ఇప్పుడు కచుడు శుక్రాచార్యుల వారి దగ్గర త్రికరణ శుద్దిగా సేవ చేస్తున్నాడు. శుక్రాచార్యుల వారికి అధిగమించలేని ఒక బలహీనత ఉన్నది, ఏమిటి ఆ బలహీనత అంటే ఆయనకీ ఒక్కత్తే కూతురు దేవయాని. ఆయన ఆ దేవయాని మనసు గాయపడడాన్ని కించిత్తు ఇష్టపడడు. దేవయాని ప్రీతి చెందితే శుక్రచార్యుల వారు చాలా రెట్లు ప్రీతి చెందుతారు. దేవయాని ప్రీతి పొందక పోతే , శుక్రాచార్యుల వారు ప్రీతి పొందరు. కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని పొందాలంటే, దేవయాని ప్రీతి కూడా పొందాలి.
ఇక్కడ మీరు ఒక ధర్మ సూత్రాన్ని గమనించాలి. అలాగే ప్రవర్తించాడు కచుడు. కచుడు బ్రహ్మ చారి , దేవయాని కన్య. ఆయన ఆమె ని అంతగా సేవిస్తే, అంతగా దగ్గర అయితే , వాళ్ళిద్దరి మధ్య ఏర్పదేటటువంటి ఆ అనురాగము, ఆ ఇద్దరిమధ్య ఏర్పడే ప్రేమ చివరికి ఏ స్థితి ని పొందాలి అన్న విషయం లో ఎవరికీ ఉండే నియమాల చేత వారు సంస్కారాన్ని పొంది ఉంటారు.
కచుడు బాగా శుక్రాచార్యుల వారినీ దేవయానిని సేవిన్చినటువంటి కారణం చేత చాల ప్రీతి పొందుతున్నారు , శుక్రాచార్యుల వారు రోజూ ఈయన ప్రీతీ ఎక్కువై పోతే ఏదో ఒక రోజున మృతసంజీవని విద్య ని ఉపదేశం చేసేస్తారు గురువుగారు. కాబట్టి ఈ కచుడు లేకుండా చెయ్యాలి అని అక్కడ ఉన్న రాక్షసులు అందరు అనుకుంటున్నారు. బ్రహ్మచర్య ఆశ్రమం లో ఉన్న వారికి కొన్ని కర్తవ్యములు ఉంటాయి. ఎప్పుడైనా గురు పత్ని పిలిచి , నాయనా భిక్షన్నం తీస్కురా అంటే వెళ్లి తీస్కువస్తాడు. గురువుగారు పిలిచి సమిధలు పట్టుకురా అంటే తీస్కోస్తాడు. వెళ్లి కాసిని పువ్వులు పళ్ళు , తేనే పట్టుకురా అంటే పట్టుకొస్తాడు. లేదా ఈ ఆవులను మేపు అంటే ఆవుల్ని తీస్కెళ్ళి మేపుతూ ఉంటాడు.
అలాగే కచుడు ఒకరోజున ఆవుల్ని తీస్కొని వెళ్ళాడు. వెళ్లి ఆ ఆవుల్ని మేపుతున్నాడు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కదలిక అని మీకు ఎప్పుడు చెప్పినా అది పర్దేవతానుగ్రహం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. కదలికలన్నీ ఆగిపోయిన సందర్భం లో అంతర్ముఖుడై తనలో తాను రమిస్తూ తాను శివుడు గా మిగిలిపొయిన శివుడు తప్ప , మిగిలిన కదలికలు ఎప్పుడు ఉన్నా, అదంతా పరదేవతానుగ్రహమే. ఆ పరదేవతనుగ్రహం లోపించిందో , కదలిక ఇంకోలా మారిపోతుంది. ఉత్తర క్షణం లో పతనం ప్రారంభం అయిపోతుంది. పరదేవతను గ్రహాం ఉంటె మీ కదలికలో ఏదైనా దోషం వస్తుంటే ఆవిడ దిద్దుతుంది.
ఇప్పుడు ఆయన సమిధల్ని తీస్కు రావటానికి వెళ్తే ఏదో దారి తప్పాడు అనుకోవచ్చు. కానీ ఆవుల్ని తీస్కుని వెళ్ళాడు. ఆ ఆవులకి ఒక లక్షణం ఉంటుంది, అవి తిరిగి ఇంటికి వస్తాయి. కాబట్టి ఆ రోజున ఆయన ఆవుల్ని కాస్తూ వెళ్ళాడు కాబట్టి , ఆవులు ఇంటికి వచ్చినా అతను రాకపోతే, అతనికి ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది అని అనుమానించటానికి ఆస్కారంఏర్పడింది.
దేవయానిని కూడా తృప్తి పరిస్తే తప్ప, సంతోసించని మనసు శుక్రుడికి ఉండటం , కచుడికి అదృష్టం అయ్యింది. శుక్రుడు పట్టించుకోలేదు , కానీ దేవయాని పట్టించుకుంది, ఇతను ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు అని అడిగింది, అలా అడిగేవారు లేరనుకోండి , ఆయన ఏమైపోనో.. ఏ పులులు తినేసినవో , అయినా బ్రతికించ గలడు శుక్రాచార్యుల వారు.
ఇప్పుడు ఆ రాక్షసులు ఏమి చేసారంటే , ఆయన్ని (కచుడు) తీస్కెళ్ళి ఒక చెట్టు కి కట్టేసి , ఆయన్ని నరికి చంపేసారు. ఇప్పుడు ఆ కచుడు మరణించాడు, సాయంకాలం వరకు ఆవులు అక్కడ మేత మేసాయి, వెనకాతల తోలుకెళ్ళిన వాడు ఎవడున్నాడో అతను మరణించాడు, ఆయన్ని చెట్టుకి కట్టేసారు, కాబట్టి ఇప్పుడు ఆ శవాన్ని పీక్కు తినటం కుడా చాలా తేలిక క్రూర మృగాలకి, ఆవులు తిరిగి వచ్చాయి, శుక్రాచార్యుల వారు పట్టించుకోలేదు, ఆయన సాయంకాలం చేయవలసిన హోమం ఏది ఉందొ అది చేస్కున్నాడు, చేసుకుని ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు, దేవయాని వచ్చి శుక్రాచార్యుల వారిని ప్రశ్న వేసింది, ఆవిడ హృదయం ఆయన యందు అనురాక్తమై ఉన్నది అన్న విషయం ఆవిడ మతాడుతున్న తీరు బట్టి స్పష్టం అవుతుంది.
కాబట్టి ఆవిడ శుక్రాచార్యుల వారి వద్దకి వెళ్లి అన్నది , మనసులో ఎంతో ప్రేమ ఉన్నవాళ్లు మాట్లాడవలసిన మాటలు, చాలా తీవ్రమైన వేడి కలిగిన కిరణములు కలిగిన సూర్యుడు పశ్చిమ సముద్రం లో మునక వేశాడు. అంటే సూర్యాస్తమయం అయిపోయింది. వెళ్ళిన ఆవులు , ఒక్క ఆవులే తిరిగి వచ్చాయి, ఆవుల్ని తోలుకుని వెళ్ళిన వాడు తిరిగి రాలేదు, నీ అగ్ని మాత్రం చక్కగా హోమ కార్యం మాత్రం పూర్తి చేసేసావు. దానికి కావాల్సిన పూర్తి చేసేసావ్, అంటే అందులో ఒక చిన్న దెప్పిపొడుపు ఉంది. కచుడు మాత్రం తిరిగి రాలేదు. అంటే ఆవిడకి ఎంత ఆందోళన ఉందొ చుడండి ఆయన రాక పోవటం మీద.
వనం లో మృగముల వలన కాని , రాక్షసుల వలన కాని ఏమైనా భాద పొందాడో ఏమో కాబట్టి నాన్న గారు కచుడు రాలేదు నాకు చాలా ఆందోళన గా ఉంది అన్నది. అంటే వెంటనే దేవయాని ఏదైనా మాట అంటే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు , శుక్రాచార్యుల వారు, తన కూతురు మీద ఆయన కి ఉన్న అభిమానము ,అవధి లేనిది. అంత మహాతపస్వికి హద్దులేని ప్రేమ ఉండటం ఆశ్చర్య కరం.
ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వారు ఒక్కసారి తన దివ్య దృష్టితో చూసాడు, ఇప్పడు ఆయన అంతర ద్రుష్టి తో ఒక్కసారి లోకం అంతా చూసాడు. కనపడలేదు, ఏమిటా అని బాగా పరిశీలనం గా చుస్తే ఒక చెట్టుకి కట్టబడినటువంటి శవం కనపడింది, ఆయన అన్నాడు రాక్షసులు కచుణ్ణి చంపశారు అని చెప్పాడు, అసుయచేత అన్నాడు.
వెంటనే దేవయాని చాలా బాధ పడిపోయింది , అలా కాదు నాన్న గారు బ్రతికించాలి అంది, ఆయన తన విద్య ని స్మరించాడు , మృతసంజీవని విద్యని అంటే ఎంత చెప్పుచేతల్లో ఉంటాయో చుడండి ఆ శక్తులు, కాబట్టి ఆయన మృత సంజీవనీ విద్య తో అన్నాడు , నువ్వు వెళ్లి అదిగో ఆ చెట్టుకి కట్టబడిన కచుణ్ణి స్పృశించి, ఆయన్ని మళ్ళి పునరుజ్జీవితున్ని చెయ్యి అన్నాడు, ఇప్పుడు ఆ విద్య వెళ్లి ఆయన్ని స్పృసించింది ఆయన మళ్ళి బ్రతికాడు.
చాలా సంతోషించాడు , కచుడు , మహానుభావుడు నన్ను బ్రతికించాడు అని, పైకి ఈ మాట అనక పోయినా చాలా సంతోషించింది దేవయాని, పగ పెరిగింది రాక్షసులకి. రాక్షసులు అందరూ సమావేశమై , శవం దొరికితే బ్రతికించాడు, కాబట్టి అసలు శవం దొరకకుండా ఉండాలి, మన గురువుగారికి ఒక శక్తి ఉంది , బూది చేసేసి ఎక్కడన్నా పెట్టినా మళ్ళి బ్రతికిస్తాడు , కాబట్టి ఇక బ్రతికించటానికి అవకాసం లేకుండా చెయ్యాలి అంటే ఏమి చెయ్యాలి, బూది చేసి గురువుగారి కడుపులోకే పంపించెయ్యాలి, అప్పుడు మృత సంజీవని తో బ్రతికించినా వాడు బయటకి రావాలి, వాడు బయటకి వస్తే గురువుగారు చనిపోతారు. అందుకని గురువుగారు ఇంక బ్రతికించరు అనుకున్నారు. కాబట్టి ఈ సారి వాడిని కాల్చి బూదిచేసి , దాన్ని గురువుగారు తాగే మద్యం లో కలిపి పట్టించేద్దాం, మద్యానికి మత్తెకించే లక్షణం ఉందిగా, అంతా బూది వస్తోంది ఏమిటి అని ఆలోచించడు. మొదటసారి గుటక లోనే మత్తు ప్రారంభం అయ్యి తాగెస్తారు.
ఇలా అనుకుని రాక్షసులు ఏమి చేసారంటే , పువ్వులు తేవటానికి అరణ్యానికి వెళ్ళిన కచుణ్ణి చంపి , బూది చేసి ఆ బూదిని శుక్రాచార్యుల వారు తాగే మద్యం లో కలిపి, ఆయనకి ఇచ్చారు , ఇస్తే ఆయన పుచ్చేస్కున్నారు, దేన్నీ బట్టి ఒక విషయం స్పష్టంగా ఉంది. అప్పటివరకు కుడా బ్రాహ్మణులూ కూడా మద్యం సేవించే అలవాటు ఉంది అని.
సరే సాయంకాలం అయ్యింది , ఇంకా కచుడు ఇంటికి రాలేదు, ఇప్పుడు అడిగేవారు ఎవరు మళ్ళి దేవయనే , అంటే అర్థం ఏమిటి పగలంతా కచుడు వచ్చేవరకు అతని గురించే ఆలోచిస్తుంది అని గుర్తు, అంటే ఒక కన్యకి అటువంటి లక్షణం ఉంది అంటే , అది కచ్చితంగా అనురాగ సంభందమై ఉన్నది అని అర్థం. సాయంకాలం అయ్యింది ఆయన రాలేదని అడిగింది దేవయాని తండ్రి ని, ఆయన అన్నాడు ఏముంది రాక్షసులు చంపేసి ఉంటారు , మళ్ళి బ్రతికించమని అడుగుతుందేమో అని ఆయన అన్నాడు ఉత్తమ గతులు పొందుతాడు లే అన్నాడు.
ఏమిటి చాలా తేలికగా చెప్పేసారు , ఆయన ఎవరు అనుకుoటున్నారు , మహానుభావుడైన అంగీరస మహర్షి యొక్క మనుమడు, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవాడు, కాబట్టి మీరు రక్షకులు ఇప్పుడు ఆయనకి, పైగా దేవగురువైన బృహస్పతి కుమారుడు, ఏమి సామాన్యుడు కాదు , మీకు శిష్యుడు, సురూపమైన బ్రహ్మచర్యాశ్రమము నందు ఉన్నవాడు అటువంటి వాడిని , కారణం లేకుండా ఈ రాక్షసులు ఆయన మీద క్రోధాన్ని పెట్టుకుని, ఆయన్ని చంపేసారు , అటువంటి కచుడి గురించి శోకించొద్దు అంటారేమిటి, నేను ఏడుస్తున్నాను , ఏడిస్తే ఏడువు అంటారేమో నేను అన్నం తినను, ఆ కచుడు లేకపోతే, అన్నది.
అప్పటికీ అతడి మీద ఉన్న అనురాగం, శుక్రాచార్యుల వారికి ఎందుకు అర్థం కాలేదు అని సందేహం కలగవచ్చు, అలా ఆమె అనురక్త అవుతుంది అని శుక్రాచార్యుల వారు వేరొక కారణానికి ఊహించలేదు. ఏ కారణమో ముందు అర్థం అవుతుంది. ఆమె అంత హటం చేస్తే అదేమిటమ్మా అన్నం కుడా తినను అంటున్నావు, అంటే అంతే కచుడు బ్రతకాల్సిందే , అయితే సరే బ్రతికిస్తాను, చేతిలో విద్య ఉందిగా. ఆయన మళ్లీ అంతర్ముఖుడై చూసాడు , ఎక్కడా కనపడలేదు, ఆకరికి తన కడుపులో నే కనపడ్డాడు.
అమ్మా ఈ రాక్షసులు నాచేత తగిన్చేసారు బూది కలిపేసి , లోపాలకి వెళ్ళిపోయాడు. సురాపానం అనేది ఇప్పటివరకు బ్రాహ్మణులూ చేసారు , కానీ ఇప్పుడు నేను కట్టడి చేస్తున్నాను. ఎంతతపస్సు ఉన్నవాడైన ఎంతటి జ్ఞానం ఉన్న వాడైనా ఎంత భక్తి ఉన్న వాడైనా, సురాపానం చేస్తే వెంటనే వాడికి విస్మృతి కలుగుతుంది, ఏమి చేస్తున్నాడో తెలియదు. నేను సురాపానం చెయ్యటం వలన అందులో కచుని యొక్క బూది ఉంది అన్న సంగతి తెలుసుకోకుండా తాగేశాను కాబట్టి నేను ఇవ్వాళ నించి లోకానికి ఒక వాక్కు విదిచిపెడుతున్నాను , బ్రాహ్మణుని తో సహా మనుష్య పుటక పుట్టినవాడేవ్వడు శురాపానము చెయ్యరాదు, అలా శూర పానం చేస్తే ఘోరాతిఘోరమైన స్థితి ని వాడు పొందు గాక కాబట్టి ఇక ఆ నాటి నుంచి ఇక సురాపానం అన్నది పూర్తిగా నిషిద్దం శాస్త్రం లో .
కాబట్టి ఇప్పుడు తన లోపల ఉన్న వాడిని బ్రతికించాలి కుతురుకోసం, కాబట్టి ఆయన ఆ మంత్రం చదివాడు , లోపల ఆ కచుడు ఊపిరి పోస్కుని ఆ కచుడు మళ్ళి సహజ స్థితిని పొందాడు, ఇప్పుడు కచుడు అన్నాడు గురువుగారు మీరు నన్ను బ్రతికించారు సరే , ఇప్పుడు నేను బయటికి రావటం ఎలా? అంటే శుక్రాచార్యుల వారు అన్నారు , నువ్వు అలా కడుపులో ఉండగానే మృతసంజీవని విద్యని నీకు ఉపదేశం చేస్తాను అన్నాడు. నువ్వు మృత సంజీవని విద్య ని పొందు , పొంది నువ్వు బయటకి రా , నేను మరణిస్తాను, తర్వాత నువ్వు నన్ను బ్రతికించు అన్నాడు.
ఇక్కడ మీరు గమనించండి కచునిమనసులో ఏదైనా ఆలోచన ఉంటె , మృత సంజీవనీ విద్య పుచ్చేస్కోని , గురువుగారి కడుపులోంచి బయటకి వచ్చేసి తన దారిన తాను వెళ్ళిపోతే, కచుడికి తప్ప మృత సంజీవనీ విద్య తెలిసున్న వాడు రాక్షసులలో లేడు ఎవ్వడు.
రెండు నేను చనిపోయిన తరువాత వీడు బయటకి వచ్చి నన్ను బ్రతికిస్తాడో ,బ్రతికించడో అనుమానం, అందుకని నేను ఎలా ఉపదేశం చేస్తాను అమ్మా అని శుక్రాచార్యుల వారు అడుగవచ్చు, శిష్యుడి మీద నమ్మకం అంటే గురువుగారికి ఉండే నమ్మకం అటువంటిది, ఆ మాట కనీసం మనసులో సంకల్పంగా కుడా శుక్రాచార్యుల వారికి రాలేదు, త్రికరణ శుద్ధి కల సిష్యుడైతే గురువుగారిని అలా మోసం చేద్దాం అన్న ఆలోచన శిష్యుడికి రాలేదు.
శుక్రాచార్యుల వారు ఎప్పుడూ ఏమనుకున్నాడంటే, ఈ కచుడు నాకు శిష్యుడు అంటే నాకు కొడుకుతో సమానం , దేవయాని ఆయన కూతురు , ఇప్పుడు దేవయాని ఒక చెల్లెలి గా అన్నగారిమీద బెంగ పెట్టుకుంటుంది అనుకున్నాడు, తప్ప ఆమె ధర్మాన్ని తప్పి అనురక్త అవుతుంది అని శుక్రాచార్యుల వారు ఊహించలేక పోయారు. అందుకని ఆయనకీ అందలేదు ఆ విషయం ఆయన లోపల అంత ధర్మం పట్టుకున్నాడు.
కచుడు దేవయాని తనపై అంత అనురక్త అయి ఉంది అని తెలుసుకోలేక పోయాడు, ఎందుకని అంటే గురువుగారిని నేను ఎంత సేవిస్తున్నానో, ఈవిడని అంత సేవిస్తున్నాను, ధార్మిక కోణం లో చూసినప్పుడు , గురుపుత్రిక కనుక ఆమె నాకు చెల్లెలు అవుతుంది,కాబట్టి ఒక అన్న గారి మీద ఎంత ప్రేమ పెంచుకుంటుందో నా మీద అంత ప్రేమ పెంచుకుంటుంది అనుకున్నాడు.
ఇప్పుడు కచుని యందు , శుక్రునియన్దు దోషం లేదు, ధర్మ వైక్లవ్యం దేవయాని యందె ఉంది. తనంత తానుగా అహాoకరించటానికి దేవయానికి అంత గొప్ప లక్షణాలు ఏమి లేవు. ఆవిడ అహంకారం అంతా ఏమిటంటే నేను శుక్రాచార్యులవారి కూతురిని అని, కాబట్టి నేను అతని యందు అనురాక్తను అవ్వడమే అతని జన్మ ధన్యం అనుకుంది.
కాబట్టి ఇప్పుడు తానూ పొందాలనుకున్న విద్య మృత సంజీవనీ విద్య అది తెలుసుకున్నాడు, పైగా గురువుగారిని సేవించి ఇతర విద్యలు కుడా నేర్చుకున్నాడు. కాబట్టి గురువుగారి దగ్గరకి వెళ్లి "అయ్యా ఇంక నేను వెళ్లి వస్తాను , నేను మా తండ్రిగారిదగ్గరకి వెళ్లి దేవతల్ని మా తండ్రిగారిని సేవిస్తాను" అన్నాడు.
చిత్రం ఏమిటంటే , నీకు ఇచ్చిన విద్యతో దేవతలని బ్రతికించ వద్దు ఇప్పటివరకు రాక్షసులే బ్రతుకుతున్నారు అని అనగలడు , కానీ ఆయన అనలేదు. విద్య ని ఇచ్చిన గురువు, దీనితో నువ్వు దేవతల్ని బ్రతికించ వద్దు అనలేదు, ఇది శుక్రాచార్యుల వారి గొప్పతనం. నిష్కర్ష గా ఆయన మహానుభావుడు. అంత ఉదారుడై ఇచ్చేసాడు ఆయన.
ఇప్పుడు దేవయాని అంది ఓ కచుడా నీవు బ్రహ్మచారివి, నేను కన్యని ఆవిడ దృష్టిలో మన ఇద్దరి మధ్య అనుభందం అంది ఆయనకీ భార్యా స్థానం లో స్త్రీ కావలి ఈవిడకి భర్త్రు స్థానం లో ఒక పురుషుడు కావలి , కాబట్టి ఆవిడ అంది, నీకు ఒక అవసరం ఉంది , నాకు ఒక అవసరం ఉంది అని గుర్తుచేస్తుంది.
భూమియందు పుట్టిన గొప్ప దేవతా శ్రేష్టుడా , ఎంత పెద్ద మాట అంది అంటే ఇప్పుడు కొత్తగా నన్ను నువ్వు పెళ్లి చేస్కో అని అడుగట్లేదు, ఎంత అహంకారమో, నీకు నాకు పెళ్లి ఎప్పుడో అయిపొయింది అంది. ఎప్పుడైపోయింది. మనోజుడు అని మన్మధునికి ఒక పేరు , కాబట్టి నీకు నాకు పెళ్లి మనోజుని యొక్క ప్రకోపం చేత,ఎప్పుడో అయిపొయింది , అంటే నేను నిన్ను అలా చూసాను. నువ్వు నన్ను అలా చూసావు అని నిర్దారించేస్తోంది. ఆయన అలా చూసాడో లేదో కానీ ఆవిడా అనేస్తుంది, అనటం కాదు, అదే సత్యం అని చెప్తుంది.
కాబట్టి నీకు నాకు మన్మదునివల్ల పెళ్లి అయిపోయింది. కాబట్టి శుక్రాచార్యుని దయతో రెండు పుచ్చుకో, ఒకటి మృతసంజీవని, రెండు నీ అదృష్టం నన్ను కూడా పుచ్చుకో, తప్ప అంతటి మహానుభావుడు , తనకి భార్య అవ్వాలన్న వినయం ఏమీ లేదు ఆవిడకి , నేను ఆయనకి భార్యని అవ్వటం ఆయన అదృష్టం అనుకుంటోంది.
ఎందుకు దేవయానికి ఈ అహంకారం, అహంకారించటానికి ఏదో కారణం ఉంది అని నన్నయ్య గారు ఏమి చెప్పలేదు. ఆవిడ మాత్రం చెప్తూ ఉంటుది ఎప్పుడు ఏమనో తెలుసా , మృతసంజీవని తెలిసున్న , శుక్రాచార్యుని కూతుర్ని అని చెప్పుకుంటుంది తప్ప శుక్రాచార్యుల వారికి ఎంత తపస్సు ఉందొ, ఎంత వినయం ఉందొ, ఎంత భక్తి ఉందొ, తనకి ఎంత ఉందొ ఎప్పుడూ పరిసీలించుకోలేదు. మహాత్ముల తో ఉన్న సంభందాన్ని అహంకరించటానికి వాడుకోవటం పతనానికి హేతువే తప్ప ఉన్నత్తికి హేతువు ఎన్నటికి కాదు.
కాబట్టి ఇప్పుడు ఆవిడ అంది, నేను కోరుకున్న కోరిక తీర్చు, అంటే కచుడు అన్నాడు నాకు అలాంటి మన్మధ వికారం ఎన్నడూ కలుగలేదు. ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సుక్ష్మం ని పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది. కచుడు ధర్మాన్ని పట్టుకున్నాడు. అందుకని దేవయానిని చెల్లెలుగా భావించాడు. గురువుగారి కూతురు చెల్లెలితో సమానం.
వేరొక భావం కి చోటే లేదు. గురువులకి శిష్యులు పుత్రులు. కాబట్టి నువ్వు నాకు చెల్లెలు తో సమానం. ఓ గురు పుత్రి నేను ఆయన కొడుకుని అని ఊహించుకున్న రోజు నువ్వు నాకు ఏమయ్యావో తెలుసుకో అని చెప్పి కాబట్టి తల్లి నన్ను వదిలేయి నేను వెళ్తున్నాను అని అన్నాడు.
ఇది విన్న ఆమె కి ఎక్కడలేని కోపం వచ్చింది, వచ్చి అసలు నువ్వు ఏ మృత సంజీవని కొరకు నువ్వు మా నాన్న దగ్గరకి వచ్చి గురు సుశ్రుష చేసి నాకు సేవలు చేసి పొందావో అది నీకు ఫలించకుoడు గాక అని శపించింది. ఇచ్చిన తండ్రిగారు అనలేదండి ఈ మాట ఆయన ఉదారుడు ఆవిడ అంది. అంటే నాకు ఫలించదు , ఇది నాకు ఫలించదు , కానీ ఇది నేను పొందుదామని రాలేదు, దేవతలు నన్ను అడిగితే వచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ విద్య పట్టుకెళ్ళి దేవతలకి ఉపదేశం చేస్తాను. వాళ్ళకి ఫలిస్తుంది గా . విద్యకి ప్రయోజనం అంటూ ఉందా లేదా.
విద్య కి ఉన్న ప్రయోజనాన్ని ఎవరూ ఏ కారణానికి ఆపలేడు . ఇంత ధర్మం లేని దానివి , ఇంకొక బ్రాహ్మణున్ని చేస్కుని కుడా ఆయన బ్రహ్మణ్యం ఏమి నిలబెదతావ్ నువ్వు అనువర్తించి. కాబట్టి నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండు గాక అన్నాడు. శుక్రాచార్యుల వారి ఏకైక కుమార్తె , భర్త బ్రాహ్మణ తేజస్సు కలవాడు కాదు. ఇప్పుడు ఇది పెద్ద శాపం, బ్రహ్మాణ స్త్రీ అయ్యుండి, ఆవిడకు బ్రాహ్మణుడు భర్త కాడు. కాబట్టి ఆవిడ జీవితం లో ఎన్నడూ ఒక బ్రాహ్మణ పుత్రుణ్ణి కనలేదు. శుక్రాచార్యుల వారికి ఒక్కత్తే కూతురు , దౌహిత్రుదు (కూతురి కొడుకు ) బ్రాహ్మణుడు కాకుండా పోతాడు. అక్కర్లేని చొరవ ఎక్కడి వరకు కట్టి కుదిపింది చుడండి.
వనం లో మృగముల వలన కాని , రాక్షసుల వలన కాని ఏమైనా భాద పొందాడో ఏమో కాబట్టి నాన్న గారు కచుడు రాలేదు నాకు చాలా ఆందోళన గా ఉంది అన్నది. అంటే వెంటనే దేవయాని ఏదైనా మాట అంటే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు , శుక్రాచార్యుల వారు, తన కూతురు మీద ఆయన కి ఉన్న అభిమానము ,అవధి లేనిది. అంత మహాతపస్వికి హద్దులేని ప్రేమ ఉండటం ఆశ్చర్య కరం.
ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వారు ఒక్కసారి తన దివ్య దృష్టితో చూసాడు, ఇప్పడు ఆయన అంతర ద్రుష్టి తో ఒక్కసారి లోకం అంతా చూసాడు. కనపడలేదు, ఏమిటా అని బాగా పరిశీలనం గా చుస్తే ఒక చెట్టుకి కట్టబడినటువంటి శవం కనపడింది, ఆయన అన్నాడు రాక్షసులు కచుణ్ణి చంపశారు అని చెప్పాడు, అసుయచేత అన్నాడు.
వెంటనే దేవయాని చాలా బాధ పడిపోయింది , అలా కాదు నాన్న గారు బ్రతికించాలి అంది, ఆయన తన విద్య ని స్మరించాడు , మృతసంజీవని విద్యని అంటే ఎంత చెప్పుచేతల్లో ఉంటాయో చుడండి ఆ శక్తులు, కాబట్టి ఆయన మృత సంజీవనీ విద్య తో అన్నాడు , నువ్వు వెళ్లి అదిగో ఆ చెట్టుకి కట్టబడిన కచుణ్ణి స్పృశించి, ఆయన్ని మళ్ళి పునరుజ్జీవితున్ని చెయ్యి అన్నాడు, ఇప్పుడు ఆ విద్య వెళ్లి ఆయన్ని స్పృసించింది ఆయన మళ్ళి బ్రతికాడు.
చాలా సంతోషించాడు , కచుడు , మహానుభావుడు నన్ను బ్రతికించాడు అని, పైకి ఈ మాట అనక పోయినా చాలా సంతోషించింది దేవయాని, పగ పెరిగింది రాక్షసులకి. రాక్షసులు అందరూ సమావేశమై , శవం దొరికితే బ్రతికించాడు, కాబట్టి అసలు శవం దొరకకుండా ఉండాలి, మన గురువుగారికి ఒక శక్తి ఉంది , బూది చేసేసి ఎక్కడన్నా పెట్టినా మళ్ళి బ్రతికిస్తాడు , కాబట్టి ఇక బ్రతికించటానికి అవకాసం లేకుండా చెయ్యాలి అంటే ఏమి చెయ్యాలి, బూది చేసి గురువుగారి కడుపులోకే పంపించెయ్యాలి, అప్పుడు మృత సంజీవని తో బ్రతికించినా వాడు బయటకి రావాలి, వాడు బయటకి వస్తే గురువుగారు చనిపోతారు. అందుకని గురువుగారు ఇంక బ్రతికించరు అనుకున్నారు. కాబట్టి ఈ సారి వాడిని కాల్చి బూదిచేసి , దాన్ని గురువుగారు తాగే మద్యం లో కలిపి పట్టించేద్దాం, మద్యానికి మత్తెకించే లక్షణం ఉందిగా, అంతా బూది వస్తోంది ఏమిటి అని ఆలోచించడు. మొదటసారి గుటక లోనే మత్తు ప్రారంభం అయ్యి తాగెస్తారు.
ఇలా అనుకుని రాక్షసులు ఏమి చేసారంటే , పువ్వులు తేవటానికి అరణ్యానికి వెళ్ళిన కచుణ్ణి చంపి , బూది చేసి ఆ బూదిని శుక్రాచార్యుల వారు తాగే మద్యం లో కలిపి, ఆయనకి ఇచ్చారు , ఇస్తే ఆయన పుచ్చేస్కున్నారు, దేన్నీ బట్టి ఒక విషయం స్పష్టంగా ఉంది. అప్పటివరకు కుడా బ్రాహ్మణులూ కూడా మద్యం సేవించే అలవాటు ఉంది అని.
సరే సాయంకాలం అయ్యింది , ఇంకా కచుడు ఇంటికి రాలేదు, ఇప్పుడు అడిగేవారు ఎవరు మళ్ళి దేవయనే , అంటే అర్థం ఏమిటి పగలంతా కచుడు వచ్చేవరకు అతని గురించే ఆలోచిస్తుంది అని గుర్తు, అంటే ఒక కన్యకి అటువంటి లక్షణం ఉంది అంటే , అది కచ్చితంగా అనురాగ సంభందమై ఉన్నది అని అర్థం. సాయంకాలం అయ్యింది ఆయన రాలేదని అడిగింది దేవయాని తండ్రి ని, ఆయన అన్నాడు ఏముంది రాక్షసులు చంపేసి ఉంటారు , మళ్ళి బ్రతికించమని అడుగుతుందేమో అని ఆయన అన్నాడు ఉత్తమ గతులు పొందుతాడు లే అన్నాడు.
ఏమిటి చాలా తేలికగా చెప్పేసారు , ఆయన ఎవరు అనుకుoటున్నారు , మహానుభావుడైన అంగీరస మహర్షి యొక్క మనుమడు, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవాడు, కాబట్టి మీరు రక్షకులు ఇప్పుడు ఆయనకి, పైగా దేవగురువైన బృహస్పతి కుమారుడు, ఏమి సామాన్యుడు కాదు , మీకు శిష్యుడు, సురూపమైన బ్రహ్మచర్యాశ్రమము నందు ఉన్నవాడు అటువంటి వాడిని , కారణం లేకుండా ఈ రాక్షసులు ఆయన మీద క్రోధాన్ని పెట్టుకుని, ఆయన్ని చంపేసారు , అటువంటి కచుడి గురించి శోకించొద్దు అంటారేమిటి, నేను ఏడుస్తున్నాను , ఏడిస్తే ఏడువు అంటారేమో నేను అన్నం తినను, ఆ కచుడు లేకపోతే, అన్నది.
అప్పటికీ అతడి మీద ఉన్న అనురాగం, శుక్రాచార్యుల వారికి ఎందుకు అర్థం కాలేదు అని సందేహం కలగవచ్చు, అలా ఆమె అనురక్త అవుతుంది అని శుక్రాచార్యుల వారు వేరొక కారణానికి ఊహించలేదు. ఏ కారణమో ముందు అర్థం అవుతుంది. ఆమె అంత హటం చేస్తే అదేమిటమ్మా అన్నం కుడా తినను అంటున్నావు, అంటే అంతే కచుడు బ్రతకాల్సిందే , అయితే సరే బ్రతికిస్తాను, చేతిలో విద్య ఉందిగా. ఆయన మళ్లీ అంతర్ముఖుడై చూసాడు , ఎక్కడా కనపడలేదు, ఆకరికి తన కడుపులో నే కనపడ్డాడు.
అమ్మా ఈ రాక్షసులు నాచేత తగిన్చేసారు బూది కలిపేసి , లోపాలకి వెళ్ళిపోయాడు. సురాపానం అనేది ఇప్పటివరకు బ్రాహ్మణులూ చేసారు , కానీ ఇప్పుడు నేను కట్టడి చేస్తున్నాను. ఎంతతపస్సు ఉన్నవాడైన ఎంతటి జ్ఞానం ఉన్న వాడైనా ఎంత భక్తి ఉన్న వాడైనా, సురాపానం చేస్తే వెంటనే వాడికి విస్మృతి కలుగుతుంది, ఏమి చేస్తున్నాడో తెలియదు. నేను సురాపానం చెయ్యటం వలన అందులో కచుని యొక్క బూది ఉంది అన్న సంగతి తెలుసుకోకుండా తాగేశాను కాబట్టి నేను ఇవ్వాళ నించి లోకానికి ఒక వాక్కు విదిచిపెడుతున్నాను , బ్రాహ్మణుని తో సహా మనుష్య పుటక పుట్టినవాడేవ్వడు శురాపానము చెయ్యరాదు, అలా శూర పానం చేస్తే ఘోరాతిఘోరమైన స్థితి ని వాడు పొందు గాక కాబట్టి ఇక ఆ నాటి నుంచి ఇక సురాపానం అన్నది పూర్తిగా నిషిద్దం శాస్త్రం లో .
కాబట్టి ఇప్పుడు తన లోపల ఉన్న వాడిని బ్రతికించాలి కుతురుకోసం, కాబట్టి ఆయన ఆ మంత్రం చదివాడు , లోపల ఆ కచుడు ఊపిరి పోస్కుని ఆ కచుడు మళ్ళి సహజ స్థితిని పొందాడు, ఇప్పుడు కచుడు అన్నాడు గురువుగారు మీరు నన్ను బ్రతికించారు సరే , ఇప్పుడు నేను బయటికి రావటం ఎలా? అంటే శుక్రాచార్యుల వారు అన్నారు , నువ్వు అలా కడుపులో ఉండగానే మృతసంజీవని విద్యని నీకు ఉపదేశం చేస్తాను అన్నాడు. నువ్వు మృత సంజీవని విద్య ని పొందు , పొంది నువ్వు బయటకి రా , నేను మరణిస్తాను, తర్వాత నువ్వు నన్ను బ్రతికించు అన్నాడు.
ఇక్కడ మీరు గమనించండి కచునిమనసులో ఏదైనా ఆలోచన ఉంటె , మృత సంజీవనీ విద్య పుచ్చేస్కోని , గురువుగారి కడుపులోంచి బయటకి వచ్చేసి తన దారిన తాను వెళ్ళిపోతే, కచుడికి తప్ప మృత సంజీవనీ విద్య తెలిసున్న వాడు రాక్షసులలో లేడు ఎవ్వడు.
రెండు నేను చనిపోయిన తరువాత వీడు బయటకి వచ్చి నన్ను బ్రతికిస్తాడో ,బ్రతికించడో అనుమానం, అందుకని నేను ఎలా ఉపదేశం చేస్తాను అమ్మా అని శుక్రాచార్యుల వారు అడుగవచ్చు, శిష్యుడి మీద నమ్మకం అంటే గురువుగారికి ఉండే నమ్మకం అటువంటిది, ఆ మాట కనీసం మనసులో సంకల్పంగా కుడా శుక్రాచార్యుల వారికి రాలేదు, త్రికరణ శుద్ధి కల సిష్యుడైతే గురువుగారిని అలా మోసం చేద్దాం అన్న ఆలోచన శిష్యుడికి రాలేదు.
శుక్రాచార్యుల వారు ఎప్పుడూ ఏమనుకున్నాడంటే, ఈ కచుడు నాకు శిష్యుడు అంటే నాకు కొడుకుతో సమానం , దేవయాని ఆయన కూతురు , ఇప్పుడు దేవయాని ఒక చెల్లెలి గా అన్నగారిమీద బెంగ పెట్టుకుంటుంది అనుకున్నాడు, తప్ప ఆమె ధర్మాన్ని తప్పి అనురక్త అవుతుంది అని శుక్రాచార్యుల వారు ఊహించలేక పోయారు. అందుకని ఆయనకీ అందలేదు ఆ విషయం ఆయన లోపల అంత ధర్మం పట్టుకున్నాడు.
కచుడు దేవయాని తనపై అంత అనురక్త అయి ఉంది అని తెలుసుకోలేక పోయాడు, ఎందుకని అంటే గురువుగారిని నేను ఎంత సేవిస్తున్నానో, ఈవిడని అంత సేవిస్తున్నాను, ధార్మిక కోణం లో చూసినప్పుడు , గురుపుత్రిక కనుక ఆమె నాకు చెల్లెలు అవుతుంది,కాబట్టి ఒక అన్న గారి మీద ఎంత ప్రేమ పెంచుకుంటుందో నా మీద అంత ప్రేమ పెంచుకుంటుంది అనుకున్నాడు.
ఇప్పుడు కచుని యందు , శుక్రునియన్దు దోషం లేదు, ధర్మ వైక్లవ్యం దేవయాని యందె ఉంది. తనంత తానుగా అహాoకరించటానికి దేవయానికి అంత గొప్ప లక్షణాలు ఏమి లేవు. ఆవిడ అహంకారం అంతా ఏమిటంటే నేను శుక్రాచార్యులవారి కూతురిని అని, కాబట్టి నేను అతని యందు అనురాక్తను అవ్వడమే అతని జన్మ ధన్యం అనుకుంది.
కాబట్టి ఇప్పుడు తానూ పొందాలనుకున్న విద్య మృత సంజీవనీ విద్య అది తెలుసుకున్నాడు, పైగా గురువుగారిని సేవించి ఇతర విద్యలు కుడా నేర్చుకున్నాడు. కాబట్టి గురువుగారి దగ్గరకి వెళ్లి "అయ్యా ఇంక నేను వెళ్లి వస్తాను , నేను మా తండ్రిగారిదగ్గరకి వెళ్లి దేవతల్ని మా తండ్రిగారిని సేవిస్తాను" అన్నాడు.
చిత్రం ఏమిటంటే , నీకు ఇచ్చిన విద్యతో దేవతలని బ్రతికించ వద్దు ఇప్పటివరకు రాక్షసులే బ్రతుకుతున్నారు అని అనగలడు , కానీ ఆయన అనలేదు. విద్య ని ఇచ్చిన గురువు, దీనితో నువ్వు దేవతల్ని బ్రతికించ వద్దు అనలేదు, ఇది శుక్రాచార్యుల వారి గొప్పతనం. నిష్కర్ష గా ఆయన మహానుభావుడు. అంత ఉదారుడై ఇచ్చేసాడు ఆయన.
ఇప్పుడు దేవయాని అంది ఓ కచుడా నీవు బ్రహ్మచారివి, నేను కన్యని ఆవిడ దృష్టిలో మన ఇద్దరి మధ్య అనుభందం అంది ఆయనకీ భార్యా స్థానం లో స్త్రీ కావలి ఈవిడకి భర్త్రు స్థానం లో ఒక పురుషుడు కావలి , కాబట్టి ఆవిడ అంది, నీకు ఒక అవసరం ఉంది , నాకు ఒక అవసరం ఉంది అని గుర్తుచేస్తుంది.
భూమియందు పుట్టిన గొప్ప దేవతా శ్రేష్టుడా , ఎంత పెద్ద మాట అంది అంటే ఇప్పుడు కొత్తగా నన్ను నువ్వు పెళ్లి చేస్కో అని అడుగట్లేదు, ఎంత అహంకారమో, నీకు నాకు పెళ్లి ఎప్పుడో అయిపొయింది అంది. ఎప్పుడైపోయింది. మనోజుడు అని మన్మధునికి ఒక పేరు , కాబట్టి నీకు నాకు పెళ్లి మనోజుని యొక్క ప్రకోపం చేత,ఎప్పుడో అయిపొయింది , అంటే నేను నిన్ను అలా చూసాను. నువ్వు నన్ను అలా చూసావు అని నిర్దారించేస్తోంది. ఆయన అలా చూసాడో లేదో కానీ ఆవిడా అనేస్తుంది, అనటం కాదు, అదే సత్యం అని చెప్తుంది.
కాబట్టి నీకు నాకు మన్మదునివల్ల పెళ్లి అయిపోయింది. కాబట్టి శుక్రాచార్యుని దయతో రెండు పుచ్చుకో, ఒకటి మృతసంజీవని, రెండు నీ అదృష్టం నన్ను కూడా పుచ్చుకో, తప్ప అంతటి మహానుభావుడు , తనకి భార్య అవ్వాలన్న వినయం ఏమీ లేదు ఆవిడకి , నేను ఆయనకి భార్యని అవ్వటం ఆయన అదృష్టం అనుకుంటోంది.
ఎందుకు దేవయానికి ఈ అహంకారం, అహంకారించటానికి ఏదో కారణం ఉంది అని నన్నయ్య గారు ఏమి చెప్పలేదు. ఆవిడ మాత్రం చెప్తూ ఉంటుది ఎప్పుడు ఏమనో తెలుసా , మృతసంజీవని తెలిసున్న , శుక్రాచార్యుని కూతుర్ని అని చెప్పుకుంటుంది తప్ప శుక్రాచార్యుల వారికి ఎంత తపస్సు ఉందొ, ఎంత వినయం ఉందొ, ఎంత భక్తి ఉందొ, తనకి ఎంత ఉందొ ఎప్పుడూ పరిసీలించుకోలేదు. మహాత్ముల తో ఉన్న సంభందాన్ని అహంకరించటానికి వాడుకోవటం పతనానికి హేతువే తప్ప ఉన్నత్తికి హేతువు ఎన్నటికి కాదు.
కాబట్టి ఇప్పుడు ఆవిడ అంది, నేను కోరుకున్న కోరిక తీర్చు, అంటే కచుడు అన్నాడు నాకు అలాంటి మన్మధ వికారం ఎన్నడూ కలుగలేదు. ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సుక్ష్మం ని పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది. కచుడు ధర్మాన్ని పట్టుకున్నాడు. అందుకని దేవయానిని చెల్లెలుగా భావించాడు. గురువుగారి కూతురు చెల్లెలితో సమానం.
వేరొక భావం కి చోటే లేదు. గురువులకి శిష్యులు పుత్రులు. కాబట్టి నువ్వు నాకు చెల్లెలు తో సమానం. ఓ గురు పుత్రి నేను ఆయన కొడుకుని అని ఊహించుకున్న రోజు నువ్వు నాకు ఏమయ్యావో తెలుసుకో అని చెప్పి కాబట్టి తల్లి నన్ను వదిలేయి నేను వెళ్తున్నాను అని అన్నాడు.
ఇది విన్న ఆమె కి ఎక్కడలేని కోపం వచ్చింది, వచ్చి అసలు నువ్వు ఏ మృత సంజీవని కొరకు నువ్వు మా నాన్న దగ్గరకి వచ్చి గురు సుశ్రుష చేసి నాకు సేవలు చేసి పొందావో అది నీకు ఫలించకుoడు గాక అని శపించింది. ఇచ్చిన తండ్రిగారు అనలేదండి ఈ మాట ఆయన ఉదారుడు ఆవిడ అంది. అంటే నాకు ఫలించదు , ఇది నాకు ఫలించదు , కానీ ఇది నేను పొందుదామని రాలేదు, దేవతలు నన్ను అడిగితే వచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ విద్య పట్టుకెళ్ళి దేవతలకి ఉపదేశం చేస్తాను. వాళ్ళకి ఫలిస్తుంది గా . విద్యకి ప్రయోజనం అంటూ ఉందా లేదా.
విద్య కి ఉన్న ప్రయోజనాన్ని ఎవరూ ఏ కారణానికి ఆపలేడు . ఇంత ధర్మం లేని దానివి , ఇంకొక బ్రాహ్మణున్ని చేస్కుని కుడా ఆయన బ్రహ్మణ్యం ఏమి నిలబెదతావ్ నువ్వు అనువర్తించి. కాబట్టి నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండు గాక అన్నాడు. శుక్రాచార్యుల వారి ఏకైక కుమార్తె , భర్త బ్రాహ్మణ తేజస్సు కలవాడు కాదు. ఇప్పుడు ఇది పెద్ద శాపం, బ్రహ్మాణ స్త్రీ అయ్యుండి, ఆవిడకు బ్రాహ్మణుడు భర్త కాడు. కాబట్టి ఆవిడ జీవితం లో ఎన్నడూ ఒక బ్రాహ్మణ పుత్రుణ్ణి కనలేదు. శుక్రాచార్యుల వారికి ఒక్కత్తే కూతురు , దౌహిత్రుదు (కూతురి కొడుకు ) బ్రాహ్మణుడు కాకుండా పోతాడు. అక్కర్లేని చొరవ ఎక్కడి వరకు కట్టి కుదిపింది చుడండి.