మహా భారతాన్ని తరువాత ఆంధ్రీకరించిన తిక్కన సోమయాజి మొదలైన వారికి మార్గ దర్శకుడి గా నిలిచి, తర్వాతి కాలం లో ఆంధ్ర దేశం లో వచ్చిన రచనా ప్రక్రియలకు కావలసినటువంటి విధి విధానములకు కావలసిన సౌకర్యన్ని మహా భారతం లో తాను ఆంధ్రీకరించిన విధానo చూపిస్తుంది.
నన్నయ్య గారు మహా భారతం ఆంధ్రీకరించడం లో వచ్చిన మొదటి పర్వమే "ఆది పర్వము ".
ఆది అను శబ్దమునకు అర్థము మొదటిది అని. సంస్కృత భారతం లో కూడా ఆది పర్వమే. ఆయా పర్వాల పేర్లు
అలగే ఉన్నాయ్.
మహా భారతాన్ని ఆంధ్రీకరించిన సమయం లో నన్నయ్య గారి నోటి నుంచి వచ్చిన మొట్ట మొదట పద్యం. ఆ పద్యాన్ని ఆయన తెలుగు లో రచించలేదు. దానికి కారణo ఒక్కటే, మనకి దేవతారాధన అని ఒక మాట ఉంది, అంటే భగవంతుణ్ణి ఆరాధించుట. ఏమి మనమే జాతీయ భాషా అని ఒక బాషని పెట్టుకున్తున్నమే, రాష్ట్ర బాష అని రాష్ట్రానికి ఒక బాషని పెట్టుకుoటుoన్నాయే. ఎవరి బాష మీద వాళ్ళకి అంతంత మక్కువ ఉంటుందే. అలాగే ఈశ్వరుడు కూడా ఒక నిర్ణయం చేసాడు. ఆరాధన యందు నామాలు చెప్పుకోవటం లోను, భగవంతుణ్ణి స్మరించడం లోను , భజన చేయడంలోనూ మీరు ఎందులో చేస్తున్నారు అన్న దాంతో సంబంధం ఉండదు. కానీ
వై దికమైన ఆరాధన ప్రక్రియ యందు సంస్కృత బాష ను మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి "శ్వేత వరాహ కల్పే "అంటాం తప్ప "తెల్ల పంది కల్పే " అని అనువాదం చేసి పూజ లో ఎక్కడా ఉపయోగించరు. సంస్కృత బాష లోనే ఉంటుంది.
భారతాన్ని ఆంధ్రీ కరించడం అనే ట టువంటి మహోజ్వలమైన ప్రక్రియని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు దేవతా మూర్తుల ఆరాధన, త్రిమూర్తుల యొక్క అనుగ్రహం నాకు కలగాలి అని సంస్కృతం లో నే ప్రారంభం చేసారు. సంస్కృతం లో ప్రారంభించడం, తెలుగు కి ఏదో తక్కువ చేసినట్టు భావించకూడదు. సంస్కృతం తల్లి వంటిది, తాను ఎంత గోప్పవా డై నా కావోచ్చుకానీ తనను కన్న తల్లి తాను చదువుకున్నo త చదువుకున్నది కాక పోవచ్చు, తాను ఇప్పుడు ఎంత ఐశ్వర్య వంతుడో ఆమె అంత ఐశ్వర్య వంతురాలు కాకపోవచ్చు , తానూ ఇప్పుడు ఎంత అందంగా ఉన్నడో ఆమె అంత అందం తో శరీర సౌస్ట వం తో లేకపోవచ్చు కానీ అమ్మ అమ్మే. అసలు అమ్మ కనపడితే నమస్కరించడం అసలు అవతల వారి వ్యక్తిత్వానికి నిదర్శనం.
కాబట్టి సంస్కృతం లో ఆ త్రిమూర్తులను స్తోత్రం చేసి ఆ త్రిమూర్తుల యొక్క శక్తి స్వరూపాలని కూడా స్తోత్రం చెయ్యడం నన్నయ్య గారి యొక్క పరిణితి కి నిదర్శనం. కాబట్టి అయన మొట్ట మొదటి పద్యాన్ని ప్రారంభం చేస్తూ
"శ్రీ వాణీగిరిజా శ్చిరాయ దధ తో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తయ స్త్రిపురషా స్సంపూజితా వ స్సురై :
ర్భూ యా సు: పురుషోత్తమా మ్బు జభవ శ్రీ క న్ద రా శ్శ్రే యసే"
అంటూ మొదలు పెట్టారు అందులో శ్రీ , వాణి , గిరిజ
శ్రీ అంటే లక్ష్మి, కవితా పరం గా శ్రీ కారం తో ప్రారంభం చెయ్యటం చాలా చక్కటి సంప్రదాయం, శుభ ప్రద మైన టువంటి ప్రారంభం. శ్రీ -->లక్ష్మీ దేవి వాణి -->సరస్వతి గిరిజ -->పార్వతి దేవి ఈ ముగ్గురు, ముగ్గురమ్మలు గా మూడు శక్తులకు ప్రతీకలు.
వాణి ,సరస్వతి ఆమె కవనశక్తి కి ప్రతీక ,ఒకరిలో ఉన్న ప్రజ్ఞ ఆయన లోనే ఉండిపోతే స్వార్థం తో అంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు లోకంలో అందుకే నీరు ఒకచోటే ఉంటె వాసన వస్తుంది. ప్రజ్ఞా తనతోనే ప్రకాశించి తన తోనే అంతరించి పోతే అంతకన్నా ఘోరమైన నేరం ఇంకోటి లేదు. సరస్వతి నది ,ప్రవహిస్తూనే ఉంటుంది ప్రవహించటానికి ఏ ప్రతిఫలాన్ని , ఏ పారితోషికాన్ని కోరకూడదు, ఎవరినించి ప్రవహించాలని అడిగారు , పురుషసూక్తం చేస్తూ వేదం లో "బ్రాహ్మణో స్య ముఖమాసిత్ "
వేదం చదువుకునేవాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ప్రయత్న పూర్వకం గా పేదరికాన్ని అనుభవించ మని చెప్తుంది వేదం. బ్రాహ్మణుడు నిరాడంభర జీవితాన్ని గడపాలి తప్పా ఎన్ని తనకి కలిసొచ్చినా అవసరమునకు మించి భోగ లాలస బ్రాహ్మణునికి ఉండరాదు. బ్రాహ్మణు డైన వాడి జీవితం ఒక్కరోజు ఎలా ఉంటుందో ,వైదికమైన బ్రాహ్మణు ని జీవితం మీరు చుస్తే మీరు తెల్లబోతారు. దాదాపుగా 70 సంవత్సరాలు పైచిలుకు వచ్చిన క్రిష్ణావధానులు గారు తన జీవితం మొత్తం లో చొక్కా వేసుకున్న పర్యాయములు మూడే మూడుసార్లు, అంటే ఎంత నిష్టాగరిస్టులై వాళ్ళు జీవితాన్ని గడిపారో చుడండి. అంత నిష్ట తో గడించిన జ్ఞానమును ఏ ఆపేక్షా లేకుండా లోకమునకు అందించడమే తమ కర్తవ్యము అని భావించి దానివలన వారి శ్వాస ఖేద పడినా , వారియొక్క హృదయము తల్లడిల్లినా ,వాళ్ళు డస్సి పోయినా , ఆయుర్దాయం తగ్గిపోయిన, అదేపనిగా మాట్లాడటం వలన ఊపిరులు ఖర్చై పోతే ఆయుర్దాయం క్షీణించి పోతుంది. అయుర్ధయమే క్షిణి o చిన దేని కొరకు మాట్లాడాలి అని అడిగారు, నీలో ఉండిపోయి విద్య నశించిపోయి నువ్వు మరణిoచేకన్నా నీ ఆయుర్దాయము తగ్గిపోయిన నువ్వు పది మందికి భోధ చేసి ప్రాణం విడిచి పెట్టు ట మేలు. కాబట్టి త్యాగము తో జీవించు, స్వార్థము తో బ్రతకవద్దు. కాబట్టి సరస్వతి ప్రవాహము , అది ప్రవహించాలి ఒకరి నుండి ఒకరి ప్రవహించి వెళ్ళిందా ఉపయుక్త మవుతుంది, ప్రవహించలేదా ఎవరికీ పనికిరాదు. గోదావరి ప్రవాహించినదా కొన్ని వేల ఎకరాలు సాగు అవుతాయి, కొన్ని లక్షల మంది దాహం తీరుతుంది. గోదావరి ఒక్కచోట ఉండిపోయిందా కొన్ని లక్షల మందికి అన్నం దొరకదు, కొన్ని కోట్లమంది దాహం తీరదు. లక్ష్మి సంపద భోగమును అనుభవించ గలిగినటు వంటి ధారుడ్యం.
కాబట్టి ఈ మూడు శక్తులు ఏవైతే ఉన్నాయో, వీటి ని మూగ్గురు మూర్తులు తమ శరీరము లలో మూడు చోట్ల ధరించి ఉన్నారు ఎక్కడెక్కడ? వక్షో ముఖాంగేషు శ్రీ -->లక్ష్మి ని (వక్షో ) గుండెల్లో పెట్టుకున్నాడు ఒకాయన వాణి (సరస్వతి) ని ముఖా , ముఖా అంటే సంస్కృతం లో నోరు అని అర్థం , కాబట్టి నోటి యందు నాలుక చివరన నిలుపుకున్నాడు ఒకాయన, శరీరము (అంగేషు) లో సగ భాగం ఇచ్చాడు లేదా శరీరం ఇచ్చేశాడు పరమేశ్వరుడు పార్వతీ దేవి కి కాబట్టి ఈ మూడు శక్తులను తమ శరీరములో మూడు అవయములలో నిలుపుకున్న త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు సశక్తి యుతులై ఉన్నారు. ఇది నన్నయ్య గారి యొక్క ప్రార్ధనా శ్లోకం
మనకి సంప్రదాయము అని ఒక మాట ఉంది, వేదం లో ఆచారము అని మనవి చేశాను. పూజ చేసేటప్పుడు శక్తియుతుడైన పరమాత్మ కి చేస్తాం. అందుకే రాముడికి కూడా రాముడిగా పూజ లేదు శ్రీ రాముడిగా పూజ చేస్తాం. ఆ శ్రీ కరం తో కలవాలి, నారాయణు న్ని నారాయణుడిగా లక్ష్మి ని లక్ష్మిగా పూజ చెయ్యం మనం. అసలు లక్ష్మిని పూజ చెయ్యాలంటే ఆయన గుండెలమీద కూర్చొని ఉంటుంది. వాళ్ళు కలిసే ఉంటారు, ఈ సశక్తియుతం గా ఉండటం ఉన్నదే అది కుటుంబ జీవనాన్ని తెలియచేస్తుంది. అందుకే శంకర భాగావపాదులo తటి వారు సౌదర్యలహరి చేస్తూ "ఆది కుటుంభీ" అని పిలిచారు ఈశ్వరుణ్ణి. ఆ నాటి నుండి ఈనాటి వరకు అలా కలిసి ఉండి సంతానా న్ని పోoదుతూ ఉండటమే. వారికి బిడ్డలు పుట్టారు వారి బిడ్డలకి బిడ్డలు పుట్టారు అలా వంశం తామర తంపరగా ఆచంద్ర తారార్కం వెళుతూనే ఉండాలి. ఒక పక్క గురు పరంపర వెళుతూ ఉండాలి ఒకపక్క వంశములు వెళ్తూ ఉండాలి తప్ప ఎక్కడో అక్కడ వంశము తంతువుగా ఆగా కూడదు. అలా వెళుతూ ఉండేటటు వంటి సత్ సంప్రదాయానికి నాంది పలికిన మా ఆరాధ్య దైవము లైనటు వంటి ముగ్గురు మూర్తులు ఉన్నారే వారు సశక్తియుతులు. ఆచార రహస్యాన్ని చెప్తున్నారు నన్నయ్య గారు. సనాతన ధర్మమూ యందు పక్కన శక్తి స్వరూపము లేకుండా ఉన్న పురుష స్వరూపం కాని పురుష స్పర్స లేని స్త్రీ స్వరూపం కాని మనం పూజ చెయ్యం. ఎప్పుడూ కూడా అమ్మవారితో కూడిన అయ్యని మాత్రమే పూజ చేస్తాం. అందుకే శంకర భగవత్ పాదులు ఒక అసుర సంధ్య వేళ ఒక నల్ల మద్ది చెట్టుకి అల్లుకున్న మల్లె తీగను చూసి, పరమశివున్ని ఆలింగనం చేసుకున్న పార్వతి దేవి గా దర్శనం చేసి స్తుతించారు. శివా అంటే పార్వతీ దేవి.
"ఛి రాయ దధ తో " ఎప్పటినించి ధరించారిలా , చాలా కాలం నించి,
ఇవాళ కలుసుకోవటం రేపు దెబ్బలాడుకోవటం ఎల్లుండి విడిపోవటం మన జాతి సంస్కృతి కాదు, ఈ జాతి
ఆచారం ఎప్పుడూ కలిసి ఉండడమే. ఒకసారి తాళి కడితే ఇక ఆ జన్మకి ఆమెయే భార్య ,ఒకసారి తాళి కట్టించుకుంటే ఆ జన్మ కి ఆయనే భర్త. ఇద్దరి మధ్య ఘర్షణలకు ఏయే ప్రాంతములు ఉంటాయో ,వాటియందు ఇద్దరు రాజీ పడి జీవితాన్ని సమన్వయము తో రెండు బండి చక్రాలు కలిసిరధాన్ని నడిపినట్టు , నడిపించడమే తప్ప ఘర్షణ పడి విడాకులన్న మాట లేని ఒకేఒక జాతి ప్రపంచపటం లో ఒకే ఒక్క జాతి భారత జాతి.
"యే లోకానాం స్థితి మావహన్త్య విహతాం " ఈలోకాన్నంతటి ని కూడా రక్ష చేసే ముగ్గురు మూర్తులు న్నారే మా
తల్లు లైన తువంటి ఆ ముగ్గురితో కలిసి ఉంటారో వాళ్ళు "స్త్రీపుంసయోగోద్భవాం " ఆ స్త్రీ పురుష యోగ కారణము చేత జనించి ప్రవర్తిల్లిన ఇంత మంది జనులు ఉన్నారు. కాబట్టి మా అందరికి వారు తల్లి తండ్రులు ముగ్గురిగా కనపడుతున్న ఒక్క పదార్థం ఉన్నదే అదే స్థి కర్త గ లయ కర్త గా ప్రళయ కర్త గా ప్రకసిస్తోంది. అదిగో అటువంటి ఆ స్వరూపానికి నమస్కారం చేస్తున్నాను.
" తే వేదత్రయ మూర్తయ స్త్రిపురషా" వాళ్ళే వేదత్రయం గా ఈలోకంలో ఉన్నారు. వాళ్ళు మాకు నిరo తర ము మాకు శ్రేయస్సు ను కలిపించు గాక. నాకు అనలేదు ఆయన. మహాభారతాన్ని ఆంధ్రీ కరించి నప్పుడు ఎవరు చదువు కోవడం మొదలు పెట్టారో, ఎవరు వినడం మొదలు పెట్టారో వాళ్ళందరికీ కూడా త్రిమూర్తుల యొక్క రక్ష కలుగు గాక. వారందరికీ లక్ష్మి పార్వతి సరస్వతుల యొక్క అనుగ్రహము కలుగు గాక. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగు గాక కాబట్టి మాకు అంటూ "పురుషోత్తమా మ్బు జభవ శ్రీ క న్ద రా శ్శ్రే యసే"
వ్యాస భగవానుడు చంద్రవంశాన్ని వర్ణిచాడు మహా భారతం లో,వాల్మికి మహర్షి సూర్య వంశాన్ని వర్ణి చారు రామాయణo లో సూర్య వంశాన్ని, చంద్ర వంశాన్ని వర్ణి చి మనకి ధర్మాన్ని నేర్పినటు వంటి వారు వారిద్దరు. సూర్య చంద్రులను ప్రస్తుతి చేసినటువంటి వ్యాస వాల్మీకులు మన సాహిత్యా న్నంత కూడా రెండు కాళ్ళ లాంటి వారు.
అందుకే వ్యాస భగవానుడిని వాల్మీకి ని స్తుతి చేయకుండా ఎటువంటి ప్రసంగాన్ని చెయ్యరు. కాబట్టి నేను చంద్రవంశాన్ని వర్ణన చెయ్యబోతున్నాను, వ్యాస భగవానుడు అందించిన చంద్రవంశం అది. కాబట్టి చంద్ర సంబందమైన కీర్తన కూడా చెయ్యాలి, అందుకని రాజ రాజ నరెంద్రున్ని అడ్డు పెట్టుకుని "రాజ "శబ్దం చంద్రున్ని చెప్తుంది.
శ్లోకం యొక్క అర్థము
చాళుక్య వంశానికి చెందిన రాజ రాజ నరేంద్రుడు మనం ఇప్పుడు రాజమండ్రి అని పిలుచుకునే రాజమహేంద్రవరాన్ని రాజధాని గా చేసుకుని పరిపాలన చేసేవాడు ఆయన్ని స్తోత్రం చేస్తూ "రాజ కులైక భూషణుడు " రాజులు అనిపిచుకున్న వాళ్ళందరిలో కూడా గొప్ప వాడిగా కీర్తింప బడినవాడు కాదు
"రాజ కులైక భూషణుడు" అనునది పైకి చంద్రుడికి సమన్వయం. "రాజ మనోహరుడు " రాజులందరికీ కూడా చాలా మనోహరమైన స్థితి ని పొందినటు వంటి వాడు "అన్య రాజా తేజో జయ శాలి శౌర్యుడు" మిగిలిన రాజులందరిని కూడా జయించినటువంటి వాడు, గొప్ప శౌర్యo కలిగినటువంటి వాడు రాజరాజ నరేంద్రుడు "విశుద్ధ యస్సస్సరదిం దు చంద్రికా రజిత సర్వలోకుడు " శరత్ కాలం లో ఉండేటటువంటి చంద్ర బింబాన్ని పరిణిత చంద్రుడు అని పిలుస్తారు, బాగా ప్రకాశవంతం గా ఉంటుంది వెన్నెల తోటి. అటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో, రాజులందరి లో రాజ రాజ నరేంద్రుడు అంత గొప్ప వాడు. "అపరాజిత భూరిభుజా కృపాణ ధా రాజల శాంత శాత్రవ పరాగుడు " ఆ రాజ రాజ నరేంద్రుడు పట్టుకున్నటువంటి ఖడ్గ రక్త ధారల చేత శత్రువుల యొక్క ఉద్రేకమనేటటువంటి ధూళి అణిగి పోయినటువంటి వాడు. ధూళి రేగిపోయి ఉందనుకొండి, వర్షం పడిందనుకోండి ఆ ధూళ అంతా అణిగిపోతుంది. శత్రువులైన రాజులు లేస్తూ ఉంటే రాజరాజ నరేంద్రుడు కత్తి పట్టుకొని యుద్ధ భూమికి వెళ్లి ఆ కుత్తుకలు తెగటార్చి, నేల రాలి పోయేలాగా శత్రువు లందరినీ ధునుమాడితే, ఆ కత్తి నుండి నేల రాలిన నెత్తుటి ధారల చే ధూళి అయినటువంటి శత్రువులని అ ణి గేల చేయ గలిగిన పరాక్రమ శాలి అయిన రాజ రాజ నరేంద్రుడు "రాజమహోన్నత్తిన్ " అటువంటి వాడు రాజరాజు అని కీర్తించి
"విమలాధిత్య తనూజుడు
విమల విచారుడు గుమార విద్యా ధరుడు
త్తమ చాళు క్యుడు వి వి ధా
గమవి జి త శ్ర ముoడు తు హినకరు డురు కాంతిన్"
చంద్రుణ్ణి చుస్తే ఎంత సంతోషం కలుగుతుందో ఆయన శరీర కాంతి చేత, రాజ రాజ నరెంద్రున్ని చుసిన వారికి కూడా అంత సంతోషం కలుగుతుందిట. ఆయన విమలదిత్యుడికి కుందమాంబ అనే స్త్రీ కి కలిగినటువంటి వాడు. చాలా పరిశుద్ధ మైన ఆచారము కలిగిన వాడు. సుబ్రమణ్యుడు దేవసేన కంతటికీ అధిపతి అయ్యి రాక్షసులని ఎలా ధునుమాడ తాడో ఆ విధం గా,అటువంటి పరాక్రమము కలిగి, శాస్త్ర అస్త్ర నైపుణ్యం కలిగిన వాడైన వాడు. లేదా సుబ్రమణ్యుడి ఆరాధన ము యందు నిష్ణాతుడై న వాడు. చాళుక్యులు గొప్ప శివ భక్తులు. అనేకమైన ఆగమములు తెలిసి ఉన్నటు వంటి వాడు. అటువంటి రాజ రాజ నరేంద్రుడు ఒకాను కోక నాడు సభలో గొప్ప గొప్ప పండితుల్ని , కవుల్ని కూర్చోపెట్టుకొని వారితో మాట్లాడుతూ ఉండగా సంసృతం లో ఉన్నటువంటి భారతం గురించి ప్రస్తావన వచ్చింది. ఆయన కి భారతం వినటం అంటే చాలా ఇష్టం , అందుకని తరచూ భారతం లో ఉండేట టు వంటి విశేషాలన్నీ వింటూ ఉండేవాడు. భారతమే కాదు రామాయణాది కావ్యాలు కూడా వినేవాడు. ఆయన నన్నయ్య గారిని పిలిచి నన్నయ్య గారితో ఒక మాట అన్నాడు. భారతం లో నన్నయ్య గారి గురించి మనకి తెలియటానికి అదొక్కటే పద్యం అది వినా నన్నయ్య గారి గురించి తెలుసుకోవటానికి సాధికారిత తో కూడిని వేరే ఇతర పద్యములేవి ఇక మనకు కనపడవు.
"తనకుల బ్రాహ్మణు ననురక్తు నవిరత
జప హోమ తత్పరు విపుల శబ్ద
శాసను సంహితాభ్యాసు బ్రహాండాది
నానా పురాణ విజ్ఞా న నిరతు
బాత్రు నాపు స్తంబ సూత్రు ముద్గల గోత్ర
జాతు సద్వినుతావ దాత చరితు
లోకజ్ఞను భయ భాషా కావ్య రచనాభి
శోభితు సత్ప్రతిభాభి యోగ్యు
నిత్య సత్య వచను మత్యమరాధిపా
చర్యు సుజను నన్నపా చర్యు( జూచి
పరమ ధర్మ విధుడు వర చాళుక్యా న్వ యా
భరణున్ డిట్టులనియె గరుణ తోడ "
పండితులలో నన్నయ్య గారిని చూసాడు, నన్నయ్య గారికి ఉన్న లక్షణములు చెప్తున్నారు. ఆయన కుల బ్రాహ్మణుడు, కుల బ్రాహ్మణు డు అంటే రాజుగారి దగ్గర పులోహిత్యం చేస్తూ వచ్చిన పరంపర బ్రాహ్మణుడు అనే అర్థమే కాదు. ప్రభువు ప్రకటించిన శాసనములను సంస్కృతం లో రచన చేసి అందించ గలిగే దిట్ట అయినటువంటి వాడిని కూడా కుల బ్రాహ్మణుడు అనే పిలుస్తారు. కాబట్టి అలాంటి శక్తి కలిగినటువంటి కుల బ్రాహ్మణుడు. నిరంతరమూ జపం చేస్తూ ఉంటాడు , హోమం చేస్తూ ఉంటాడు. హోమము చేత దేవతల ప్రీతి కల్పిస్తూ ఉంటాడు. మాత్రముల చేత ఆయా మంత్రాధి స్టా న దేవతలను అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాడు. విపుల శబ్ద శాసనుడాయన,
ఏ శబ్దానికి ఎన్ని అర్థములుంటాయో, ఏ శబ్దాన్ని ఎలా ప్రయోగించ్చచో, ప్రయోగించి ఆ ఫలితాన్ని సాధించుకోవచ్చో, అందరికి అర్థం అయ్యేటట్టు చెప్పచ్చో , బాష మీద , శబ్దం మీద ప్రభుత్వం ఉన్నటువంటి వాడు. అనేకమైనటువంటి పురాణములను , అష్టాదశ పురాణములను సమగ్రం గా చదువుకున్నవాడు. ఆపస్తంబ సూత్రముల యందు పుట్టిన వాడు, ముద్గల గోత్రమునందు జన్మిచిన వాడు, పెద్దల చేత గౌరవి o ప బడిన వాడు. లోక జ్ఞానం కలిగిన వాడు. సంకృతాంధ్ర భాషల యందు మహా పండితుడు. గొప్ప విద్ద్వత్తు కలిగిన వారందరి చేత కీర్తింప బడిన వాడు, ఇన్ని ఉండి కూడా పరమ వినయం తో విధేయత తో భగవత్ భక్తి తో నోరు విప్పితే ఎన్నడూ అసత్యము పలుకక సత్యమును మాత్రమే పలికే వ్రతమున్న వాడు , దేవతలకి గురువైన బృహస్పతి ఎటువంటివాడో , ఈలోకం లో రాజరాజ నరేంద్రుడి దగ్గర ఉన్నటువంటి భూలోకం లో బుద్దికి బృహస్పతి వంటివాడు . అటువంటి నన్నయ్యాచార్యుడు ని చూసి పిలిచి ఒక నమస్కారం చేసి , మహానుభావ నన్నయ్య , నీవంటి ప్రాజ్ఞుడు జన్మించడ యా , నీయొక్క గొప్ప త నా న్ని మేము ఉపయోగించుకోవాలి. అటువంటి ప్రభువులు ఉన్ననాడు కదా జాతి కి అందేది ఇటువంటివి. అటువంటి జ్ఞానులు ఉన్నాకూడా ,ప్రభువులు గుర్తించ గలిగే వారు లేకపోతే కూడా సాలగ్రామాలు కూడా రాల్లలోనే ఉండిపోతాయి. వాటిని చుసేదేప్పుడు, శుద్ధి చేసేదేప్పుడు , వాటికి పూజ చేసేదెప్పుడు, వాటి అనుగ్రహాన్ని నువ్వు పొందగాలిగేదేప్పుడు. కాబట్టి ఆ రాజు పిలిచి అన్నాడు మహానుభావా నీకు నాకు ఇస్తమైనవెవొ తెలుసు. నీవు నాకు కుల బ్రాహ్మణుడవు . ఇవాళ్ళ నేను నీకు కొత్తగా చెప్తున్నానని నువ్వు అనుకోవక్కర్లేదు. నాకు ఇష్టమైనవి ఈ లోకంలో 5 ఉన్నాయ్. ఆ 5 నాకు ఇస్తామని నీకు చెప్తే అది నిజ మే నా అ ని నువ్వు శ o కిం చ వలసిన అవసరం లేదు. నీకు బాగా తెలుసు నా నడవడి అంతా ను. రాజ రాజ నరేంద్రుడు చెప్పుకుంటున్నాడు. నాకు 5 ఇష్టం అని. అయిదు చెయ్యాలని ఎప్పుడూ నా మనసు ఉవ్విళ్ళు రుతుంది. ఒక్కసారి చేసినా కుడా మళ్ళి మళ్ళి చెయ్యాలనిపిస్తుంది. ఈ భూమి యందు దేవతల వంటి బ్రాహ్మణులు కనపడ్డప్పుడు వాళ్ళ ని సేవిo చా లని, వాళ్ళకి నమస్కరించాలని నా మనసు వేమ్పర్లాడుతూ ఉంటుందయ్యా. భారతం ఎన్నిమాట్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంటుం ది. నిజమో అబద్ధమో నన్నయ్య గారికి తెలీదూ, రోజూ వినటం లేదూ. అది నిజం అని నన్నయ్య గారికి తెలుసు. అందుకు కదూ భారతాన్ని ఆంధ్రీ కరించిoది. నన్నయ్య గారికి అటువంటి శక్తి ఉన్నా, అటువంటి కోర్కె ఉన్న రాజు పుట్టద్దూ!! అందుకని రాజ రాజ నరెంద్రున్ని తక్కువ చెయ్యద్దు అంటున్నాను.
ఎంత గొప్పగా చెప్పాడంటే " పార్వతీ పతి " పూజ మళ్ళి మళ్ళి చెయ్యాలనిపిస్తుందయా నన్నయ్య , ఏమిటో నాకు పార్వతీ పతి పూజ అంటే అంత ఇష్టం. అంటే ఆయన విష్ణు ద్వేషి కాదు. ఆయన కి శివుని యందు అనురక్తి అంతే కాని ఆయన విష్ణు ద్వేషి కాదు. ఎప్పుడూ దానం చెయ్యాలని పిస్తుంది. ఉండడం ఒక ఎత్తు, దానం చెయ్యాలని ఉండడం ఒకెత్తు. సాధారణం గ ఉండడం అన్న విషయం లో లక్ష్మి విషయం లో ప్రారబ్దం ఏమిటంటే, దాచు కుందా o
అనే ఉంటుంది తప్ప ఇద్దాం అని అనిపించదు. అసలు శాస్త్రం లో పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి,దేనికి దాచుకుంటాడని అడగండి నాకే ఉండాలని దాచుకుంటాడు, అసలు పిచ్చాడై అలా దాచుకున్నది నీకు రాదు, మీ బిడ్డలకి వెళ్ళిపోతుంది , గుటుక్కున ఊపిరి ఆగిపోతే, నీకే ఉండాలo టే నువ్వు దానం చేస్తే నీ ఖాతా లోకొస్తుంది. అంటే అంతా ఇచ్చేయ్యమని చెప్పరు. కనీసం ఎవడికి తోచింది వాడు దానం చెయ్యక పోతే ఎలా ఉత్తర జన్మలలో?
నువ్వు దాచింది నీతో రాదు, నువ్వు ఇఛుకున్నదెదొ అది నీతో వస్తుంది. అందుకే దానం చేసేటప్పుడు కొడుకు ని దగ్గర పెట్టుకోమ్మన్నారు, పెద్దలకి సుసృష చేసేటప్పుడు తల్లి కూతుర్ని దగ్గర పెట్టుకోమ్మన్నారు, తల్లిని చూసి పెద్దలకి సుసృష కూతురు నేర్చుకుంటుంది. తండ్రి దానం చూసి , ఓహో నాన్నగారిలా ఇలా బతకాలన్న మాట అని కొడుకు నేర్చుకుంటాడు.కాబట్టి రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు " సాధు పురుషులైన వాళ్ళు ఉంటారే పరమ భక్తి తత్పరులు , వాళ్ళ తో స్నేహం కోరుకుంటా నయ్య , వాళ్ళతో నేను దగ్గరగా ఉండాలని వాళ్ళతో చనువుగా ఉండగాల్గాలని , వాళ్ళ పక్కన తిరగగల చొరవ నాకు నిలబడాలని నేను కోరుకుంటాను". ఎందుకు కోరుకోవడం, దాని యందు వేరొక ప్రయోజనం కోరి కాదు, ఆయన ఆ సత్పురుషుడు అంకుశం లాంటి వాడు మనమో ఏనుగు తొండం లాంటి వాళ్ళం, ఎనుగుతోండం ఎప్పుడూ నిలకడగా ఉండదు. ఇలా వెడుతూ పూల కొమ్మ లాగుతుంది,మావటి ఏమి చేస్తాడంటే అంకుశం పట్టుకుని ఆ తొండం మీద ఇలా అంటాడు. అంటే మళ్ళి తొండం కిందకి దింపేస్తు oది. సత్పురుషుని తో స్నేహం ఎటువంటిదో తెలుసాండి ,రామకృష్ణ పరమహంస చెప్పిన మాట అంకుశం పట్టుకున్న మవటిని పక్కన పెట్టుకోవటం వంటిది. ఆయన తో కలిసి ఉంటె ఆయన జీవన విధానం మీకు తెలిసి ఉంటుంది, తెలిసుండి ప్రయోజనం ఏమి ఉండదు, ఆయన జీవనం ఎలా సాగించాలను కుంటున్నారో దానికి తగినట్టు మీ జీవితం ఉండాలి. ఆయన జీవన శైలి ని పుణి కి పుచ్చుకోవాలి, అంతే తప్ప ఆయనకి మనం ప్రతి భందకం కాకూడదు. పక్కన ఉన్న వాళ్ళంతా శిష్యులని అనుకోవలదు. ఎక్కడో ఉన్నా ప్రేరణ పొంది, జీవితాన్ని మలచుకుoటే వాడు మహానుభావుడు. నాకు ఈ అయిదు ఇష్టం, కాబట్టి నన్నయ్య నేను ఒక్క కోరిక కోరుకుతున్నాను, నువ్వు మహానుబహుడవు , నిరంతర జప హోమ తత్పరుడవు , నాకోసం నువ్వు ఒక ఉపకారం చెయ్యాలయ్యా. భారతాన్ని ఆంధ్రీకరించాలి, ఏమయ్యా మిగిలినవి ఆంధ్రీకరించమని అడకకుండా ఒక్క భారతాన్నే ఆంధ్రీకరించాలని అడుగుతున్నవే మీ అని అడుగుతావేమొ,
మీరు ఒక గోవుని దానం చేస్తే నూరు గోవుల్ని దానం చేసినట్టు లెక్కలో వేస్కుంటారు. అందుకే గోదానం పుచుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పక్కకి వెళ్లి జపం చేస్కుంటారు, ఎందుకంటే వాళ్ళకి వంద గోవులు పట్టిన ఫలితం వాళ్ళ ఖాతా లో పడకుండా ఉండడం కోసం, అప్పుడు వాళ్ళకు ఆ ఒక్క గోవు పుచ్చుకున్న ఫలితం వాళ్ళకి వేస్తారు ఆ మంత్ర జపం చేస్తే ఇచిన్న వాడికి మాత్రం నూరు గోవుల కిందే లేక్కపెట్టేస్తారు. భారతం లోనే అనుశాసన పర్వం లో ఉంది పరమేశ్వరుడు గోవులకు ఉత్కృష్ట స్థితిని ఇచ్చాడు. ఆయన తన మూడో కంటి లోని తేజస్సు కొంత తీసి కొన్ని గోవులయందు ప్రవేశ పెట్టాడు, ఆ గోవులు గోరోజన వర్ణాన్ని పొందాయి, అంటే పూర్తి ఎర్రటి ఎరుపు కాదు, కొద్ది ఎరుపు రంగును పొందుతాయి, వాట్ని కపిల గోవులు అంటారు , ఒక్క కపిల గోవు దానం చేసినా , సేవ చేసినా , అరిటిపండు పెట్టినా చాలా సంతోషం. రాజ రాజ నరేంద్రుడు అంటున్నాడు ఇక్కడ సరిఅయిన గోవు దొరకటం కష్టం కాదు కాదు కపిల గోవు దొరకాలి , అది ఎటువంటి కపిల గొవై ఉండాలి, గొప్ప పొదుగు కలిగి ఉండి , ఇలా శిరములు ముట్టుకుoటే పాలు కారేటట్లు ఉండాలి, అది విపరీతం గా పొడిచే ఆవు కాకూడదు, చక్కటి ధేను వై ఉండాలి సాధు గొవై ఉండాలి, చూడ ముచ్చటగా ఉండాలి, ఇప్పుడు ఆవు పాల కాచి తోడుపెట్టుకొని, పెరుగు తినే వాడై ఉండకూడదు, పరమ సంతోషం తో ఆ ఆవు పాలు చేత పట్టుకుని పరమేశ్వరుడి కి అభిషేకం చేస్కుని రమించి పోయేటటువంటి వేద వేదాంగములు చదువు కున్న బ్రాహ్మణుడు దొరకాలి, అటువంటి బ్రాహ్మణుడు ఎందుకు దానం పుచుకుంటాడు, అయన తన ఇంట అభిషేకం చేస్కోవటానికి ఒక గోవు ఉంటె బావుండు, రోజూ ప్రదక్షణం చేస్కోవటానికి ఒక గోవు దొరికితే బావుండు అని అనుకునే వేద వేదాంగములు చదువుకున్న బ్రాహ్మణుడు దొరకాలి అప్పుడు నువ్వు దానం చెయ్యాలి, దేశము కాలము నీదగ్గర పుచ్చుకునే వాడు ఇవ్వడానికి గోవు ఇన్ని కలిసి రావాలి కాని ఒకవేళ అటువంటి గోవు దొరికిన ,గోవుని దానం చేయ్యకలవేమో, ఆ బ్రాహ్మణుడు ఈలోపాల వేరొకని దగ్గర గోవు ని పుచ్చుకోని చాల o డి నాకెందుకు ఇన్ని గోవులు నేను పెంచుకోలేను మహాప్రభో నాకు అక్కర్లేదు అంటదు. నువ్వు ఇంకా తరించాలి అనుకుంటే ఆ ఆవు కొమ్ములు ఎంత పరిమాణం లో ఉంటాయో వాటికి తగిన శుద్ధ మై న బoగా రం తో నువ్వు ఆ గోవుకి అలంకారములు చేయించాలి, వాటి డేక్కల కి బంగారపు తొడుగులు చేయించాలి. వాటి కొమ్ములకి గిట్టలకి బంగారు తొడుగులు చేయించి ఒక వేద వేదాంగములు చదువుకున్న బ్రాహ్మణుని కి దానం ఇస్తే ఫలితమో మహాభారతాన్ని విన్న వాడికి అంత ఫలితం. బాగా మగ్గిన కొతపల్లి మామిడిపండు తేనె జాడి లో పడినది తినటం ఎంత తేలికో మహాభారత శ్రవణం చెయ్యటం అంత తేలిక. ఇంత కన్నా తరించే మార్గం ఉందా, అంత ఫలితం ఇస్తారయ్య, అటువంటి మహా భారతం సంస్కృతం లో ఉంది కాని ఆధ్రమ్ లేదు. కాబట్టి మహానుభావా ఇంతటి మహా ఫలితాన్నిచ్చే మహాభారతాన్ని ఆంధ్రీకరించాలి అన్నాడు రాజ రాజ నరేంద్రుడు.
అప్పుడు నన్నయ్య గారు అంటారు ఆకాశం లో ఉన్నటువంటి నక్షత్రాలు అన్నింటిని తప్పు లేకుండా లెక్కపెట్టు,
ప్రతిరోజూ రాత్రి లెక్కపెట్టి, బ్రతికున్నన్నళ్ళు లెక్కపెట్టి , కచ్చితం గా లెక్క చెప్పగలవా , చెప్పలేవు, అలా వేదముల యొక్క శాస్త్రముల యొక్క సమస్త సారా న్ని నేను పొందేస్తా ను అంటే అవుతుoదా తేలిగ్గా , బుద్ధి బలం అనే చేతులతోటి మహా సముద్రమైన భారతాన్ని ఈదుతానూ అంటే కుదురుతుందా, నాకేదో కావన శక్తి ఉండొచ్చు నాకేదో బాష మీద ప్రభుత్వం ఉండొచ్చు, అయితే మాత్రం మహా భారతం అనే సముద్రాన్ని నేను ఈద గలనా రాజరాజనరేంద్ర , నావల్ల కాదు అని నేను ఊరుకుంటున్నాను అని నువ్వు అనుకున్తున్నవేమో చత్రుముఖ బ్రహ్మ కైనా సాధ్యమా అంత గొప్పదయ్య మహాభారతం, చతుర్ముఖ బ్రహ్మ గారే చెప్పగలడా అన్నారంటే అటువంటి మహా భరతన్ని నిర్మాణం చేసిన వేదవ్యాసుడు ఎంత గొప్పవాడై ఉండాలి. అయిన నేను ఆంధ్రీకరిస్తాను ఎందుకో తెలుసా, ఒక్క కారణానికి , నా వల్ల కాదు అని ఇలా తల వంచుతాను , నేను ఎవరిముందు అయితే తల వంచుతానో, వారి పనిముట్టు గా నన్ను అంగీకరించారా జరిగిపోతుంది అంతే కధంతా, నేను చేస్తున్నాను అంటే కదా నాకు సమర్ధత , ఎవరు నన్ను స్వీకరిoచాలో వారు నన్ను స్వీకరించాక ఇంకెందుకు నడవదు. కాబట్టి నేను ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను. నేను పరమ శివునికి, విష్ణువుకి , బ్రహ్మ గారికి , విగ్నేస్వరుడికి , సూర్యుడికి , ఆరు ముఖములు ఉన్న సుబ్రహ్మణ్యేస్వర స్వామి కి ,లక్ష్మీ దేవికి , సరస్వతి కి , పార్వతీ దేవికి, దేవతల అందరికి తల వంచి నమస్కరిస్తున్నాను, వీళ్ళందరికీ నమస్కరించి , పద్య విద్య కి ఆది అయిన వేరొక మహా పురుషుడికి నమస్కరిస్తున్నాను,ఎవరో తెలుసా ఆయన ప్రచేతసను కుమారుడై రామాయణ కావ్యాన్ని లోకానికి అందించిన వాల్మికి మహర్షి
యొక్క పాదరవిన్దములకు నమస్కరించి, సూర్య వంశాన్ని వర్ణించి రామాయణ లోకానికి ధర్మ ప్రభోదంచేసిన చేసిన వాల్మీకి మహర్షి కి నమస్కరిస్తున్నాను అన్నారు. పద్య విద్య అన్నారు, మనకి ఛందస్సు ఒక అద్భుతం ఇది ఇతర భాష లకి లేదు, సంస్కృతానికి , తెలుగుకి మన భాష లేకె ఇటువంటి మర్యాద ఉన్నది. ఛందస్సు పద్యం గా వస్తే మీరు ధారణ చెయ్యవచ్చు, మీరు వాక్యముల కింద ఎన్ని వాక్యములు రాసినా ధారణ చెయ్యలేము. నాలుగు మట్లు పద్యాన్ని చదివితే వచ్చేస్తుంది పద్యం మీకు, పది మాట్లు వాక్యం విన్నా అది యథా తధం గా చెప్పలేము. భారతం కిరణముల చేత చీకటిని పారత్రోలిన మహానుభావుడైన పరసరమహర్షి కి కుమారుడైన వేదవ్యాస భగవానుడి
పాదరవిన్దములకు నమస్కారం చేస్తూ నేను భారతమును ఆంధ్రీకరించుట ప్రారంభం చేస్తాను. రాజరాజ నరేంద్ర నీ కోర్కె తీరనున్నది అని చెప్పి మొదటి ఆశ్వాసము మొదలు పెట్టారు ఆదికవి నన్నయ్యగారు.
నన్నయ్య గారు మహా భారతం ఆంధ్రీకరించడం లో వచ్చిన మొదటి పర్వమే "ఆది పర్వము ".
ఆది అను శబ్దమునకు అర్థము మొదటిది అని. సంస్కృత భారతం లో కూడా ఆది పర్వమే. ఆయా పర్వాల పేర్లు
అలగే ఉన్నాయ్.
మహా భారతాన్ని ఆంధ్రీకరించిన సమయం లో నన్నయ్య గారి నోటి నుంచి వచ్చిన మొట్ట మొదట పద్యం. ఆ పద్యాన్ని ఆయన తెలుగు లో రచించలేదు. దానికి కారణo ఒక్కటే, మనకి దేవతారాధన అని ఒక మాట ఉంది, అంటే భగవంతుణ్ణి ఆరాధించుట. ఏమి మనమే జాతీయ భాషా అని ఒక బాషని పెట్టుకున్తున్నమే, రాష్ట్ర బాష అని రాష్ట్రానికి ఒక బాషని పెట్టుకుoటుoన్నాయే. ఎవరి బాష మీద వాళ్ళకి అంతంత మక్కువ ఉంటుందే. అలాగే ఈశ్వరుడు కూడా ఒక నిర్ణయం చేసాడు. ఆరాధన యందు నామాలు చెప్పుకోవటం లోను, భగవంతుణ్ణి స్మరించడం లోను , భజన చేయడంలోనూ మీరు ఎందులో చేస్తున్నారు అన్న దాంతో సంబంధం ఉండదు. కానీ
వై దికమైన ఆరాధన ప్రక్రియ యందు సంస్కృత బాష ను మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి "శ్వేత వరాహ కల్పే "అంటాం తప్ప "తెల్ల పంది కల్పే " అని అనువాదం చేసి పూజ లో ఎక్కడా ఉపయోగించరు. సంస్కృత బాష లోనే ఉంటుంది.
భారతాన్ని ఆంధ్రీ కరించడం అనే ట టువంటి మహోజ్వలమైన ప్రక్రియని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు దేవతా మూర్తుల ఆరాధన, త్రిమూర్తుల యొక్క అనుగ్రహం నాకు కలగాలి అని సంస్కృతం లో నే ప్రారంభం చేసారు. సంస్కృతం లో ప్రారంభించడం, తెలుగు కి ఏదో తక్కువ చేసినట్టు భావించకూడదు. సంస్కృతం తల్లి వంటిది, తాను ఎంత గోప్పవా డై నా కావోచ్చుకానీ తనను కన్న తల్లి తాను చదువుకున్నo త చదువుకున్నది కాక పోవచ్చు, తాను ఇప్పుడు ఎంత ఐశ్వర్య వంతుడో ఆమె అంత ఐశ్వర్య వంతురాలు కాకపోవచ్చు , తానూ ఇప్పుడు ఎంత అందంగా ఉన్నడో ఆమె అంత అందం తో శరీర సౌస్ట వం తో లేకపోవచ్చు కానీ అమ్మ అమ్మే. అసలు అమ్మ కనపడితే నమస్కరించడం అసలు అవతల వారి వ్యక్తిత్వానికి నిదర్శనం.
కాబట్టి సంస్కృతం లో ఆ త్రిమూర్తులను స్తోత్రం చేసి ఆ త్రిమూర్తుల యొక్క శక్తి స్వరూపాలని కూడా స్తోత్రం చెయ్యడం నన్నయ్య గారి యొక్క పరిణితి కి నిదర్శనం. కాబట్టి అయన మొట్ట మొదటి పద్యాన్ని ప్రారంభం చేస్తూ
"శ్రీ వాణీగిరిజా శ్చిరాయ దధ తో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తయ స్త్రిపురషా స్సంపూజితా వ స్సురై :
ర్భూ యా సు: పురుషోత్తమా మ్బు జభవ శ్రీ క న్ద రా శ్శ్రే యసే"
అంటూ మొదలు పెట్టారు అందులో శ్రీ , వాణి , గిరిజ
శ్రీ అంటే లక్ష్మి, కవితా పరం గా శ్రీ కారం తో ప్రారంభం చెయ్యటం చాలా చక్కటి సంప్రదాయం, శుభ ప్రద మైన టువంటి ప్రారంభం. శ్రీ -->లక్ష్మీ దేవి వాణి -->సరస్వతి గిరిజ -->పార్వతి దేవి ఈ ముగ్గురు, ముగ్గురమ్మలు గా మూడు శక్తులకు ప్రతీకలు.
వాణి ,సరస్వతి ఆమె కవనశక్తి కి ప్రతీక ,ఒకరిలో ఉన్న ప్రజ్ఞ ఆయన లోనే ఉండిపోతే స్వార్థం తో అంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు లోకంలో అందుకే నీరు ఒకచోటే ఉంటె వాసన వస్తుంది. ప్రజ్ఞా తనతోనే ప్రకాశించి తన తోనే అంతరించి పోతే అంతకన్నా ఘోరమైన నేరం ఇంకోటి లేదు. సరస్వతి నది ,ప్రవహిస్తూనే ఉంటుంది ప్రవహించటానికి ఏ ప్రతిఫలాన్ని , ఏ పారితోషికాన్ని కోరకూడదు, ఎవరినించి ప్రవహించాలని అడిగారు , పురుషసూక్తం చేస్తూ వేదం లో "బ్రాహ్మణో స్య ముఖమాసిత్ "
వేదం చదువుకునేవాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ప్రయత్న పూర్వకం గా పేదరికాన్ని అనుభవించ మని చెప్తుంది వేదం. బ్రాహ్మణుడు నిరాడంభర జీవితాన్ని గడపాలి తప్పా ఎన్ని తనకి కలిసొచ్చినా అవసరమునకు మించి భోగ లాలస బ్రాహ్మణునికి ఉండరాదు. బ్రాహ్మణు డైన వాడి జీవితం ఒక్కరోజు ఎలా ఉంటుందో ,వైదికమైన బ్రాహ్మణు ని జీవితం మీరు చుస్తే మీరు తెల్లబోతారు. దాదాపుగా 70 సంవత్సరాలు పైచిలుకు వచ్చిన క్రిష్ణావధానులు గారు తన జీవితం మొత్తం లో చొక్కా వేసుకున్న పర్యాయములు మూడే మూడుసార్లు, అంటే ఎంత నిష్టాగరిస్టులై వాళ్ళు జీవితాన్ని గడిపారో చుడండి. అంత నిష్ట తో గడించిన జ్ఞానమును ఏ ఆపేక్షా లేకుండా లోకమునకు అందించడమే తమ కర్తవ్యము అని భావించి దానివలన వారి శ్వాస ఖేద పడినా , వారియొక్క హృదయము తల్లడిల్లినా ,వాళ్ళు డస్సి పోయినా , ఆయుర్దాయం తగ్గిపోయిన, అదేపనిగా మాట్లాడటం వలన ఊపిరులు ఖర్చై పోతే ఆయుర్దాయం క్షీణించి పోతుంది. అయుర్ధయమే క్షిణి o చిన దేని కొరకు మాట్లాడాలి అని అడిగారు, నీలో ఉండిపోయి విద్య నశించిపోయి నువ్వు మరణిoచేకన్నా నీ ఆయుర్దాయము తగ్గిపోయిన నువ్వు పది మందికి భోధ చేసి ప్రాణం విడిచి పెట్టు ట మేలు. కాబట్టి త్యాగము తో జీవించు, స్వార్థము తో బ్రతకవద్దు. కాబట్టి సరస్వతి ప్రవాహము , అది ప్రవహించాలి ఒకరి నుండి ఒకరి ప్రవహించి వెళ్ళిందా ఉపయుక్త మవుతుంది, ప్రవహించలేదా ఎవరికీ పనికిరాదు. గోదావరి ప్రవాహించినదా కొన్ని వేల ఎకరాలు సాగు అవుతాయి, కొన్ని లక్షల మంది దాహం తీరుతుంది. గోదావరి ఒక్కచోట ఉండిపోయిందా కొన్ని లక్షల మందికి అన్నం దొరకదు, కొన్ని కోట్లమంది దాహం తీరదు. లక్ష్మి సంపద భోగమును అనుభవించ గలిగినటు వంటి ధారుడ్యం.
"ఛి రాయ దధ తో " ఎప్పటినించి ధరించారిలా , చాలా కాలం నించి,
ఇవాళ కలుసుకోవటం రేపు దెబ్బలాడుకోవటం ఎల్లుండి విడిపోవటం మన జాతి సంస్కృతి కాదు, ఈ జాతి
ఆచారం ఎప్పుడూ కలిసి ఉండడమే. ఒకసారి తాళి కడితే ఇక ఆ జన్మకి ఆమెయే భార్య ,ఒకసారి తాళి కట్టించుకుంటే ఆ జన్మ కి ఆయనే భర్త. ఇద్దరి మధ్య ఘర్షణలకు ఏయే ప్రాంతములు ఉంటాయో ,వాటియందు ఇద్దరు రాజీ పడి జీవితాన్ని సమన్వయము తో రెండు బండి చక్రాలు కలిసిరధాన్ని నడిపినట్టు , నడిపించడమే తప్ప ఘర్షణ పడి విడాకులన్న మాట లేని ఒకేఒక జాతి ప్రపంచపటం లో ఒకే ఒక్క జాతి భారత జాతి.
"యే లోకానాం స్థితి మావహన్త్య విహతాం " ఈలోకాన్నంతటి ని కూడా రక్ష చేసే ముగ్గురు మూర్తులు న్నారే మా
తల్లు లైన తువంటి ఆ ముగ్గురితో కలిసి ఉంటారో వాళ్ళు "స్త్రీపుంసయోగోద్భవాం " ఆ స్త్రీ పురుష యోగ కారణము చేత జనించి ప్రవర్తిల్లిన ఇంత మంది జనులు ఉన్నారు. కాబట్టి మా అందరికి వారు తల్లి తండ్రులు ముగ్గురిగా కనపడుతున్న ఒక్క పదార్థం ఉన్నదే అదే స్థి కర్త గ లయ కర్త గా ప్రళయ కర్త గా ప్రకసిస్తోంది. అదిగో అటువంటి ఆ స్వరూపానికి నమస్కారం చేస్తున్నాను.
" తే వేదత్రయ మూర్తయ స్త్రిపురషా" వాళ్ళే వేదత్రయం గా ఈలోకంలో ఉన్నారు. వాళ్ళు మాకు నిరo తర ము మాకు శ్రేయస్సు ను కలిపించు గాక. నాకు అనలేదు ఆయన. మహాభారతాన్ని ఆంధ్రీ కరించి నప్పుడు ఎవరు చదువు కోవడం మొదలు పెట్టారో, ఎవరు వినడం మొదలు పెట్టారో వాళ్ళందరికీ కూడా త్రిమూర్తుల యొక్క రక్ష కలుగు గాక. వారందరికీ లక్ష్మి పార్వతి సరస్వతుల యొక్క అనుగ్రహము కలుగు గాక. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగు గాక కాబట్టి మాకు అంటూ "పురుషోత్తమా మ్బు జభవ శ్రీ క న్ద రా శ్శ్రే యసే"
పురుషోత్తముడు అన్న మాట శ్రీమహ విష్ణువుది "మహా దేవుడు అన్న మాట పరమ శివునిది "అమ్భుజ భవ "
అంటే తామర పువ్వులోనించి పుట్టినవాడు బ్రహ్మ దేవుడు
"శ్రీ క న్ద రా శ్శ్రే యసే" శ్రీ అంటే విషము కన్ధరా అంటే కంట మునందు పెట్టుకున్న వాడు కంటమ్ము నం దు హాలాహ లం పెట్టుకున్న పరమ శివుడు మాకు సమస్త అభ్హ్యున్నతులను కృప చేయు గాక.
అంటూ ప్రారంభం చేసి రాజరాజ నరేo ద్రుడు మీద ఒక పద్యం చెప్తున్నారు. కాదు కాదు మనకి ఇందులో ఒక చమత్కారం ఉంది మనకి సాహిత్యమూ అంటే భగవన్నామ స్పర్స లేని సాహిత్యం ఏది ఉందొ,ఆ సాహిత్యాన్ని మనవాళ్ళు అంగీకరించరు. అందుకే పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ ఒక మాట అంటారు "ఎంత గొప్ప గొప్ప శబ్దాలు వేసిన, ఎంత గొప్ప అర్థాలు ఉన్నారచన చేసినా , పరమేశ్వరుని గురించి చెప్పనటువంటి సాహిత్యం ఏది ఉందొ , భగవత్ భక్తీ ని ప్రభోదం చెయ్యనిది ఏది ఉందొ అది నిర ర్థ కము, అది తద్దినం పెట్టిన రేవులకి కాకులు వెళ్లినట్టు వెళ్ళే వాళ్ళకి పనికివస్తుందేమో కానీ , హరినామ స్మరణం . హంసలు మానస సరోవరానికి వెళ్లి తామర తూళ్ళు తిని ఆడుకున్నట్టు హరినామ స్మరణ చేసినకావ్యములు ఎవరు చదువు కుంటారు అంటే హరి చేరుకోవటానికి కుతూహలం ఉనవాళ్లు చదువు కుంటారు.వ్యాస భగవానుడు చంద్రవంశాన్ని వర్ణిచాడు మహా భారతం లో,వాల్మికి మహర్షి సూర్య వంశాన్ని వర్ణి చారు రామాయణo లో సూర్య వంశాన్ని, చంద్ర వంశాన్ని వర్ణి చి మనకి ధర్మాన్ని నేర్పినటు వంటి వారు వారిద్దరు. సూర్య చంద్రులను ప్రస్తుతి చేసినటువంటి వ్యాస వాల్మీకులు మన సాహిత్యా న్నంత కూడా రెండు కాళ్ళ లాంటి వారు.
అందుకే వ్యాస భగవానుడిని వాల్మీకి ని స్తుతి చేయకుండా ఎటువంటి ప్రసంగాన్ని చెయ్యరు. కాబట్టి నేను చంద్రవంశాన్ని వర్ణన చెయ్యబోతున్నాను, వ్యాస భగవానుడు అందించిన చంద్రవంశం అది. కాబట్టి చంద్ర సంబందమైన కీర్తన కూడా చెయ్యాలి, అందుకని రాజ రాజ నరెంద్రున్ని అడ్డు పెట్టుకుని "రాజ "శబ్దం చంద్రున్ని చెప్తుంది.
శ్లోకం యొక్క అర్థము
చాళుక్య వంశానికి చెందిన రాజ రాజ నరేంద్రుడు మనం ఇప్పుడు రాజమండ్రి అని పిలుచుకునే రాజమహేంద్రవరాన్ని రాజధాని గా చేసుకుని పరిపాలన చేసేవాడు ఆయన్ని స్తోత్రం చేస్తూ "రాజ కులైక భూషణుడు " రాజులు అనిపిచుకున్న వాళ్ళందరిలో కూడా గొప్ప వాడిగా కీర్తింప బడినవాడు కాదు
"రాజ కులైక భూషణుడు" అనునది పైకి చంద్రుడికి సమన్వయం. "రాజ మనోహరుడు " రాజులందరికీ కూడా చాలా మనోహరమైన స్థితి ని పొందినటు వంటి వాడు "అన్య రాజా తేజో జయ శాలి శౌర్యుడు" మిగిలిన రాజులందరిని కూడా జయించినటువంటి వాడు, గొప్ప శౌర్యo కలిగినటువంటి వాడు రాజరాజ నరేంద్రుడు "విశుద్ధ యస్సస్సరదిం దు చంద్రికా రజిత సర్వలోకుడు " శరత్ కాలం లో ఉండేటటువంటి చంద్ర బింబాన్ని పరిణిత చంద్రుడు అని పిలుస్తారు, బాగా ప్రకాశవంతం గా ఉంటుంది వెన్నెల తోటి. అటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో, రాజులందరి లో రాజ రాజ నరేంద్రుడు అంత గొప్ప వాడు. "అపరాజిత భూరిభుజా కృపాణ ధా రాజల శాంత శాత్రవ పరాగుడు " ఆ రాజ రాజ నరేంద్రుడు పట్టుకున్నటువంటి ఖడ్గ రక్త ధారల చేత శత్రువుల యొక్క ఉద్రేకమనేటటువంటి ధూళి అణిగి పోయినటువంటి వాడు. ధూళి రేగిపోయి ఉందనుకొండి, వర్షం పడిందనుకోండి ఆ ధూళ అంతా అణిగిపోతుంది. శత్రువులైన రాజులు లేస్తూ ఉంటే రాజరాజ నరేంద్రుడు కత్తి పట్టుకొని యుద్ధ భూమికి వెళ్లి ఆ కుత్తుకలు తెగటార్చి, నేల రాలి పోయేలాగా శత్రువు లందరినీ ధునుమాడితే, ఆ కత్తి నుండి నేల రాలిన నెత్తుటి ధారల చే ధూళి అయినటువంటి శత్రువులని అ ణి గేల చేయ గలిగిన పరాక్రమ శాలి అయిన రాజ రాజ నరేంద్రుడు "రాజమహోన్నత్తిన్ " అటువంటి వాడు రాజరాజు అని కీర్తించి
"విమలాధిత్య తనూజుడు
విమల విచారుడు గుమార విద్యా ధరుడు
త్తమ చాళు క్యుడు వి వి ధా
గమవి జి త శ్ర ముoడు తు హినకరు డురు కాంతిన్"
చంద్రుణ్ణి చుస్తే ఎంత సంతోషం కలుగుతుందో ఆయన శరీర కాంతి చేత, రాజ రాజ నరెంద్రున్ని చుసిన వారికి కూడా అంత సంతోషం కలుగుతుందిట. ఆయన విమలదిత్యుడికి కుందమాంబ అనే స్త్రీ కి కలిగినటువంటి వాడు. చాలా పరిశుద్ధ మైన ఆచారము కలిగిన వాడు. సుబ్రమణ్యుడు దేవసేన కంతటికీ అధిపతి అయ్యి రాక్షసులని ఎలా ధునుమాడ తాడో ఆ విధం గా,అటువంటి పరాక్రమము కలిగి, శాస్త్ర అస్త్ర నైపుణ్యం కలిగిన వాడైన వాడు. లేదా సుబ్రమణ్యుడి ఆరాధన ము యందు నిష్ణాతుడై న వాడు. చాళుక్యులు గొప్ప శివ భక్తులు. అనేకమైన ఆగమములు తెలిసి ఉన్నటు వంటి వాడు. అటువంటి రాజ రాజ నరేంద్రుడు ఒకాను కోక నాడు సభలో గొప్ప గొప్ప పండితుల్ని , కవుల్ని కూర్చోపెట్టుకొని వారితో మాట్లాడుతూ ఉండగా సంసృతం లో ఉన్నటువంటి భారతం గురించి ప్రస్తావన వచ్చింది. ఆయన కి భారతం వినటం అంటే చాలా ఇష్టం , అందుకని తరచూ భారతం లో ఉండేట టు వంటి విశేషాలన్నీ వింటూ ఉండేవాడు. భారతమే కాదు రామాయణాది కావ్యాలు కూడా వినేవాడు. ఆయన నన్నయ్య గారిని పిలిచి నన్నయ్య గారితో ఒక మాట అన్నాడు. భారతం లో నన్నయ్య గారి గురించి మనకి తెలియటానికి అదొక్కటే పద్యం అది వినా నన్నయ్య గారి గురించి తెలుసుకోవటానికి సాధికారిత తో కూడిని వేరే ఇతర పద్యములేవి ఇక మనకు కనపడవు.
"తనకుల బ్రాహ్మణు ననురక్తు నవిరత
జప హోమ తత్పరు విపుల శబ్ద
శాసను సంహితాభ్యాసు బ్రహాండాది
నానా పురాణ విజ్ఞా న నిరతు
బాత్రు నాపు స్తంబ సూత్రు ముద్గల గోత్ర
జాతు సద్వినుతావ దాత చరితు
లోకజ్ఞను భయ భాషా కావ్య రచనాభి
శోభితు సత్ప్రతిభాభి యోగ్యు
నిత్య సత్య వచను మత్యమరాధిపా
చర్యు సుజను నన్నపా చర్యు( జూచి
పరమ ధర్మ విధుడు వర చాళుక్యా న్వ యా
భరణున్ డిట్టులనియె గరుణ తోడ "
పండితులలో నన్నయ్య గారిని చూసాడు, నన్నయ్య గారికి ఉన్న లక్షణములు చెప్తున్నారు. ఆయన కుల బ్రాహ్మణుడు, కుల బ్రాహ్మణు డు అంటే రాజుగారి దగ్గర పులోహిత్యం చేస్తూ వచ్చిన పరంపర బ్రాహ్మణుడు అనే అర్థమే కాదు. ప్రభువు ప్రకటించిన శాసనములను సంస్కృతం లో రచన చేసి అందించ గలిగే దిట్ట అయినటువంటి వాడిని కూడా కుల బ్రాహ్మణుడు అనే పిలుస్తారు. కాబట్టి అలాంటి శక్తి కలిగినటువంటి కుల బ్రాహ్మణుడు. నిరంతరమూ జపం చేస్తూ ఉంటాడు , హోమం చేస్తూ ఉంటాడు. హోమము చేత దేవతల ప్రీతి కల్పిస్తూ ఉంటాడు. మాత్రముల చేత ఆయా మంత్రాధి స్టా న దేవతలను అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాడు. విపుల శబ్ద శాసనుడాయన,
ఏ శబ్దానికి ఎన్ని అర్థములుంటాయో, ఏ శబ్దాన్ని ఎలా ప్రయోగించ్చచో, ప్రయోగించి ఆ ఫలితాన్ని సాధించుకోవచ్చో, అందరికి అర్థం అయ్యేటట్టు చెప్పచ్చో , బాష మీద , శబ్దం మీద ప్రభుత్వం ఉన్నటువంటి వాడు. అనేకమైనటువంటి పురాణములను , అష్టాదశ పురాణములను సమగ్రం గా చదువుకున్నవాడు. ఆపస్తంబ సూత్రముల యందు పుట్టిన వాడు, ముద్గల గోత్రమునందు జన్మిచిన వాడు, పెద్దల చేత గౌరవి o ప బడిన వాడు. లోక జ్ఞానం కలిగిన వాడు. సంకృతాంధ్ర భాషల యందు మహా పండితుడు. గొప్ప విద్ద్వత్తు కలిగిన వారందరి చేత కీర్తింప బడిన వాడు, ఇన్ని ఉండి కూడా పరమ వినయం తో విధేయత తో భగవత్ భక్తి తో నోరు విప్పితే ఎన్నడూ అసత్యము పలుకక సత్యమును మాత్రమే పలికే వ్రతమున్న వాడు , దేవతలకి గురువైన బృహస్పతి ఎటువంటివాడో , ఈలోకం లో రాజరాజ నరేంద్రుడి దగ్గర ఉన్నటువంటి భూలోకం లో బుద్దికి బృహస్పతి వంటివాడు . అటువంటి నన్నయ్యాచార్యుడు ని చూసి పిలిచి ఒక నమస్కారం చేసి , మహానుభావ నన్నయ్య , నీవంటి ప్రాజ్ఞుడు జన్మించడ యా , నీయొక్క గొప్ప త నా న్ని మేము ఉపయోగించుకోవాలి. అటువంటి ప్రభువులు ఉన్ననాడు కదా జాతి కి అందేది ఇటువంటివి. అటువంటి జ్ఞానులు ఉన్నాకూడా ,ప్రభువులు గుర్తించ గలిగే వారు లేకపోతే కూడా సాలగ్రామాలు కూడా రాల్లలోనే ఉండిపోతాయి. వాటిని చుసేదేప్పుడు, శుద్ధి చేసేదేప్పుడు , వాటికి పూజ చేసేదెప్పుడు, వాటి అనుగ్రహాన్ని నువ్వు పొందగాలిగేదేప్పుడు. కాబట్టి ఆ రాజు పిలిచి అన్నాడు మహానుభావా నీకు నాకు ఇస్తమైనవెవొ తెలుసు. నీవు నాకు కుల బ్రాహ్మణుడవు . ఇవాళ్ళ నేను నీకు కొత్తగా చెప్తున్నానని నువ్వు అనుకోవక్కర్లేదు. నాకు ఇష్టమైనవి ఈ లోకంలో 5 ఉన్నాయ్. ఆ 5 నాకు ఇస్తామని నీకు చెప్తే అది నిజ మే నా అ ని నువ్వు శ o కిం చ వలసిన అవసరం లేదు. నీకు బాగా తెలుసు నా నడవడి అంతా ను. రాజ రాజ నరేంద్రుడు చెప్పుకుంటున్నాడు. నాకు 5 ఇష్టం అని. అయిదు చెయ్యాలని ఎప్పుడూ నా మనసు ఉవ్విళ్ళు రుతుంది. ఒక్కసారి చేసినా కుడా మళ్ళి మళ్ళి చెయ్యాలనిపిస్తుంది. ఈ భూమి యందు దేవతల వంటి బ్రాహ్మణులు కనపడ్డప్పుడు వాళ్ళ ని సేవిo చా లని, వాళ్ళకి నమస్కరించాలని నా మనసు వేమ్పర్లాడుతూ ఉంటుందయ్యా. భారతం ఎన్నిమాట్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంటుం ది. నిజమో అబద్ధమో నన్నయ్య గారికి తెలీదూ, రోజూ వినటం లేదూ. అది నిజం అని నన్నయ్య గారికి తెలుసు. అందుకు కదూ భారతాన్ని ఆంధ్రీ కరించిoది. నన్నయ్య గారికి అటువంటి శక్తి ఉన్నా, అటువంటి కోర్కె ఉన్న రాజు పుట్టద్దూ!! అందుకని రాజ రాజ నరెంద్రున్ని తక్కువ చెయ్యద్దు అంటున్నాను.
ఎంత గొప్పగా చెప్పాడంటే " పార్వతీ పతి " పూజ మళ్ళి మళ్ళి చెయ్యాలనిపిస్తుందయా నన్నయ్య , ఏమిటో నాకు పార్వతీ పతి పూజ అంటే అంత ఇష్టం. అంటే ఆయన విష్ణు ద్వేషి కాదు. ఆయన కి శివుని యందు అనురక్తి అంతే కాని ఆయన విష్ణు ద్వేషి కాదు. ఎప్పుడూ దానం చెయ్యాలని పిస్తుంది. ఉండడం ఒక ఎత్తు, దానం చెయ్యాలని ఉండడం ఒకెత్తు. సాధారణం గ ఉండడం అన్న విషయం లో లక్ష్మి విషయం లో ప్రారబ్దం ఏమిటంటే, దాచు కుందా o
అనే ఉంటుంది తప్ప ఇద్దాం అని అనిపించదు. అసలు శాస్త్రం లో పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి,దేనికి దాచుకుంటాడని అడగండి నాకే ఉండాలని దాచుకుంటాడు, అసలు పిచ్చాడై అలా దాచుకున్నది నీకు రాదు, మీ బిడ్డలకి వెళ్ళిపోతుంది , గుటుక్కున ఊపిరి ఆగిపోతే, నీకే ఉండాలo టే నువ్వు దానం చేస్తే నీ ఖాతా లోకొస్తుంది. అంటే అంతా ఇచ్చేయ్యమని చెప్పరు. కనీసం ఎవడికి తోచింది వాడు దానం చెయ్యక పోతే ఎలా ఉత్తర జన్మలలో?
నువ్వు దాచింది నీతో రాదు, నువ్వు ఇఛుకున్నదెదొ అది నీతో వస్తుంది. అందుకే దానం చేసేటప్పుడు కొడుకు ని దగ్గర పెట్టుకోమ్మన్నారు, పెద్దలకి సుసృష చేసేటప్పుడు తల్లి కూతుర్ని దగ్గర పెట్టుకోమ్మన్నారు, తల్లిని చూసి పెద్దలకి సుసృష కూతురు నేర్చుకుంటుంది. తండ్రి దానం చూసి , ఓహో నాన్నగారిలా ఇలా బతకాలన్న మాట అని కొడుకు నేర్చుకుంటాడు.కాబట్టి రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు " సాధు పురుషులైన వాళ్ళు ఉంటారే పరమ భక్తి తత్పరులు , వాళ్ళ తో స్నేహం కోరుకుంటా నయ్య , వాళ్ళతో నేను దగ్గరగా ఉండాలని వాళ్ళతో చనువుగా ఉండగాల్గాలని , వాళ్ళ పక్కన తిరగగల చొరవ నాకు నిలబడాలని నేను కోరుకుంటాను". ఎందుకు కోరుకోవడం, దాని యందు వేరొక ప్రయోజనం కోరి కాదు, ఆయన ఆ సత్పురుషుడు అంకుశం లాంటి వాడు మనమో ఏనుగు తొండం లాంటి వాళ్ళం, ఎనుగుతోండం ఎప్పుడూ నిలకడగా ఉండదు. ఇలా వెడుతూ పూల కొమ్మ లాగుతుంది,మావటి ఏమి చేస్తాడంటే అంకుశం పట్టుకుని ఆ తొండం మీద ఇలా అంటాడు. అంటే మళ్ళి తొండం కిందకి దింపేస్తు oది. సత్పురుషుని తో స్నేహం ఎటువంటిదో తెలుసాండి ,రామకృష్ణ పరమహంస చెప్పిన మాట అంకుశం పట్టుకున్న మవటిని పక్కన పెట్టుకోవటం వంటిది. ఆయన తో కలిసి ఉంటె ఆయన జీవన విధానం మీకు తెలిసి ఉంటుంది, తెలిసుండి ప్రయోజనం ఏమి ఉండదు, ఆయన జీవనం ఎలా సాగించాలను కుంటున్నారో దానికి తగినట్టు మీ జీవితం ఉండాలి. ఆయన జీవన శైలి ని పుణి కి పుచ్చుకోవాలి, అంతే తప్ప ఆయనకి మనం ప్రతి భందకం కాకూడదు. పక్కన ఉన్న వాళ్ళంతా శిష్యులని అనుకోవలదు. ఎక్కడో ఉన్నా ప్రేరణ పొంది, జీవితాన్ని మలచుకుoటే వాడు మహానుభావుడు. నాకు ఈ అయిదు ఇష్టం, కాబట్టి నన్నయ్య నేను ఒక్క కోరిక కోరుకుతున్నాను, నువ్వు మహానుబహుడవు , నిరంతర జప హోమ తత్పరుడవు , నాకోసం నువ్వు ఒక ఉపకారం చెయ్యాలయ్యా. భారతాన్ని ఆంధ్రీకరించాలి, ఏమయ్యా మిగిలినవి ఆంధ్రీకరించమని అడకకుండా ఒక్క భారతాన్నే ఆంధ్రీకరించాలని అడుగుతున్నవే మీ అని అడుగుతావేమొ,
మీరు ఒక గోవుని దానం చేస్తే నూరు గోవుల్ని దానం చేసినట్టు లెక్కలో వేస్కుంటారు. అందుకే గోదానం పుచుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పక్కకి వెళ్లి జపం చేస్కుంటారు, ఎందుకంటే వాళ్ళకి వంద గోవులు పట్టిన ఫలితం వాళ్ళ ఖాతా లో పడకుండా ఉండడం కోసం, అప్పుడు వాళ్ళకు ఆ ఒక్క గోవు పుచ్చుకున్న ఫలితం వాళ్ళకి వేస్తారు ఆ మంత్ర జపం చేస్తే ఇచిన్న వాడికి మాత్రం నూరు గోవుల కిందే లేక్కపెట్టేస్తారు. భారతం లోనే అనుశాసన పర్వం లో ఉంది పరమేశ్వరుడు గోవులకు ఉత్కృష్ట స్థితిని ఇచ్చాడు. ఆయన తన మూడో కంటి లోని తేజస్సు కొంత తీసి కొన్ని గోవులయందు ప్రవేశ పెట్టాడు, ఆ గోవులు గోరోజన వర్ణాన్ని పొందాయి, అంటే పూర్తి ఎర్రటి ఎరుపు కాదు, కొద్ది ఎరుపు రంగును పొందుతాయి, వాట్ని కపిల గోవులు అంటారు , ఒక్క కపిల గోవు దానం చేసినా , సేవ చేసినా , అరిటిపండు పెట్టినా చాలా సంతోషం. రాజ రాజ నరేంద్రుడు అంటున్నాడు ఇక్కడ సరిఅయిన గోవు దొరకటం కష్టం కాదు కాదు కపిల గోవు దొరకాలి , అది ఎటువంటి కపిల గొవై ఉండాలి, గొప్ప పొదుగు కలిగి ఉండి , ఇలా శిరములు ముట్టుకుoటే పాలు కారేటట్లు ఉండాలి, అది విపరీతం గా పొడిచే ఆవు కాకూడదు, చక్కటి ధేను వై ఉండాలి సాధు గొవై ఉండాలి, చూడ ముచ్చటగా ఉండాలి, ఇప్పుడు ఆవు పాల కాచి తోడుపెట్టుకొని, పెరుగు తినే వాడై ఉండకూడదు, పరమ సంతోషం తో ఆ ఆవు పాలు చేత పట్టుకుని పరమేశ్వరుడి కి అభిషేకం చేస్కుని రమించి పోయేటటువంటి వేద వేదాంగములు చదువు కున్న బ్రాహ్మణుడు దొరకాలి, అటువంటి బ్రాహ్మణుడు ఎందుకు దానం పుచుకుంటాడు, అయన తన ఇంట అభిషేకం చేస్కోవటానికి ఒక గోవు ఉంటె బావుండు, రోజూ ప్రదక్షణం చేస్కోవటానికి ఒక గోవు దొరికితే బావుండు అని అనుకునే వేద వేదాంగములు చదువుకున్న బ్రాహ్మణుడు దొరకాలి అప్పుడు నువ్వు దానం చెయ్యాలి, దేశము కాలము నీదగ్గర పుచ్చుకునే వాడు ఇవ్వడానికి గోవు ఇన్ని కలిసి రావాలి కాని ఒకవేళ అటువంటి గోవు దొరికిన ,గోవుని దానం చేయ్యకలవేమో, ఆ బ్రాహ్మణుడు ఈలోపాల వేరొకని దగ్గర గోవు ని పుచ్చుకోని చాల o డి నాకెందుకు ఇన్ని గోవులు నేను పెంచుకోలేను మహాప్రభో నాకు అక్కర్లేదు అంటదు. నువ్వు ఇంకా తరించాలి అనుకుంటే ఆ ఆవు కొమ్ములు ఎంత పరిమాణం లో ఉంటాయో వాటికి తగిన శుద్ధ మై న బoగా రం తో నువ్వు ఆ గోవుకి అలంకారములు చేయించాలి, వాటి డేక్కల కి బంగారపు తొడుగులు చేయించాలి. వాటి కొమ్ములకి గిట్టలకి బంగారు తొడుగులు చేయించి ఒక వేద వేదాంగములు చదువుకున్న బ్రాహ్మణుని కి దానం ఇస్తే ఫలితమో మహాభారతాన్ని విన్న వాడికి అంత ఫలితం. బాగా మగ్గిన కొతపల్లి మామిడిపండు తేనె జాడి లో పడినది తినటం ఎంత తేలికో మహాభారత శ్రవణం చెయ్యటం అంత తేలిక. ఇంత కన్నా తరించే మార్గం ఉందా, అంత ఫలితం ఇస్తారయ్య, అటువంటి మహా భారతం సంస్కృతం లో ఉంది కాని ఆధ్రమ్ లేదు. కాబట్టి మహానుభావా ఇంతటి మహా ఫలితాన్నిచ్చే మహాభారతాన్ని ఆంధ్రీకరించాలి అన్నాడు రాజ రాజ నరేంద్రుడు.
అప్పుడు నన్నయ్య గారు అంటారు ఆకాశం లో ఉన్నటువంటి నక్షత్రాలు అన్నింటిని తప్పు లేకుండా లెక్కపెట్టు,
ప్రతిరోజూ రాత్రి లెక్కపెట్టి, బ్రతికున్నన్నళ్ళు లెక్కపెట్టి , కచ్చితం గా లెక్క చెప్పగలవా , చెప్పలేవు, అలా వేదముల యొక్క శాస్త్రముల యొక్క సమస్త సారా న్ని నేను పొందేస్తా ను అంటే అవుతుoదా తేలిగ్గా , బుద్ధి బలం అనే చేతులతోటి మహా సముద్రమైన భారతాన్ని ఈదుతానూ అంటే కుదురుతుందా, నాకేదో కావన శక్తి ఉండొచ్చు నాకేదో బాష మీద ప్రభుత్వం ఉండొచ్చు, అయితే మాత్రం మహా భారతం అనే సముద్రాన్ని నేను ఈద గలనా రాజరాజనరేంద్ర , నావల్ల కాదు అని నేను ఊరుకుంటున్నాను అని నువ్వు అనుకున్తున్నవేమో చత్రుముఖ బ్రహ్మ కైనా సాధ్యమా అంత గొప్పదయ్య మహాభారతం, చతుర్ముఖ బ్రహ్మ గారే చెప్పగలడా అన్నారంటే అటువంటి మహా భరతన్ని నిర్మాణం చేసిన వేదవ్యాసుడు ఎంత గొప్పవాడై ఉండాలి. అయిన నేను ఆంధ్రీకరిస్తాను ఎందుకో తెలుసా, ఒక్క కారణానికి , నా వల్ల కాదు అని ఇలా తల వంచుతాను , నేను ఎవరిముందు అయితే తల వంచుతానో, వారి పనిముట్టు గా నన్ను అంగీకరించారా జరిగిపోతుంది అంతే కధంతా, నేను చేస్తున్నాను అంటే కదా నాకు సమర్ధత , ఎవరు నన్ను స్వీకరిoచాలో వారు నన్ను స్వీకరించాక ఇంకెందుకు నడవదు. కాబట్టి నేను ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను. నేను పరమ శివునికి, విష్ణువుకి , బ్రహ్మ గారికి , విగ్నేస్వరుడికి , సూర్యుడికి , ఆరు ముఖములు ఉన్న సుబ్రహ్మణ్యేస్వర స్వామి కి ,లక్ష్మీ దేవికి , సరస్వతి కి , పార్వతీ దేవికి, దేవతల అందరికి తల వంచి నమస్కరిస్తున్నాను, వీళ్ళందరికీ నమస్కరించి , పద్య విద్య కి ఆది అయిన వేరొక మహా పురుషుడికి నమస్కరిస్తున్నాను,ఎవరో తెలుసా ఆయన ప్రచేతసను కుమారుడై రామాయణ కావ్యాన్ని లోకానికి అందించిన వాల్మికి మహర్షి
యొక్క పాదరవిన్దములకు నమస్కరించి, సూర్య వంశాన్ని వర్ణించి రామాయణ లోకానికి ధర్మ ప్రభోదంచేసిన చేసిన వాల్మీకి మహర్షి కి నమస్కరిస్తున్నాను అన్నారు. పద్య విద్య అన్నారు, మనకి ఛందస్సు ఒక అద్భుతం ఇది ఇతర భాష లకి లేదు, సంస్కృతానికి , తెలుగుకి మన భాష లేకె ఇటువంటి మర్యాద ఉన్నది. ఛందస్సు పద్యం గా వస్తే మీరు ధారణ చెయ్యవచ్చు, మీరు వాక్యముల కింద ఎన్ని వాక్యములు రాసినా ధారణ చెయ్యలేము. నాలుగు మట్లు పద్యాన్ని చదివితే వచ్చేస్తుంది పద్యం మీకు, పది మాట్లు వాక్యం విన్నా అది యథా తధం గా చెప్పలేము. భారతం కిరణముల చేత చీకటిని పారత్రోలిన మహానుభావుడైన పరసరమహర్షి కి కుమారుడైన వేదవ్యాస భగవానుడి
పాదరవిన్దములకు నమస్కారం చేస్తూ నేను భారతమును ఆంధ్రీకరించుట ప్రారంభం చేస్తాను. రాజరాజ నరేంద్ర నీ కోర్కె తీరనున్నది అని చెప్పి మొదటి ఆశ్వాసము మొదలు పెట్టారు ఆదికవి నన్నయ్యగారు.
No comments:
Post a Comment