వేంగి దేశాన్ని , రాజమహేంద్ర వరాన్ని రాజధాని గా చేస్కొని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని కోర్కేమేరకు నన్నయ్య భట్టారకుడిని (భట్టారక అన్న శబ్దం గౌరవన్ని సూచిస్తుంది. లలితా పరా భట్టారక, క్రోధ భట్టారక, శృంగార భట్టారక అలాగే నన్నయ్య భట్టారక అంటే గౌరవనీయమైన వ్యక్తి, పూజనీయమైన వ్యక్తిఅని అర్థం ) ప్రార్థన చేస్తే ఆయన అత్యంత వినయం తో దేవతా స్వరూపాలన్నిటికి నమస్కారం చేసి , వ్యాస వాల్మీకులకు నమస్కారం చేసి మహా భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేసారు. ఆయన ఆ మహా భారతాన్ని ప్రారంభం చేసిన సందర్భం లో మహా భారతం చెప్పబడిన విధానం గురించి ప్రారంభం చేస్తారు . ఆంధ్ర మహా భారతాన్ని పరిశీలనం చేస్తే మొట్ట మొదట చెప్పటం మొదలు పెట్టినటువంటి వాడు శౌతి, తర్వాత కధ కొంత దూరం వెళ్ళినాక జనమేజయ సర్పయాగం పూర్తై పోయిన తరువాత మళ్ళి కధా భాగం చెప్పటం మొదలుపెట్టే వాడు వైశంపాయనుడు. మొదసల
మహా భారతం ఎక్కడ మొదటి సారి భూమండలం మీద జరిగిందో, ఎక్కడ మొదటి భారత ప్రవచనం జరిగిందో, అటువంటి ప్రదేసమేదో దాని గురించి నన్నయ్య గారు ప్రారంభం చేస్తున్నారు. మొట్ట మొదట ప్రవచనం నైమిశారణ్యం అనే ప్రదేశం లో జరిగింది . మనకి అత్యంత ప్రఖ్యాతమైన ప్రదేశములు భారత దేశం లో అనేకం ఉన్నాయ్. భూమండలం లో భారత దేశం మినహా మరే ఇతర ప్రాంతములలో , అరణ్యం లోకి వెళ్ళడం అక్కడ ఉండడం అనేది ఉండదు కానీ ఒక్క భారత దేశం లో మాత్రం ఋషులు కోరి కోరి అరణ్యం లో ఉంటుంటూ ఉంటారు. అక్కడ
ఆశ్రమము ఏర్పరుచుకొని , పరమ ప్రశాంతమైన వాతావరణం లో తపస్సు చేస్తూ , శిష్యుల్ని పోషిస్తూ ,వారికి విద్య నేర్పుతూ , వారు అరణ్యం లో నివసించిన కారణం చేత అరణ్యం లోని క్రూర మృగాలు కూడా ఒకదాని యందు ఉన్న క్రూర స్వభాన్ని మరచి అత్యంత ప్రేమతో మెలిగ గలిగే తపో వైభవాన్ని ప్రకటించి, అసలు అరణ్యము అన్న మాటకి ఒక కొత్త శోభని ఆవిష్కరించారు. అందు కే పౌరాణిక వాగ్మయాన్ని పరిశీలనం చేస్తే , పరమ పవిత్రమైన కొన్ని అరణ్యముల పేర్లు వినబడతాయి, అందులో ప్రత్యేకించి దండకారణ్యము, అది రామాయణ కాలం లో శ్రీరామ చంద్ర మూర్తి ఎందరో మహా ఋషులని దర్శనం చేసారు. దండకారణ్యము, ధర్మా రణ్యము , చంపా రణ్యం , సైo ధవారణ్యం, పుష్కరా రణ్యం, నైమిశారణ్యం ఇలా ఎన్నో అరణ్యములు. ఈ అరణ్యాలు అన్ని ఋషి స్పర్స కలిగి ఉంటాయి. (ఒక సారి శంకరాచార్యుల వారు శ్రుంగగిరి కి వెళ్ళినప్పుడు, ఒక పాము కప్పకి పడగ పట్టి ఉండడం చూశారు, పరస్పర శత్రుత్వం కలిగిన కప్పా పాము ఇలా ఉండటం ఏమిటి అని వారు అంతర్ముఖులై ఆలోచించారుఆయన ఒకసారి దివ్యద్రుష్టి తో చూసారు, దివ్య ద్రుష్టి అని ఒక మాట తరచూ వినపడుతూ ఉంటుంది, ద్రుష్టి అన్నది మాంస నేత్రము ఎంత వరకు చూడ గలదో అంత వరకు చూడడం , అది సాధారణం గా మనుష్యులందరికి ఒకే విధం గా ఉంటుంది కాని మనుష్య ప్రాణికి ఎటువంటి ద్రుష్టి ఉంటుందో అన్ని ప్రాణులకి అలాగే ఉంటుంది అని చెప్పటానికి వీలు ఉండదు ఎందుకంటే ఎక్కడో దూరంగా ఎగురుతున్న గ్రద్దకి నేలమీద ఎక్కడో ఉన్న కోడిపిల్ల కనపడి ఇలా నిటారుగా వచ్చి కొడితే ఈ కోడి పిల్ల నాకు దొరుకుతుంది అని ఆకాశం లోనించి ఒక్కసారి భూమండలం మీదకి రాగలదు. ఒక్కక్కదని ద్రుష్టి ఒకలా ఉంటుంది. బాహ్య నేత్రం తో చూసేది సామాన్య ద్రుష్టి, దివ్య ద్రుష్టి అంటే ఒక్కసారి ఈ బాహ్య నేత్రాన్ని మూసి దేనిగురించి ఆలోచిస్తున్నారో దాని మీద ద్రుష్టి పెడితే ఎక్కడ ఏది జరిగింది అన్నది ఇతరులకి అందని విషయం, కన్నులు మూసుకున్న వ్యక్తికి గోచారం అవుతుoది. అలా చూడగలిగిన శక్తి తపస్సు చేత సాధింపబడుతుంది. అది అందరికి సాధ్యం అయ్యే విషయం కాదు. అది అటువంటు తపోశాలులైన మహర్షులకు, భ్రూ మధ్యమున ద్రుష్టి ని కేంద్రీకరించి, ఏమి జరిగింది అని వారు కన్నులు మూస్కుంటే , ఏది జరిగిందో వారికి కరతలామలకం అయ్యేది, కంచి కామకోటికి పీతధిపత్యమ్ చేసి నడిచే దేవుడు అని పేర్గాంచిన చంద్రశేకరేంద్ర సరస్వతి స్వామివారు ఒక్క సారి ఇలా కన్నులు మూస్కొని ఉంటె , తన దగ్గరకి ప్రసాదం పట్టుకు వచ్చిన వ్యక్తీ , ఎక్కడో ఒక చోట చేయించుకున్న రుద్రాభిషేకం లో ఏ బ్రాహ్మణున్ని అవమానం చేసారో, ఆ బ్రాహ్మణుడు దేవాలయం లో ఈశ్వరునికి ఏమి చెప్పుకున్నాడో , ఆ చెప్పుకున్నయన ఎంత బాధ పడి ప్రాణం విదిచిపెట్టేసాడో కూడా ఆయన తెలుసుకుని ఆ పూట భిక్ష కూడా వదిలిపెట్టేసిన రోజులున్నాయి. మహాత్ములు తమ తప్పస్శక్తి తో బాహ్య నేత్రములు మూసి, అంత: నేత్రం తో చూడగలరు దాన్ని దివ్య ద్రుష్టి అంటారు. ఇప్పుడు శంకరాచర్యుల వారు దివ్య ద్రుష్టి తో చుస్తే ఆయనకి అర్థమైంది , ఎప్పుడో త్రేతాయుగం లో అక్కడ ఋష్యశృంగుల వారు అక్కడ తపస్సు చేసారని, త్రేతాయుగం లో ఋష్యశ్రుంగ మహర్షి తపస్సు కారణం చేత , కలియుగం లో శంకర భగవత్ పాద చార్యుల నడవటం చేత ఆ తపస్సు యొక్క ప్రకంపనల చేత తత్ ప్రభావం చేత అక్కడ ఉండే ప్రాణులు కూడా సహజం గా ఉండే శత్రుత్వాన్ని కూడా మరచి తిరగ గలిగాయి. అంటే ఒక్కొక్క మహానుభావుడు తపస్సు మూలం చేత ఆ అరణ్యములు యుగము మారిపోయినా కుడా శోభస్కరములు గా నిలబడిపోయాయి, ఇది అనన్య సామాన్య మైన ప్రక్రియ. ఇది ఒక్క భారత దేశం లో ఋషులకి మాత్రమే సoబoదిoచిన సంప్రదాయం. అటువంటి సంప్రదయమునకి మనము వారసులము). అందునా ప్రత్యేకించి నైమిశారణ్యం వెళ్లి తపస్సు చేయటం వాళ్ళ అటువంటి శక్తి పొందింది కాదు, కలియుగ ప్రారంభం లో మహర్షులు వెళ్లి అడిగారు, చతుర్ముఖ బ్రహ్మ గారిని, నువ్వు సృష్టి కర్తవి నీకు యుగ లక్షణం అంతా కూడా తెలుసు. భూమండలం అంతా కూడా కలియోక్క ప్రభావం ఉంటుంది. కలి ప్రభావం ప్రధానం గా ఎవరి మీద ఉంటుంది, కలికి లొంగి పోయిన వాడికి, కలి తన ప్రభావం చూపక్కరలేదు. కలికి లొంగ కుండా ఎవరైతే ఈశ్వరుని పాదాలు పట్టుకున్నాడో, అతని మీద కలి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి భూమండలం లో ఎక్కడ కూర్చొని తపస్సు చేసినా కలి ప్రభావం మామీద ఉంటుoది, తపస్సు అసలు నిలబడుతుంది అన్న ధైర్యం లేదు. కాబట్టి మహానుభావ భూమండలం లో ఎక్కడ మేము కలి ప్రభావానికి వశులం కాని ప్రదేశం ఉన్నదో,అటువంటి ప్రదేశాన్ని మాకు ఎరుక పరచవలసినది అని ప్రార్ధన చేసారు. బ్రహ్మ గారు ఒక చక్రాన్ని ఒక దాన్ని మనసా నిర్మించి, విడిచిపెట్టారు, దీని వెంట వెళ్ళండి, ఇది దోర్లుకుoటూ వెళ్తుంది, వెళ్లి వెళ్లి వెళ్లి ఎక్కడ దీని నేమి ఆగిపోతుందో దీని ఇరుసు శిధిలం అయిపోతుందో , ఆ పడిపోయిన ప్రదేశం లో కలి పురుషుని యొక్క ప్రభావం ఉండదు. కాబట్టి మీరు అక్కడ తపస్సు చెయ్యండి అన్నారు. అదిగో అప్పుడు వచ్చింది నైమిశారణ్యం,అక్కడ ఆ చక్రం యొక్క నేమి శిధిలం అయి పడిపోయిoది. ఆ రోజుల్లో మహర్షులు అక్కడ తపస్సు కి కూర్చుంటే, మహాత్ములైన వారు తపోనిష్టాగరిస్టులు అక్కడ కూర్చున్నారని 88000 మంది ఋషులు చేరారంట

నైమిశారణ్యం లోకి ప్రారభం లో. అంత మంది మహర్షుల యొక్క పాద ధూళి చేత పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం,అక్కడ సాక్షాత్తు గా శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించారు ఒక ప్రత్యేక కారణానికి, రాక్షస సంహారానికి,ఆ ప్రదేశంలోనే అనేక మంది ఋషులు కూర్చొని వాళ్ళు సరస్వతీ దేవి ని ధ్యానం చేశారు. ఆ ధ్యానం చేసినందుకు సంతోషించి "కాంచనాక్షి " అన్న పేరుతో ప్రవహించింది అక్కడ నైమిశారణ్యంలో. అందుకే ఇప్పటికి అక్కడ ఉన్న గోమతి నది యందు ధర్మ చక్రం తిరిగింది అని చెప్తారు. ధర్మమూ ఒకలా ఉండదు, అస్తమానం మారిపోతుంది. నేను ఇప్పుడు వేదిక మీద కూర్చుంటే నాదొక ధర్మం, వేదిక దిగిపోతే నాదొక ధర్మం. నేను వేదిక మీద
ఉన్నపుడు మీరు నాతో ఒకలా ఉండాలి, వేదిక దిగి మాట్లాడితే ఒకలా మాట్లాడాలి. నేను నా భార్య తో ఉంటే నాది భత్రు ధర్మం , నేను నా అక్క దగ్గర నిలబడితే నాది సోదర ధర్మం, నేను నా కూతురు దగ్గర నిలబడితే పితృ ధర్మం, నేను నా తండ్రి దగ్గర నిలబడితే పుత్ర ధర్మం, నేను కార్యాలయానికి వెళ్తే ఉద్యోగి ధర్మం, ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు తొందరగా పారణ ధర్మం, ఎక్కడి ధర్మం అక్కడే , ధర్మం ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది, మీరున్న పరిస్థి తి ని బట్టి మారిపోతుంది. ఆ ధర్మాన్ని పట్టుకుని , ధర్మానుస్టానం చేసిన వాడు చివరికి ఏది పొందుతాడు,ఏది కదలని పరమ సత్యమో, దేనికి మార్పు లేదో,ఏది షడూర్ము ల కతీతమో షడ్వికారముల కతీత మొ అటువంటి సత్యమైన ఆత్మా ఎరుకలోకి వస్తుంది ,ఆత్మ కొత్తగా దర్శనం అవ్వటం ఉండదు. ఆత్మ ఉన్నది తెలియబడుతుంది. ఆ ఆత్మ తెలియ బడి అద్వైతాను భూ తి యందు ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ ధర్మ చక్రము అక్కడ ఉన్నటువంటి గొమతీ నది జలములలో తిరిగిందిట. అందుకే ఆ గోమతీ నదీ జలాలతో స్నానం చేసి అక్కడ పురాణ ప్రవచనం వింటారు, కారణం మేమిటంటే ఆ నైమిశారణ్యo యొక్క శక్తి అటువంటిది . నన్నయ్య గారు చెప్తున్నారు ... అక్కడ శౌనకుడు అనబడే కులపతి ఉన్నారు. కులపతి అన్న మాట అర్థం, నాలుగు వేదములను స్వరంతో గురువుగారి దగ్గర నేర్చుకున్న వాడై, వేదం యొక్క ఉపాంగములైన టు వంటి కల్పము , జ్యోతిషము , నిరుత్తము , శిక్షా, వ్యాకరణము, ఇటువంటి 6 టినీ కూడా ,వేదములు వేదాంగములు అంటారు ,వేదంగాములతో కూడినటువంటి నాలుగు వేదములు చదువుకున్న వాడై ప్రతిరోజూ 10000 మందికి భోజనం పెడుతూ పోషిస్తూ వేద పాఠాలు చెప్పటానికి అవకాశాన్ని ,వ్యవస్థ ని కలిపించిన వాడెవరో ఆయనకి కులపతి అని పేరు. అక్కడ శౌనకుడు అనే కులపతి ఉన్నాడు. అంటే ఆయన నాలుగు వేదములు చదువుకుని 6 వేదాంగములు చదువుకున్న వాడు, ఇన్ని చదువుకున్న వాడు కాబట్టి పరమ మౌని, మౌనమ్ గా ఉండే వాడు . ఎప్పుడూ తనలో తానూ మననం చేస్తూ ఉండేవాడు . అది చాలా గొప్ప విషయం ఎందుకంటే మననం చేత మాత్రమే ధారణ ఏర్పడుతుంది. మననం చేత పుస్తకం లోని విద్య మీ విద్య గా మారుతుంది. పుస్తకం లో ఉన్న విద్య మీ విద్య కాదు. ఎందుకంటే పద్యం కావాలంటే మీరు చుస్తే దోషం కాదు, కానీ అసలు ధర్మం ఏది అన్న ప్రశ్న వచ్చి నప్పుడు అన్నిటికి పుస్తకమే చూడాలండి అని మీరంటే అసలు మీరు అనుస్టించ గలిగింది పోతుంది. కాబట్టి పుస్తకం లో ఉన్నది మీరుగా మారిపోవాలంటే అలా మార్చగలిగే ప్రక్రియకి మననమే కారణం. ఎంత లోపల తిప్పుతాడో, విన్న దాన్ని ఎంత పరిశీలనం చేస్తాడో, ఎంత జ్ఞాపకం తెచ్చుకుంటాడో అంత బాగా పట్టుకుంటుంది. అందుకే దేవతలు బ్రహ్మ విద్యని సాధించారు, ఈ బహ్మ విద్య రాక్షసులకు అందకూడదు పాడు చేసేస్తారు, కాబట్టి ఎక్కడ దాచాలి దీన్ని అని అడిగారు . పట్టుకెళ్ళి దదీచి మహర్షి దగ్గర దాచండి అన్నారు. బ్రహ్మ విద్యని అంతటిని పట్టుకెళ్ళి దధీచికి ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడ దాచాలి. ఆయన ఆ బ్రహ్మ విద్యని మననం చేసి మననం చేసి అస్తిగతం చేసేసాడు, ఆయన యముకలలోకి పెట్టేస్కున్నాడు. ఇప్పుడు ఆయన ఎముకలతో చెయ్యబడిన వజ్రాయుధాన్ని ఇంద్రుడు పట్టుకుంటాడు. అంటే ఇంద్రుడి చేతిలో ఉన్నదేది అంటే, బ్రహ్మ విద్య ఆయన చేతిలో ఉంటుంది. జాగ్రత్తగా విద్యని దాచడం అంటే అర్థం ఏంటో తెలుసాండి మీలో పెట్టేస్కోవటం. ఐశ్వర్యాన్ని మీదిగా చేస్కోవటానికి అర్థం ఏమిటో తెలుసా, దానం చెయ్యటమే . దేన్నీ ఎదిచేస్తే మీది అవుతుందో తెలుసుకొని ఉండడమే శాస్త్రం. మీరు ఒకలా అనుకుని చేసినది మీకు అభ్యున్నతి ని ఇవ్వదు. శాస్త్రం ఏది చెప్పిందో అది చేస్తే అది మీదవుతుంది. కాబట్టి విద్య మీది కావటం అంటే విద్యని నిరంతర మననం చెయ్యాలి. ఎప్పుడో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో చెప్తానండి కాదు, ఎప్పుడూ లోపల తిరుగుతూ వుండాలి. ప్రయత్నపూర్వకం గా కాదు, అది అలవాటుగా మారాలి, మననం చేత ఆ విద్య కరతలామలకం అవుతుంది, అది స్పురణ లో నిలబడి ఉంటుంది, ఆ నిలబడింది ఏదైతే ఉందొ అది అంతిమ శ్వాస యందు స్మరణ దానియందు నిలబడుతుంది, అది అభ్యన్నతి కారణం అవుతుంది. తన వారియందు వ్యామోహం పెట్టుకున్నా , తన శత్రువు యందు వ్యామోహం పెట్టుకున్న తిర్యక్కు గా అంటే వెన్నుపాము అడ్డం గా ఉండే ప్రాణి గా వెళ్ళిపోతాడు, ఇంక మనిషిగా ఉండదు, ఏ కుక్క గా నో పిల్లిగానో పందిగానో ఉంటాడు. ఎవడు శాస్త్రము ని నిరంతరం తలుచుకుంటూ ఉంటాడో, ఎందుకని స్మరణ మనసు మీద ఆధార పడుతుంది, మనసు ఊపిరి మీద ఆధార పడుతుంది, ఊపిరిని కనక మీరు నియంత్రించ గలిగితే, మనసు నియంత్రింప పడుతుంది, అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేస్తారు. అందుకే ప్రాణాయామం ఎందుకు చేస్తారు అంటే, మనసుని నియంత్రించబడుతుంది, మనసు నియంత్రింపబడి సంకల్ప వికల్పములు ఆగుతాయి, సంకల్ప వికల్పములు ఆగితే ఆందోళనలు ఆగుతాయి, ఆందోళనలు ఆగితే ఒత్తిడి ఆగుతుంది, ఒత్తిడి ఆగితే ఆరోగ్యం నిలబడుతుంది. అందుకు ప్రాణాయమం వచ్చింది. మీరు చుడండి, మనసుని విడిచిపెట్టారుఅనుకోండి, ఎన్నిటినో సృష్టిస్తుంది, అంతే ఎక్కడ లేని ఆందోళన పుడుతుంది, ఈ ఆందోళన ఆరోగ్యానికి భంగకరం అవుతుంది. ప్రాణాయామము మనసుని నియంత్రించే సాధనముగా ఆరోగ్య కారకము. భారతం లాంటి పురాణాలని మీరు పరిశీలనగా చదివినా విన్నా, ఇది చెప్పండి అని ఎంత మర్యాదగా అడగాల్సి ఉంటుందో, మీకు అర్థం అవుతుంది, చదవకపోతే ప్రవర్తన యందు దోషం ఉంటే ఎక్కడ ఏది ఏ విధం గా అడగాలో తెలియదు. నైమిశారణ్యం న సునకుడైన పరమ మౌని, రోజూ 11000 మందికి భోజనం పెట్టి, వేదములు చదివించే వాడు, బ్రహ్మర్షుల తో కుడి ఉన్న వాడు, ఆయన చేస్తున్నదేమిటి , అంటే 12 సంవత్సరములు కొనసాగేటటువంటి సత్ర యాగాన్ని చేస్తున్నాడట. యాగములు అనేకమైన యాగములు ఉంటై, అందులో సత్ర యాగము అనే ఒక యాగము, ఈ సత్ర యాగం చాలా గమత్తుగ ఉంటుంది, బ్రహ్మణు న్ని దానం పట్టమని చెప్పింది శాస్త్రం, ఏమి బ్రాహ్మణుడే ఎందుకు దానం పుచుకోవటం, అంటే ఇచ్చిన పంచాల చాపల్లా తానూ కట్టేసుకోకూడదు. పంచాల చాపులు పుచ్చుకుoటే, ఒక ఐదో ఆరో తను కట్టుకోవటానికి ఉంచుకుని, మిగిలిన పంచాల చాపులు తీస్కెళ్ళి వేరే ఉంచాలి, ఉంచి దేవాలయాల్లో శారదా నవరాత్రులు జరుగుతున్నాయి అన్నారనుకోండి, దీక్షా వస్త్రాలు గా కట్టుకోండి అని ఒక 10-15 పంచాల చాపులు తీస్కొచి ఇచ్చేసే య్యాలి. బ్రాహ్మణుడు తెలుసుకోవలిసిన మొదటి లక్షణం ఏమిటంటే కేవలం తానూ అనుభవించుట కాదు,వైదిక సంస్కారం పెరగటానికి , తనకు వచ్చిన దాన్ని తిరిగి పెట్టుబడి గా ఇస్తూ ఉండాలి. అందుకే బ్రాహ్మణుడి జీవితం నిరాడంబరం గా ఉండాలి అని శాస్త్రాలు చెప్పడానికి కారణాలు అవే. సత్ర యాగము అన్న మాట కి అర్థం ఏమిటంటే దానికి యజమానులు ఉండరు. యజమాని ఉంటాడు చేయించే వాళ్ళు ఉంటారు. యజమాని అంటే కోర్కె ఆయనది, ఆయన కొరకు యాగం జరుగుతూ ఉంటుంది, దశరధ మహారాజుకి పిల్లలు లేరు, దశరధ మహారాజు వశిష్టున్ని ఆశ్రయించాడు, వశిష్టుడు అన్నారు, అశ్వమేధ యాగం చెయ్యాలి అని, వశిష్టుడి కి ఏమి కలగదు, సంతానము కలగకుండా ఏ దోషం ప్రదిభందకం గా దాశరధ మహారాజు కి అడ్డం వచ్చి నిలబడిందో ఆ దోషము తొలగి పోతుంది, ఇప్పుడు ఆ దోషము తొలగటానికి కి ఈ యాగం చెయ్యవలసి ఉంటుంది అని వశిష్టుడు చెప్పాడు, కాబట్టి ఆ యాగం చేశాడు, ప్రతిబంధకం పోయింది, ఇప్పుడు సత్పుత్రులు కలగాలి, కాబట్టి పుత్రకమేష్టి చేసాడు, పయసపాత్ర పట్టుకుని యజ్ఞ పురుషుడు బయటికి వచ్చాడు. యాగము , హోమము , బలి అని మూడు ఉంటై వాటిని కొంచం జాగ్రత్త గా మీరు పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది. యాగము యాగ శాల అని ఉంటై, యాగ శాలా ప్రవేశేమే అద్భుతమైన విషయం, అసలు ఆ దీక్షా వస్త్రాలు కట్టుకొని మంగళవాయిద్యాలతో వెళ్తారు, అందరు యాగ శాల లోకి వెళ్ళకూడదు, యాగ శాల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి మనం అందరం, యాగ శాల లోకి ఋత్విక్కులు వెళతారు, వెళ్లి అగ్ని ముఖంగా హవిస్సులు ఇచ్చి దేవతలని పట్టుకెళ్ళ మని చెప్తారు, అంటే వాళ్ళకి అన్నం పెడతారు, అగ్ని ముఖం గా వాళ్ళు ఆ అన్నం తింటారు, వాళ్ళా అన్నం తినటానికి వచ్చి కూర్చుంటారు , ఇవాళ్ళమనని పిలుస్తారు అనం పెడతారు అని, మనం పిలిచాం అనుకోండి భోజనానికి రండి అంటాం , తప్పు దేవతార్చనకి రండి అనాలి, వచ్చి కూర్చుంటే అయ్యా వడ్డించేస్తున్నాం కూర్చోండి అంటారు . అలాగే యాగశాల నిర్మాణం చేసేసి నాంది ప్రస్తావన చేసేస్తే , దేవతలు వచ్చి కూర్చుంటారు, హవిస్సులు ఇస్తారు అని, అందుకని యాగ శాల లోకి అందరూ వెళ్లారు, దానికి తగిన నియమ పాలన చేసేవాళ్ళు, దీక్షితులు అందుకే యాగం చేస్తేనే దీక్షా అన్న పేరు వచ్చింది. దీక్షా వస్త్రాలు కట్టుకుని వాళ్ళు యాగ శాల లోకి వెళతారు. అటువంటి హోమగుండం , హవిస్సులు, ఋత్విక్కులు , దేవతలు, అందరూ ఆ యాగ శాల లో కూర్చున్నారు కాబట్టి,అటువంటి యాగాశాలకి ప్రదక్షిణం చేసేస్తారు,కాబట్టి దేవతలకి ప్రదక్షిణం అయిపోతుంది, వారిని కుడి భుజం వైపున ఉంచుకుని తిరిగాడు, ప్రదక్షిణం అన్న మాటకి అర్థం ఏమిటంటే, మీరు ఇటువైపు నుండి అటువైపు వచ్చినా ఈ మధ్యలో ఉన్న వస్తువు మీ ఎడం భుజం వైపు రాకూడదు, ఎడమ భుజం వైపు ఉన్నది అంటే పూజనీయత తరిగి పోతుంది. కుడి భుజం వైపు ఉన్నది అంటే పూజనీయత పెరుగుతుంది. ప్రదక్షిణ ఎందుకు చేస్తారు అంటే గుండ్రం గా తిరిగి వస్తున్నా ఈ వస్తువు మాత్రం నా కుడి భుజం వైపే ఉండాలి, అంటే ఇది పరమ పవిత్రం అని అర్థం ఏమిటంటే కుడి భుజం దీనివైపు ఉండాలి, ఇది ఇంత పవిత్రమైనది కాబట్టి దీని చుట్టూ నేను తిరిగినప్పుడు దీనిలోని శక్తి నాలోకి ప్రసరిస్తుంది, ప్రసరించి నాకు అభ్యున్నతి ని ఇస్తుంది. మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, దేవతా మూర్తి కింద ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్రం తన శక్తిని చిమ్ముతూ ఉంటుంది చుట్టును, మీరు మౌనమ్ గా ప్రదక్షిణ చెయ్యాలి, ఊసుపోని కబుర్లు చెప్తూ ప్రదక్షిణ చేస్తే మీకు ఫలితం రాదు, పైగా దేవాలయాలకి మళ్ళి మళ్ళి కుమ్భాభిషేకాలు చెయ్యాల్సొస్తుంది. కాబట్టి కలియుగం లో దేవాలయాల కున్న శక్తి క్షీణిo చి పోవటానికి కారణం అదే, అమర్యాద తో కూడిన నడవడి దేవాలయం లో. మీరు రామాయణ మహా కావ్యం చదివితే, ప్రతి చోటా ఎక్కడెక్కడ పూజనీయమైన వస్తువు కనపడితే అక్కడక్కడ ప్రదక్షిణం చేసివేళతాడు శ్రీ రామచంద్ర మూర్తి, అప్రదక్షిణ గా వెళ్ళడు. మహాభారతం లో విరాట పర్వము లో అర్జునుడు యుద్ద భూమి లోకి వచ్చి నిలబడితే, ఆ సారధి ఉత్తర కుమారిడి తో చెప్తాడు, నీవు రథం నడిపెటప్పుడు , ద్రోణాచార్యుల వారికి కాని భీష్మా చార్యుల వారికి కాని నా యడం భుజం వైపు వాళ్ళ రధాలు ఉండేటట్టు తొలకు సుమా ! వారు మహానుభావులు, వారు పూజనీయులు, వారు నాకు గురువు, వారు నాకు పరమేశ్వర స్వరూపము, వారు నాకు ఎడమ భుజం వైపుకు ఉండరాదు, ఎప్పుడు నా రధం వెళ్ళినా , వారు నారధానికి కుడివైపు ఉండేటట్టు చూడు అంటాడు. అంతటి ధర్మైక మూర్తులు కాబట్టే వాళ్ళు అంత విజయాన్ని సాధించారు. అంతటి మహోజ్వలమైన స్థితి ని పొంద గలిగారు. కాబట్టి ఆచరనత్మకమై ఉంటుంది, అదే ధర్మమూ అన్న మాటకి అర్థము. కాబట్టి ఆయన (శౌనకుడు) సత్ర యాగం చేసాడు, సత్ర యాగం యజమాని కొరకు చెయ్యరు, ఎవరు ఋత్విక్కులు గా ఉన్నారో వారే యజమానులుగా ఉంటారు. వారే చేస్తారు, వారే కోరికలు కోరతారు. ఇప్పుడు శౌనకుడికి కోరికేమి ఉంటుంది, శౌనకుడితో చేరినవారుకి కోరికేమి ఉంటుంది. వారందరు కలిపురుషుని యొక్క ప్రభావం తమపై ఉండకూడదని, ఈశ్వరుని అనుగ్రహం మాకు కావలి అని అక్కడ కూర్చున్న వాళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళు విచారించ వలసి వస్తే దేనిగురించి విచారిస్తారు , అయ్యో మేము అంటే ఇక్కడ నైమిశారణ్యం చేరుకున్నాం ఇక్కడ కుర్చుని జపం చేస్కున్తున్నాం, పురాణ కధలు వింటున్నాం, కానీ పాపం ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు సంసారం లో మగ్గిపోతున్న వాళ్ళు,ఈ భూమండలం కలిపురుషుని యొక్క ఉద్దతి కి వాళ్ళు వశులై పోతున్నారు, ఇప్పుడు లోకం కొరకు, లోకం అంతా కూడా శాంతి గా ఉండాలి, కలిపురుషుని యొక్క ఉద్దతి తో బాధ పడకూడదు, కాబట్టి ఇప్పుడు వాళ్ళు యాగం చేస్తే వాళ్ళకి కోరిక లేదు , యజమాని లేడు , కోరికా లేదు, కాబట్టి ఋత్విక్కులే యజమానులుగా ఉంది 12 సం॥ దీర్గ సత్ర యాగం చేస్తున్నాడు శౌనకుడు, ఆ అరణ్యం ఎటువంటిది, ఆ ప్రదేశం ఎటువంటిది, అక్కడ ఉన్న మహాత్ములు ఎటువంటి వారు, అసలు వాళ్ళ మనసులు ఎటువంటివి, వాళ్ళు చేస్తున్న యాగం ఎటువంటిది అక్కడికి వెళ్ళాడు మహానుభావుడైన సౌతి , నన్నయ ఆయన్ని సౌతి , కధకుడు అని ఈరెండు పేర్ల తో పిలుస్తూ ఉంటారు. మళ్ళి వైశంపాయనుడు వచ్చేంతవరకు కధ లో అలాగే పిలుస్తూ తీస్కొని వెళ్తారు. ఆయన రోమహర్షుని కుమారుడు ఉగ్రశ్రవసుడు ఆయన పేరు ఆయన్ని సౌతి అంటారు. ఆ సౌతి ఆ యొక్క నైమిశారణ్యనికి వచ్చాడు. అక్కడికి ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే అక్కడికి వచ్చిన ఉగ్రస్రవసుని యొక్క తండ్రిగారి పేరు రోమహర్షనుడు. ఆయనకి అసలా రోమహర్షనుడు అన్న పేరెందుకు వచ్చింది సూతుడన్న పేరెందుకు వచ్చింది, సూతుడన్న పేరు సాధారణం గా సారధికి అన్వయం చేస్తూ ఉంటారు, లేదా జన్మ చేత కొంత మందిని సూత అనే శబ్దం తో పిలుస్తారు. ఇక్కడ రోమహర్షనుడు సుతుడు అని ఎందుకు అంటున్నారో తెలుసాండి, అది ఈ జాతి సంబందమైన అన్వయం కాదు. మీకు కాశి ఖండం లో దీనికి సంబంధించిన ప్రస్తావన చేస్తారు.
పృధు మహారాజు ఒకానొకప్పుడు ఒక పెద్ద యజ్ఞం చేసాడు, ఆ యజ్ఞగుండం లోంచి ఒక మహా పురుషుడు ఆవిర్భవించాడు, ఆయన్ని పిలిచారందరూ "అగ్నికుండ సముద్భుతా " అగ్ని గుండం లోనించి జన్మించిన వాడా "నిర్మలమనసా " నిర్మలమైన మనసు కలవాడా అని పిలిచారు. ఈయన వేదవ్యాసునకి శిష్యుడైయ్యాడు. శిష్యుడై, పురాణ వగ్మయాలు అన్నిటిని కూడా , అష్టాదస పురాణాలూ అన్నింటినీ కుడా వేద వ్యాసుల నుండి ఉపదేశం గా పొందాడు, పొంది ఈ పురాణముల అన్నిటిని కూడా ప్రవచనము చెయ్యటం తన ధ్యేయం గా పెట్టుకున్నాడు. ఎందుకలా పెట్టుకోవాలి ఆయన అంటే ఆయనకేదో ఊసు పోక చెప్పినటువంటి వాడు కాదు, ఆయన చెప్పేటప్పుడు ట పొంగిపోయి, ఆ కధ లో తానూ లీనమై పోయి ఎంత పరవశించి పోయేవాడoటే లోపల తాను ఏ ఘట్టాన్ని వర్నిస్తున్నాడో ఆ ఘట్టాన్ని తాను దర్సనం చేసి పరవశించి చెప్పెవాడు ట, అంత పరవశించి ఆయన చెప్పే వాడు కాబట్టి సభలో కూర్చున్న వాళ్ళందరికి కూడా ఆనందంతో పులకలు వచ్చి వెంట్రుకలు నిక్కపొడుచుకునే లాగా వినేవారు ట అందరు ఆయన చెప్పే ప్రవచనాన్ని, అంత భక్తి కుదురుకునేది ట ఆయన మాట్లాడితే. అలా మాట్లాడాడు కాబట్టి ఆయనని రోమ హర్షణుడు అని పిలిచారు. అగ్ని గుండం లో నించి ఉద్భవించాడు కాబట్టి సుతా అని పిలిచారు. అటువంటి రోమహర్షుని కుమారుడు ఉగ్రశ్రవసుడు, ఈయనకీ తండ్రి పోలికే వచ్చింది. ఈయనకి కూడా ఏమిటి పని అంటే పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. పురాణ ప్రవచనము భూతద్దం పెట్టి వస్తువుని చూపించడం అంటుంది శాస్త్రం. వేదము రాజ శాసనం ఎలా ఉంటుందో అలా మాట్లాడుతుంది "సత్యం వధ ధర్మం చర "అంటుంది. ఇప్పుడు వేదంలో ఉండే సమస్త ఆచార కాండ ని స్మృతులు చెప్తాయి . స్మృతి అంటే ఏ ఋషి వాటిని అన్నింటినీ వేదం లో నించి తీసి క్రోడీకరించారో ఆ ఋషి పేరు ఆ స్మృతికి వస్తుంది. యాజ్ఞవల్కుడు క్రోడీ కరించాడు అనుకోండి యగ్నవల్క స్మృతి. గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి. మనువు క్రోడీకరిస్తే మను స్మృతి. ఈ స్మృతి
కి ఆధారం శ్రుతే, వేదమే వేదంలోనించే తీస్తారు కాబట్టే "శ్రుతే రివార్థం స్మ్రుతిరన్వ గఛత్ " అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ ఎలా వెళ్తుందో శ్రుతి వెంట స్మృతి వెళ్తుంది అని కాలిదాస మహాకవి రఘువంశ మహాకావ్యం లో వర్ణన చేస్తాడు. వేదాలు ఏమేమి చెప్పినవో అవే స్మృతులు చెప్తాయి. కాని అకడక్కడ చెప్పిన విషయాలు తీసి ఋషి క్రోడీకరిస్తాడు. దాన్ని స్మృతి అంటారు. ఇప్పుడు ఈ శ్రుతి స్మృతి ఈ రెండు ఏమి చెప్తాయి అంటే మనం ఎలా ప్రవర్తించాలో ప్రామాణి కం గా మనకు చెప్తాయి, ఈశ్వర వాక్కు కాబట్టి, కానీ దాని మీద మనకి బాగా బుద్ధి కుడురుకోవాలి అనుకోండి,పురాణం వినాలి. పురాణం వింటే నువ్వు శ్రుతిని స్మృతిని విన్నట్టే ఎందుకని "ధర్మం చేర " నువ్వు ధర్మం నే అనుస్టించు , ధర్మమే అనుస్టిస్తే ఏమవుతుందoడి, రామాయణం విను నీకు అర్థం అవుతుంది ధర్మం అంటే ఏమిటో , ఎలా రక్షిస్తుందో. ఇప్పుడు వేదం లో ధర్మం చెర అన్న మాటని రామాయణ మహాకావ్య రామచంద్ర మూర్తి యొక్క జీవితం గా సమర్ధించి చూపించి మీకు ధర్మము నందు పూనిక కల్పిస్తుంది. అయితే పురాణానికి చరిత్రకి మళ్ళి ఒక తేడ ఉంటుంది. ప్రధానమైన వేత్యాసం ఎక్కడ ఉంటుంది అంటే, ఒక వ్యక్తి పుట్టుక , జీవితం, మరణం వారికే చరిత్ర మాట్లాడుతుంది. కృష్ణ దేవరాయలు ఎప్పుడు పుట్టారు ఎలా పెరిగారు, ఎన్ని విజయాలు సాధించారు, వెంకట రమణున్ని ఎలా సేవించారు ఎలా మరణించారు ఇవి చెప్తుంది చరిత్ర, అది పురాణం చెప్పిందనుకోండి కృష్ణ దేవరాయల వారి జీవుడు కృష్ణ దేవరాయలగా వచ్చి ఆంధ్రభోజుడన్న కీర్తి ఎలా పొందాడో చెప్తుంది, కృష్ణ దేవరాయల దేహం పడిపోయినప్పుడు , కృష్ణ దేవరాయల జీవుడు ఏమైయ్యడో కూడా చెప్తుంది అందుకే "సర్గాస్చ ప్రతిసర్గాస్చ మన్వత రా నిచ " అక్కడ సర్గ ప్రతిసర్గ నియమం తో వంశాన్ని అంతటిని , మన్వంతరముల అన్నిటిని వర్ణిస్తూ, జీవుడు ఎలా వైక్లావ్యలని పొంది , శరీరాలని మార్చుకొని చిట్ట చివరకు ఈశ్వరుణ్ణి చేరాడు అన్న విషయాన్నీ వర్ణిస్తుంది. భరతుడు , అంతా అరణ్యానికి వెళ్లి ఒక లేడి మీద వ్యామోహం పెట్టుకున్నందుకు మళ్ళి దేనిగా పుట్టాడు , అప్పుడు ఆ వ్యామోహం ఎలా పోయింది, అదే చరిత్ర అనుకోండి ఆయన ఒక శరీరం లో ఉన్న అంత వరకు మాత్రమే చరిత్ర మాట్లాడుతుంది. అందుకని చరిత్ర అతోధరణ కొరకు హేతువుగా నిలబడుతుంది అని చెప్పటానికి కష్టం. కాని పురాణం మాత్రం అతోధరణ కొరకు హేతువు అవుతుంది. శ్రుతి యందు స్మృతి యందు ఉన్న దాన్ని భూతద్దం లో పెట్టి చూపిస్తుంది. శ్రుతి వింటే నాకు అర్థం అయ్యిందండి అని అందరు చెప్పాలేరు , కానీ వేదాన్ని వినడమే చాలు. స్మృతి వింటే నాకు అర్థం అయ్యిందండి అని అందరు చెప్పగలరా అంటే చెప్పటం కష్టం. పురాణం వింటే నాకు అర్థం కాలేదండి అనటానికి ఏమీ ఉండదు. ప్రవచనం అంటే ప్రకృష్ట వచనం , బాగా కర్ర పాతుకుందో లేదో అని ఆయనే బాగా ఊపి చూస్తాడుఒకసారి . అలా పుర్వపర విచారణ చేస్తూ కధ ని సమర్ధిస్తూ సృతితో స్మృతితో అనుసంధానం చేస్తూ జరిగిన మాట తేలికగా మన మనసులో ధర్మం నిలబడే లాగా చేస్తుంది. మనం ధర్మము నందు అనురాక్తులం అయ్యేటట్టుగా చేస్తుంది. అందుకని ప్రవచనం చేసారు. రోమహర్షనుడైన సూతుడు చేసినా ఆయన కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు చేసినా దేనికి కొరకు చేసారంటే , వాళ్ళకేదో ఊసు పోక , కాలక్షేపo లేక అదేపనిగా చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళు కాదు , అందుకే మీకు ఈ పురాణం ప్రవచనం అనే ప్రక్రియ , ప్రపంచ పటం లో ఏ ప్రదేశం లో ఏ సంప్రదాయం లో ఏ విశ్వాసం లో మీకు కనపడదు. పురాణం ప్రవచనం చెయ్యటం అనేది కేవలం సనాతన ధర్మము నందే ఉన్నది.
మీకొక యదార్ధం చెప్తాను, దేవాలయానికి పెద్దలైన వారు వచ్చి నప్పుడు ఒక విషయం అడుగుతారు, ఇక్కడ ఎప్పుడైనా రామాయణం చెప్పరా అని, ఇక్కడ రామాయణం చెప్పారండి అన్నారంటే, ఆ ప్రాంగణానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అన్నిటికన్నా ఒక ప్రాంతం పునీతమైంది అని ఎప్పుడు చెప్తారoటే అక్కడ భారతం చెప్పి ఉంటె. దేవాలయ ప్రాంగణం లో కుర్చుని భారత చెప్పినా ,విన్నా అది సర్వోత్క్రుస్ట మైన స్థితి ని కల్పిస్తుంది. దేవాలయ ప్రాంగణం లో ఈశ్వరుని సముఖం లో భారతం వినడం అంటే కొన్ని కోట్ల కోట్ల జన్మలకి కాని ఆ అదృష్టం జీవుడికి ఇవ్వరు అది శాస్త్రములు తెగేసి చెప్తున్నై, ఎందుకని అంటే మహా భారతాన్ని వినడమే అంత గొప్ప, ఎందుకని అంటే ప్రతి చోట, ప్రతిమాట ధర్మ సుక్ష్మ సమన్వయమే. అంత గొప్పగా ధర్మమూ అనే పతకాన్ని ఎగర వేస్తుంది మహాభారతం.
ఇప్పుడు అక్కడికి ఉగ్రశ్రవసుడు వచ్చారు. ఆయన ప్రవచనం చేయుట యందు దిట్ట. ఆయన కి ఎవరు కనపడ్డారు, శౌనకుడు , బ్రహ్మర్షులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందు నమస్కారం చెయ్యాలి. ఉగ్రస్రవాసుల వినయం ఏమిటంటే ఆయనే బ్రహ్మర్షులు కి నమస్కారం చేసారు. నమస్కారం చేసి కూర్చుంటే వాళ్ళందరూ గబగబా ఆయన చుట్టూ చేరారు. ఒక మహాత్ముడు కన్పించినపుడు ఆయన తో ఏది మాట్లాడాలో , ఎలా మాట్లాడాలో తెలిసుండి మాట్లాడిన వాడు ధన్యత ని పొందిన వాడు తప్ప ఎవరిదగ్గర ఏది మాట్లాడాలో తెలియని వాడు అవకాసం వచ్చిన జారవిడుచుకున్న వాడు. ఆయన్ని వాళందరూ కూడా ప్రశ్న వేశారు , అయ్యా మేమందరం ఇక్కడ నైమిశారణ్యం చేరాము , 12 సంవత్సరములు కోన సాగే సత్ర యాగాన్ని నిర్వర్తిస్తున్నాం , మేము అందరమూ కూడా భగవంతుని యొక్క పుణ్య కధలు వినడం యందు అనురాక్తులం అయిన వాళ్ళం, నీవు మాకు ఏమైనా భగవథ్ సంబంధమైన కధలు చెప్ప వలసింది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, నువ్వు ఈ మధ్య కాలం లో ఏమి చూసావు , ఏ తీర్థముల యందు స్నానం చేసావ్, ఏ క్షేత్రములు దర్శించావు అని అడిగారు. తీర్థ యాత్ర అని అంటారు. ప్రకృష్టమై అనేకమైన పేర్ల తో తీర్థములు ఉంటై. ఒక వెంకటాచల క్షేత్రం ఉండనుకోoడి, ఎన్నో తీర్థములు ఉంటాయి . తీర్థము అంటే దానియందు స్నానం చేస్తే ఒక యజ్ఞం చేసిన పలితాన్ని మీ ఖాతా లో వేస్తారు. యజ్ఞం చేస్తే సోమయాజి అంటారు. గృహస్తాశ్రమం లో కి ప్రవేసించేది ఎందుకు అంటే యజ్ఞం చెయ్యటం కోసం. యజ్ఞ యాగాదులు జరిగినప్పుడు ఆర్థికం గా ఆదుకోవటం కోసం, వాడి బలాన్ని దానికి దాపుగా పెట్టి రక్షించడం కోసం, ఏది చెయ్య గలిగితే అది చెయ్యాలి, యజ్ఞ యాగాది క్రతువుల కోసం , కానీ కలియుగం లో మానవుడు అన్ని చెయ్యలేక పోతున్నా డెమో అని ఈశ్వరుడు తీర్థము లని ప్రవేశపెట్టాడు. తీర్థం వేరు నది వేరు, తీర్థం లో స్నానం చేస్తే యజ్ఞం చేసిన పలితం ఇస్తారు , వేదం లో చెప్పారు ఈ మాట. తీర్థ యాత్ర చేస్తే తీర్థములో స్నానం చేయ్యాలి. అప్పుడు తీర్థ యాత్ర చేసిన వాడు అంటే యజ్ఞం చేసిన వాడుతో సమానం. అందుకు వచాయి. అందుకు తీర్థాలకి కి వెళ్తే స్నానం చేస్తారు.
కాబట్టి వారందరూ నువ్వు పురాణ వాగ్మయం అంతా చదువుకున్నావు, కాబట్టి ఎక్కడ ఏ తీర్థం ఉందొ తెలుసు, ఎక్కడ ఏ క్షేత్రం ఉందొ తెలుసు, కాస్త పెద్దాయన తో ఎందుకు వెళ్తారు యాత్రకి అంటే ఎవరు కాస్త తెలిసున్న వాడో ఆయన పెట్టె వీళ్ళందరూ పట్టుకుంటారు, ఎందుకు అంటే ఆయనకి తెలుసు, ఆయన నాలుగు మాటలు చెప్పి చూపిస్తాడు అని తాపత్రయం. వెళ్ళలేని వాళ్ళు , అయ్యా ఏమి చూసారు అని అడిగి తెలుసుకుని సంతోష పడతారు. మీరు ఏమేమి చూసారు , మీకన్ని తెలుసు కదు కాబట్టి చెప్పండి.
తీర్థ యాత్ర చేసి వచ్చిన వారి ఇంటికి వెళ్తే అడగ వలశి న ప్రశ్న ఇది. వాళ్ళు కూడా ఏమి మాట్లాడాలి అంటే వాళ్ళు తీర్థ యాత్ర ప్రారంభం దగ్గర నించి మననం చేస్కోవాలి . ఎక్కడెక్కడికి వెళ్ళాం అక్కడ ఏమేమి చూసాం, ఏయే గుళ్ళోకి వెళ్ళాం , అక్కడ స్థల పురాణం ఏమిటి, దాన్ని గొప్పతనం ఏమిటి, ఏమి స్నానం చేసాం , అక్కడ ఏ మహాత్ములు గురించి మనం విన్నాం, వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని ఇంటికి వచ్చిన వాడికి చెప్పుకుంటూ పోతే, ఆ చెప్పటం చేత విన్న వాడు తరిస్తాడు, వీళ్ళకి మననం అవుతుంది, మళ్ళి మళ్ళి తీర్థముల పేర్లు మళ్ళి మళ్ళి క్షేత్రముల పేర్లు స్మరించడం చేత ప్రాసంగిక పుణ్యం పడిపోతుంది, అందుకే తీర్థ యాత్ర అన్న మాట మీద అన్ని విషయాలు పేర్కొన్నాయి శాస్త్రాలు.
కాబట్టి అందుకు అడగటం , నైమిశారణ్యం లో ఉన్న వాళ్ళు చేత కాక ఆ ప్రశ్న వేశారు అని మీరు అనుకోకూడదు, మహా భారతం ధర్మ సుక్ష్మ సమన్వయము, మహా భారతం వింటే మనం ఏమి చెయ్యాలో మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఊంచు కోవటానికి భారతం తప్పా , నన్నయ్య గారు బాగా రాసారు అని సర్టిఫికేట్ ఇవ్వటానికి భారతం చదవక్కర్లా, ఆయనికి సర్టిఫికెట్లు మీరు నేను ఇవ్వకరలేదు ఆయన తరించిపోయారు. మనం తరించడం నేర్చుకోవటానికి భారతం చదవాలి. ఇప్పుడు వాళ్ళందరారికి ఆయన (ఉగ్రశ్రవసుడు / సౌతి ) నమస్కరించారు, అక్కడ బ్రహ్మర్షులు అందరూ ఆయన్ని ప్రశ్న వేసారు. అప్పుడు ఆయన అన్నారు శమంతక పంచాకాన్ని చూసొచ్చాను, ఎందుకు ఈ మాట వచ్చింది , వాళ్ళు ప్రశ్న వేసే లోపే , వాళ్ళకి చెప్పాలి అన్న ఉత్సాహం పెల్లుబుకుతుంది ఆయనలో . అంటే అన్నీ తెలిసున్న వాడు ఇది చెప్తే బావుండు అనుకున్నాడు అంటే అది ప్రయోజన కరమైన విషయము అని మీరు నమ్మ వలసి ఉంటుంది కదా లేకపోతే ఆయన కి ఆ పొంగు ఎందుకు వస్తుంది. కాబట్టి ఆయనకి ఏమి జ్ఞాపకం వచ్చిందంటే , శమంతక పంచకం జ్ఞాపకం వచ్చింది, అక్కడ పరశురాముడు 21 మార్లు ఈ భూమండలం అంతా కూడా దండ యాత్ర చేసి , క్షత్రియుల్ని తెగటార్చి వారి రక్తం తోటి 5 సరోవారాల్ని ఏర్పాటు చేసి, ఆ రక్తం తోటి పితృదేవతలకి తర్పణం ఇచ్చాడు , అప్పుడు వాళ్ళు అయ్యాబాబోయి ఇలాంటి అలజడి వద్దురా నాయనా ఇంక క్షత్రియ సంహారం చెయ్యకు అన్న తరువాత ఆయన శాంతించాడు, అదిగో అంత గొప్ప ప్రదేశం ఆ శమంతక పంచకాన్ని, కురుక్షేత్రాన్ని, జనమేజయున్ని , యాగాన్ని ఇవన్నీ చుసోస్తున్నాను , అంటే వాళ్ళన్నారు మేము ఏది వింటే బావుంటుంది, ఇది అడగాల్సింది , మీరు వేదిక మీదకి వచ్చిన వ్యక్తికి ఇలా ఒక కాయితం ఇచ్చి ఇది చెప్పండి అని అడగ కూడదు, ఏది మీకు చెప్పాలో వేదిక మీద కూర్చున్న వాడికి తెలిసి ఉంటుంది అని మీరు నమ్మాలి , అది వినయం . ఆ వినయం లేని వాడికి వినే అర్హత ఉండదు. ఆ వినయం ముందు నేర్చుకోవాలి. కాబట్టి మాకు మీరు ఏది చెప్పలనుకున్తున్నారు, ఏది చెప్తే బావుంటుంది, ఏది మాకు పురషార్థాన్ని కలిపిస్తుంది మాకు అటువంటి గ్రంధాన్ని అటువంటి ఇతిహసాన్ని , అటువంటి విషయాన్ని మాకు ప్రవచనం చెయ్యవలసింది మహానుభావా అని వాళ్ళు ప్రార్థన చేస్తే,
ఆయన అన్నారు మా గురువు మహానుభావుడు , వేదమంతా ఒక రాశిగా పడిపోయి ఉంటె , కలియుగం లో ఉండేటటువంటి ఆయుర్థయన్ని దృష్టిలో పెట్టుకుని వేదములను చదవ గలిగిన వాళ్ళు ఉండరని , వేదమును విభాగం చేసి "రుక్" "యజుర్" "సామ" "అథర్వణ" వేదము అని నాలుగు విభాగములు చేసి 18 పురాణములు వెలయించిన తరువాత పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచన చేసారు, అందులో లేనటువంటి ధర్మ సుక్ష్మం లేదు , భారతం అంతా కూడా రచన చేసిన తరువాత వేదవ్యసుడే అన్నాడు నీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా , ఏది తెలుసుకోవాలన్నా భారతమే ఆధారం ఇంత కన్నా ఇంకోటి ఏది ఉందొ నాకు చెప్పు అన్నాడు , కాబట్టి నీకు జవాబు లేనిది లేదు మహాభారతం లో అన్ని ఉన్నాయ్. నీకు వెతుక్కోవటం రావాలి, తెలుసు కోవటం రావాలి , ఇది కాకుండా వేరొకటి కొత్తగా తెలుసుకోవటానికి వేరేది ఉండదు, అన్ని భారతం లోనే ఉన్నాయ్.
అన్ని ఆఖ్యానములతో అన్ని ఉపాఖ్యానములతో అన్ని విసేషాలతో భారత రచన చేశానని మా గురువైన వేద వ్యాసుడు పేర్కొన్నాడు. అటువంటి మహాభారతం ను
"ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబనియు ఆధ్యాత్మ వేదులు వేదంతమనియు నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని కవివృ ష భులు మహా కావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష సంగ్రహమని అయితి హసకులు ఇతిహసమనియు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయంబు అని మహి కొనియాడుచుండ వివిధ వేద తత్వ వేది వేదవ్యసుడాది ముని పరశారత్మజుండు, విష్ణు సన్నిభుoడు , విశ్వ జానీనమై పరగుచుoచేసే భారతంబు"
సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన టు వంటి వేదవ్యాసుడు రచన చేసినటు వంటి ఆ మహాభారతం ఉందే దాన్ని ధర్మమునందు నిష్ణాతులైన వారు ఇదే ధర్మ శాస్త్రం అని మహా భారతాన్ని పిలుస్తారు. ఆ ధర్మమునే భోధ చెయ్యటానికే సమస్త వాంగ్మయం వచ్చింది , " ఆధ్యాత్మ వేదులు వేదంతమనియు" వేదాంతములు అంటే వేదముల చివరన ఉండేవి ఉపనిషత్తులు , ఆ ఉపనిషత్తుల యందు శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తాడు, ప్రశ్న వేస్తే గురువు మాట్లాడుతాడు, మాట్లాడితే ఆ జ్ఞానము వలన మళ్లి పుట్టే అవసరము లేని, పునరావ్రుత్త రహిత శాశ్వత శివసాయుజ్య స్థితి ఏర్పడుతుంది, అటువంటి మోక్ష కారకమైనటువంటి వేదంతము ఏది ఉన్నదో ఆ వేదంతమే మహా భారతం అని వేదాంతులు చెప్తారు "నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని " లోకంలో నీతి మాట్లాడే వాళ్ళందరూ మహా భారతం కన్నా నీటి శాస్త్రం లేదు అంటారు. కాబట్టి మహాభారతం గురించి మాట్లాడిన మహాభారతం లోని ఏ వ్యక్తి గురించి పుస్తకాలు రాసిన ఆ కోణం లో నే చూసి రాయాలి, ఆ కోణం లోనే మహాభారతాన్ని రాయాలి, తప్ప ఇంకొకలా చూసి కవిత్వ పరంగా అన్వయం చేసి రాసే అధికారం ఎవరికీ ఉండదని తీర్పు. "నీతి శాస్త్రంబని కవివృ ష భులు మహా కావ్యమనియు" గొప్ప కవులు దాన్ని మహా కావ్యం అని పిలిచారు ఇంతకన్నా కావ్యం ఉండదు లోకంలో "లాక్షణికులు సర్వలక్ష సంగ్రహమని" లాక్షణికులు ఇంతకన్నా గొప్ప లక్ష్య శాస్త్రం వేరొకటి లేదు అని అన్నారు " అయితి హసకులు ఇతిహసమనియు" యదర్ధముగా జరిగిన గాధ ఇంత కన్నా గొప్పగా చెప్పటం వ్యాసునికి తప్ప అన్యులకి సాధ్యం కాదు. "పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయంబు" పురాణం చదివిన వారు మహాభారతం లో లేనటువంటి పురాణం లేదు , అన్ని పురాణములలో ఉన్న విశేషాలు మహాభారతం లో వస్తాయి అని మహాభారతానికి పెద్ద పీట వేసి పొగుడుతారు. "మహి కొనియాడుచుండ వివిధ వేద తత్వ వేది" అనేకమైన వేదముల యొక్క తత్వముల కంతటికీ పుట్ట ఆ మూల కంద మైన వేదవ్యాస మహర్షి ఉన్నారే ఆది ముని మొదటి ముని , మహనుభావుడు పరసరాత్మజుడు పరసరుని యొక్క కుమారుడు , సాక్షాత్తు విష్ణు స్వరూప మైన టు వంటి వాడు " వ్యాసో నారాయణ స్వయం "అటువంటివాడు రాసిన మహాభారతం , నేను దాని గురించి ప్రవచనం చేస్తాను , చక్కగా మీరందరూ వినండి అని
అక్షౌహిణి అన్న మాటకి అర్థమేమిటో, పర్వము అంటే ఏమిటో మహాభారతం లో ఎని పర్వాలు ఉన్నాయో ఆ పర్వాలలో ఉండే సారాంశం ఏమిటో ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో , పద్దెనిమిది పర్వాలు గురించి విహంగ వీక్షణం గా ఒక్కసారి చెప్పాడు , సంక్షేప రామాయణం అంటారు చూసారా అలా ఒక్కసారి చెప్పాడు, ఇలా ఎందుకు చెప్తారంటే జిజ్ఞాసువు అయిన వాడితే అమ్మో ఇన్ని విషయాలు ఉన్నాయ్, మనకి ఇది ఎలా అందుతుంది రా ఇలా ఆయన చెప్పి వెళ్ళిపోవటం కాదు వివరం గా విందాం అని , బాగా నాకు వివరించి చెప్పండి అని అడుగుతారు. వివరించి చెప్పమని అడగటం శిష్యునకు ఉండవలసిన లక్షణం, ఒకసారి పైపైన చదివేసి, వివరం గా తెలుసుకుందాం అని జిజ్ఞాస లేకపోతే వాడు సరియైన అధికారి కాలేదు అని అర్థం చదవటంలో. కాబట్టి ఆ ఉత్సాహం ఉన్నవాళ్ళేనా నాకేనా మహాభారతం చెప్పటం సంతోషం వీలు వింటారా ఒక్కసారి సంక్షేపం గా చెప్పాడు ఆయన , వాళ్ళన్నారు కాదు కాదు మాకు అంతా వివరంగా కావలి అందులో ఎన్నో విషయములు , అగ్ని హోత్రపు నెగడు దగ్గరకి వెళ్లి కర్రతో కట్టెలు లోపలకి తోస్తే నిప్పురవ్వలు చిందినట్టు నువ్వు చెప్పిన ఆదిపర్వం కధ వింటే మా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేసాయో అసలు ఆ శంతన మహారాజు ఏమిటి , భీష్ముడు ఏమిటి, పిల్లాడేమిటి ఆ ప్రతిజ్ఞ చెయ్యటం ఏమిటి, గంగ ఏమిటి అష్ట వసువులు ఏమిటి , వాళ్ళ శాపం ఏమిటి , వాళ్ళు భూమీ మీద పుట్టడం ఏమిటి గంగ పట్టుకెళ్ళి గంగ లో పారెయ్యటం ఏమిటి , ఎనిమిదో వాడు మహా పురుషుడు అవ్వటం ఏమిటి , దీర్గ కాలం ఉండటం ఏమిటి, పెళ్లి చేస్కోక పోవటం ఏమిటి,అది ధర్మ విరుధం కదా ఇవన్ని ఎలా జరిగాయి , మాకు వివరంగా చెప్పు అలా ఏదో చెప్పెశానంటే కుదరదు, అంటే వాళ్ళకి జిజ్ఞాస ఉంది , చాలా సంతోషిoచాడు ఆయన , సంతోషిoచి మీకు నేను అలానే చెప్తాను అని జనమేజయుడి దగ్గర నించి ప్రారంభం చేసాడు, ఎందుకని అప్పుడే కదా జనమేజయుడి యాగ శాల నించి వచ్చాను అని చెప్పాడు. అప్పుడు నైమిశారణ్యం లో మొట్ట మొదటి సారి మహాభారతం ప్రవచనం చేసే సరికి అప్పుడే ఆయన చూసి వచ్చిన ఆ యజ్ఞ శాల యొక్క ఘట్టాల గురించి చెప్తూ ప్రారంబం చేసాడు
ఆయన అన్నాడు : జనమేజయుడు అనే వాడు చంద్ర వంశం లో పాండవుల వారసుడు గా జన్మించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేసాడు, ఆ యజ్ఞం లో ఆయన తనకి అని కోరిక కోరుకోని చేసిన వాడు కాదు ఆ యజ్ఞాన్ని, ఆయన దేని కొరకు చేసాడు ఆ యజ్ఞాన్ని అంటే ప్రజల యొక్క సంక్షేమం కొసo , తన రాజ్యం లో ఉండే ప్రజల యొక్క అభ్యున్నతి కోసం చేసాడు, అంటే ఇక్కడ ఒకటి గమనిo చాలి , వేదము యొక్క ప్రమనమును నమ్మి ప్రజలయోక్క సంక్షేమం కోరే ప్రభువు సింహాసనం మీద ఉన్నాడు ,కాబట్టి ఆ రాజు కారణం గా నెలకోక వాన పడుతుంది.
ఉన్నపుడు మీరు నాతో ఒకలా ఉండాలి, వేదిక దిగి మాట్లాడితే ఒకలా మాట్లాడాలి. నేను నా భార్య తో ఉంటే నాది భత్రు ధర్మం , నేను నా అక్క దగ్గర నిలబడితే నాది సోదర ధర్మం, నేను నా కూతురు దగ్గర నిలబడితే పితృ ధర్మం, నేను నా తండ్రి దగ్గర నిలబడితే పుత్ర ధర్మం, నేను కార్యాలయానికి వెళ్తే ఉద్యోగి ధర్మం, ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు తొందరగా పారణ ధర్మం, ఎక్కడి ధర్మం అక్కడే , ధర్మం ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది, మీరున్న పరిస్థి తి ని బట్టి మారిపోతుంది. ఆ ధర్మాన్ని పట్టుకుని , ధర్మానుస్టానం చేసిన వాడు చివరికి ఏది పొందుతాడు,ఏది కదలని పరమ సత్యమో, దేనికి మార్పు లేదో,ఏది షడూర్ము ల కతీతమో షడ్వికారముల కతీత మొ అటువంటి సత్యమైన ఆత్మా ఎరుకలోకి వస్తుంది ,ఆత్మ కొత్తగా దర్శనం అవ్వటం ఉండదు. ఆత్మ ఉన్నది తెలియబడుతుంది. ఆ ఆత్మ తెలియ బడి అద్వైతాను భూ తి యందు ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ ధర్మ చక్రము అక్కడ ఉన్నటువంటి గొమతీ నది జలములలో తిరిగిందిట. అందుకే ఆ గోమతీ నదీ జలాలతో స్నానం చేసి అక్కడ పురాణ ప్రవచనం వింటారు, కారణం మేమిటంటే ఆ నైమిశారణ్యo యొక్క శక్తి అటువంటిది . నన్నయ్య గారు చెప్తున్నారు ... అక్కడ శౌనకుడు అనబడే కులపతి ఉన్నారు. కులపతి అన్న మాట అర్థం, నాలుగు వేదములను స్వరంతో గురువుగారి దగ్గర నేర్చుకున్న వాడై, వేదం యొక్క ఉపాంగములైన టు వంటి కల్పము , జ్యోతిషము , నిరుత్తము , శిక్షా, వ్యాకరణము, ఇటువంటి 6 టినీ కూడా ,వేదములు వేదాంగములు అంటారు ,వేదంగాములతో కూడినటువంటి నాలుగు వేదములు చదువుకున్న వాడై ప్రతిరోజూ 10000 మందికి భోజనం పెడుతూ పోషిస్తూ వేద పాఠాలు చెప్పటానికి అవకాశాన్ని ,వ్యవస్థ ని కలిపించిన వాడెవరో ఆయనకి కులపతి అని పేరు. అక్కడ శౌనకుడు అనే కులపతి ఉన్నాడు. అంటే ఆయన నాలుగు వేదములు చదువుకుని 6 వేదాంగములు చదువుకున్న వాడు, ఇన్ని చదువుకున్న వాడు కాబట్టి పరమ మౌని, మౌనమ్ గా ఉండే వాడు . ఎప్పుడూ తనలో తానూ మననం చేస్తూ ఉండేవాడు . అది చాలా గొప్ప విషయం ఎందుకంటే మననం చేత మాత్రమే ధారణ ఏర్పడుతుంది. మననం చేత పుస్తకం లోని విద్య మీ విద్య గా మారుతుంది. పుస్తకం లో ఉన్న విద్య మీ విద్య కాదు. ఎందుకంటే పద్యం కావాలంటే మీరు చుస్తే దోషం కాదు, కానీ అసలు ధర్మం ఏది అన్న ప్రశ్న వచ్చి నప్పుడు అన్నిటికి పుస్తకమే చూడాలండి అని మీరంటే అసలు మీరు అనుస్టించ గలిగింది పోతుంది. కాబట్టి పుస్తకం లో ఉన్నది మీరుగా మారిపోవాలంటే అలా మార్చగలిగే ప్రక్రియకి మననమే కారణం. ఎంత లోపల తిప్పుతాడో, విన్న దాన్ని ఎంత పరిశీలనం చేస్తాడో, ఎంత జ్ఞాపకం తెచ్చుకుంటాడో అంత బాగా పట్టుకుంటుంది. అందుకే దేవతలు బ్రహ్మ విద్యని సాధించారు, ఈ బహ్మ విద్య రాక్షసులకు అందకూడదు పాడు చేసేస్తారు, కాబట్టి ఎక్కడ దాచాలి దీన్ని అని అడిగారు . పట్టుకెళ్ళి దదీచి మహర్షి దగ్గర దాచండి అన్నారు. బ్రహ్మ విద్యని అంతటిని పట్టుకెళ్ళి దధీచికి ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడ దాచాలి. ఆయన ఆ బ్రహ్మ విద్యని మననం చేసి మననం చేసి అస్తిగతం చేసేసాడు, ఆయన యముకలలోకి పెట్టేస్కున్నాడు. ఇప్పుడు ఆయన ఎముకలతో చెయ్యబడిన వజ్రాయుధాన్ని ఇంద్రుడు పట్టుకుంటాడు. అంటే ఇంద్రుడి చేతిలో ఉన్నదేది అంటే, బ్రహ్మ విద్య ఆయన చేతిలో ఉంటుంది. జాగ్రత్తగా విద్యని దాచడం అంటే అర్థం ఏంటో తెలుసాండి మీలో పెట్టేస్కోవటం. ఐశ్వర్యాన్ని మీదిగా చేస్కోవటానికి అర్థం ఏమిటో తెలుసా, దానం చెయ్యటమే . దేన్నీ ఎదిచేస్తే మీది అవుతుందో తెలుసుకొని ఉండడమే శాస్త్రం. మీరు ఒకలా అనుకుని చేసినది మీకు అభ్యున్నతి ని ఇవ్వదు. శాస్త్రం ఏది చెప్పిందో అది చేస్తే అది మీదవుతుంది. కాబట్టి విద్య మీది కావటం అంటే విద్యని నిరంతర మననం చెయ్యాలి. ఎప్పుడో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో చెప్తానండి కాదు, ఎప్పుడూ లోపల తిరుగుతూ వుండాలి. ప్రయత్నపూర్వకం గా కాదు, అది అలవాటుగా మారాలి, మననం చేత ఆ విద్య కరతలామలకం అవుతుంది, అది స్పురణ లో నిలబడి ఉంటుంది, ఆ నిలబడింది ఏదైతే ఉందొ అది అంతిమ శ్వాస యందు స్మరణ దానియందు నిలబడుతుంది, అది అభ్యన్నతి కారణం అవుతుంది. తన వారియందు వ్యామోహం పెట్టుకున్నా , తన శత్రువు యందు వ్యామోహం పెట్టుకున్న తిర్యక్కు గా అంటే వెన్నుపాము అడ్డం గా ఉండే ప్రాణి గా వెళ్ళిపోతాడు, ఇంక మనిషిగా ఉండదు, ఏ కుక్క గా నో పిల్లిగానో పందిగానో ఉంటాడు. ఎవడు శాస్త్రము ని నిరంతరం తలుచుకుంటూ ఉంటాడో, ఎందుకని స్మరణ మనసు మీద ఆధార పడుతుంది, మనసు ఊపిరి మీద ఆధార పడుతుంది, ఊపిరిని కనక మీరు నియంత్రించ గలిగితే, మనసు నియంత్రింప పడుతుంది, అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేస్తారు. అందుకే ప్రాణాయామం ఎందుకు చేస్తారు అంటే, మనసుని నియంత్రించబడుతుంది, మనసు నియంత్రింపబడి సంకల్ప వికల్పములు ఆగుతాయి, సంకల్ప వికల్పములు ఆగితే ఆందోళనలు ఆగుతాయి, ఆందోళనలు ఆగితే ఒత్తిడి ఆగుతుంది, ఒత్తిడి ఆగితే ఆరోగ్యం నిలబడుతుంది. అందుకు ప్రాణాయమం వచ్చింది. మీరు చుడండి, మనసుని విడిచిపెట్టారుఅనుకోండి, ఎన్నిటినో సృష్టిస్తుంది, అంతే ఎక్కడ లేని ఆందోళన పుడుతుంది, ఈ ఆందోళన ఆరోగ్యానికి భంగకరం అవుతుంది. ప్రాణాయామము మనసుని నియంత్రించే సాధనముగా ఆరోగ్య కారకము. భారతం లాంటి పురాణాలని మీరు పరిశీలనగా చదివినా విన్నా, ఇది చెప్పండి అని ఎంత మర్యాదగా అడగాల్సి ఉంటుందో, మీకు అర్థం అవుతుంది, చదవకపోతే ప్రవర్తన యందు దోషం ఉంటే ఎక్కడ ఏది ఏ విధం గా అడగాలో తెలియదు. నైమిశారణ్యం న సునకుడైన పరమ మౌని, రోజూ 11000 మందికి భోజనం పెట్టి, వేదములు చదివించే వాడు, బ్రహ్మర్షుల తో కుడి ఉన్న వాడు, ఆయన చేస్తున్నదేమిటి , అంటే 12 సంవత్సరములు కొనసాగేటటువంటి సత్ర యాగాన్ని చేస్తున్నాడట. యాగములు అనేకమైన యాగములు ఉంటై, అందులో సత్ర యాగము అనే ఒక యాగము, ఈ సత్ర యాగం చాలా గమత్తుగ ఉంటుంది, బ్రహ్మణు న్ని దానం పట్టమని చెప్పింది శాస్త్రం, ఏమి బ్రాహ్మణుడే ఎందుకు దానం పుచుకోవటం, అంటే ఇచ్చిన పంచాల చాపల్లా తానూ కట్టేసుకోకూడదు. పంచాల చాపులు పుచ్చుకుoటే, ఒక ఐదో ఆరో తను కట్టుకోవటానికి ఉంచుకుని, మిగిలిన పంచాల చాపులు తీస్కెళ్ళి వేరే ఉంచాలి, ఉంచి దేవాలయాల్లో శారదా నవరాత్రులు జరుగుతున్నాయి అన్నారనుకోండి, దీక్షా వస్త్రాలు గా కట్టుకోండి అని ఒక 10-15 పంచాల చాపులు తీస్కొచి ఇచ్చేసే య్యాలి. బ్రాహ్మణుడు తెలుసుకోవలిసిన మొదటి లక్షణం ఏమిటంటే కేవలం తానూ అనుభవించుట కాదు,వైదిక సంస్కారం పెరగటానికి , తనకు వచ్చిన దాన్ని తిరిగి పెట్టుబడి గా ఇస్తూ ఉండాలి. అందుకే బ్రాహ్మణుడి జీవితం నిరాడంబరం గా ఉండాలి అని శాస్త్రాలు చెప్పడానికి కారణాలు అవే. సత్ర యాగము అన్న మాట కి అర్థం ఏమిటంటే దానికి యజమానులు ఉండరు. యజమాని ఉంటాడు చేయించే వాళ్ళు ఉంటారు. యజమాని అంటే కోర్కె ఆయనది, ఆయన కొరకు యాగం జరుగుతూ ఉంటుంది, దశరధ మహారాజుకి పిల్లలు లేరు, దశరధ మహారాజు వశిష్టున్ని ఆశ్రయించాడు, వశిష్టుడు అన్నారు, అశ్వమేధ యాగం చెయ్యాలి అని, వశిష్టుడి కి ఏమి కలగదు, సంతానము కలగకుండా ఏ దోషం ప్రదిభందకం గా దాశరధ మహారాజు కి అడ్డం వచ్చి నిలబడిందో ఆ దోషము తొలగి పోతుంది, ఇప్పుడు ఆ దోషము తొలగటానికి కి ఈ యాగం చెయ్యవలసి ఉంటుంది అని వశిష్టుడు చెప్పాడు, కాబట్టి ఆ యాగం చేశాడు, ప్రతిబంధకం పోయింది, ఇప్పుడు సత్పుత్రులు కలగాలి, కాబట్టి పుత్రకమేష్టి చేసాడు, పయసపాత్ర పట్టుకుని యజ్ఞ పురుషుడు బయటికి వచ్చాడు. యాగము , హోమము , బలి అని మూడు ఉంటై వాటిని కొంచం జాగ్రత్త గా మీరు పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది. యాగము యాగ శాల అని ఉంటై, యాగ శాలా ప్రవేశేమే అద్భుతమైన విషయం, అసలు ఆ దీక్షా వస్త్రాలు కట్టుకొని మంగళవాయిద్యాలతో వెళ్తారు, అందరు యాగ శాల లోకి వెళ్ళకూడదు, యాగ శాల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి మనం అందరం, యాగ శాల లోకి ఋత్విక్కులు వెళతారు, వెళ్లి అగ్ని ముఖంగా హవిస్సులు ఇచ్చి దేవతలని పట్టుకెళ్ళ మని చెప్తారు, అంటే వాళ్ళకి అన్నం పెడతారు, అగ్ని ముఖం గా వాళ్ళు ఆ అన్నం తింటారు, వాళ్ళా అన్నం తినటానికి వచ్చి కూర్చుంటారు , ఇవాళ్ళమనని పిలుస్తారు అనం పెడతారు అని, మనం పిలిచాం అనుకోండి భోజనానికి రండి అంటాం , తప్పు దేవతార్చనకి రండి అనాలి, వచ్చి కూర్చుంటే అయ్యా వడ్డించేస్తున్నాం కూర్చోండి అంటారు . అలాగే యాగశాల నిర్మాణం చేసేసి నాంది ప్రస్తావన చేసేస్తే , దేవతలు వచ్చి కూర్చుంటారు, హవిస్సులు ఇస్తారు అని, అందుకని యాగ శాల లోకి అందరూ వెళ్లారు, దానికి తగిన నియమ పాలన చేసేవాళ్ళు, దీక్షితులు అందుకే యాగం చేస్తేనే దీక్షా అన్న పేరు వచ్చింది. దీక్షా వస్త్రాలు కట్టుకుని వాళ్ళు యాగ శాల లోకి వెళతారు. అటువంటి హోమగుండం , హవిస్సులు, ఋత్విక్కులు , దేవతలు, అందరూ ఆ యాగ శాల లో కూర్చున్నారు కాబట్టి,అటువంటి యాగాశాలకి ప్రదక్షిణం చేసేస్తారు,కాబట్టి దేవతలకి ప్రదక్షిణం అయిపోతుంది, వారిని కుడి భుజం వైపున ఉంచుకుని తిరిగాడు, ప్రదక్షిణం అన్న మాటకి అర్థం ఏమిటంటే, మీరు ఇటువైపు నుండి అటువైపు వచ్చినా ఈ మధ్యలో ఉన్న వస్తువు మీ ఎడం భుజం వైపు రాకూడదు, ఎడమ భుజం వైపు ఉన్నది అంటే పూజనీయత తరిగి పోతుంది. కుడి భుజం వైపు ఉన్నది అంటే పూజనీయత పెరుగుతుంది. ప్రదక్షిణ ఎందుకు చేస్తారు అంటే గుండ్రం గా తిరిగి వస్తున్నా ఈ వస్తువు మాత్రం నా కుడి భుజం వైపే ఉండాలి, అంటే ఇది పరమ పవిత్రం అని అర్థం ఏమిటంటే కుడి భుజం దీనివైపు ఉండాలి, ఇది ఇంత పవిత్రమైనది కాబట్టి దీని చుట్టూ నేను తిరిగినప్పుడు దీనిలోని శక్తి నాలోకి ప్రసరిస్తుంది, ప్రసరించి నాకు అభ్యున్నతి ని ఇస్తుంది. మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, దేవతా మూర్తి కింద ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్రం తన శక్తిని చిమ్ముతూ ఉంటుంది చుట్టును, మీరు మౌనమ్ గా ప్రదక్షిణ చెయ్యాలి, ఊసుపోని కబుర్లు చెప్తూ ప్రదక్షిణ చేస్తే మీకు ఫలితం రాదు, పైగా దేవాలయాలకి మళ్ళి మళ్ళి కుమ్భాభిషేకాలు చెయ్యాల్సొస్తుంది. కాబట్టి కలియుగం లో దేవాలయాల కున్న శక్తి క్షీణిo చి పోవటానికి కారణం అదే, అమర్యాద తో కూడిన నడవడి దేవాలయం లో. మీరు రామాయణ మహా కావ్యం చదివితే, ప్రతి చోటా ఎక్కడెక్కడ పూజనీయమైన వస్తువు కనపడితే అక్కడక్కడ ప్రదక్షిణం చేసివేళతాడు శ్రీ రామచంద్ర మూర్తి, అప్రదక్షిణ గా వెళ్ళడు. మహాభారతం లో విరాట పర్వము లో అర్జునుడు యుద్ద భూమి లోకి వచ్చి నిలబడితే, ఆ సారధి ఉత్తర కుమారిడి తో చెప్తాడు, నీవు రథం నడిపెటప్పుడు , ద్రోణాచార్యుల వారికి కాని భీష్మా చార్యుల వారికి కాని నా యడం భుజం వైపు వాళ్ళ రధాలు ఉండేటట్టు తొలకు సుమా ! వారు మహానుభావులు, వారు పూజనీయులు, వారు నాకు గురువు, వారు నాకు పరమేశ్వర స్వరూపము, వారు నాకు ఎడమ భుజం వైపుకు ఉండరాదు, ఎప్పుడు నా రధం వెళ్ళినా , వారు నారధానికి కుడివైపు ఉండేటట్టు చూడు అంటాడు. అంతటి ధర్మైక మూర్తులు కాబట్టే వాళ్ళు అంత విజయాన్ని సాధించారు. అంతటి మహోజ్వలమైన స్థితి ని పొంద గలిగారు. కాబట్టి ఆచరనత్మకమై ఉంటుంది, అదే ధర్మమూ అన్న మాటకి అర్థము. కాబట్టి ఆయన (శౌనకుడు) సత్ర యాగం చేసాడు, సత్ర యాగం యజమాని కొరకు చెయ్యరు, ఎవరు ఋత్విక్కులు గా ఉన్నారో వారే యజమానులుగా ఉంటారు. వారే చేస్తారు, వారే కోరికలు కోరతారు. ఇప్పుడు శౌనకుడికి కోరికేమి ఉంటుంది, శౌనకుడితో చేరినవారుకి కోరికేమి ఉంటుంది. వారందరు కలిపురుషుని యొక్క ప్రభావం తమపై ఉండకూడదని, ఈశ్వరుని అనుగ్రహం మాకు కావలి అని అక్కడ కూర్చున్న వాళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళు విచారించ వలసి వస్తే దేనిగురించి విచారిస్తారు , అయ్యో మేము అంటే ఇక్కడ నైమిశారణ్యం చేరుకున్నాం ఇక్కడ కుర్చుని జపం చేస్కున్తున్నాం, పురాణ కధలు వింటున్నాం, కానీ పాపం ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు సంసారం లో మగ్గిపోతున్న వాళ్ళు,ఈ భూమండలం కలిపురుషుని యొక్క ఉద్దతి కి వాళ్ళు వశులై పోతున్నారు, ఇప్పుడు లోకం కొరకు, లోకం అంతా కూడా శాంతి గా ఉండాలి, కలిపురుషుని యొక్క ఉద్దతి తో బాధ పడకూడదు, కాబట్టి ఇప్పుడు వాళ్ళు యాగం చేస్తే వాళ్ళకి కోరిక లేదు , యజమాని లేడు , కోరికా లేదు, కాబట్టి ఋత్విక్కులే యజమానులుగా ఉంది 12 సం॥ దీర్గ సత్ర యాగం చేస్తున్నాడు శౌనకుడు, ఆ అరణ్యం ఎటువంటిది, ఆ ప్రదేశం ఎటువంటిది, అక్కడ ఉన్న మహాత్ములు ఎటువంటి వారు, అసలు వాళ్ళ మనసులు ఎటువంటివి, వాళ్ళు చేస్తున్న యాగం ఎటువంటిది అక్కడికి వెళ్ళాడు మహానుభావుడైన సౌతి , నన్నయ ఆయన్ని సౌతి , కధకుడు అని ఈరెండు పేర్ల తో పిలుస్తూ ఉంటారు. మళ్ళి వైశంపాయనుడు వచ్చేంతవరకు కధ లో అలాగే పిలుస్తూ తీస్కొని వెళ్తారు. ఆయన రోమహర్షుని కుమారుడు ఉగ్రశ్రవసుడు ఆయన పేరు ఆయన్ని సౌతి అంటారు. ఆ సౌతి ఆ యొక్క నైమిశారణ్యనికి వచ్చాడు. అక్కడికి ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే అక్కడికి వచ్చిన ఉగ్రస్రవసుని యొక్క తండ్రిగారి పేరు రోమహర్షనుడు. ఆయనకి అసలా రోమహర్షనుడు అన్న పేరెందుకు వచ్చింది సూతుడన్న పేరెందుకు వచ్చింది, సూతుడన్న పేరు సాధారణం గా సారధికి అన్వయం చేస్తూ ఉంటారు, లేదా జన్మ చేత కొంత మందిని సూత అనే శబ్దం తో పిలుస్తారు. ఇక్కడ రోమహర్షనుడు సుతుడు అని ఎందుకు అంటున్నారో తెలుసాండి, అది ఈ జాతి సంబందమైన అన్వయం కాదు. మీకు కాశి ఖండం లో దీనికి సంబంధించిన ప్రస్తావన చేస్తారు.
పృధు మహారాజు ఒకానొకప్పుడు ఒక పెద్ద యజ్ఞం చేసాడు, ఆ యజ్ఞగుండం లోంచి ఒక మహా పురుషుడు ఆవిర్భవించాడు, ఆయన్ని పిలిచారందరూ "అగ్నికుండ సముద్భుతా " అగ్ని గుండం లోనించి జన్మించిన వాడా "నిర్మలమనసా " నిర్మలమైన మనసు కలవాడా అని పిలిచారు. ఈయన వేదవ్యాసునకి శిష్యుడైయ్యాడు. శిష్యుడై, పురాణ వగ్మయాలు అన్నిటిని కూడా , అష్టాదస పురాణాలూ అన్నింటినీ కుడా వేద వ్యాసుల నుండి ఉపదేశం గా పొందాడు, పొంది ఈ పురాణముల అన్నిటిని కూడా ప్రవచనము చెయ్యటం తన ధ్యేయం గా పెట్టుకున్నాడు. ఎందుకలా పెట్టుకోవాలి ఆయన అంటే ఆయనకేదో ఊసు పోక చెప్పినటువంటి వాడు కాదు, ఆయన చెప్పేటప్పుడు ట పొంగిపోయి, ఆ కధ లో తానూ లీనమై పోయి ఎంత పరవశించి పోయేవాడoటే లోపల తాను ఏ ఘట్టాన్ని వర్నిస్తున్నాడో ఆ ఘట్టాన్ని తాను దర్సనం చేసి పరవశించి చెప్పెవాడు ట, అంత పరవశించి ఆయన చెప్పే వాడు కాబట్టి సభలో కూర్చున్న వాళ్ళందరికి కూడా ఆనందంతో పులకలు వచ్చి వెంట్రుకలు నిక్కపొడుచుకునే లాగా వినేవారు ట అందరు ఆయన చెప్పే ప్రవచనాన్ని, అంత భక్తి కుదురుకునేది ట ఆయన మాట్లాడితే. అలా మాట్లాడాడు కాబట్టి ఆయనని రోమ హర్షణుడు అని పిలిచారు. అగ్ని గుండం లో నించి ఉద్భవించాడు కాబట్టి సుతా అని పిలిచారు. అటువంటి రోమహర్షుని కుమారుడు ఉగ్రశ్రవసుడు, ఈయనకీ తండ్రి పోలికే వచ్చింది. ఈయనకి కూడా ఏమిటి పని అంటే పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. పురాణ ప్రవచనము భూతద్దం పెట్టి వస్తువుని చూపించడం అంటుంది శాస్త్రం. వేదము రాజ శాసనం ఎలా ఉంటుందో అలా మాట్లాడుతుంది "సత్యం వధ ధర్మం చర "అంటుంది. ఇప్పుడు వేదంలో ఉండే సమస్త ఆచార కాండ ని స్మృతులు చెప్తాయి . స్మృతి అంటే ఏ ఋషి వాటిని అన్నింటినీ వేదం లో నించి తీసి క్రోడీకరించారో ఆ ఋషి పేరు ఆ స్మృతికి వస్తుంది. యాజ్ఞవల్కుడు క్రోడీ కరించాడు అనుకోండి యగ్నవల్క స్మృతి. గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి. మనువు క్రోడీకరిస్తే మను స్మృతి. ఈ స్మృతి
కి ఆధారం శ్రుతే, వేదమే వేదంలోనించే తీస్తారు కాబట్టే "శ్రుతే రివార్థం స్మ్రుతిరన్వ గఛత్ " అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ ఎలా వెళ్తుందో శ్రుతి వెంట స్మృతి వెళ్తుంది అని కాలిదాస మహాకవి రఘువంశ మహాకావ్యం లో వర్ణన చేస్తాడు. వేదాలు ఏమేమి చెప్పినవో అవే స్మృతులు చెప్తాయి. కాని అకడక్కడ చెప్పిన విషయాలు తీసి ఋషి క్రోడీకరిస్తాడు. దాన్ని స్మృతి అంటారు. ఇప్పుడు ఈ శ్రుతి స్మృతి ఈ రెండు ఏమి చెప్తాయి అంటే మనం ఎలా ప్రవర్తించాలో ప్రామాణి కం గా మనకు చెప్తాయి, ఈశ్వర వాక్కు కాబట్టి, కానీ దాని మీద మనకి బాగా బుద్ధి కుడురుకోవాలి అనుకోండి,పురాణం వినాలి. పురాణం వింటే నువ్వు శ్రుతిని స్మృతిని విన్నట్టే ఎందుకని "ధర్మం చేర " నువ్వు ధర్మం నే అనుస్టించు , ధర్మమే అనుస్టిస్తే ఏమవుతుందoడి, రామాయణం విను నీకు అర్థం అవుతుంది ధర్మం అంటే ఏమిటో , ఎలా రక్షిస్తుందో. ఇప్పుడు వేదం లో ధర్మం చెర అన్న మాటని రామాయణ మహాకావ్య రామచంద్ర మూర్తి యొక్క జీవితం గా సమర్ధించి చూపించి మీకు ధర్మము నందు పూనిక కల్పిస్తుంది. అయితే పురాణానికి చరిత్రకి మళ్ళి ఒక తేడ ఉంటుంది. ప్రధానమైన వేత్యాసం ఎక్కడ ఉంటుంది అంటే, ఒక వ్యక్తి పుట్టుక , జీవితం, మరణం వారికే చరిత్ర మాట్లాడుతుంది. కృష్ణ దేవరాయలు ఎప్పుడు పుట్టారు ఎలా పెరిగారు, ఎన్ని విజయాలు సాధించారు, వెంకట రమణున్ని ఎలా సేవించారు ఎలా మరణించారు ఇవి చెప్తుంది చరిత్ర, అది పురాణం చెప్పిందనుకోండి కృష్ణ దేవరాయల వారి జీవుడు కృష్ణ దేవరాయలగా వచ్చి ఆంధ్రభోజుడన్న కీర్తి ఎలా పొందాడో చెప్తుంది, కృష్ణ దేవరాయల దేహం పడిపోయినప్పుడు , కృష్ణ దేవరాయల జీవుడు ఏమైయ్యడో కూడా చెప్తుంది అందుకే "సర్గాస్చ ప్రతిసర్గాస్చ మన్వత రా నిచ " అక్కడ సర్గ ప్రతిసర్గ నియమం తో వంశాన్ని అంతటిని , మన్వంతరముల అన్నిటిని వర్ణిస్తూ, జీవుడు ఎలా వైక్లావ్యలని పొంది , శరీరాలని మార్చుకొని చిట్ట చివరకు ఈశ్వరుణ్ణి చేరాడు అన్న విషయాన్నీ వర్ణిస్తుంది. భరతుడు , అంతా అరణ్యానికి వెళ్లి ఒక లేడి మీద వ్యామోహం పెట్టుకున్నందుకు మళ్ళి దేనిగా పుట్టాడు , అప్పుడు ఆ వ్యామోహం ఎలా పోయింది, అదే చరిత్ర అనుకోండి ఆయన ఒక శరీరం లో ఉన్న అంత వరకు మాత్రమే చరిత్ర మాట్లాడుతుంది. అందుకని చరిత్ర అతోధరణ కొరకు హేతువుగా నిలబడుతుంది అని చెప్పటానికి కష్టం. కాని పురాణం మాత్రం అతోధరణ కొరకు హేతువు అవుతుంది. శ్రుతి యందు స్మృతి యందు ఉన్న దాన్ని భూతద్దం లో పెట్టి చూపిస్తుంది. శ్రుతి వింటే నాకు అర్థం అయ్యిందండి అని అందరు చెప్పాలేరు , కానీ వేదాన్ని వినడమే చాలు. స్మృతి వింటే నాకు అర్థం అయ్యిందండి అని అందరు చెప్పగలరా అంటే చెప్పటం కష్టం. పురాణం వింటే నాకు అర్థం కాలేదండి అనటానికి ఏమీ ఉండదు. ప్రవచనం అంటే ప్రకృష్ట వచనం , బాగా కర్ర పాతుకుందో లేదో అని ఆయనే బాగా ఊపి చూస్తాడుఒకసారి . అలా పుర్వపర విచారణ చేస్తూ కధ ని సమర్ధిస్తూ సృతితో స్మృతితో అనుసంధానం చేస్తూ జరిగిన మాట తేలికగా మన మనసులో ధర్మం నిలబడే లాగా చేస్తుంది. మనం ధర్మము నందు అనురాక్తులం అయ్యేటట్టుగా చేస్తుంది. అందుకని ప్రవచనం చేసారు. రోమహర్షనుడైన సూతుడు చేసినా ఆయన కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు చేసినా దేనికి కొరకు చేసారంటే , వాళ్ళకేదో ఊసు పోక , కాలక్షేపo లేక అదేపనిగా చెప్పుకుంటూ వెళ్ళిన వాళ్ళు కాదు , అందుకే మీకు ఈ పురాణం ప్రవచనం అనే ప్రక్రియ , ప్రపంచ పటం లో ఏ ప్రదేశం లో ఏ సంప్రదాయం లో ఏ విశ్వాసం లో మీకు కనపడదు. పురాణం ప్రవచనం చెయ్యటం అనేది కేవలం సనాతన ధర్మము నందే ఉన్నది.
మీకొక యదార్ధం చెప్తాను, దేవాలయానికి పెద్దలైన వారు వచ్చి నప్పుడు ఒక విషయం అడుగుతారు, ఇక్కడ ఎప్పుడైనా రామాయణం చెప్పరా అని, ఇక్కడ రామాయణం చెప్పారండి అన్నారంటే, ఆ ప్రాంగణానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అన్నిటికన్నా ఒక ప్రాంతం పునీతమైంది అని ఎప్పుడు చెప్తారoటే అక్కడ భారతం చెప్పి ఉంటె. దేవాలయ ప్రాంగణం లో కుర్చుని భారత చెప్పినా ,విన్నా అది సర్వోత్క్రుస్ట మైన స్థితి ని కల్పిస్తుంది. దేవాలయ ప్రాంగణం లో ఈశ్వరుని సముఖం లో భారతం వినడం అంటే కొన్ని కోట్ల కోట్ల జన్మలకి కాని ఆ అదృష్టం జీవుడికి ఇవ్వరు అది శాస్త్రములు తెగేసి చెప్తున్నై, ఎందుకని అంటే మహా భారతాన్ని వినడమే అంత గొప్ప, ఎందుకని అంటే ప్రతి చోట, ప్రతిమాట ధర్మ సుక్ష్మ సమన్వయమే. అంత గొప్పగా ధర్మమూ అనే పతకాన్ని ఎగర వేస్తుంది మహాభారతం.
ఇప్పుడు అక్కడికి ఉగ్రశ్రవసుడు వచ్చారు. ఆయన ప్రవచనం చేయుట యందు దిట్ట. ఆయన కి ఎవరు కనపడ్డారు, శౌనకుడు , బ్రహ్మర్షులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందు నమస్కారం చెయ్యాలి. ఉగ్రస్రవాసుల వినయం ఏమిటంటే ఆయనే బ్రహ్మర్షులు కి నమస్కారం చేసారు. నమస్కారం చేసి కూర్చుంటే వాళ్ళందరూ గబగబా ఆయన చుట్టూ చేరారు. ఒక మహాత్ముడు కన్పించినపుడు ఆయన తో ఏది మాట్లాడాలో , ఎలా మాట్లాడాలో తెలిసుండి మాట్లాడిన వాడు ధన్యత ని పొందిన వాడు తప్ప ఎవరిదగ్గర ఏది మాట్లాడాలో తెలియని వాడు అవకాసం వచ్చిన జారవిడుచుకున్న వాడు. ఆయన్ని వాళందరూ కూడా ప్రశ్న వేశారు , అయ్యా మేమందరం ఇక్కడ నైమిశారణ్యం చేరాము , 12 సంవత్సరములు కోన సాగే సత్ర యాగాన్ని నిర్వర్తిస్తున్నాం , మేము అందరమూ కూడా భగవంతుని యొక్క పుణ్య కధలు వినడం యందు అనురాక్తులం అయిన వాళ్ళం, నీవు మాకు ఏమైనా భగవథ్ సంబంధమైన కధలు చెప్ప వలసింది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, నువ్వు ఈ మధ్య కాలం లో ఏమి చూసావు , ఏ తీర్థముల యందు స్నానం చేసావ్, ఏ క్షేత్రములు దర్శించావు అని అడిగారు. తీర్థ యాత్ర అని అంటారు. ప్రకృష్టమై అనేకమైన పేర్ల తో తీర్థములు ఉంటై. ఒక వెంకటాచల క్షేత్రం ఉండనుకోoడి, ఎన్నో తీర్థములు ఉంటాయి . తీర్థము అంటే దానియందు స్నానం చేస్తే ఒక యజ్ఞం చేసిన పలితాన్ని మీ ఖాతా లో వేస్తారు. యజ్ఞం చేస్తే సోమయాజి అంటారు. గృహస్తాశ్రమం లో కి ప్రవేసించేది ఎందుకు అంటే యజ్ఞం చెయ్యటం కోసం. యజ్ఞ యాగాదులు జరిగినప్పుడు ఆర్థికం గా ఆదుకోవటం కోసం, వాడి బలాన్ని దానికి దాపుగా పెట్టి రక్షించడం కోసం, ఏది చెయ్య గలిగితే అది చెయ్యాలి, యజ్ఞ యాగాది క్రతువుల కోసం , కానీ కలియుగం లో మానవుడు అన్ని చెయ్యలేక పోతున్నా డెమో అని ఈశ్వరుడు తీర్థము లని ప్రవేశపెట్టాడు. తీర్థం వేరు నది వేరు, తీర్థం లో స్నానం చేస్తే యజ్ఞం చేసిన పలితం ఇస్తారు , వేదం లో చెప్పారు ఈ మాట. తీర్థ యాత్ర చేస్తే తీర్థములో స్నానం చేయ్యాలి. అప్పుడు తీర్థ యాత్ర చేసిన వాడు అంటే యజ్ఞం చేసిన వాడుతో సమానం. అందుకు వచాయి. అందుకు తీర్థాలకి కి వెళ్తే స్నానం చేస్తారు.
కాబట్టి వారందరూ నువ్వు పురాణ వాగ్మయం అంతా చదువుకున్నావు, కాబట్టి ఎక్కడ ఏ తీర్థం ఉందొ తెలుసు, ఎక్కడ ఏ క్షేత్రం ఉందొ తెలుసు, కాస్త పెద్దాయన తో ఎందుకు వెళ్తారు యాత్రకి అంటే ఎవరు కాస్త తెలిసున్న వాడో ఆయన పెట్టె వీళ్ళందరూ పట్టుకుంటారు, ఎందుకు అంటే ఆయనకి తెలుసు, ఆయన నాలుగు మాటలు చెప్పి చూపిస్తాడు అని తాపత్రయం. వెళ్ళలేని వాళ్ళు , అయ్యా ఏమి చూసారు అని అడిగి తెలుసుకుని సంతోష పడతారు. మీరు ఏమేమి చూసారు , మీకన్ని తెలుసు కదు కాబట్టి చెప్పండి.
తీర్థ యాత్ర చేసి వచ్చిన వారి ఇంటికి వెళ్తే అడగ వలశి న ప్రశ్న ఇది. వాళ్ళు కూడా ఏమి మాట్లాడాలి అంటే వాళ్ళు తీర్థ యాత్ర ప్రారంభం దగ్గర నించి మననం చేస్కోవాలి . ఎక్కడెక్కడికి వెళ్ళాం అక్కడ ఏమేమి చూసాం, ఏయే గుళ్ళోకి వెళ్ళాం , అక్కడ స్థల పురాణం ఏమిటి, దాన్ని గొప్పతనం ఏమిటి, ఏమి స్నానం చేసాం , అక్కడ ఏ మహాత్ములు గురించి మనం విన్నాం, వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని ఇంటికి వచ్చిన వాడికి చెప్పుకుంటూ పోతే, ఆ చెప్పటం చేత విన్న వాడు తరిస్తాడు, వీళ్ళకి మననం అవుతుంది, మళ్ళి మళ్ళి తీర్థముల పేర్లు మళ్ళి మళ్ళి క్షేత్రముల పేర్లు స్మరించడం చేత ప్రాసంగిక పుణ్యం పడిపోతుంది, అందుకే తీర్థ యాత్ర అన్న మాట మీద అన్ని విషయాలు పేర్కొన్నాయి శాస్త్రాలు.
కాబట్టి అందుకు అడగటం , నైమిశారణ్యం లో ఉన్న వాళ్ళు చేత కాక ఆ ప్రశ్న వేశారు అని మీరు అనుకోకూడదు, మహా భారతం ధర్మ సుక్ష్మ సమన్వయము, మహా భారతం వింటే మనం ఏమి చెయ్యాలో మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఊంచు కోవటానికి భారతం తప్పా , నన్నయ్య గారు బాగా రాసారు అని సర్టిఫికేట్ ఇవ్వటానికి భారతం చదవక్కర్లా, ఆయనికి సర్టిఫికెట్లు మీరు నేను ఇవ్వకరలేదు ఆయన తరించిపోయారు. మనం తరించడం నేర్చుకోవటానికి భారతం చదవాలి. ఇప్పుడు వాళ్ళందరారికి ఆయన (ఉగ్రశ్రవసుడు / సౌతి ) నమస్కరించారు, అక్కడ బ్రహ్మర్షులు అందరూ ఆయన్ని ప్రశ్న వేసారు. అప్పుడు ఆయన అన్నారు శమంతక పంచాకాన్ని చూసొచ్చాను, ఎందుకు ఈ మాట వచ్చింది , వాళ్ళు ప్రశ్న వేసే లోపే , వాళ్ళకి చెప్పాలి అన్న ఉత్సాహం పెల్లుబుకుతుంది ఆయనలో . అంటే అన్నీ తెలిసున్న వాడు ఇది చెప్తే బావుండు అనుకున్నాడు అంటే అది ప్రయోజన కరమైన విషయము అని మీరు నమ్మ వలసి ఉంటుంది కదా లేకపోతే ఆయన కి ఆ పొంగు ఎందుకు వస్తుంది. కాబట్టి ఆయనకి ఏమి జ్ఞాపకం వచ్చిందంటే , శమంతక పంచకం జ్ఞాపకం వచ్చింది, అక్కడ పరశురాముడు 21 మార్లు ఈ భూమండలం అంతా కూడా దండ యాత్ర చేసి , క్షత్రియుల్ని తెగటార్చి వారి రక్తం తోటి 5 సరోవారాల్ని ఏర్పాటు చేసి, ఆ రక్తం తోటి పితృదేవతలకి తర్పణం ఇచ్చాడు , అప్పుడు వాళ్ళు అయ్యాబాబోయి ఇలాంటి అలజడి వద్దురా నాయనా ఇంక క్షత్రియ సంహారం చెయ్యకు అన్న తరువాత ఆయన శాంతించాడు, అదిగో అంత గొప్ప ప్రదేశం ఆ శమంతక పంచకాన్ని, కురుక్షేత్రాన్ని, జనమేజయున్ని , యాగాన్ని ఇవన్నీ చుసోస్తున్నాను , అంటే వాళ్ళన్నారు మేము ఏది వింటే బావుంటుంది, ఇది అడగాల్సింది , మీరు వేదిక మీదకి వచ్చిన వ్యక్తికి ఇలా ఒక కాయితం ఇచ్చి ఇది చెప్పండి అని అడగ కూడదు, ఏది మీకు చెప్పాలో వేదిక మీద కూర్చున్న వాడికి తెలిసి ఉంటుంది అని మీరు నమ్మాలి , అది వినయం . ఆ వినయం లేని వాడికి వినే అర్హత ఉండదు. ఆ వినయం ముందు నేర్చుకోవాలి. కాబట్టి మాకు మీరు ఏది చెప్పలనుకున్తున్నారు, ఏది చెప్తే బావుంటుంది, ఏది మాకు పురషార్థాన్ని కలిపిస్తుంది మాకు అటువంటి గ్రంధాన్ని అటువంటి ఇతిహసాన్ని , అటువంటి విషయాన్ని మాకు ప్రవచనం చెయ్యవలసింది మహానుభావా అని వాళ్ళు ప్రార్థన చేస్తే,
ఆయన అన్నారు మా గురువు మహానుభావుడు , వేదమంతా ఒక రాశిగా పడిపోయి ఉంటె , కలియుగం లో ఉండేటటువంటి ఆయుర్థయన్ని దృష్టిలో పెట్టుకుని వేదములను చదవ గలిగిన వాళ్ళు ఉండరని , వేదమును విభాగం చేసి "రుక్" "యజుర్" "సామ" "అథర్వణ" వేదము అని నాలుగు విభాగములు చేసి 18 పురాణములు వెలయించిన తరువాత పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచన చేసారు, అందులో లేనటువంటి ధర్మ సుక్ష్మం లేదు , భారతం అంతా కూడా రచన చేసిన తరువాత వేదవ్యసుడే అన్నాడు నీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా , ఏది తెలుసుకోవాలన్నా భారతమే ఆధారం ఇంత కన్నా ఇంకోటి ఏది ఉందొ నాకు చెప్పు అన్నాడు , కాబట్టి నీకు జవాబు లేనిది లేదు మహాభారతం లో అన్ని ఉన్నాయ్. నీకు వెతుక్కోవటం రావాలి, తెలుసు కోవటం రావాలి , ఇది కాకుండా వేరొకటి కొత్తగా తెలుసుకోవటానికి వేరేది ఉండదు, అన్ని భారతం లోనే ఉన్నాయ్.
అన్ని ఆఖ్యానములతో అన్ని ఉపాఖ్యానములతో అన్ని విసేషాలతో భారత రచన చేశానని మా గురువైన వేద వ్యాసుడు పేర్కొన్నాడు. అటువంటి మహాభారతం ను
"ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబనియు ఆధ్యాత్మ వేదులు వేదంతమనియు నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని కవివృ ష భులు మహా కావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష సంగ్రహమని అయితి హసకులు ఇతిహసమనియు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయంబు అని మహి కొనియాడుచుండ వివిధ వేద తత్వ వేది వేదవ్యసుడాది ముని పరశారత్మజుండు, విష్ణు సన్నిభుoడు , విశ్వ జానీనమై పరగుచుoచేసే భారతంబు"
సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన టు వంటి వేదవ్యాసుడు రచన చేసినటు వంటి ఆ మహాభారతం ఉందే దాన్ని ధర్మమునందు నిష్ణాతులైన వారు ఇదే ధర్మ శాస్త్రం అని మహా భారతాన్ని పిలుస్తారు. ఆ ధర్మమునే భోధ చెయ్యటానికే సమస్త వాంగ్మయం వచ్చింది , " ఆధ్యాత్మ వేదులు వేదంతమనియు" వేదాంతములు అంటే వేదముల చివరన ఉండేవి ఉపనిషత్తులు , ఆ ఉపనిషత్తుల యందు శిష్యుడు గురువుని ప్రశ్న వేస్తాడు, ప్రశ్న వేస్తే గురువు మాట్లాడుతాడు, మాట్లాడితే ఆ జ్ఞానము వలన మళ్లి పుట్టే అవసరము లేని, పునరావ్రుత్త రహిత శాశ్వత శివసాయుజ్య స్థితి ఏర్పడుతుంది, అటువంటి మోక్ష కారకమైనటువంటి వేదంతము ఏది ఉన్నదో ఆ వేదంతమే మహా భారతం అని వేదాంతులు చెప్తారు "నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని " లోకంలో నీతి మాట్లాడే వాళ్ళందరూ మహా భారతం కన్నా నీటి శాస్త్రం లేదు అంటారు. కాబట్టి మహాభారతం గురించి మాట్లాడిన మహాభారతం లోని ఏ వ్యక్తి గురించి పుస్తకాలు రాసిన ఆ కోణం లో నే చూసి రాయాలి, ఆ కోణం లోనే మహాభారతాన్ని రాయాలి, తప్ప ఇంకొకలా చూసి కవిత్వ పరంగా అన్వయం చేసి రాసే అధికారం ఎవరికీ ఉండదని తీర్పు. "నీతి శాస్త్రంబని కవివృ ష భులు మహా కావ్యమనియు" గొప్ప కవులు దాన్ని మహా కావ్యం అని పిలిచారు ఇంతకన్నా కావ్యం ఉండదు లోకంలో "లాక్షణికులు సర్వలక్ష సంగ్రహమని" లాక్షణికులు ఇంతకన్నా గొప్ప లక్ష్య శాస్త్రం వేరొకటి లేదు అని అన్నారు " అయితి హసకులు ఇతిహసమనియు" యదర్ధముగా జరిగిన గాధ ఇంత కన్నా గొప్పగా చెప్పటం వ్యాసునికి తప్ప అన్యులకి సాధ్యం కాదు. "పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయంబు" పురాణం చదివిన వారు మహాభారతం లో లేనటువంటి పురాణం లేదు , అన్ని పురాణములలో ఉన్న విశేషాలు మహాభారతం లో వస్తాయి అని మహాభారతానికి పెద్ద పీట వేసి పొగుడుతారు. "మహి కొనియాడుచుండ వివిధ వేద తత్వ వేది" అనేకమైన వేదముల యొక్క తత్వముల కంతటికీ పుట్ట ఆ మూల కంద మైన వేదవ్యాస మహర్షి ఉన్నారే ఆది ముని మొదటి ముని , మహనుభావుడు పరసరాత్మజుడు పరసరుని యొక్క కుమారుడు , సాక్షాత్తు విష్ణు స్వరూప మైన టు వంటి వాడు " వ్యాసో నారాయణ స్వయం "అటువంటివాడు రాసిన మహాభారతం , నేను దాని గురించి ప్రవచనం చేస్తాను , చక్కగా మీరందరూ వినండి అని
అక్షౌహిణి అన్న మాటకి అర్థమేమిటో, పర్వము అంటే ఏమిటో మహాభారతం లో ఎని పర్వాలు ఉన్నాయో ఆ పర్వాలలో ఉండే సారాంశం ఏమిటో ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో , పద్దెనిమిది పర్వాలు గురించి విహంగ వీక్షణం గా ఒక్కసారి చెప్పాడు , సంక్షేప రామాయణం అంటారు చూసారా అలా ఒక్కసారి చెప్పాడు, ఇలా ఎందుకు చెప్తారంటే జిజ్ఞాసువు అయిన వాడితే అమ్మో ఇన్ని విషయాలు ఉన్నాయ్, మనకి ఇది ఎలా అందుతుంది రా ఇలా ఆయన చెప్పి వెళ్ళిపోవటం కాదు వివరం గా విందాం అని , బాగా నాకు వివరించి చెప్పండి అని అడుగుతారు. వివరించి చెప్పమని అడగటం శిష్యునకు ఉండవలసిన లక్షణం, ఒకసారి పైపైన చదివేసి, వివరం గా తెలుసుకుందాం అని జిజ్ఞాస లేకపోతే వాడు సరియైన అధికారి కాలేదు అని అర్థం చదవటంలో. కాబట్టి ఆ ఉత్సాహం ఉన్నవాళ్ళేనా నాకేనా మహాభారతం చెప్పటం సంతోషం వీలు వింటారా ఒక్కసారి సంక్షేపం గా చెప్పాడు ఆయన , వాళ్ళన్నారు కాదు కాదు మాకు అంతా వివరంగా కావలి అందులో ఎన్నో విషయములు , అగ్ని హోత్రపు నెగడు దగ్గరకి వెళ్లి కర్రతో కట్టెలు లోపలకి తోస్తే నిప్పురవ్వలు చిందినట్టు నువ్వు చెప్పిన ఆదిపర్వం కధ వింటే మా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేసాయో అసలు ఆ శంతన మహారాజు ఏమిటి , భీష్ముడు ఏమిటి, పిల్లాడేమిటి ఆ ప్రతిజ్ఞ చెయ్యటం ఏమిటి, గంగ ఏమిటి అష్ట వసువులు ఏమిటి , వాళ్ళ శాపం ఏమిటి , వాళ్ళు భూమీ మీద పుట్టడం ఏమిటి గంగ పట్టుకెళ్ళి గంగ లో పారెయ్యటం ఏమిటి , ఎనిమిదో వాడు మహా పురుషుడు అవ్వటం ఏమిటి , దీర్గ కాలం ఉండటం ఏమిటి, పెళ్లి చేస్కోక పోవటం ఏమిటి,అది ధర్మ విరుధం కదా ఇవన్ని ఎలా జరిగాయి , మాకు వివరంగా చెప్పు అలా ఏదో చెప్పెశానంటే కుదరదు, అంటే వాళ్ళకి జిజ్ఞాస ఉంది , చాలా సంతోషిoచాడు ఆయన , సంతోషిoచి మీకు నేను అలానే చెప్తాను అని జనమేజయుడి దగ్గర నించి ప్రారంభం చేసాడు, ఎందుకని అప్పుడే కదా జనమేజయుడి యాగ శాల నించి వచ్చాను అని చెప్పాడు. అప్పుడు నైమిశారణ్యం లో మొట్ట మొదటి సారి మహాభారతం ప్రవచనం చేసే సరికి అప్పుడే ఆయన చూసి వచ్చిన ఆ యజ్ఞ శాల యొక్క ఘట్టాల గురించి చెప్తూ ప్రారంబం చేసాడు
ఆయన అన్నాడు : జనమేజయుడు అనే వాడు చంద్ర వంశం లో పాండవుల వారసుడు గా జన్మించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేసాడు, ఆ యజ్ఞం లో ఆయన తనకి అని కోరిక కోరుకోని చేసిన వాడు కాదు ఆ యజ్ఞాన్ని, ఆయన దేని కొరకు చేసాడు ఆ యజ్ఞాన్ని అంటే ప్రజల యొక్క సంక్షేమం కొసo , తన రాజ్యం లో ఉండే ప్రజల యొక్క అభ్యున్నతి కోసం చేసాడు, అంటే ఇక్కడ ఒకటి గమనిo చాలి , వేదము యొక్క ప్రమనమును నమ్మి ప్రజలయోక్క సంక్షేమం కోరే ప్రభువు సింహాసనం మీద ఉన్నాడు ,కాబట్టి ఆ రాజు కారణం గా నెలకోక వాన పడుతుంది.