని లక్ష్మిగా పూజ చెయ్యం మనం. అసలు లక్ష్మిని పూజ చెయ్యాలంటే ఆయన గుండెలమీద కూర్చొని ఉంటుంది. వాళ్ళు కలిసే ఉంటారు, ఈ సశక్తియుతం గా ఉండటం ఉన్నదే అది కుటుంబ జీవనాన్ని తెలియచేస్తుంది. అందుకే శంకర భాగావపాదులo తటి  వారు సౌదర్యలహరి చేస్తూ "ఆది కుటుంభీ" అని పిలిచారు ఈశ్వరుణ్ణి. ఆ నాటి నుండి ఈనాటి వరకు అలా కలిసి ఉండి సంతానా న్ని పోoదుతూ ఉండటమే. వారికి బిడ్డలు పుట్టారు వారి బిడ్డలకి బిడ్డలు పుట్టారు అలా వంశం తామర తంపరగా ఆచంద్ర తారార్కం వెళుతూనే ఉండాలి. ఒక పక్క గురు పరంపర వెళుతూ ఉండాలి ఒకపక్క వంశములు వెళ్తూ ఉండాలి తప్ప ఎక్కడో అక్కడ వంశము తంతువుగా ఆగా కూడదు. అలా వెళుతూ ఉండేటటు వంటి సత్ సంప్రదాయానికి నాంది పలికిన మా ఆరాధ్య దైవము లైనటు వంటి ముగ్గురు మూర్తులు ఉన్నారే వారు సశక్తియుతులు. ఆచార రహస్యాన్ని చెప్తున్నారు నన్నయ్య గారు. సనాతన ధర్మమూ యందు పక్కన శక్తి స్వరూపము లేకుండా ఉన్న పురుష స్వరూపం కాని పురుష స్పర్స లేని స్త్రీ స్వరూపం కాని మనం పూజ చెయ్యం. ఎప్పుడూ కూడా అమ్మవారితో కూడిన అయ్యని మాత్రమే పూజ చేస్తాం. అందుకే  శంకర భగవత్ పాదులు  ఒక అసుర సంధ్య వేళ ఒక నల్ల మద్ది చెట్టుకి అల్లుకున్న మల్లె తీగను చూసి, పరమశివున్ని ఆలింగనం చేసుకున్న పార్వతి దేవి గా దర్శనం చేసి స్తుతించారు.  శివా అంటే పార్వతీ దేవి.
"ఛి రాయ  దధ తో " ఎప్పటినించి ధరించారిలా , చాలా కాలం నించి,
ఇవాళ కలుసుకోవటం రేపు దెబ్బలాడుకోవటం ఎల్లుండి విడిపోవటం మన జాతి సంస్కృతి కాదు, ఈ జాతి
ఆచారం ఎప్పుడూ కలిసి ఉండడమే. ఒకసారి తాళి కడితే ఇక ఆ జన్మకి ఆమెయే భార్య ,ఒకసారి తాళి కట్టించుకుంటే ఆ జన్మ కి ఆయనే భర్త. ఇద్దరి మధ్య ఘర్షణలకు ఏయే ప్రాంతములు ఉంటాయో ,వాటియందు ఇద్దరు  రాజీ పడి జీవితాన్ని సమన్వయము తో రెండు బండి చక్రాలు కలిసిరధాన్ని నడిపినట్టు , నడిపించడమే తప్ప ఘర్షణ పడి విడాకులన్న మాట లేని ఒకేఒక జాతి ప్రపంచపటం లో ఒకే ఒక్క జాతి భారత జాతి.
"యే లోకానాం  స్థితి మావహన్త్య విహతాం " ఈలోకాన్నంతటి ని కూడా రక్ష చేసే ముగ్గురు మూర్తులు న్నారే  మా
తల్లు లైన తువంటి ఆ ముగ్గురితో కలిసి ఉంటారో వాళ్ళు  "స్త్రీపుంసయోగోద్భవాం " ఆ స్త్రీ పురుష యోగ కారణము చేత జనించి ప్రవర్తిల్లిన ఇంత మంది జనులు ఉన్నారు. కాబట్టి మా అందరికి వారు తల్లి తండ్రులు ముగ్గురిగా కనపడుతున్న ఒక్క పదార్థం ఉన్నదే అదే స్థి కర్త గ లయ కర్త గా ప్రళయ కర్త గా ప్రకసిస్తోంది. అదిగో అటువంటి ఆ స్వరూపానికి నమస్కారం చేస్తున్నాను.
"     తే వేదత్రయ మూర్తయ స్త్రిపురషా" వాళ్ళే వేదత్రయం గా ఈలోకంలో ఉన్నారు. వాళ్ళు  మాకు నిరo తర ము మాకు శ్రేయస్సు ను కలిపించు గాక. నాకు అనలేదు ఆయన. మహాభారతాన్ని ఆంధ్రీ కరించి నప్పుడు ఎవరు చదువు కోవడం మొదలు పెట్టారో, ఎవరు వినడం మొదలు పెట్టారో వాళ్ళందరికీ కూడా త్రిమూర్తుల యొక్క రక్ష కలుగు గాక. వారందరికీ లక్ష్మి పార్వతి సరస్వతుల యొక్క అనుగ్రహము కలుగు గాక. బ్రహ్మ  విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగు గాక కాబట్టి మాకు అంటూ "పురుషోత్తమా మ్బు జభవ శ్రీ క న్ద రా శ్శ్రే యసే"
పురుషోత్తముడు అన్న మాట శ్రీమహ విష్ణువుది "మహా దేవుడు అన్న మాట పరమ శివునిది "అమ్భుజ భవ "
అంటే  తామర పువ్వులోనించి పుట్టినవాడు  బ్రహ్మ దేవుడు 
"శ్రీ క న్ద రా శ్శ్రే యసే" శ్రీ అంటే విషము కన్ధరా అంటే కంట మునందు  పెట్టుకున్న వాడు కంటమ్ము నం దు  హాలాహ లం పెట్టుకున్న పరమ శివుడు మాకు సమస్త అభ్హ్యున్నతులను కృప చేయు గాక. 
అంటూ ప్రారంభం చేసి రాజరాజ నరేo ద్రుడు  మీద ఒక పద్యం చెప్తున్నారు.  కాదు కాదు మనకి ఇందులో ఒక చమత్కారం ఉంది మనకి సాహిత్యమూ అంటే భగవన్నామ స్పర్స లేని సాహిత్యం ఏది ఉందొ,ఆ సాహిత్యాన్ని మనవాళ్ళు అంగీకరించరు. అందుకే పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ఒక మాట అంటారు "ఎంత గొప్ప గొప్ప శబ్దాలు వేసిన, ఎంత గొప్ప అర్థాలు ఉన్నారచన చేసినా , పరమేశ్వరుని గురించి చెప్పనటువంటి  సాహిత్యం ఏది ఉందొ , భగవత్ భక్తీ ని ప్రభోదం చెయ్యనిది ఏది ఉందొ అది  నిర ర్థ కము, అది తద్దినం పెట్టిన రేవులకి కాకులు వెళ్లినట్టు వెళ్ళే వాళ్ళకి పనికివస్తుందేమో కానీ , హరినామ స్మరణం . హంసలు మానస సరోవరానికి వెళ్లి తామర తూళ్ళు తిని ఆడుకున్నట్టు హరినామ స్మరణ చేసినకావ్యములు ఎవరు చదువు కుంటారు అంటే హరి చేరుకోవటానికి కుతూహలం ఉనవాళ్లు చదువు కుంటారు.
వ్యాస భగవానుడు చంద్రవంశాన్ని వర్ణిచాడు మహా భారతం లో,వాల్మికి మహర్షి సూర్య వంశాన్ని వర్ణి చారు రామాయణo లో సూర్య వంశాన్ని, చంద్ర వంశాన్ని వర్ణి చి మనకి ధర్మాన్ని నేర్పినటు వంటి వారు వారిద్దరు. సూర్య చంద్రులను ప్రస్తుతి చేసినటువంటి వ్యాస వాల్మీకులు మన సాహిత్యా న్నంత కూడా రెండు కాళ్ళ లాంటి వారు.
అందుకే వ్యాస భగవానుడిని వాల్మీకి ని స్తుతి చేయకుండా ఎటువంటి ప్రసంగాన్ని చెయ్యరు. కాబట్టి నేను చంద్రవంశాన్ని వర్ణన చెయ్యబోతున్నాను, వ్యాస భగవానుడు అందించిన చంద్రవంశం అది. కాబట్టి చంద్ర సంబందమైన కీర్తన కూడా చెయ్యాలి, అందుకని రాజ రాజ నరెంద్రున్ని అడ్డు పెట్టుకుని "రాజ "శబ్దం చంద్రున్ని చెప్తుంది.
          శ్లోకం యొక్క అర్థము

చాళుక్య వంశానికి చెందిన రాజ రాజ నరేంద్రుడు మనం ఇప్పుడు రాజమండ్రి అని పిలుచుకునే రాజమహేంద్రవరాన్ని రాజధాని గా చేసుకుని  పరిపాలన చేసేవాడు ఆయన్ని స్తోత్రం చేస్తూ  "రాజ కులైక భూషణుడు " రాజులు అనిపిచుకున్న వాళ్ళందరిలో కూడా గొప్ప వాడిగా కీర్తింప బడినవాడు కాదు
"రాజ కులైక భూషణుడు" అనునది పైకి చంద్రుడికి సమన్వయం. "రాజ మనోహరుడు " రాజులందరికీ కూడా చాలా మనోహరమైన స్థితి ని పొందినటు వంటి వాడు  "అన్య రాజా తేజో జయ శాలి శౌర్యుడు"  మిగిలిన రాజులందరిని కూడా జయించినటువంటి వాడు, గొప్ప శౌర్యo కలిగినటువంటి వాడు రాజరాజ నరేంద్రుడు "విశుద్ధ యస్సస్సరదిం దు చంద్రికా రజిత సర్వలోకుడు " శరత్ కాలం లో ఉండేటటువంటి చంద్ర బింబాన్ని పరిణిత  చంద్రుడు అని పిలుస్తారు, బాగా ప్రకాశవంతం గా ఉంటుంది వెన్నెల తోటి. అటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో, రాజులందరి లో రాజ రాజ నరేంద్రుడు అంత గొప్ప వాడు. "అపరాజిత భూరిభుజా  కృపాణ ధా రాజల శాంత శాత్రవ పరాగుడు " ఆ రాజ రాజ నరేంద్రుడు పట్టుకున్నటువంటి ఖడ్గ రక్త ధారల చేత శత్రువుల యొక్క ఉద్రేకమనేటటువంటి ధూళి అణిగి పోయినటువంటి వాడు. ధూళి రేగిపోయి ఉందనుకొండి, వర్షం  పడిందనుకోండి ఆ ధూళ అంతా అణిగిపోతుంది. శత్రువులైన రాజులు లేస్తూ ఉంటే రాజరాజ నరేంద్రుడు కత్తి పట్టుకొని యుద్ధ భూమికి వెళ్లి ఆ కుత్తుకలు తెగటార్చి, నేల రాలి పోయేలాగా శత్రువు లందరినీ ధునుమాడితే, ఆ కత్తి నుండి నేల రాలిన నెత్తుటి ధారల చే ధూళి అయినటువంటి శత్రువులని  అ ణి గేల  చేయ గలిగిన పరాక్రమ శాలి అయిన రాజ రాజ నరేంద్రుడు "రాజమహోన్నత్తిన్ " అటువంటి వాడు రాజరాజు అని కీర్తించి



"విమలాధిత్య తనూజుడు
విమల విచారుడు గుమార విద్యా ధరుడు
త్తమ చాళు క్యుడు వి వి ధా
గమవి జి త శ్ర ముoడు తు హినకరు డురు కాంతిన్"


చంద్రుణ్ణి చుస్తే ఎంత సంతోషం కలుగుతుందో ఆయన శరీర కాంతి చేత, రాజ రాజ నరెంద్రున్ని చుసిన వారికి కూడా అంత సంతోషం కలుగుతుందిట. ఆయన  విమలదిత్యుడికి కుందమాంబ అనే స్త్రీ కి కలిగినటువంటి వాడు. చాలా పరిశుద్ధ మైన ఆచారము కలిగిన వాడు. సుబ్రమణ్యుడు దేవసేన కంతటికీ అధిపతి అయ్యి రాక్షసులని ఎలా ధునుమాడ తాడో ఆ విధం గా,అటువంటి పరాక్రమము కలిగి, శాస్త్ర అస్త్ర నైపుణ్యం కలిగిన వాడైన వాడు. లేదా   సుబ్రమణ్యుడి  ఆరాధన ము యందు  నిష్ణాతుడై న వాడు. చాళుక్యులు గొప్ప శివ భక్తులు. అనేకమైన ఆగమములు తెలిసి ఉన్నటు వంటి వాడు. అటువంటి రాజ రాజ నరేంద్రుడు ఒకాను కోక నాడు  సభలో గొప్ప గొప్ప పండితుల్ని , కవుల్ని కూర్చోపెట్టుకొని వారితో మాట్లాడుతూ ఉండగా  సంసృతం లో ఉన్నటువంటి భారతం గురించి ప్రస్తావన వచ్చింది. ఆయన కి భారతం వినటం అంటే చాలా ఇష్టం , అందుకని తరచూ భారతం లో ఉండేట టు వంటి విశేషాలన్నీ వింటూ ఉండేవాడు. భారతమే కాదు రామాయణాది కావ్యాలు కూడా వినేవాడు.  ఆయన నన్నయ్య గారిని పిలిచి నన్నయ్య గారితో ఒక మాట అన్నాడు.  భారతం లో నన్నయ్య గారి గురించి మనకి తెలియటానికి అదొక్కటే పద్యం అది వినా నన్నయ్య గారి గురించి తెలుసుకోవటానికి సాధికారిత తో కూడిని వేరే ఇతర పద్యములేవి ఇక మనకు కనపడవు.
       

"తనకుల బ్రాహ్మణు ననురక్తు నవిరత
                జప హోమ తత్పరు విపుల శబ్ద
          శాసను సంహితాభ్యాసు బ్రహాండాది
               నానా పురాణ విజ్ఞా న నిరతు
         బాత్రు నాపు స్తంబ సూత్రు ముద్గల గోత్ర
              జాతు సద్వినుతావ దాత చరితు
         లోకజ్ఞను భయ భాషా కావ్య రచనాభి
               శోభితు సత్ప్రతిభాభి యోగ్యు
నిత్య సత్య వచను మత్యమరాధిపా
చర్యు సుజను నన్నపా చర్యు( జూచి
పరమ ధర్మ విధుడు వర చాళుక్యా న్వ యా
భరణున్ డిట్టులనియె గరుణ తోడ "

పండితులలో నన్నయ్య గారిని చూసాడు, నన్నయ్య గారికి ఉన్న  లక్షణములు చెప్తున్నారు.  ఆయన కుల బ్రాహ్మణుడు, కుల బ్రాహ్మణు డు అంటే రాజుగారి దగ్గర పులోహిత్యం చేస్తూ వచ్చిన పరంపర బ్రాహ్మణుడు అనే అర్థమే కాదు. ప్రభువు ప్రకటించిన శాసనములను సంస్కృతం లో రచన చేసి అందించ గలిగే దిట్ట అయినటువంటి వాడిని కూడా కుల బ్రాహ్మణుడు అనే పిలుస్తారు. కాబట్టి అలాంటి శక్తి కలిగినటువంటి కుల బ్రాహ్మణుడు. నిరంతరమూ జపం చేస్తూ ఉంటాడు , హోమం చేస్తూ ఉంటాడు. హోమము చేత దేవతల ప్రీతి కల్పిస్తూ  ఉంటాడు. మాత్రముల చేత ఆయా మంత్రాధి స్టా న దేవతలను అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాడు. విపుల శబ్ద శాసనుడాయన,
ఏ శబ్దానికి ఎన్ని అర్థములుంటాయో, ఏ శబ్దాన్ని ఎలా ప్రయోగించ్చచో, ప్రయోగించి ఆ ఫలితాన్ని సాధించుకోవచ్చో, అందరికి అర్థం అయ్యేటట్టు చెప్పచ్చో , బాష మీద , శబ్దం మీద ప్రభుత్వం ఉన్నటువంటి వాడు. అనేకమైనటువంటి పురాణములను , అష్టాదశ పురాణములను సమగ్రం గా చదువుకున్నవాడు. ఆపస్తంబ సూత్రముల యందు పుట్టిన వాడు, ముద్గల గోత్రమునందు జన్మిచిన వాడు, పెద్దల చేత గౌరవి o ప బడిన వాడు. లోక జ్ఞానం కలిగిన వాడు. సంకృతాంధ్ర భాషల యందు మహా పండితుడు. గొప్ప విద్ద్వత్తు కలిగిన వారందరి చేత కీర్తింప బడిన వాడు,  ఇన్ని ఉండి కూడా పరమ వినయం తో విధేయత తో భగవత్ భక్తి తో నోరు విప్పితే ఎన్నడూ అసత్యము పలుకక సత్యమును మాత్రమే పలికే వ్రతమున్న వాడు , దేవతలకి గురువైన బృహస్పతి ఎటువంటివాడో , ఈలోకం లో రాజరాజ నరేంద్రుడి దగ్గర ఉన్నటువంటి భూలోకం లో బుద్దికి బృహస్పతి వంటివాడు . అటువంటి నన్నయ్యాచార్యుడు ని చూసి పిలిచి  ఒక నమస్కారం చేసి , మహానుభావ నన్నయ్య , నీవంటి ప్రాజ్ఞుడు జన్మించడ యా , నీయొక్క గొప్ప త నా న్ని  మేము ఉపయోగించుకోవాలి. అటువంటి ప్రభువులు ఉన్ననాడు కదా జాతి కి అందేది ఇటువంటివి. అటువంటి జ్ఞానులు ఉన్నాకూడా ,ప్రభువులు గుర్తించ గలిగే వారు లేకపోతే కూడా సాలగ్రామాలు కూడా రాల్లలోనే ఉండిపోతాయి. వాటిని చుసేదేప్పుడు, శుద్ధి చేసేదేప్పుడు , వాటికి పూజ చేసేదెప్పుడు, వాటి అనుగ్రహాన్ని నువ్వు పొందగాలిగేదేప్పుడు.  కాబట్టి ఆ రాజు పిలిచి అన్నాడు మహానుభావా నీకు నాకు ఇస్తమైనవెవొ  తెలుసు. నీవు నాకు కుల బ్రాహ్మణుడవు . ఇవాళ్ళ నేను నీకు కొత్తగా చెప్తున్నానని నువ్వు అనుకోవక్కర్లేదు. నాకు ఇష్టమైనవి ఈ లోకంలో 5 ఉన్నాయ్. ఆ 5 నాకు ఇస్తామని నీకు చెప్తే అది నిజ మే నా అ ని  నువ్వు  శ o కిం చ వలసిన  అవసరం లేదు. నీకు బాగా తెలుసు నా నడవడి అంతా ను. రాజ రాజ నరేంద్రుడు చెప్పుకుంటున్నాడు. నాకు 5 ఇష్టం అని. అయిదు చెయ్యాలని ఎప్పుడూ నా  మనసు ఉవ్విళ్ళు రుతుంది. ఒక్కసారి చేసినా కుడా మళ్ళి మళ్ళి చెయ్యాలనిపిస్తుంది. ఈ భూమి యందు దేవతల వంటి బ్రాహ్మణులు కనపడ్డప్పుడు వాళ్ళ ని సేవిo చా లని, వాళ్ళకి నమస్కరించాలని నా మనసు వేమ్పర్లాడుతూ ఉంటుందయ్యా. భారతం ఎన్నిమాట్లు  విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంటుం ది. నిజమో అబద్ధమో నన్నయ్య గారికి తెలీదూ, రోజూ వినటం లేదూ.  అది నిజం అని నన్నయ్య గారికి తెలుసు. అందుకు కదూ భారతాన్ని ఆంధ్రీ కరించిoది. నన్నయ్య గారికి అటువంటి శక్తి ఉన్నా, అటువంటి కోర్కె ఉన్న రాజు పుట్టద్దూ!! అందుకని రాజ రాజ నరెంద్రున్ని తక్కువ చెయ్యద్దు అంటున్నాను.
ఎంత గొప్పగా చెప్పాడంటే  " పార్వతీ పతి " పూజ మళ్ళి మళ్ళి చెయ్యాలనిపిస్తుందయా నన్నయ్య , ఏమిటో నాకు పార్వతీ పతి  పూజ అంటే అంత ఇష్టం. అంటే ఆయన విష్ణు ద్వేషి కాదు. ఆయన కి శివుని యందు అనురక్తి అంతే కాని ఆయన విష్ణు ద్వేషి కాదు. ఎప్పుడూ దానం చెయ్యాలని పిస్తుంది.  ఉండడం ఒక ఎత్తు, దానం చెయ్యాలని ఉండడం ఒకెత్తు. సాధారణం గ ఉండడం అన్న విషయం లో లక్ష్మి విషయం లో ప్రారబ్దం ఏమిటంటే, దాచు కుందా o
అనే ఉంటుంది తప్ప ఇద్దాం అని అనిపించదు. అసలు శాస్త్రం లో పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి,దేనికి దాచుకుంటాడని అడగండి నాకే ఉండాలని దాచుకుంటాడు, అసలు పిచ్చాడై  అలా దాచుకున్నది నీకు రాదు, మీ బిడ్డలకి వెళ్ళిపోతుంది , గుటుక్కున ఊపిరి ఆగిపోతే, నీకే ఉండాలo టే  నువ్వు దానం చేస్తే నీ ఖాతా లోకొస్తుంది. అంటే అంతా ఇచ్చేయ్యమని చెప్పరు. కనీసం ఎవడికి తోచింది వాడు దానం చెయ్యక పోతే ఎలా ఉత్తర జన్మలలో?
నువ్వు దాచింది నీతో రాదు, నువ్వు ఇఛుకున్నదెదొ అది నీతో వస్తుంది. అందుకే దానం చేసేటప్పుడు కొడుకు ని దగ్గర పెట్టుకోమ్మన్నారు, పెద్దలకి సుసృష చేసేటప్పుడు తల్లి కూతుర్ని దగ్గర పెట్టుకోమ్మన్నారు, తల్లిని చూసి పెద్దలకి సుసృష కూతురు నేర్చుకుంటుంది. తండ్రి దానం చూసి , ఓహో నాన్నగారిలా ఇలా బతకాలన్న మాట అని కొడుకు నేర్చుకుంటాడు.కాబట్టి రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు " సాధు పురుషులైన వాళ్ళు ఉంటారే పరమ భక్తి తత్పరులు , వాళ్ళ తో స్నేహం కోరుకుంటా నయ్య , వాళ్ళతో నేను దగ్గరగా ఉండాలని వాళ్ళతో చనువుగా ఉండగాల్గాలని , వాళ్ళ పక్కన తిరగగల చొరవ నాకు నిలబడాలని నేను కోరుకుంటాను". ఎందుకు కోరుకోవడం, దాని యందు వేరొక ప్రయోజనం కోరి కాదు, ఆయన ఆ సత్పురుషుడు అంకుశం లాంటి వాడు మనమో ఏనుగు తొండం లాంటి వాళ్ళం, ఎనుగుతోండం ఎప్పుడూ నిలకడగా ఉండదు.  ఇలా వెడుతూ పూల కొమ్మ లాగుతుంది,మావటి ఏమి చేస్తాడంటే అంకుశం పట్టుకుని ఆ తొండం మీద ఇలా అంటాడు. అంటే మళ్ళి తొండం కిందకి దింపేస్తు oది. సత్పురుషుని తో స్నేహం ఎటువంటిదో తెలుసాండి ,రామకృష్ణ పరమహంస చెప్పిన మాట అంకుశం పట్టుకున్న మవటిని పక్కన పెట్టుకోవటం వంటిది. ఆయన తో కలిసి ఉంటె ఆయన జీవన విధానం మీకు తెలిసి ఉంటుంది, తెలిసుండి ప్రయోజనం ఏమి ఉండదు, ఆయన జీవనం ఎలా సాగించాలను కుంటున్నారో దానికి తగినట్టు మీ జీవితం  ఉండాలి. ఆయన జీవన శైలి ని  పుణి కి పుచ్చుకోవాలి, అంతే తప్ప ఆయనకి మనం ప్రతి భందకం కాకూడదు. పక్కన ఉన్న వాళ్ళంతా శిష్యులని అనుకోవలదు. ఎక్కడో ఉన్నా ప్రేరణ పొంది, జీవితాన్ని మలచుకుoటే వాడు మహానుభావుడు. నాకు ఈ అయిదు ఇష్టం, కాబట్టి నన్నయ్య నేను ఒక్క కోరిక కోరుకుతున్నాను, నువ్వు మహానుబహుడవు , నిరంతర జప హోమ తత్పరుడవు , నాకోసం నువ్వు ఒక ఉపకారం చెయ్యాలయ్యా.  భారతాన్ని ఆంధ్రీకరించాలి, ఏమయ్యా మిగిలినవి ఆంధ్రీకరించమని అడకకుండా ఒక్క భారతాన్నే ఆంధ్రీకరించాలని అడుగుతున్నవే మీ  అని అడుగుతావేమొ,
మీరు ఒక గోవుని దానం చేస్తే నూరు గోవుల్ని దానం చేసినట్టు లెక్కలో వేస్కుంటారు. అందుకే గోదానం పుచుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పక్కకి వెళ్లి జపం చేస్కుంటారు, ఎందుకంటే వాళ్ళకి వంద గోవులు పట్టిన ఫలితం వాళ్ళ ఖాతా లో పడకుండా ఉండడం కోసం, అప్పుడు వాళ్ళకు ఆ ఒక్క గోవు పుచ్చుకున్న ఫలితం వాళ్ళకి వేస్తారు ఆ మంత్ర జపం చేస్తే ఇచిన్న వాడికి మాత్రం నూరు గోవుల కిందే లేక్కపెట్టేస్తారు. భారతం లోనే అనుశాసన పర్వం లో ఉంది పరమేశ్వరుడు గోవులకు ఉత్కృష్ట స్థితిని ఇచ్చాడు. ఆయన తన మూడో కంటి లోని తేజస్సు కొంత తీసి కొన్ని గోవులయందు ప్రవేశ పెట్టాడు, ఆ గోవులు గోరోజన వర్ణాన్ని పొందాయి, అంటే పూర్తి ఎర్రటి ఎరుపు కాదు, కొద్ది ఎరుపు రంగును పొందుతాయి, వాట్ని  కపిల  గోవులు అంటారు , ఒక్క కపిల గోవు దానం చేసినా , సేవ చేసినా , అరిటిపండు పెట్టినా చాలా సంతోషం. రాజ రాజ నరేంద్రుడు అంటున్నాడు ఇక్కడ సరిఅయిన గోవు దొరకటం కష్టం కాదు కాదు కపిల గోవు దొరకాలి , అది ఎటువంటి కపిల గొవై ఉండాలి, గొప్ప పొదుగు కలిగి ఉండి , ఇలా శిరములు ముట్టుకుoటే పాలు కారేటట్లు ఉండాలి, అది విపరీతం గా పొడిచే ఆవు కాకూడదు, చక్కటి ధేను వై  ఉండాలి సాధు గొవై ఉండాలి, చూడ ముచ్చటగా ఉండాలి, ఇప్పుడు ఆవు పాల కాచి తోడుపెట్టుకొని, పెరుగు తినే వాడై ఉండకూడదు, పరమ సంతోషం తో ఆ ఆవు పాలు చేత పట్టుకుని పరమేశ్వరుడి కి అభిషేకం చేస్కుని రమించి పోయేటటువంటి వేద వేదాంగములు చదువు కున్న బ్రాహ్మణుడు దొరకాలి, అటువంటి బ్రాహ్మణుడు ఎందుకు దానం పుచుకుంటాడు, అయన తన ఇంట అభిషేకం చేస్కోవటానికి ఒక గోవు ఉంటె బావుండు, రోజూ ప్రదక్షణం చేస్కోవటానికి ఒక గోవు దొరికితే బావుండు అని అనుకునే వేద వేదాంగములు చదువుకున్న బ్రాహ్మణుడు దొరకాలి అప్పుడు నువ్వు దానం చెయ్యాలి, దేశము కాలము నీదగ్గర పుచ్చుకునే వాడు ఇవ్వడానికి గోవు ఇన్ని కలిసి రావాలి కాని ఒకవేళ అటువంటి గోవు దొరికిన ,గోవుని దానం చేయ్యకలవేమో, ఆ బ్రాహ్మణుడు ఈలోపాల వేరొకని దగ్గర గోవు ని పుచ్చుకోని  చాల o డి నాకెందుకు ఇన్ని గోవులు నేను పెంచుకోలేను మహాప్రభో నాకు అక్కర్లేదు అంటదు. నువ్వు ఇంకా తరించాలి అనుకుంటే ఆ ఆవు కొమ్ములు ఎంత పరిమాణం లో ఉంటాయో వాటికి తగిన శుద్ధ  మై న  బoగా రం  తో నువ్వు ఆ గోవుకి అలంకారములు చేయించాలి, వాటి డేక్కల కి బంగారపు తొడుగులు చేయించాలి. వాటి కొమ్ములకి గిట్టలకి బంగారు తొడుగులు చేయించి ఒక వేద వేదాంగములు చదువుకున్న బ్రాహ్మణుని కి దానం ఇస్తే ఫలితమో మహాభారతాన్ని విన్న వాడికి అంత ఫలితం.  బాగా  మగ్గిన కొతపల్లి మామిడిపండు తేనె జాడి లో పడినది తినటం ఎంత తేలికో మహాభారత శ్రవణం చెయ్యటం అంత తేలిక. ఇంత కన్నా తరించే మార్గం ఉందా, అంత ఫలితం ఇస్తారయ్య, అటువంటి మహా భారతం సంస్కృతం లో ఉంది కాని ఆధ్రమ్ లేదు. కాబట్టి మహానుభావా ఇంతటి మహా ఫలితాన్నిచ్చే మహాభారతాన్ని ఆంధ్రీకరించాలి అన్నాడు రాజ రాజ నరేంద్రుడు.
అప్పుడు నన్నయ్య గారు అంటారు ఆకాశం లో ఉన్నటువంటి నక్షత్రాలు అన్నింటిని తప్పు లేకుండా లెక్కపెట్టు,
ప్రతిరోజూ రాత్రి లెక్కపెట్టి, బ్రతికున్నన్నళ్ళు  లెక్కపెట్టి , కచ్చితం గా లెక్క చెప్పగలవా , చెప్పలేవు, అలా వేదముల యొక్క శాస్త్రముల యొక్క సమస్త సారా న్ని నేను పొందేస్తా ను అంటే అవుతుoదా తేలిగ్గా , బుద్ధి బలం అనే చేతులతోటి మహా సముద్రమైన భారతాన్ని ఈదుతానూ అంటే కుదురుతుందా, నాకేదో  కావన  శక్తి ఉండొచ్చు   నాకేదో బాష మీద ప్రభుత్వం ఉండొచ్చు, అయితే మాత్రం మహా భారతం అనే సముద్రాన్ని నేను ఈద గలనా రాజరాజనరేంద్ర , నావల్ల కాదు అని నేను ఊరుకుంటున్నాను అని నువ్వు అనుకున్తున్నవేమో చత్రుముఖ బ్రహ్మ కైనా సాధ్యమా అంత గొప్పదయ్య మహాభారతం, చతుర్ముఖ బ్రహ్మ గారే చెప్పగలడా అన్నారంటే అటువంటి మహా భరతన్ని నిర్మాణం చేసిన వేదవ్యాసుడు ఎంత గొప్పవాడై ఉండాలి. అయిన నేను ఆంధ్రీకరిస్తాను ఎందుకో తెలుసా, ఒక్క కారణానికి , నా వల్ల కాదు అని ఇలా తల వంచుతాను , నేను ఎవరిముందు అయితే తల వంచుతానో, వారి పనిముట్టు గా నన్ను అంగీకరించారా జరిగిపోతుంది అంతే కధంతా, నేను చేస్తున్నాను అంటే కదా నాకు సమర్ధత , ఎవరు నన్ను స్వీకరిoచాలో  వారు నన్ను స్వీకరించాక ఇంకెందుకు నడవదు. కాబట్టి నేను ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను. నేను పరమ శివునికి, విష్ణువుకి , బ్రహ్మ గారికి , విగ్నేస్వరుడికి , సూర్యుడికి , ఆరు ముఖములు ఉన్న సుబ్రహ్మణ్యేస్వర స్వామి కి ,లక్ష్మీ దేవికి , సరస్వతి కి , పార్వతీ దేవికి, దేవతల అందరికి తల వంచి నమస్కరిస్తున్నాను, వీళ్ళందరికీ నమస్కరించి , పద్య విద్య కి ఆది అయిన వేరొక మహా పురుషుడికి నమస్కరిస్తున్నాను,ఎవరో తెలుసా ఆయన ప్రచేతసను కుమారుడై రామాయణ కావ్యాన్ని లోకానికి అందించిన వాల్మికి మహర్షి
 యొక్క పాదరవిన్దములకు నమస్కరించి, సూర్య వంశాన్ని వర్ణించి రామాయణ లోకానికి ధర్మ ప్రభోదంచేసిన చేసిన వాల్మీకి మహర్షి కి నమస్కరిస్తున్నాను అన్నారు. పద్య విద్య అన్నారు,  మనకి  ఛందస్సు ఒక అద్భుతం ఇది   ఇతర భాష లకి లేదు, సంస్కృతానికి , తెలుగుకి మన భాష లేకె ఇటువంటి మర్యాద ఉన్నది. ఛందస్సు పద్యం గా వస్తే మీరు ధారణ చెయ్యవచ్చు, మీరు వాక్యముల కింద ఎన్ని వాక్యములు రాసినా ధారణ చెయ్యలేము. నాలుగు మట్లు పద్యాన్ని చదివితే వచ్చేస్తుంది పద్యం మీకు, పది మాట్లు వాక్యం విన్నా అది యథా తధం గా చెప్పలేము.  భారతం కిరణముల చేత చీకటిని పారత్రోలిన మహానుభావుడైన పరసరమహర్షి కి  కుమారుడైన వేదవ్యాస భగవానుడి
పాదరవిన్దములకు నమస్కారం చేస్తూ నేను భారతమును ఆంధ్రీకరించుట ప్రారంభం చేస్తాను. రాజరాజ నరేంద్ర నీ కోర్కె తీరనున్నది అని చెప్పి మొదటి ఆశ్వాసము మొదలు పెట్టారు  ఆదికవి నన్నయ్యగారు.


Thursday, April 17, 2014

ఆదిపర్వము 1


  శుక్లామ్ భర ధరం విష్ణుం సే సి వర్ణం చతుర్భుజం
  ప్రసన్న వధనమ్ ధ్యాయేత్ సర్వ విగ్నోప శాంతయేత్  !!

వేదవ్యాసభగవానుడు ఈ జాతికి సూర్యుని వంటి వాడు.  నన్నయ్య గారు ఆయన ని వర్ణ న చేస్తూ, ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ అదే మాట అంటారు,సంసారమనే టటువంటి చీకటి ని తొలగ తోయగాలిగి నటువంటి వాడు, ధర్మోప దేశం చేయ్యగాలిన వాడు, పురుషార్ధ సమన్వయాన్ని ఈ జాతికి అందించినటువంటి వాడు, వేదాన్ని విభాగం చేసినటువంటి వాడు, 18 పురాణములను ఈ జాతికి అందించినటువంటి వాడు, పంచమ వేదమైనటువంటి భారతాన్ని అందించిన వ్యాస భగవానుడు లేని నాడు, మొత్తం అంతా కటిక  చీకటి, అటువంటు మహానుభావుని యొక్క ఉచ్చిస్టమే  సమస్త వంగ్మయము. అటు వంటి మహానుభావుని యొక్క స్పర్శతో కూడుకున్నదై కేవలము ఆయనచేత రచింపబడినదే కాక మహాభారతం లో అనేక ఘట్టాలలో వేదవ్యాసుడు స్వయం గా మనకి కనపడతారు,
ఆయన కూడా ఆ కధా గమనమునందు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి గా నిలిచారు. భారతము యథార్థముగా జరిగినది.  ఇతిహాసము "ఇతి హా అసము" ఇది ఇలాగే జరిగినది, ఇది ఇంకొకలా జరిగినది కాదు. ఇలా జరగలేదని నువ్వు అనుకుoటు న్నా వేమొ, కాదు కాదు ప్రతి అక్షరము ఇందులో ఎలా  చెప్పామో అలాగే
జరిగినది.కాబట్టే శ్రీరామాయణ రచన యందు వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి, ఆ కధా గమనం లో ఆయన కూడా తనవంతు ఆ వ్యక్తిత్వాన్ని అందులో పోషించి కధకి పూర్ణత్వాన్ని సాధించి పెట్టారు, అలాగే మహాభారత రచన చేసినటువంటి వేదవ్యసుడే మహాభారత కధా గమనంమందు కూడా ఒక గొప్ప స్థితి ని పొంది ఎప్పుడెప్పుడు కధా గమనము వైక్లవ్యము ను పొందు తుందో, అప్పుడప్పుడు  ధార్మికం మైనటువంటి  స్థితిలో మళ్ళి ఆ వంశముల కొనసాగింపులకి, ధర్మం నిలబడడానికి తనదైనటువంటి కృషి తనదైన సహాయం అందజేస్తూ ఒక వ్యక్తి గా కధా గమనం లో నిలబడినటువంటి స్థితి.
అందుకే వేద వ్యాస భగవానుడు లేని నాడు మహాభారతం కాదు, వేద విభాగములు కాదు, అష్టా దశ పురాణములు  కాదు, బ్రహ్మ సూత్రములు కాదు, ఇవేవి అందేటటువంటి అవకాశం లేదు. అందుకే గురు పూర్ణిమ అన్న పేరు తో ఆషాడ శు ద్ద పూర్ణిమ నాడు వ్యాస భాగావనుడ్ని మనం అందరం పూజ చేస్తాం.
అటువంటి మహానుభావుడై నటువంటి వ్యాసుడు, సంస్కృతం లో మహాభారతాన్ని ఇచ్చారు.
'మహాభారతం' అన్న మాట ఒక్క భారతానికి మాత్రమే అన్వయం. రామాయణానికి కానీ భాగవతానికి కానీ ఈ మహాత్ శబ్దాన్ని ప్రయోగం చెయ్యరు. ఎందు వలన అంటే భారతం అనే మాటలోనే  భారము అన్న మాట నిక్షేపింప బడి ఉన్నది. గ్రంధము శ్రీ రామాయణం కన్నా భాగవతం కన్నా విస్ప్రుతి పొందినటువంటి స్థితి ఉంటుంది. అనేకమైనటువంటి శ్లోకాలు నూరు వెయ్యి శ్లోకాలతో కూడుకున్నటువంటి మహోత్క్రు స్ట మైనటు వంటి ఇతిహాసము మహాభారతం, బరువు కి సంబందినంత వరకు అలాగే ఉంటుంది. 18 పర్వాలు. పర్వము అంటే కణుపు అని ఒక అర్థం. 18 పర్వములతో కూడుకున్నదై, కొన్ని వేలమంది వ్యక్తులు ఇందులో కనపడుతూ ఉంటారు.  ఎన్ని ఆఖ్యనములో ఎన్ని ఉపఖ్యనములో ప్రతి చిన్న విషయాన్నీ కూడా ఎక్కడా విస్మరించ కుండా అందచేస్తాడు వ్యాస భగవానుడు. ప్రతి దానివెనక ఒక్కటే ఆయన యొక్క ఉద్దేశ్యం స్పష్టం గా కనపడుతూ ఉంటుంది, ఈ జాతికి ధర్మాన్ని అందించాలి. భారతం అన్న గ్రంధం వెనుక ఉన్న విశేషం అదే.  అది భాహ్యo లో ఎంత పెద్ద గ్రంధమో లోపల సారాన్ని పరిశీలనం చేసినప్పుడు కుడా అంత పెద్ద గ్రంధమే. అందుకే పెద్దలైనటువంటి వారు ఒక మాట అంటూ ఉంటారు "అసలు మహాభారతం వినని వాడు, మహా భారతం చెప్పని వాడు , మహా భరతం చదవని వాడు విధ్వంసుడే కాడు ". ఎందుచేత అంటే వేదము ఎంత గహనమైనదో, వేదము స్వరం తో ఆ మంత్రాన్ని నేర్చుకోవాలి
ఆ ఉధర్త అను ఉధార్త స్వరః స్వరముతో గురువుగారిదగ్గర కూర్చొని గురుముఖతగా నేర్చుకున్నటు వంటి 
 వేదమంత్రములలో నిక్షేపింప బడినటువంటి అర్థాన్ని తెలుసుకుని స్వరం తో కూడిన మంత్రముల చేత ఈశ్వరుని ఆరాధన చేసి భక్తితో కూడిన కర్మచారణము వలన ఈస్వరానుగ్రహమును పొంది తత్కారణము చేత జ్ఞానము కలగడం చేత అద్వైత సిద్ధి ని ఇక్కడే పొందడానికి అనువైనటువంటి స్థితిని కల్పించ గలిగిన వేదo ఎంత గొప్పదో ,
ఆ వేదముతొ సమానమైన స్థాయి లో వ్యాస భగవానుడు పంచమ వేదంగా మహాభారతాన్ని ఈలోకానికి అందించారు .
మహా భారత ప్రయోజనము కానీ రామాయణ ప్రయోజనము కానీ భాగవత ప్రయోజనం ఒక్కటే ధర్మాన్ని అందించాలి.
మహాభారత గ్రంధం ఇంట్లో ఉండటమే గొప్ప, మహాభారతాన్ని ముట్టుకోవటమే గొప్ప ,
మహాభారతం చదవడం గొప్ప ,అసలు మహా భారతం వినడం ఎంత గొప్పదో , ఎందుకు మహాభారతాన్ని ఆంధ్రీ కరింప బడాలని తాను అంతగా వేమ్పర్లాడు తున్నాడో రాజ రాజ నరేంద్రుడు నన్నయ్య గారికి చెప్పిన ఘట్టాని చదివితే అటువంటి మహా పురుష జననo జరిగి ఉండి ఉండక పోతే ఈ మహాభారతం ఆంధ్రీ కరింప బడి ఉండేది కాదు కదా , మహాభారతం కవిత్రయం ఆంధ్రీకరిస్తే మధ్యలో కొన్ని వందల సంవత్సరాలు కాళి ఆ జాగా ఏర్పడినా కూడా పరమేస్వరాను గ్రహం గా దాన్ని ఆంధ్రీ కరింప చెయ్యాలనేటటు వంటి కృత నిశ్చయం కలిగినటువంటి రాజులు కాల క్రమం లో ఎప్పుడో ఒక సారి తళుక్కున ప్రభవించడం, అటువంటి రాజు ఉన్నపుడే అటువంటి గొప్ప కవి కూడా ఈశ్వరానుగ్రహం గా రావడం దేశ కాలములు సమకూడి నన్నయ్య ,తిక్కన, ఎర్రాప్రగడ ముగ్గురు త్రిముర్తులై ఆంధ్రీ కరించి , తెలుగు భాష కే  కొత్త గౌరవన్ని తెచ్చారు, తెలుగు జాతికే ఒక గొప్ప గౌరవన్ని తీస్కువచ్చారు.
 పంచమ వేదమైనటువంటి మహాభారతము ను ఆంధ్రీ కరింప చేయటం లో రాజరాజనరేంద్రుడు పడిన ఆర్తి చుస్తే మహాభారతం ఎంత గొప్ప గ్రంథం రా అనిపిస్తుంది. భారతాన్ని చదవటం ఎంత కష్టమో, భారతమ్ లో ఉండేటువంటి ధర్మ సమన్వయము చేసుకొని జీవితాన్ని అభ్యుదయ పధం లో నడిపిచుకోగాలిగినటువంటి స్థిత ప్రజ్ఞత ని పొందడం కూడా అంతే కష్టం.
మహా భారతం నిజంగా చదవగలిగితే, మహాభారతం లో చెప్పిన ధర్మం లో మనం ఏపాటి నిలబడ గలుగుతున్నాం అనిపిస్తుంది. ఈ జాతి గొప్పతనం అసలు ఎక్కడున్నదంటే, మతం అన్న పేరు జీవించేటటువంటి
విధానానికి లేదు. మతం అని పిలవం, దీన్ని సనాతన ధర్మమూ అని పిలుస్తాము,ధర్మమూ అన్న మాటకి అర్థం మీరు అనుష్టి చవలసినది, ఏది అనుస్టి చాలి ? అంటే నాకు తోచినది నేను మీకు తోచి నది  మీరు అను ష్టి చడం కాదు, ఏది మీరు నేనూ కూడా కాలముతో దేశముతో సంబంధం లేకుండా ఎప్పుడూ అందరు అనుస్టిoచి  తరించవలసి ఉంటుందో ఏది అనుస్టిoచడం చేత మారని సత్యమును మీరు ఎరుకలోకి తెచ్చుకోగలరో అలా ఆచరించవలసినటు వంటది ఆచార ఖాoడ గా వేదం లో చెప్పుకొస్తూ, జ్ఞానము పొందడానికి కావలసిన సోపానము ల నన్నిటినికి  ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదం గా నిలబడింది. అందుకే మిగిలిన మతాలకి ఏదో ఒక గ్రంధము ఆధారమై ఉండోచ్చు , ఆ గ్రంధ కర్త దానిని చేసిన వారై ఉండవచ్చు. సనాతన ధర్మాని కి వేదము ప్రమాణము,ఆ వేదము అపౌరిషీయము , దానిని ఎవ్వరు రచించినది కాదు. అది ఈశ్వరుని ఊపిరి.
 నేను ముందరా నా ఊపిరి ముందరా అని అడిగారనుకోండి అది చెప్పడం కష్టం. నేను నా ఊపిరి ఒక్క సారే ప్రభవిస్తాం. నేను లేను అన్న మాట ఎప్పుడు వస్తుందంటే నా ఊపిరి ఆగిపోయినప్పుడు  . ఆచరించడం అంటే నువ్వు ఈవిధంగా చెయ్యి అని అర్థం. ఎందుకు ఆ విధంగా చెయ్యడం. చాదస్తం కోసమా ? కాదు. మనసుకు ఏదో ఒక ఆలంభన లేకపోతే అది పిచేక్కిన కోతి లాగా ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది.  మనసుని పవిత్రీకరించడం కోసమే ఆచారం అన్నది వచ్చింది. అందుకు తీస్కోచింది వేదం.
మొట్ట మొదట ఆచరాన్ని పాటించడం అన్నది ప్రారంభం అయితే ఆ ఆచరమును అనుస్టిo చిన కారణం చేత మనసు పరిపక్వం అయి , పవిత్రమైన మనసు సత్ కర్మ ఆచరణం నందు ఊంచు కొని నిల బడుతుంది. అటువంటి పవిత్ర కర్మా చరణ  భక్తీ తో చెయ్యడం వలన ఈశ్వరుని యొక్క ప్రీతీ కలుగుతుంది. ఈశ్వరుని ప్రీతి ని సంతరించిన భక్తి తో కూడిన కర్మచారణము జ్ఞానముకు యోగ్యమవుతుంది. ఆ జ్ఞానము మోక్షమునకు హేతువు అవుతుంది.
 అందు కొరకు కర్మ చెయ్య వలసిన దాని  ఆచార ఖండగా  చెప్పడం దగ్గర నించి ఈశ్వరుడే సనాతన ధర్మం లో మనకి వేదాన్ని అందించాడు . ఆ వేదం లో చాలా భాగం ధర్మం గురించే మాట్లాడతారు. ఆచరించినది ఏదైతే ఉందొ దాని పేరే ధర్మం. తెలిసి ఉన్నది ధర్మం కాదు. ధర్మా చరణము నందు తెలిసి ఉండటం అన్నది ఒక సోపానము. ఆచరించడానికి పనికి రాకుండా తెలుసుకోవ డానికి ఏదైతే ఉందొ అది ధర్మం కాదు. తెలుసుకొని ఆచారించినది ఏదైతే ఉన్నదో అది మాత్రమే ధర్మం.
వేదము దేన్నీ చెప్పిందో దాన్ని మాత్రమే అనుస్టించు. ధర్మము నువ్వు పండేటట్లు చెయ్య గలదు . పిందే తనంత తాను గా పండదు. పిందే పండవుతుంది. పిందే ఎప్పుడు పండవుతుంది. పిందే చెట్టు నుండి విడివడకుండా ఉన్నపుడు పండుతుంది . పండై తనంత తాను చెట్టు నించి విడివడుతుంది. పిందే ఆ పువ్వు పుట్టిన ఆ ప్రదేశాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. లోకంలో ఏ పిందే అయిన వగరుగానే ఉంటుంది. పిందే పెరిగి కాయ అవుతుంది , ఏ  కాయ ముట్టుకున్న గట్టిగానే ఉంటుంది. ఏ కాయైన పండిన తరువాత రంగు మారిపోతుంది. లోపల పదార్ధం మెత్త బడిపోతుంది. పందినాక తనత తాను చెట్టు నుంచి విదివడుతుంది. అందుకే పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు "పండి పోయడండి ఆయన " అని .చిన్నపిల్లలు  ఒక ఆట ఆడుతూ ఉండేవారు, ప రమ పద సోపానము అని అనేవారు. అందులో దేవతల మధ్య చేరినప్పుడు కూడా పండరు. పరమ పురుషుని చేరిన తరువాత పండి పోయాడు అంటారు. అంత వరకు పందేoవేస్తూ నే ఉంటాడు. కర్మా చరణము చెస్తూనే ఉంటాడు. పండి పోవటా ని కి కావలశిన ప్రాతి పదికను అందించ డమే ధర్మం.
సనా తన ధర్మం నందున్నంత భోధ మీకు ఇంకెక్కడా కనపడదు. ఏదైనా క్రతువుకాని,ప్రవచనం చివరిలో చెప్పేది
"ఓం శాంతి శాంతి శాంతి: ". ధర్మము దేనికొరకు వచ్చిదంటే ఈ శాంతి కొరకే వచ్చింది. నువ్వు శాoతం గా ఉండాలి ఇంకోకరిని శాంతం గా ఉండనివ్వాలి.
 పరమేశ్వరుడే పిండాoడాన్ని , బ్రంహాడాన్ని శ్రుజియించాడు. ఆయనే కన్నులు ఇచ్చాడు, బయట జలపాతాన్ని ఇచ్చాడు.ఆయనే ఇక్కడ పళ్ళు పెట్టి నాలుక పెట్టాడు, బయట ఆపిల్ పండు పెట్టాడు. పరమేశ్వరుడు ఇక్కడ కంటం పెట్టాడు, బయట నీళ్ళు పెట్టాడు. పర మేస్వరుడు  తిన్న దాన్ని జీర్ణం చేసి మిగిలిన టు వంటి పిప్పిని విడిచిపెట్టే ట టువంటి స్థితి ని ఈ పిండాo డానికి ఇచ్చాడు. ఈ విడిచి పెట్టిందాన్ని పుచ్చుకొమ్మని బ్రహ్మాoడాన్ని  శాసించాడు. బ్రహ్మాడం లో ఉన్న భోగాలను అనుభవించ వద్దని శాసనం చెయ్యలేదు, అనుభవిoచమనే   ఆయన చెప్పాడు, కానీ నీకున్న బలం ఎంతో దాన్ని బట్టి నువ్వు అనుభవించడం కాదు,ఈశ్వరుడు చేసిన నియ మానికి నీవు బద్దుడ వై  అనుభ వించ వలసి ఉంటుంది తప్ప నాకింత శక్తి ఉంది కదా అని శక్తి హీనులైన వారిది అనుభవించ మని మనకి శాస్త్రాలు చెప్పట్లేదు. అక్కడ వచ్చింది ధర్మం అన్న మాట . ఆ ధర్మం అన్నది లేకపోతే బలవంతుడైన వాడు బలహీడైన వాడిని కొట్టుకు తింటాడు.
అందుకే ఈ ధర్మము అన్న మాట సనాతన ధర్మం లో ఎంత వరకి వెళ్లిందంటే, యుద్ధ భూమి అని ఒక భూమి, ఇంట్లో అగ్ని శాల అని ఒక గది అక్కడకి తీస్కెళ్ళి అగ్ని హోత్రాలవి  పెట్టుకుంటారు, పూజ గది ఒక గది, పడక గది ఒక గది, మీ ఇంట్లో మీరు విభాగం చేసుకున్నట్టే యుద్ధం చెయ్య వలసి వస్తే  యుద్ధ భూమి అని వేరొక భూమిని  నిర్ణయం చేసారు,అక్కడికెళ్ళి యుద్ధం చేసేవారు. సామాన్య జనులు పిల్లతో పాపలతో ఉండేటటువంటి నగరాలకి దూరంగా ఉన్న చోట ప్రత్యేకం గా యుద్ధం చెయ్యటానికి వెళ్లి నిలబడేవారు.  యుద్ధం చెయ్యటానికి కూడా ధనుర్వేదం నేర్పేవారు.  యుద్ధం చేసేటప్పుడు కూడా సుర్యోదయత్పూర్వము కాని సుర్యాస్తామయానతరము కాని యుద్దము లేదు.  మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే వ్యాస భారతం లో ఒక అద్భుతమైన ఘట్టం, యుద్ధం పూర్తయి సూర్యాస్తమయం అయ్యింది ఇంకా కాసేపాగితే ప్రాయశ్చిత్తం తో సంధ్యా వందనం చెయ్యాలి, భీష్మా చార్యుల వంటి మహా పురుషులు సూర్యా స్తమయం అయ్యి రధం ఇలా కిందకి దిగగానే ఇంటికి వెళ్లి స్నానం చేసి అర్గ్య ప్రదానం చేస్తే ప్రాయశ్చిత్తం తో చెయ్యవలసి వస్తుంది కనుక స్నానం చెయ్యక పోయిన , పంచభూత స్నానం మనకి ఉంది, శాస్త్రం అంగీకరించింది, కాసింత పృధివి ని తీస్కుని తలమీద వేసుకుని వారు అక్కడే ఉన్నటువంటి మట్టిని తీసి సూర్య భగవానుడికి అర్గ్యం గా విడిచిపెట్టేసారు, అంటే నీ విహిత కర్మాచరణం నువ్వు చెయ్యవలసి వస్తే ఆ సమయం లో నువ్వు స్నానం చేసి లేవన్న బెంగ కూడా  లేకుండా నీకు శాస్త్రం చేసింది.
 ఒక యుద్ద భూమి కి వెళ్తే, అక్కడ నగారా మొగించేవాడు ఉంటాడు, అందరికి నీళ్ళందించే వాడు ఉంటాడు, వంట చేసే వాడుంటాడు. వాళ్ళ జోలికి వెళ్లి వాళ్ళని చంప కూడదు, పారిపోయే వాడిని చంపకూడదు, ధనుస్సు విరిగి ఇంకో ధనుస్సు పట్టుకుంటున్న వాడిని చంప కూడదు, విల్లిచ్చిన వాడిని చంపకూడదు, చుట్టూ చేరి నలుగురు కలిసి ఒక్కణ్ణి చంపకూడదు, యుద్దం చెయ్యకుండా పరాకు గా ఉన్న వాడి మీద బాణం వెయ్యకూడదు, యుద్దానికి తాను సిద్ధ పడి ఎదురొడ్డిన వాడిని మాత్రమే చంపాలి.
ఎక్కడ ఉన్నాయ్ ఈ ధర్మాలు చెప్పండి, తర్వాతి కాలం లో జరిగిన యుద్దాలలో  ఏ పాపం ఎరుగని వాళ్ళు , రాత్రిళ్ళు నిద్రపోతున్న సమయం లో నగరాలకి నగరాల మీద బాంబులు వేసిన ఘన చరిత్ర మిగిలిన చోట్ల ఉంటె, యుద్ద భూమి యoదు పాటించ వలసిన ధర్మాలను చెప్పి, అలాగే సంధ్యా వందనం చేసి అలాగే యుద్ధం చేసినటువంటి జాతికి వారసులo  మనం. అంతగొప్ప ధర్మం ఈ జాతిది. ప్రతి చోట ధర్మమే, ధర్మం విడిచి బ్రతకటం కన్నా, ధర్మాచరణం లో ప్రాణము విడవటమే శ్రేయస్కరం అని నమ్మి బ్రతికారు. అంత గొప్పగా ధర్మ ప్రభోదం చేసారు. ఆ ధర్మమే పోయిన నాడు నీవు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. కాబట్టి ఆ ధర్మాన్ని ఒకటికి పదిమార్లు లోకానికి భోద చెయ్యాలి. ప్రతివారికి ధర్మాన్ని అందించాలి. ఈ అందించడం లో వచ్చినటువంటి మహోత్కృష్ట మైన తువంటి ఇతిహాసమే మహాభారతం.
 భారతం భారత వంశమునకు సంబందించిన కధా అని ప్రతీతి, కాదు కాదు మీరు జాగ్రత్తగా గమనిస్తే "భా " అంటే కాంతి అన్న అర్థాన్ని మీరు వేరొకరకం గా చుస్తే జ్ఞానమే కాంతి. జ్ఞానం మన్న కాంతి యందు యదార్ధ మైన వస్తువు కనపడుతుంది, ఆ కాంతి లేకపోతే చీకట్లో దుంగ కి దొంగ కి తేడా తెలియనట్లు, త్రాటికి పాముకి తేడ తెలియనట్లు,
జ్ఞానమే కాంతి కలగ నంత వరకు సత్య వస్తువుకి అసత్య వస్తువు కి భేదం గోచరించాదు .
 కాబట్టి అటువంటి సత్య వస్తువు ఎరుకలోకి రావాలి అంటే జ్ఞానం అనేటటువంటిది  కలగాలి.  ఆ జ్ఞానం అనే కాంతి కలగాలి అంటే, నా వంట్లో బలం ఉంది కదా  అని నేను భోగం అనుభవించ కూడదు, నేను ఏదైనా అన్నా వాడు తిరగాబడ లేడు  కదా అని వాడిని హింసించ కూడదు. నేను ఈస్వరుడుకి జవాబుదారిగా బ్రతకవలసిన నియమా వళిని, ఆ చట్రాన్ని తెచ్చి మనకి అందించారు, అదే ధర్మ చక్రం, ఆ చక్రం ఎప్పుడూ తిరుగుతునే ఉంటుంది. అంటే కదిలే ధర్మము ను పట్టుకొని కదలని సత్యము లోనికి వెళ్ళిపోతాడు. చిట్ట చివర ఆ సత్యము ఎరుకలోకి వచ్చిన తరువాత, తన కన్నా వేరొక వస్తువు లేదు సమస్తము ఇదే "అద్వైతం ". రెండవ వస్తువు లేదు ఉన్నదావుక్కటే అన్న ఎరుక కలిగిన తర్వాత,ఆ ఎరుక యందె నిలబడి తన శరీరాన్ని విడిచి పెట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు మళ్ళి పుట్ట వలసిన స్థితికి వెళ్ళ గలుగుతాడు అని ధర్మ ప్రభోదాన్ని చేసాయి, కావ్యాలు పురాణములు.
  "భా " ఆ జ్ఞానము నందు "రత" రామిచాలని కోరిక కలిగి ఉన్నారో.  మేము ధర్మాన్ని పట్టుకుంటాం అని కోరుకున్న వారెవరున్నారో అటువంటి వాళ్ళ అందరి కోసం ఆ నాడు మహానుభావుడు అయినటువంటి వ్యాసుడు మనకి భారతాన్ని అందించాడు. ఆ భారతమే తదనంతర కాలం లో వ్యాస భగవానుని యొక్క ప్రతి రూపం గా  ఎందరో మహానుభావులు ఆ నాటి నుండి ఈనాటి వరకు మహాభారత ఇతిహసాన్ని లోకాని కి ప్రవచన రూపం లో అంద చేస్తూ నే ఉన్నారు. అందుకే మహా భారత ప్రవచనం ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రీతి పొందేవాడు ఈశ్వరుడు కాదు ట, వ్యాస భగవానుడు ప్రీతి చెందుతాడు ట. నేను నా జాతి ధర్మం పట్టుకుoటుoదని, నా వారసులు జ్ఞానం కోసం అలమటిస్తా రాని, నేను అందించే ఈ ధర్మాన్ని వాళ్ళు పట్టుకుంటారని, ఇంత గొప్ప గ్రంధాన్ని రచించి అందించాను, వీళ్ళు ఇంత సంతోషం తో భారతాన్ని చెప్పుకుంటున్నారు, వింటున్నారని, ఎక్కడెక్కడ భారతం మీద ప్రవచనం మొదలవుతుందో అక్కడక్కడ వ్యాస భగవానుడు ఏదో ఒక రూపం లో వచ్చి కూర్చుంటూ నే ఉంటాడు. అంత టి మహానుభావుడు సంతోషిస్తే మన జీవితానికి వేరే సాఫల్యం ఏముంటుంది చెప్పండి. అంత గొప్ప గ్రంధం మహాభారతం.
ఆ మహా  గ్రంధం చాలా కాలం సంస్కృతం లో ఉండిపోయింది. ప్రత్యేకించి ఆంధ్ర భాషా లోకి రాలేదు. ఈశ్వరుడి యొక్క సంకల్పం పరదేవతా సంకల్పం, ఆ తల్లి దానికి కావాల్సిన పనిముట్టు కూడా ఆవిడే తెచ్చుకుంటుంది, అటు వంటి పనిముట్టు తెచ్చుకోవాలి అంటే, మంత్ర భాగము నందు శ్రద్ధ కలిగిన వాడై ఉండాలి.
ఎవరు శ్రద్ధా భక్తులతో మళ్ళి మళ్ళి జపం చేస్తారో వారిని రక్షించ గల శబ్ద విస్పొటన శక్తి సమహరమునకు మంత్రము అని పేరు. విస్పోతనము చేయ్యగాలిగినటువంటి భీజాక్షరములను తీస్కొచి సమాహారము గా కూర్చి దానికి అధిష్టాన మైనటువంటి ఋషిని దేవతని నిర్ణయము చేసి వేదములో ఈశ్వరుడు దాన్ని  మనకు అందిస్తే అటువంటి మంత్రము  మీద   నమ్మకం తో విశ్వాసం తో ఎవడు నిలబడి ఆ మంత్రాన్ని అనుస్టిస్తాడో, అటువంటి వాడు ఆ మంత్రం యొక్క శక్తి పొంది తానూ భూలోకం లో నడయాడుతున్న ఆ మంత్ర శక్తియే ఆ రూపంలో తిరుగుతున్నట్టి వ్యక్తి గా మారి ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తి జన్మించాలి అంటే అది కాకతాళీయం  గా  జరిగేటటువంటి విశేషం కాదు, దానికి పరమేశ్వరుని యొక్క కృప ఉండాలి, పరదేవతానుగ్రహం ఉండాలి, ఉంటే  తప్ప సంస్కృతం లో ఉన్నటువంటి మహాభారతాన్నిఆంధ్రీ కరించ గలిగి న మహా పురుషుని జననం జరగదు, ఒక వేళ జరిగినా  అంత గొప్ప భారతాంధ్రీకరణ ప్రయత్నానికి సంకల్పం తాను చేసి, అటువంటి మహా పురుషుడు ఒకడు ఉన్నాడని గుర్తించి, ఆయనది త్యాగము తో కూడిన జీవితం అని గుర్తించి, ఆయనకి ప్రతిఫలా పేక్ష లేదు, ఈయన కారణ జన్ముడు, ఈయన జన్మించినందుకు ఈయన దగ్గర భారతాన్ని ఆంధ్రీకరింప చేస్కొని దీన్ని నేను రాజునైనందుకు నా కాలం లో ఈ భరతం ఆంధ్రీకరింప బడింది అని నేను అనుపించుకుంటే , దాని వలన ఈ జాతికి నేను రాచరికం చేసినందుకు శాస్వతుడ నౌతను తప్ప . ఎంతమంది రాజులు వెళ్ళిపోయారు , అందరు గుర్తున్నారా, ఎవరో ఎక్కడో ఒక మహానుభా వుడు ఉంటాడు. అన్ని రాళ్ల మధ్యలో ఉన్నటువంటి సాలగ్రామాన్ని గుర్తించి, అన్ని రాళ్ళని పడతోసి సాలగ్రామాన్ని తీస్కొచి నీట కడిగి అభిషేకం చేసి మెత్తటి దూది తో తుడిచి గంధం రాసి బొట్టుపెట్టి పూజా మందిరం లో పెట్టి పూజించి, సాలగ్రామము యొక్క ఆరాధన చేత సాలగ్రామము నందు ఉన్నటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆరాధకుని లా ఇన్ని రాళ్ల మధ్యలో సాలగ్రామము ఉన్నట్టు , తన రాజ్యం లోనే ఇంత మంది గృహస్తుల మద్యలో ఒక గృహస్తు గా  ఇంతమంది వేదం చదువుకున్న వాళ్ళలో తానూ ఒక వేదం చదువుకున్న వాడిలా , ఇంత మంది మంత్ర జపం చేస్కునే వాళ్ళలో తానూ ఒక మంత్ర జపం చేస్కునే వాడిలా , ఇంత మంది ఉభయ భాషా ప్రవీణు లలో తానూ ఒక ఉభయ భాషా ప్రవీణు డిలా కనపడుతూ తాను ప్రత్యేకం గా మహాభారతాన్ని ఆంధ్రీకరించ గలిగిన ప్రజ్ఞ తో కుడి ఉన్న వాడను అన్న మాట కూడా అతిశయం తో ఎక్కడా చెప్పనటువంటి వ్యక్తి  ని గుర్తించగలిగిన ప్రజ్ఞ ఒక రాజు యందు ప్రచోదనం కావాలంటే అది కూడా పరదేవతను గ్రహమే. 
పరదేవత ఒక రాజు యందు ఆవహించి అటువంటి కోర్కె పుట్టించాలి.  ఎందుకు ఆంధ్రీకరిస్తారు, ఆంధ్రీకరించి అందించడానికి ఎంత కష్ట పడితే, ఎంత తాపత్రయ పడితే, వాళ్ళు ఎంత వ్యగ్రత ని పొందితే వాళ్ళ శరీరము ఎంత ఖేదాన్ని పొందితే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించి ఉంటారు, తిక్కన సోమయాజి భారతాన్ని అందించి ఉంటారు ఎర్రాప్రగడ భారతాన్ని అందించి ఉంటారు, వారికి ఎందుకు అందించాలన్న కోర్కె పుడుతుంది. నీకు శక్తి ఉంది రాయవో భారతాన్ని అంటే రాస్తారా ? భారతాన్ని ఎందుకు ఆంధ్రీకరింప బడాలని కోరుకుంటున్నాడో ఆయన నోటి తో ఆయన చెప్పినప్పుడు, ఆయన తోడి తనకున్న తువంటి స్నేహవిశేషం చేత ఆయన శీలాన్ని విచారణ చేసినటువంటి సమర్ధుడైన ఆంధ్రీకరించ గలిగినటువంటి కవి రూపం లో భూమి మీద తిరుగుతున్నటువంటి  ఈశ్వరు ని యొక్క ప్రజ్ఞా విశేషము కలిగినటువంటి ఆ కారణ జన్ముడు, రాజు చెప్పిన మాట యదార్థము అని గుర్తించి ప్రచోదనాన్ని పొందితే ఆ సంతోషం తో ఆ ఆనందం తో ఇవాళ్ళ నేను అందించే ట టు వంటి ఈ భారతం రాబోవు కాలం లో ఎన్ని కోట్ల మందిని తరింప చేస్తుందో, ఎంత మందికి ధర్మాన్ని అందిస్తుందో, కాబట్టి నేను ఆంధ్రీకరించ వలసిందే అని తన్కున్నటువంటి పాండితీ ప్రకర్ష ని తనకున్న ప్రజ్ఞా విశేషాలని రంగరించి ఘంటం పట్టుకొని ఆంధ్రీకరించి వాళ్ళు ఏమీ కోరకుండా ఆ భారతాన్ని లోకానికి అందించి తమ శరీరాలని విడిచి పెట్టి వెళ్లి పో యినటువంటి నన్నయాదులు ఎవరైతే ఉన్నారో వారు మనకి ప్రతస్మరణీయులు, వారు వందనీయులు, వారికి  నమస్కరించక పోతే మనకు ఋషి ఋణం తీరదు. పుట్టుకతో ఋషి ఋణం ఉంది మనకి.
అంతటి మహా పురుషులైన వారు కేవలం గా ఇవాళ్ళ నన్నయ్య గారు ఆదిపర్వం, సభాపర్వం కొంత భాగం చేసి శరీరాన్ని విదిచిపెట్టేస్తే వెంటనే తిక్కనగారు ఆయన శరీరం విడిచి పెట్టిన ఉత్తర క్షణం లో మిగిలిన భాగాన్ని నేను పూర్తి చేసేస్తానండి అని అన్న వాళ్ళు లేరు , మళ్ళి అటువంటి సమర్థు డు పుట్టాలి అంటే మళ్ళి కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసం వచ్చేసింది.
మళ్ళి తిక్కన గారు పుట్టినప్పుడు ఆయనలోని ప్రతిభని కనిపెట్ట గలిగే రాజు పుట్టాలి అంటే మళ్ళి పరదేవతను గ్రహం కొన్ని వందల సంవత్సరాలకి. కాబట్టి నన్నయ్య కాలం లో పుట్టిన వారు మనంత అదృష్ట వంతులు కారు, ఎందుకో తెలుసా వాళ్ళు  తెలుగు చేయ బడిన భారతాన్ని పూర్తి గా చదువుకోలేదు, నన్నయ్య గారు చేసిన భారతం మాత్రమే చదివారు. తిక్కన గారి కాలం లో వాళ్ళు మనంత అదృష్ట వంతులు కారు, వాళ్ళు నన్నయ్య గారు తిక్కన గారు ఆంధ్రీకరించిన భారతాన్ని చదువుకున్నారు. ఎర్రాప్రగడ కాలం లో వాళ్ళు ఎర్రాప్రగడ ఆంధ్రీకరించింది చదివారని నమ్మకం లేదు. 
మనం చాలా అదృష్టవంతులం, ఎందుకంటే నన్నయగారు తిక్కన గారు ఎర్రాప్రగడ గారు రాసి మనకు అందిస్తే, మనం వెళ్లి తాళ పత్రాలు తెచ్చుకొని రాస్కుని ప్రతిని తెచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా వెళ్లి ద్రవ్యం ఇస్తే ఆ ద్రవ్యనికి గ్రంధం వస్తే ఆ గ్రంధాన్ని పట్టుకుని హాయిగా చాడువుకోవచ్చని ఈశ్వరుడు అనుగ్ర హిస్తున్నాడు. అయిన అనుభవించని వాడు ఇంటి కింద ఐశ్వర్యం ఉంది అని తెలిసి కూడా అనుభవించకుండా పక్క ఇళ్ళకి వెళ్లి భిక్షమెత్తుకొని అక్కడేదో ఐశ్వర్య ము ఉందనుకొని వెళ్ళిన దరిద్రుడు ఎటువంటి వాడో, తన ఇంట నున్న భారతాన్ని చదువుకొని తరించాలేనివాడు, అటువంటి వాడు. కాబట్టి మనం భాగ్య వంతులం.  అటువంటి మహా భారతం.
అటువంటి పంచమ వేదం.
ఆ మహాభారతాన్ని ఆంధ్రీకరించిన సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దలు ఒక మాట అంటారు. నన్నయ్య గారికి "ఆదికవి" అని ఒక బిరుదు. ఆయనకి ఉన్న  బిరుదునా మా లలో ఒకటి. అయితే నిజానికి బిరుదు నామం కాదు గొప్పది, నన్నయ్య గారు మన జాతి కి అందించిన గొప్ప ఫలం ఉన్నదే అదే మనకు గొప్పది. 

ప్రేరణ

ఈరోజు నాకు ఈ బ్లాగ్ రాయటానికి ప్రేరణ
పూజ్య గురువర్యులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, ఆయన తో పరిచయము లేకున్నా ఆయన ప్రవచనము వినననిదే మాకు తెల్లవారదు.  ఆ పరదేవతనుగ్రహము తో గురువర్యులు ప్రవచించిన ఆంధ్ర మహా భారతం రాయాలని కోరిక తో, ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షములతో తదుపరి పోస్ట్ తో మొదలు పెట్ట  తలచాను.దీనిలో ఏమైనా తప్పులున్న ట్లై తే  నేను తెలియక చేసినవి గా పరిగణించి,  క్షమించ బడి సవరించవలసినది ది గా ప్రార్ధన.