Sunday, October 19, 2014

ఆదిపర్వం 19

ఇప్పుడు కచుడు శుక్రాచార్యుల వారి దగ్గర త్రికరణ శుద్దిగా సేవ చేస్తున్నాడు. శుక్రాచార్యుల వారికి అధిగమించలేని ఒక బలహీనత ఉన్నది, ఏమిటి ఆ బలహీనత అంటే ఆయనకీ ఒక్కత్తే కూతురు దేవయాని. ఆయన ఆ దేవయాని మనసు గాయపడడాన్ని కించిత్తు ఇష్టపడడు. దేవయాని ప్రీతి చెందితే శుక్రచార్యుల వారు చాలా రెట్లు ప్రీతి చెందుతారు. దేవయాని ప్రీతి పొందక పోతే , శుక్రాచార్యుల వారు ప్రీతి పొందరు. కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని పొందాలంటే, దేవయాని ప్రీతి కూడా పొందాలి.

ఇక్కడ మీరు ఒక ధర్మ సూత్రాన్ని గమనించాలి. అలాగే ప్రవర్తించాడు కచుడు. కచుడు బ్రహ్మ చారి , దేవయాని కన్య. ఆయన ఆమె ని అంతగా సేవిస్తే, అంతగా దగ్గర అయితే , వాళ్ళిద్దరి మధ్య ఏర్పదేటటువంటి ఆ అనురాగము, ఆ ఇద్దరిమధ్య ఏర్పడే ప్రేమ చివరికి ఏ స్థితి ని పొందాలి అన్న విషయం లో ఎవరికీ ఉండే నియమాల చేత వారు సంస్కారాన్ని పొంది ఉంటారు. 

కచుడు బాగా శుక్రాచార్యుల వారినీ దేవయానిని సేవిన్చినటువంటి కారణం చేత చాల ప్రీతి పొందుతున్నారు , శుక్రాచార్యుల వారు రోజూ ఈయన ప్రీతీ ఎక్కువై పోతే ఏదో ఒక రోజున మృతసంజీవని విద్య ని ఉపదేశం చేసేస్తారు గురువుగారు. కాబట్టి ఈ కచుడు లేకుండా చెయ్యాలి అని అక్కడ ఉన్న రాక్షసులు అందరు అనుకుంటున్నారు. బ్రహ్మచర్య ఆశ్రమం లో ఉన్న వారికి కొన్ని కర్తవ్యములు ఉంటాయి. ఎప్పుడైనా గురు పత్ని పిలిచి , నాయనా భిక్షన్నం తీస్కురా అంటే వెళ్లి తీస్కువస్తాడు. గురువుగారు పిలిచి సమిధలు పట్టుకురా అంటే తీస్కోస్తాడు. వెళ్లి కాసిని పువ్వులు పళ్ళు , తేనే పట్టుకురా అంటే పట్టుకొస్తాడు. లేదా ఈ ఆవులను మేపు అంటే ఆవుల్ని తీస్కెళ్ళి మేపుతూ ఉంటాడు. 

అలాగే కచుడు ఒకరోజున ఆవుల్ని తీస్కొని వెళ్ళాడు. వెళ్లి ఆ ఆవుల్ని మేపుతున్నాడు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కదలిక అని మీకు ఎప్పుడు చెప్పినా అది పర్దేవతానుగ్రహం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. కదలికలన్నీ ఆగిపోయిన సందర్భం లో అంతర్ముఖుడై తనలో తాను రమిస్తూ తాను శివుడు గా మిగిలిపొయిన శివుడు తప్ప , మిగిలిన కదలికలు ఎప్పుడు ఉన్నా, అదంతా పరదేవతానుగ్రహమే. ఆ పరదేవతనుగ్రహం లోపించిందో , కదలిక ఇంకోలా మారిపోతుంది. ఉత్తర క్షణం లో పతనం ప్రారంభం అయిపోతుంది. పరదేవతను గ్రహాం ఉంటె మీ కదలికలో ఏదైనా దోషం వస్తుంటే ఆవిడ దిద్దుతుంది. 

ఇప్పుడు ఆయన సమిధల్ని తీస్కు రావటానికి వెళ్తే ఏదో దారి తప్పాడు అనుకోవచ్చు. కానీ ఆవుల్ని తీస్కుని వెళ్ళాడు. ఆ ఆవులకి ఒక లక్షణం ఉంటుంది, అవి తిరిగి ఇంటికి వస్తాయి. కాబట్టి ఆ రోజున ఆయన ఆవుల్ని కాస్తూ వెళ్ళాడు కాబట్టి , ఆవులు ఇంటికి వచ్చినా అతను రాకపోతే, అతనికి ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది అని అనుమానించటానికి ఆస్కారంఏర్పడింది. 

దేవయానిని కూడా తృప్తి పరిస్తే తప్ప, సంతోసించని మనసు శుక్రుడికి ఉండటం , కచుడికి అదృష్టం అయ్యింది. శుక్రుడు పట్టించుకోలేదు , కానీ దేవయాని పట్టించుకుంది, ఇతను ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు అని అడిగింది, అలా అడిగేవారు లేరనుకోండి , ఆయన ఏమైపోనో.. ఏ పులులు తినేసినవో , అయినా బ్రతికించ గలడు శుక్రాచార్యుల వారు. 

ఇప్పుడు ఆ రాక్షసులు ఏమి చేసారంటే , ఆయన్ని (కచుడు) తీస్కెళ్ళి ఒక చెట్టు కి కట్టేసి , ఆయన్ని నరికి చంపేసారు. ఇప్పుడు ఆ కచుడు మరణించాడు, సాయంకాలం వరకు ఆవులు అక్కడ మేత మేసాయి, వెనకాతల తోలుకెళ్ళిన వాడు ఎవడున్నాడో అతను మరణించాడు, ఆయన్ని చెట్టుకి కట్టేసారు, కాబట్టి ఇప్పుడు ఆ శవాన్ని పీక్కు తినటం కుడా చాలా తేలిక క్రూర మృగాలకి, ఆవులు తిరిగి వచ్చాయి, శుక్రాచార్యుల వారు పట్టించుకోలేదు, ఆయన సాయంకాలం చేయవలసిన హోమం ఏది ఉందొ అది చేస్కున్నాడు, చేసుకుని ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు, దేవయాని వచ్చి  శుక్రాచార్యుల వారిని ప్రశ్న వేసింది, ఆవిడ హృదయం ఆయన యందు అనురాక్తమై ఉన్నది అన్న విషయం ఆవిడ మతాడుతున్న తీరు బట్టి స్పష్టం అవుతుంది. 

కాబట్టి ఆవిడ శుక్రాచార్యుల వారి వద్దకి వెళ్లి అన్నది , మనసులో ఎంతో ప్రేమ ఉన్నవాళ్లు మాట్లాడవలసిన మాటలు, చాలా తీవ్రమైన వేడి కలిగిన కిరణములు కలిగిన సూర్యుడు పశ్చిమ సముద్రం లో మునక వేశాడు. అంటే సూర్యాస్తమయం అయిపోయింది. వెళ్ళిన ఆవులు , ఒక్క ఆవులే తిరిగి  వచ్చాయి, ఆవుల్ని తోలుకుని వెళ్ళిన వాడు తిరిగి రాలేదు, నీ అగ్ని మాత్రం చక్కగా హోమ కార్యం మాత్రం పూర్తి చేసేసావు. దానికి కావాల్సిన పూర్తి చేసేసావ్, అంటే అందులో ఒక చిన్న దెప్పిపొడుపు ఉంది. కచుడు మాత్రం తిరిగి రాలేదు. అంటే ఆవిడకి ఎంత ఆందోళన ఉందొ చుడండి ఆయన రాక పోవటం మీద.

వనం లో మృగముల వలన కాని , రాక్షసుల వలన కాని ఏమైనా భాద పొందాడో ఏమో కాబట్టి నాన్న గారు కచుడు రాలేదు నాకు చాలా ఆందోళన గా ఉంది అన్నది. అంటే వెంటనే దేవయాని ఏదైనా మాట అంటే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు , శుక్రాచార్యుల వారు, తన కూతురు మీద ఆయన కి ఉన్న అభిమానము ,అవధి లేనిది. అంత మహాతపస్వికి హద్దులేని ప్రేమ ఉండటం ఆశ్చర్య కరం.

ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వారు ఒక్కసారి తన దివ్య దృష్టితో  చూసాడు, ఇప్పడు ఆయన అంతర ద్రుష్టి తో ఒక్కసారి లోకం అంతా చూసాడు. కనపడలేదు, ఏమిటా అని బాగా పరిశీలనం గా చుస్తే ఒక చెట్టుకి కట్టబడినటువంటి శవం కనపడింది, ఆయన అన్నాడు రాక్షసులు కచుణ్ణి చంపశారు అని చెప్పాడు, అసుయచేత అన్నాడు.

వెంటనే దేవయాని చాలా బాధ పడిపోయింది , అలా కాదు నాన్న గారు బ్రతికించాలి అంది, ఆయన తన విద్య ని స్మరించాడు , మృతసంజీవని విద్యని అంటే ఎంత చెప్పుచేతల్లో ఉంటాయో చుడండి ఆ శక్తులు, కాబట్టి ఆయన మృత సంజీవనీ విద్య తో అన్నాడు , నువ్వు వెళ్లి అదిగో ఆ చెట్టుకి కట్టబడిన కచుణ్ణి స్పృశించి, ఆయన్ని మళ్ళి పునరుజ్జీవితున్ని చెయ్యి అన్నాడు, ఇప్పుడు ఆ విద్య వెళ్లి ఆయన్ని స్పృసించింది ఆయన మళ్ళి బ్రతికాడు.

చాలా సంతోషించాడు , కచుడు , మహానుభావుడు నన్ను బ్రతికించాడు అని, పైకి ఈ మాట అనక పోయినా చాలా సంతోషించింది దేవయాని, పగ పెరిగింది రాక్షసులకి. రాక్షసులు అందరూ సమావేశమై , శవం దొరికితే బ్రతికించాడు, కాబట్టి అసలు శవం దొరకకుండా ఉండాలి, మన గురువుగారికి ఒక శక్తి ఉంది , బూది చేసేసి ఎక్కడన్నా పెట్టినా మళ్ళి బ్రతికిస్తాడు , కాబట్టి ఇక బ్రతికించటానికి అవకాసం లేకుండా చెయ్యాలి అంటే ఏమి చెయ్యాలి, బూది చేసి గురువుగారి కడుపులోకే పంపించెయ్యాలి, అప్పుడు మృత సంజీవని తో బ్రతికించినా వాడు బయటకి రావాలి, వాడు బయటకి వస్తే గురువుగారు చనిపోతారు. అందుకని గురువుగారు ఇంక బ్రతికించరు అనుకున్నారు. కాబట్టి ఈ సారి వాడిని కాల్చి బూదిచేసి , దాన్ని గురువుగారు తాగే మద్యం లో కలిపి పట్టించేద్దాం, మద్యానికి మత్తెకించే లక్షణం ఉందిగా, అంతా బూది వస్తోంది ఏమిటి అని ఆలోచించడు. మొదటసారి గుటక లోనే మత్తు ప్రారంభం అయ్యి తాగెస్తారు.

ఇలా అనుకుని రాక్షసులు ఏమి చేసారంటే , పువ్వులు తేవటానికి అరణ్యానికి వెళ్ళిన కచుణ్ణి చంపి , బూది చేసి ఆ బూదిని శుక్రాచార్యుల వారు తాగే మద్యం లో కలిపి, ఆయనకి ఇచ్చారు , ఇస్తే ఆయన పుచ్చేస్కున్నారు, దేన్నీ బట్టి ఒక విషయం స్పష్టంగా ఉంది. అప్పటివరకు కుడా బ్రాహ్మణులూ కూడా మద్యం సేవించే అలవాటు ఉంది అని.

సరే సాయంకాలం అయ్యింది , ఇంకా కచుడు ఇంటికి రాలేదు, ఇప్పుడు అడిగేవారు ఎవరు మళ్ళి దేవయనే , అంటే అర్థం ఏమిటి పగలంతా కచుడు వచ్చేవరకు అతని గురించే ఆలోచిస్తుంది అని గుర్తు, అంటే ఒక కన్యకి అటువంటి లక్షణం ఉంది అంటే , అది కచ్చితంగా అనురాగ సంభందమై ఉన్నది అని అర్థం. సాయంకాలం అయ్యింది ఆయన రాలేదని అడిగింది దేవయాని తండ్రి ని, ఆయన అన్నాడు ఏముంది రాక్షసులు చంపేసి ఉంటారు , మళ్ళి  బ్రతికించమని అడుగుతుందేమో అని ఆయన అన్నాడు ఉత్తమ గతులు పొందుతాడు లే అన్నాడు.

ఏమిటి చాలా తేలికగా చెప్పేసారు , ఆయన ఎవరు అనుకుoటున్నారు , మహానుభావుడైన అంగీరస మహర్షి యొక్క మనుమడు, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవాడు, కాబట్టి మీరు రక్షకులు ఇప్పుడు ఆయనకి, పైగా దేవగురువైన బృహస్పతి కుమారుడు, ఏమి సామాన్యుడు కాదు , మీకు శిష్యుడు, సురూపమైన బ్రహ్మచర్యాశ్రమము నందు ఉన్నవాడు  అటువంటి వాడిని , కారణం లేకుండా ఈ రాక్షసులు ఆయన మీద క్రోధాన్ని పెట్టుకుని, ఆయన్ని చంపేసారు , అటువంటి కచుడి గురించి శోకించొద్దు అంటారేమిటి, నేను ఏడుస్తున్నాను , ఏడిస్తే ఏడువు అంటారేమో నేను అన్నం తినను, ఆ కచుడు లేకపోతే, అన్నది.

అప్పటికీ అతడి మీద ఉన్న అనురాగం, శుక్రాచార్యుల వారికి ఎందుకు అర్థం కాలేదు అని సందేహం కలగవచ్చు, అలా ఆమె అనురక్త అవుతుంది అని శుక్రాచార్యుల వారు వేరొక కారణానికి ఊహించలేదు. ఏ కారణమో ముందు అర్థం అవుతుంది. ఆమె అంత హటం చేస్తే అదేమిటమ్మా అన్నం కుడా తినను అంటున్నావు, అంటే అంతే కచుడు బ్రతకాల్సిందే , అయితే సరే బ్రతికిస్తాను, చేతిలో విద్య ఉందిగా. ఆయన మళ్లీ అంతర్ముఖుడై చూసాడు , ఎక్కడా కనపడలేదు, ఆకరికి తన కడుపులో నే కనపడ్డాడు.

అమ్మా ఈ రాక్షసులు నాచేత తగిన్చేసారు బూది కలిపేసి , లోపాలకి వెళ్ళిపోయాడు. సురాపానం అనేది ఇప్పటివరకు బ్రాహ్మణులూ చేసారు , కానీ ఇప్పుడు నేను కట్టడి చేస్తున్నాను. ఎంతతపస్సు ఉన్నవాడైన ఎంతటి జ్ఞానం ఉన్న వాడైనా ఎంత భక్తి ఉన్న వాడైనా, సురాపానం చేస్తే వెంటనే వాడికి విస్మృతి కలుగుతుంది, ఏమి చేస్తున్నాడో తెలియదు. నేను సురాపానం చెయ్యటం వలన అందులో కచుని యొక్క బూది ఉంది అన్న సంగతి తెలుసుకోకుండా తాగేశాను కాబట్టి నేను ఇవ్వాళ నించి లోకానికి ఒక వాక్కు విదిచిపెడుతున్నాను , బ్రాహ్మణుని తో సహా మనుష్య పుటక పుట్టినవాడేవ్వడు శురాపానము చెయ్యరాదు, అలా శూర పానం చేస్తే ఘోరాతిఘోరమైన స్థితి ని వాడు పొందు గాక కాబట్టి ఇక ఆ నాటి నుంచి ఇక సురాపానం అన్నది పూర్తిగా నిషిద్దం శాస్త్రం లో .

కాబట్టి ఇప్పుడు తన లోపల ఉన్న వాడిని బ్రతికించాలి కుతురుకోసం, కాబట్టి ఆయన ఆ మంత్రం చదివాడు , లోపల ఆ కచుడు ఊపిరి పోస్కుని ఆ కచుడు మళ్ళి సహజ స్థితిని పొందాడు, ఇప్పుడు కచుడు అన్నాడు గురువుగారు మీరు నన్ను బ్రతికించారు సరే , ఇప్పుడు నేను బయటికి రావటం ఎలా? అంటే శుక్రాచార్యుల వారు అన్నారు , నువ్వు అలా కడుపులో ఉండగానే మృతసంజీవని విద్యని నీకు ఉపదేశం చేస్తాను అన్నాడు. నువ్వు మృత సంజీవని విద్య ని పొందు , పొంది నువ్వు బయటకి రా , నేను మరణిస్తాను, తర్వాత నువ్వు నన్ను బ్రతికించు అన్నాడు.

ఇక్కడ మీరు గమనించండి కచునిమనసులో ఏదైనా ఆలోచన ఉంటె , మృత సంజీవనీ విద్య పుచ్చేస్కోని , గురువుగారి కడుపులోంచి బయటకి వచ్చేసి తన దారిన తాను వెళ్ళిపోతే, కచుడికి తప్ప మృత సంజీవనీ విద్య తెలిసున్న వాడు రాక్షసులలో లేడు ఎవ్వడు.

రెండు నేను చనిపోయిన తరువాత వీడు బయటకి వచ్చి నన్ను బ్రతికిస్తాడో ,బ్రతికించడో అనుమానం, అందుకని నేను ఎలా ఉపదేశం చేస్తాను అమ్మా అని శుక్రాచార్యుల వారు అడుగవచ్చు, శిష్యుడి మీద నమ్మకం అంటే గురువుగారికి ఉండే నమ్మకం అటువంటిది, ఆ మాట కనీసం మనసులో సంకల్పంగా కుడా శుక్రాచార్యుల వారికి రాలేదు, త్రికరణ శుద్ధి కల సిష్యుడైతే గురువుగారిని అలా మోసం చేద్దాం అన్న ఆలోచన శిష్యుడికి రాలేదు.

శుక్రాచార్యుల వారు ఎప్పుడూ ఏమనుకున్నాడంటే, ఈ కచుడు నాకు శిష్యుడు అంటే నాకు కొడుకుతో సమానం , దేవయాని ఆయన కూతురు , ఇప్పుడు దేవయాని ఒక చెల్లెలి గా అన్నగారిమీద బెంగ పెట్టుకుంటుంది అనుకున్నాడు, తప్ప ఆమె ధర్మాన్ని తప్పి అనురక్త అవుతుంది అని శుక్రాచార్యుల వారు ఊహించలేక పోయారు. అందుకని ఆయనకీ అందలేదు ఆ విషయం ఆయన లోపల అంత ధర్మం పట్టుకున్నాడు.

కచుడు దేవయాని తనపై అంత  అనురక్త అయి ఉంది అని తెలుసుకోలేక పోయాడు, ఎందుకని అంటే గురువుగారిని నేను ఎంత సేవిస్తున్నానో, ఈవిడని అంత సేవిస్తున్నాను, ధార్మిక కోణం లో చూసినప్పుడు , గురుపుత్రిక కనుక ఆమె నాకు చెల్లెలు అవుతుంది,కాబట్టి ఒక అన్న గారి మీద ఎంత ప్రేమ పెంచుకుంటుందో నా మీద అంత ప్రేమ పెంచుకుంటుంది అనుకున్నాడు.

ఇప్పుడు కచుని యందు , శుక్రునియన్దు దోషం లేదు, ధర్మ వైక్లవ్యం దేవయాని యందె ఉంది. తనంత తానుగా అహాoకరించటానికి దేవయానికి అంత గొప్ప లక్షణాలు ఏమి లేవు. ఆవిడ అహంకారం అంతా ఏమిటంటే నేను శుక్రాచార్యులవారి కూతురిని అని, కాబట్టి నేను అతని యందు అనురాక్తను అవ్వడమే అతని జన్మ ధన్యం అనుకుంది.

కాబట్టి ఇప్పుడు తానూ పొందాలనుకున్న విద్య మృత సంజీవనీ విద్య అది తెలుసుకున్నాడు, పైగా గురువుగారిని సేవించి ఇతర విద్యలు కుడా నేర్చుకున్నాడు. కాబట్టి గురువుగారి దగ్గరకి వెళ్లి "అయ్యా ఇంక నేను వెళ్లి వస్తాను , నేను మా తండ్రిగారిదగ్గరకి వెళ్లి దేవతల్ని మా తండ్రిగారిని సేవిస్తాను" అన్నాడు.

చిత్రం ఏమిటంటే , నీకు ఇచ్చిన విద్యతో దేవతలని బ్రతికించ వద్దు ఇప్పటివరకు రాక్షసులే బ్రతుకుతున్నారు అని అనగలడు , కానీ ఆయన అనలేదు. విద్య ని ఇచ్చిన గురువు, దీనితో నువ్వు దేవతల్ని బ్రతికించ వద్దు అనలేదు, ఇది శుక్రాచార్యుల వారి గొప్పతనం. నిష్కర్ష గా ఆయన మహానుభావుడు. అంత ఉదారుడై ఇచ్చేసాడు ఆయన.

ఇప్పుడు దేవయాని అంది ఓ కచుడా నీవు బ్రహ్మచారివి, నేను కన్యని ఆవిడ దృష్టిలో మన ఇద్దరి మధ్య అనుభందం అంది ఆయనకీ భార్యా స్థానం లో స్త్రీ కావలి ఈవిడకి భర్త్రు స్థానం లో ఒక పురుషుడు కావలి , కాబట్టి ఆవిడ అంది, నీకు ఒక అవసరం ఉంది , నాకు ఒక అవసరం ఉంది అని గుర్తుచేస్తుంది.

భూమియందు పుట్టిన గొప్ప దేవతా శ్రేష్టుడా , ఎంత పెద్ద మాట అంది అంటే  ఇప్పుడు కొత్తగా నన్ను నువ్వు పెళ్లి చేస్కో అని అడుగట్లేదు, ఎంత అహంకారమో, నీకు నాకు పెళ్లి ఎప్పుడో అయిపొయింది అంది. ఎప్పుడైపోయింది. మనోజుడు అని మన్మధునికి ఒక పేరు , కాబట్టి నీకు నాకు పెళ్లి మనోజుని యొక్క ప్రకోపం చేత,ఎప్పుడో అయిపొయింది , అంటే నేను నిన్ను అలా చూసాను. నువ్వు నన్ను అలా చూసావు అని నిర్దారించేస్తోంది. ఆయన అలా చూసాడో లేదో కానీ ఆవిడా అనేస్తుంది, అనటం కాదు, అదే సత్యం అని చెప్తుంది.

కాబట్టి నీకు నాకు మన్మదునివల్ల పెళ్లి అయిపోయింది. కాబట్టి శుక్రాచార్యుని దయతో రెండు పుచ్చుకో, ఒకటి మృతసంజీవని, రెండు నీ అదృష్టం నన్ను కూడా పుచ్చుకో, తప్ప అంతటి మహానుభావుడు , తనకి భార్య అవ్వాలన్న వినయం ఏమీ లేదు ఆవిడకి , నేను ఆయనకి భార్యని అవ్వటం ఆయన అదృష్టం అనుకుంటోంది.

ఎందుకు దేవయానికి ఈ అహంకారం, అహంకారించటానికి ఏదో కారణం ఉంది అని నన్నయ్య గారు ఏమి చెప్పలేదు. ఆవిడ మాత్రం చెప్తూ ఉంటుది ఎప్పుడు ఏమనో తెలుసా , మృతసంజీవని తెలిసున్న , శుక్రాచార్యుని కూతుర్ని అని చెప్పుకుంటుంది తప్ప శుక్రాచార్యుల వారికి ఎంత తపస్సు ఉందొ, ఎంత వినయం ఉందొ, ఎంత భక్తి ఉందొ, తనకి ఎంత ఉందొ ఎప్పుడూ పరిసీలించుకోలేదు. మహాత్ముల తో ఉన్న సంభందాన్ని అహంకరించటానికి వాడుకోవటం పతనానికి హేతువే తప్ప ఉన్నత్తికి హేతువు ఎన్నటికి కాదు.

కాబట్టి ఇప్పుడు ఆవిడ అంది, నేను కోరుకున్న కోరిక తీర్చు, అంటే కచుడు అన్నాడు నాకు అలాంటి మన్మధ వికారం ఎన్నడూ కలుగలేదు. ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సుక్ష్మం ని పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది. కచుడు ధర్మాన్ని పట్టుకున్నాడు. అందుకని దేవయానిని చెల్లెలుగా భావించాడు. గురువుగారి కూతురు చెల్లెలితో సమానం.
వేరొక భావం కి చోటే లేదు. గురువులకి శిష్యులు పుత్రులు. కాబట్టి నువ్వు నాకు చెల్లెలు తో సమానం. ఓ గురు పుత్రి నేను ఆయన కొడుకుని అని ఊహించుకున్న రోజు నువ్వు నాకు ఏమయ్యావో తెలుసుకో అని చెప్పి కాబట్టి తల్లి నన్ను వదిలేయి నేను వెళ్తున్నాను అని అన్నాడు.

ఇది విన్న ఆమె కి ఎక్కడలేని కోపం వచ్చింది, వచ్చి అసలు నువ్వు ఏ మృత సంజీవని కొరకు నువ్వు మా నాన్న దగ్గరకి వచ్చి గురు సుశ్రుష చేసి నాకు సేవలు చేసి పొందావో అది నీకు ఫలించకుoడు గాక అని శపించింది. ఇచ్చిన తండ్రిగారు అనలేదండి ఈ మాట ఆయన ఉదారుడు ఆవిడ అంది. అంటే నాకు ఫలించదు , ఇది నాకు ఫలించదు , కానీ ఇది నేను పొందుదామని రాలేదు, దేవతలు నన్ను అడిగితే వచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ విద్య పట్టుకెళ్ళి దేవతలకి ఉపదేశం చేస్తాను. వాళ్ళకి ఫలిస్తుంది గా . విద్యకి ప్రయోజనం అంటూ ఉందా లేదా.

విద్య కి ఉన్న ప్రయోజనాన్ని ఎవరూ ఏ కారణానికి ఆపలేడు . ఇంత ధర్మం లేని దానివి , ఇంకొక బ్రాహ్మణున్ని చేస్కుని కుడా ఆయన బ్రహ్మణ్యం ఏమి నిలబెదతావ్ నువ్వు అనువర్తించి. కాబట్టి నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండు గాక అన్నాడు. శుక్రాచార్యుల వారి ఏకైక కుమార్తె , భర్త బ్రాహ్మణ  తేజస్సు కలవాడు కాదు. ఇప్పుడు ఇది పెద్ద శాపం, బ్రహ్మాణ స్త్రీ అయ్యుండి, ఆవిడకు బ్రాహ్మణుడు భర్త కాడు. కాబట్టి ఆవిడ జీవితం లో ఎన్నడూ ఒక బ్రాహ్మణ పుత్రుణ్ణి కనలేదు. శుక్రాచార్యుల వారికి ఒక్కత్తే కూతురు , దౌహిత్రుదు (కూతురి కొడుకు ) బ్రాహ్మణుడు కాకుండా పోతాడు. అక్కర్లేని చొరవ ఎక్కడి వరకు కట్టి కుదిపింది చుడండి.


















Monday, October 6, 2014

ఆదిపర్వం 18

శంకర భగవత్ పాదుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు అమ్మా నీ దగ్గరకి వచ్చిన వాళ్ళందరూ కోరిన కోర్కెలు తీర్చ గలిగిన ఓ పరదేవతా! హరి నిన్ను మోహించి జగన్మోహిని రూపాన్ని పొందాడు, ఇక్కడవరకు బానే ఉంది అప్పుడు మనకి ఏమి గుర్తొస్తుంది అలా జగన్మోహిని రూపం ధరించడం వల్లనే దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచటం లో రాక్షసులకి దక్కకుండా, లోకాన్ని కాపాడి అంటాం, అక్కడే శంకరా చార్యుల వారు ఏమి చేసారంటే , మన అందరినీ పక్కకి తోసేసి ఇంకోవైపుకి వెళ్లారు.

శంకరాచార్యులు అన్నారు అమ్మా శ్రీమహా విష్ణువు నిన్ను ఉపాసన చేసారు, నువ్వేమి చేసావు , లోకం లోక్కెల్లా నువ్వే అందగాత్తెవి త్రిపురసుందరివి నీ అందాన్ని శ్రీమహావిష్ణువు కి ఇచ్చావు ఇప్పుడు ఆయన జగన్మోహిని అయ్యాడు, అమృతం గురించి చెప్తే బానే ఉండేది, కానీ శంకరాచార్యులు ఏమ్మన్నారంటే అప్పుడు ఏమైందో తెలుసా అమ్మా , మీ ఆయన పరువు బజారున పడింది అన్నారు. పరమ శివుడు ఆ జగన్మోహిని వెంట పడ్డాడు అన్నాడు.

పురములు కాల్చిన పరమేశ్వరుని లో కామము బయలుదేరి, ఆయన ఆ జగ్నమొహిని అవతారం పొందిన ఆ విష్ణువు వెంట పడ్డారు. అమ్మా ఎంత పని చేశావమ్మా మరి ఇంకా ఊరుకున్నావా? ఆ పరమ శివుడు మన్మదున్ని కల్చేసాడు. కలచేస్తే ఇంకేముంది జననం లేదు మరణం లేదు. ఎవరి మీద కాముడు బాణాలు వెయ్యటం లేదు హాయి. సుఖం గా ఉన్నారు అందరు , అని మనం అనుకుందాం కాసేపు, అమ్మవారు ఏమి చేసింది మన్మదున్ని బతికించింది. బతికించి పైగా ఏమి చేసింది ఎవ్వరికి కనపడవు రా !, ఒక్క మీ ఆవిడకే కనపడతావు అంది.

కానీ ఇప్పుడు ఎటువైపు నుంచి వచ్చి బాణాలు వేస్తాడో , ఎంత నిష్ట గా ఉన్నవాడు ఆ బాణాలకి ఏమైపోతాడో ఎవరికీ తెలీదు. అమ్మా దీని వల్ల  ఏమైంది అంటే , ముక్కు ముస్కుని , హిమాలయ పర్వతాల లో జపం చేస్కునే వాళ్ళు కూడా బయపడుతున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కుడా కామానికి వశులై పోతున్నారు. కాబట్టి అమ్మా ఇంత గొప్ప పని చేసిన నీకొక నమస్కారం అంటారు శంకరులు.

ఇది పైకి బావుందేమో , మీరు కొంచం జాగ్రత్త గా ఆలోచిస్తే, ఇంత గొప్ప అందాన్ని శ్రీమహావిష్ణువు కి ఇచ్చి పరమ శివుని ప్రతిష్ట బజారున పారెయ్యటం , పతివ్రతా లక్షణమా?
రెండు ఆ కాముడు లేకపోతే ఈ చావులేదు పుట్టుకా లేదు, ఏ గొడవా లేదు. ఆ కాముడికి ప్రాణం పోసింది ఆవిడ , ఆ మన్మధుడు బతక బట్టి మన అందరికి ఈ అల్లరి వచ్చింది. పుట్టటం , చావటం , పుట్టటం ,చావటం. పోనీ ఊరుకుందా ఆ మన్మధున్ని బాణాలు ఎవరిమీద వెయ్యటానికి కూడా అధికారం ఇచ్చేసింది, ఒరేయి తపస్సు చేకుంటున్న ఋషుల మీద కూడా వేస్తె వెయ్యి నేనేమి అనను అన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా భయ పడిపోతున్నారు. అమ్మా ఇన్ని చేసిన నీకు ఒక నమస్కారం.

ఇది స్తోత్రమా ? నిందా ? భయపడకుండా గుండెలమీద చెయ్యేసుకుని ఆలోచించండి. ఇందులో నిజాయితీ గా త్రికరణ శుద్దిగా అమ్మవారిని  అబ్బా ఏమి అమ్మవారు అని స్తోత్రం చెయ్యటం ఏమైనా ఉందా ? ఏమీ లేదు , మరి ఏమిలేని దానికి శంకరా చార్యుల వారు సౌందర్య లహరి లో శ్లోకం ఎందుకు ఇచ్చినట్టు.

ఎవరు చట్టాన్ని చేసారో , వారు ఆ చట్టాన్ని తెసేసే అధికారం కలిగి ఉంటారు.  ఇక్కడ వరకు అంగీకరిస్తారా? ఇంకా రెండు మీరు మేము ఇంకా బెంగ పెట్టుకున్నది దేని కొరకు అయ్యయ్యో ఆ చచ్చి పొయిన మన్మధున్ని అమ్మవారు మళ్ళి ఎందుకు బ్రతికించింది అని.

అమ్మవారు మనమధున్ని పుట్టించలేదు అనుకోండి, మన్మధ బాణములు లోకంలో పడలేదు అనుకోండి. సృష్టి ఆగిపోయింది గా , సృష్టి ఆగిపోతే మనం చేసిన పాప పుణ్యాలు పోయేది ఎప్పుడు. ఈ శరీరం ఉంటె కదా పాప పుణ్యాలు పోయేది? ఈ శరీరం పోయిన తరువాత జీవుడు మళ్ళి పుట్టాలి , మీతో నేను కొంచం కటినంగా ఉన్నా ఎదార్థం చెప్తున్నాను.

గరుడ పురాణం చెప్తుంది, శరీరం లేకుండా దక్షిణ దిక్కున పిత్రులోకం అంటారు , అక్కడ నిలబడి పోయారు అనుకోండి, అప్పుడు ఏడుస్తాడు. శరీరం ఉంటె పుణ్య కర్మ చెయ్యొచ్చు , పాపాన్ని పోగొట్టుకోవచ్చు. శరీరం లేదు జీవుడు ఉండిపోయాడు, అప్పుడు ఏడుస్తాడు, నాకు ఏదో ఒక శరీరం ఇవ్వు ఈశ్వరా, శరీరం అంటూ ఉంటె నేను మళ్ళి నిన్ను శరీరం తో సేవిస్తాను అంటాడు. కానీ ఏ శరీరం పడితే అది ఇస్తే ఏమీ చెయ్యలేదు, మనుష్య శరీరం ఇస్తేనే చెయ్యగలడు.

ఇప్పుడు ఈ మనుష్య శరీరం కావలి, కావాలంటే ఎలా వస్తుంది?  తల్లి తండ్రుల మీద మన్మధ బాణాలు పడితేనే నా ఈ శరీరం వస్తుంది. ఈ శరీరం వస్తేనే నా మీరు మళ్ళి పాప పుణ్యాలు పోగొట్టుకోవటానికి ఈశ్వరుని సేవ చేస్తారు? కాబట్టి ఇప్పుడు అమ్మవారు , కామున్ని బ్రతికించటం వలన , మనకి ఈ శరీరాలని పొందటానికి అవకాశం వచ్చిందా లేదా ?అమ్మవారి అనుగ్రహం లేదు అందులో.

నేను మీతో ఇంకో మాట మనవి చేస్తాను మీతో, అమ్మవారు కమున్ని ఎప్పుడైతే బ్రతికిన్చిందో కామము బ్రతికింది. కామము బ్రతికితే బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి ? నీ కామము ధర్మ బద్దం అయితే నువ్వు పితృ ఋణం నించి బయట పడి పోయావు. ధర్మ బద్దమైన కామం తో ధర్మ పత్ని యందు కామం పెట్టుకున్నావ్. సంతానాన్ని కనడం తో పితృ ఋణం నించి బయట పడ్డావు.

కాబట్టి నీకు కాముడు ఉంటె బెంగ ఎందుకు , పితృ ఋణం తీరింది. ధార్మికమైన కామం అనుభవించ లేక పోతున్నాను, అప్పుడూ బెంగ లేదు, ఈ విషయం అమ్మవారికి చెప్పు , అమ్మా నువ్వు కమున్ని ఇచ్చావు , కామాన్ని ఇచ్చావ్ , కానీ వచ్చిన పెద్ద చిక్కల్లా , కామాన్ని ధర్మం తో ముడి వెయ్యలేక పోతున్నాను ఆ ముడి వెయ్యలేక పోవటం వాళ్ళ నేను పడైపోతున్నాను అని అమ్మవారితో చెప్పు , ఎవరు చట్టం చేసారో వాళ్ళే చట్టాన్ని రద్దు చేసినట్టు, నువ్వు అమ్మవారి పదాలు పట్టుకుంటే , అమ్మ కమున్ని పిలిచి వాడి జోలికి వేళ్ళకు అంటుంది.

మీకు ఇంకో విషయం చెప్తాను , మహాత్ములైన వారు ఉన్నారు, వారికి కామ స్పర్స ఉండదు, ఆయన అస్కలిత బ్రహ్మచారి , ఆయనకి అసలు ఎట్టి పరిస్థితులలో కామం అనే స్పర్స అంటదు, ఇప్పడు ఆయన శరీరం తో ఉండి పోతాడా? నాకు చెప్పండి, ఎంతటి మహాత్ముడైన కానివ్వండి , ఆయన శరీరము ఒక ప్రత్యేకమైన దేశ కాలము యందేనా ఉంటుంది? ఎప్పటికి ఉండిపోతుందా ? చంద్రశేకర భారతీ స్వామివారే అయినా , శంకర భగవత్ పాదులే అయిన శరీరాలని విడిచి పెట్టేసారు, వెళ్లి పోతారు. మరి శరీరం వెళ్ళిపోతే ఒక పెద్ద ఇబ్బంది ఒకటి ఉంది. మళ్ళి ఇంకో మహాత్ముడు శరీరం లోకి వచ్చి కూర్చుంటే మీకు భోధ ఉంటుంది. లేకపోతే ఆగిపోతుంది.

కాబట్టి మహాత్ముల పరంపర నడవాలి , మళ్లి మళ్ళి మళ్ళి మహాత్ములు రావాలి, ఇప్పుడు కుడా మనకు మహాత్ములు ఉండాలి. ఉండి వాళ్ళు మాట్లాడితేనే , మన తప్పులు మనం తెలుసుకుని ,మనం ధర్మ మార్గం లోకి వెళ్తాం. కానీ అలా చెప్పి మాట్లాడే మహాత్ముడు ఎలా వస్తాడు? ఆయన శరీరం లోకి రావాలంటే ఆయన తల్లి తండ్రుల మీద కాముడి బాణాలు పడవలసిందే. పరిపూర్ణమైన మనసుతో భార్యాభర్త లు ఇద్దరు సంగమించక పోతే , పరిపూర్ణమైన ఆరోగ్యం తో శిశువు పుట్టడు. విముఖులై సంఘమిస్తే తేజోవంతమైన , ఆరోగ్యవంతమైన శిశువు పుట్టదు. అలా కలవలేదు కాబట్టే వ్యాసుడే సంఘమించినా సత్సంతానం కలగలేదు, భారతం లో. వెల వేల బోతే పాండురాజు పుట్టాడు , కళ్ళు మూసుకుంటే ద్రుతరాస్త్రుడు పుట్టాడు.

పరిపూర్ణ హృదయం తో ఒక మహాపురుషుడు, ఒక స్త్రీతో సంగమిస్తే తప్ప, ఆయన వీర్యం స్కలనం అవ్వాలంటే ఆయనకి కామం కలిగి తీరాలి, ఆయనకీ కామం కలిగితేనే ఆయన తేజస్సు వేరొక స్త్రీలోకి వెళ్తుంది. వెళితేనే ఇంకో మహాత్ముడు పుడతాడు, పుడితేనే తప్ప మీకు మాట్లాడేవాడు లేడు. మీకు రాసేవాడు లేడు , చెప్పేవాడు లేడు. అప్పుడు లోకం ఏమై పోవాలి , కాబట్టి ఇప్పుడు ఒక మహాత్ముడు పుట్టాలి అంటే అంతకంటే మహా పురుషుని లో కామం కలగాలి, ఆయనకి కామం కలగదు, ఎందుకని అంటే ఆయన మహా పురుషుడండి, పరాశరుడికి కామం ఎందుకు కలుగుతుంది, ఒక్కనాటికి కలగదు.

పరాశర మహర్షి వంటి మహా పురుషుని తేజస్సుని పట్టగలిగే క్షేత్రం ఉండాలి. కారణ జన్మురాల్ని సృష్టించాలి. కారణజన్ముడైన పురుషుడు పుట్టాలి అంటే ఉపరిచర వసువు వంటి మహా పురుషుని వీర్యం గిరిక లోకి వెళ్ళ వలసినది, శాప విమోచనం కావలిసిన అద్రికలోకి వెళ్లి అద్రిక నుండి మత్యగoధి పుట్టి, మత్యగంది వంటి ఉపరిచర వసువు వల్ల పుట్టిన గొప్ప క్షేత్రం లోకి పరాసరుని తేజస్సు ప్రవేశిస్తే, ఈ క్షేత్ర భీజ సంపర్కం చేత వేరొక మహా పురుషుడైన వేదవ్యాసుడు, పుడతాడు. ఆయన పుడితే మీరు నేను తరిస్తాం.

ఇప్పుడు పరాశర మహార్శిలో కామo కలగాలి , ఆయనకి కలుగుతుందా ఒక్కనాటికి కలగదు, సత్యవతి ని చూడగానే ఆయనకీ కామం కలిగితే తప్ప వ్యాసుడు రాడు. వ్యాసుడు వస్తే తప్ప మీకూ నాకు భారతం లేదు. వేద విభాగం లేదు, అష్టాదశ పురాణములు లేవు. ఇప్పుడు అంతటి మహా పురుషుని మనసుని కదప గలిగినది ఎవరు?
ఎవరు చట్టం చెయ్యగలరో ఎవరు రద్దు చెయ్య గలరో వారే చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు పరదేవత ఏమి చెయ్యాలి , అంతటి మహాపురుషుని మనసు , కామ ప్రచోదనం కలిగేటట్టు చెయ్యాలి.

కాబట్టి ఎవరు చేసింది అని గుర్తు, పరాశక్తి చేస్తుంది , ఈ కదలికలన్నీ ఆయన మనసు సత్యవతి యందు లగ్నం అయితే సత్య గర్భమున వేదవ్యాసుడు పుడతాడు. అందుకని ఆయనలో కామ ప్రచోదనం ఎంత వరకు అవసరమో అంత వరకే చేసింది , పరాశక్తి. ఒక్క వ్యాస జననం వరకే ఇంకా ఆ తరువాత , పరాశరుడికి ఎప్పుడూ కామం లేదు. మహాపురుష జననం ఎందుకు జరుగుతుంది, పరాశక్తి నిర్ణయం చేస్తుంది. అందుకే మహా పురుష జననములను విచారణ చెయ్యవద్దు అని అన్నారు.

మహాపురుష జననము నందు నువ్వు వెకిలి నవ్వు నవ్వితే , నీకు పాపం వస్తుంది. అందువలన శాస్త్రం ఏమి అన్నదంటే, ఒకవేళ నీకు అర్థం కాకా పోతే ఊరుకుండి పో విచారణ చెయ్యొద్దు. మహాపురుష జననము , నది యొక్క ప్రారంభ స్థానమును విచారణ చెయ్యవద్దు, నది ఉంది స్నానం చెయ్యి అంతే. ఎక్కడ పుట్టింది అని అడగకు.
మహపురుషుని వలన నీకు వాంగ్మయం వచ్చింది. నువ్వు వాంగ్మయం చదువుకో ఆయన అలా ఎలా పుట్టాడు అని అడుగ వద్దు.

పరదేవతనుగ్రహం కలిగింది, వ్యాస భగవానుడు పుట్టాలి, ద్వాపర యుగం అయిపోతోంది, కాళీ యుగం ప్రారంభం అవుతుంది, కలియుగం లో కలిపురుషుడు విజ్రుమ్భిస్తాడు. ధర్మం చెప్పేవాడు లేడు, ఆయుర్దాయం తగ్గిపోతుంది. వేదాన్ని అంతటిని ఎవరూ చదవలేరు, వేదాన్ని అంతటిని విభాగం చేసి, ఉన్న ఆయుర్దాయం లో వేదాన్ని చదువుకునే వాడు ఉండాలి, అష్టాదశ మహాపురనములను ఇవ్వగలిగిన వాడు ఉండాలి. భారతం చెప్పగలిగిన వాడు ఉండాలి, శిష్యుల్ని తానె తాయారు చేస్కో గలగాలి. మహా పురుషుడై స్వార్థ త్యాగి అయిన వాడు కావలి, అటువంటి వాడు పుట్టాలి అంటే ఎంతటి మహాత్ముడి తేజస్సు కదలాలి.

అటువంటి మహాపురుషుడి తేజస్సు కదిలినా అంతటి తేజస్సు పట్ట గలిగిన క్షేత్రం ఏది, అందుకని ఆ క్షేత్రాన్ని కుడా పరదేవతే సిద్దం చేసింది. వేరొక మహాపురుషుడి తేజస్సు కదిపి అది అద్రిక మింగి, అది అద్రిక కడుపులో పెరిగితే అద్రికకి శాప విమోచనం అవుతుంది. అప్సరస గర్భం నుండి బయటకి వచ్చింది కాబట్టి , దాశ రాజు దగ్గర పెరిగితే, యమునా నది దాటుతున్న అప్పుడు ఆయన హృదయము ఆమె యందు నిలబడింది. మనకొరకు ఆయన మనసు ఎంత వరకు కదలాలో అంతవరకు కదిలేలా చేసిన పరదేవతనుగ్రహాన్ని మీరుచదువుతున్నరని గుర్తు.

అందుకే ఆదిపర్వం లో మహాపురుషుల జననం వింటే, సాక్షాత్తుగా దేవతల యొక్క రాక్షసుల యొక్క, పరదేవత యొక్క ఇంతమంది యొక్క అనుగ్రహము కలిగేస్తుంది . మహా పురుష జననం వెనకాల పరదేవత యొక్క అనుగ్రహం నడుస్తోంది.

ఇప్పుడు తీర్థ యాత్ర కి వెళ్తున్న ఆ పరాశరుడు యమునా నది పైన పడవ నడుపుతున్న ఆ యోజన గ్రంధి ని చూసి ఆయనకీ అసలు మదము లేదు మత్సరము లేదు, లేని వాడికి ఎలా కలిగింది , మనకోసం కల్పించింది పరదేవత. నీ తేజస్సు జారితే కాని రాదు వ్యాసుడు అని. ముడులోకముల చేత స్తోత్రం చెయ్య బడే వాడు, వసిష్టుని యొక్క మనవడు, శక్తి మహర్షి యొక్క కుమారుడు, పాపములు నశించిపోయే టట్టు గా ఘోరమైన తపస్సులు చేసిన వాడు,మంచి వ్రతం తో తీర్థ యాత్ర కి వెళ్ళే వాడు.

వొంటినిండా యోజనం దూరం వరకు చేపల కంపుకొట్టే ఆ స్త్రీ ని చూసాడు,  ఇందులో ఒక విచిత్రం ఉంది, పొగ ఎక్కడ మొదలైందో అక్కడకి వెళ్లి కూర్చుంటే, పొగ ఉండదు. కంపు ఎక్కడ మొదలైందో అక్కడకి వెళ్తే కంపు ఎక్కువ వస్తుంది. ఇంత మహాన్వితుడు అంత దుర్వాసన వస్తున్నా మత్యగంది దగ్గరకి వెళ్లి చుస్తాడండి ఆయన? మరి చూసాడు అంటే మన కోసం చూసాడు అని చెప్పాలి. పరదేవతానుగ్రహం గా చూసాడు అని చెప్పాలి. చూసి ఆమె యొక్క పొందు కోరాడు.

కోరితే ఆ మాత్య గంధి అంది నేను కన్యని , నా కన్యాత్వం పోతే నా తండ్రి నన్ను గడపలో అడుగుపెట్ట నిస్తాడా ? అటువంటి తప్పుడు పనిచేసి ఇంటికి వస్తావా అంటాడు. కాబట్టి నువ్వు ఎంతటి మహా పురుషుడవైనా కావొచ్చు నీతో సంఘమం నాకు ఎలా కుదురుతుంది.

అంటే ఆయన అన్నాడు ఇది బహుశః పరదేవత అనుగ్రహం లేకపోతే నా మనసు నీయందు నిలబడటం ఏమిటి, నీకు వరం ఇస్తున్నాను. నీ శరీరము చేపల వాసన కదూ వస్తోంది అని అంటున్నావు, ఇక నించి నువ్వు యోజన గంది వి అవుతావు, మత్యగంధి వి కావు, నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడ నించి యోజనం దూరం సువాసనలు వచ్చి ఆకర్షిస్తాయి. అదే  ఎదర భరత వంశానికి వరం అయ్యింది. ఊరికినే ఋషి నోటివెంట ఏమాటా రాదండి. అమ్మవారు పలికిస్తోంది. యోజన గంధి వి అవుతావు, ఆ వాసన లే శంతన మహారాజుని తీస్కువచ్చాయి.

నీ కన్యత్వం చెడదు, 9 నెలలో 10 నెలలో నువ్వు గర్భం ధరించక్కర్లేదు, సత్య గర్భం గా ఇప్పుడే మహాత్ముడు జన్మిస్తాడు నీ కడుపున, నీవు కన్య గానే ఉంటావు నేను నీకు వరం ఇస్తున్నాను. పగటివేళ మంచుతెరలు సృష్టిస్తున్నాను నా యొక్క తపస్సు చేత, పరాశర మహర్షి యొక్క సంఘమ ఫలితంగా పరమేష్టి సమానుడైన పరాశర మహర్షి అనుగ్రహం చేత సద్యో గర్భం లో సాక్షాత్తు సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు, పుట్టుకతోనే నాలుగు వేదములు నేర్చుకుని పుట్టిన వాడు. సాక్షాత్తు నారాయణుడు పుట్టాడు. సకల మునులకు మొట్ట మొదటి వాడు. పుట్టుకతోనే మహా జ్ఞానం తో పుట్టాడు మహానుభావుడు.

వచశ్రీమంతుడు పుట్టాడు, పుట్టీ పుడుతూ నే నల్లటి వర్ణం తో పుట్టి మహానుభావుడు ఆ యమునా నది ఒడ్డున అమ్మా నేను తపస్సు చేస్కోవటానికి వెళ్ళిపోతున్నాను అమ్మా , తండ్రి పరాశర మహర్షి తన సహజ స్థితి లోకి వెళ్లి పోయాడు ,పుట్టిన బిడ్డడు ఆయన వెళ్ళిపోయాడు. ఇటువంటి మహాపురుష సంపర్కం చేత మహాపురుష జననం చేత ఆమె కన్యత్వం చెడలేదు, ఎదర భారత వంశం నిలబడటానికి ప్రాతిపదిక పడింది.

శుభ క్షణం లేకపోతే అసలు కౌరవ పాండవులు పుట్టే అవకాసం లేదు. భీష్ముడితో సరి, ఆ భీష్ముడి సంతతి పెరిగితే ఏమో కధ ఎలా ఉండేదో. భీష్మ ప్రతిజ్ఞ చేయించి ఆ భీస్మున్ని అలా నిలబెట్టింది. మళ్ళి భీష్ముడు అలా నిలబడక పోతే, దీర్ఘాయుషుమంతుడు కాక పోతే వశిష్టుడి శాపం నిలబడదు, వసిష్ట మహర్షి యొక్క వాక్కు నిలబడ టానికి ఇదిగో ఈ మహాత్ముడు ఇప్పుడు పుట్టాడు. పుట్టి ఆయన తపస్సు చేస్కోవటానికి వెళ్తుంటే ఆయన్ని , కృష్ణ ద్వైపాయనుడు అని పిలిచారు. అక్క వనం లో పుట్టి వెంటనే వెళ్ళిపోయాడు కాబట్టి ద్వీపంలో కృష్ణ ద్వైపాయనుడు అని పేరు వచ్చింది.

నాయనా ! నువ్వు నన్ను అడిగావు కదా అసలు ఎందుకు జరిగింది భారత యుద్ధం , అసలు ఎందుకు చెప్పిన మాట వినలేదు అని కదా నువ్వు అడిగావు. ఈ భూమికి భారం పెరిగిపొయింది పాపుల చేత, భారం పెరిగిపోతే భూదేవి ఏడ్చింది. ఈలోకంలో పాపభారం పెరిగిపోతుంది , దీన్ని నిర్మూలించ టానికి దేవతంశలు రావాలి , శ్రీమన్నారాయణుడు కదిలి రావాలి, వచ్చి పాప భారాన్ని అంత పోగొట్టాలి అన్నారు, అంటే తప్పకుండా అలాగే అని వరం ఇచ్చారు .

ఇప్పుడు ఎంత పాపభారం పెరిగి ఉన్నదో తెలుసాoడి ఆ సమయం లో, అది పోగొట్టటానికి ఒక్క పరమేశ్వరుడు వస్తే సరిపోదు, దేవతలు అందరు అంశాలతో కదిలి రావాలి , అందుకని దేవతలు అందరూ కదిలి వచ్చారు. దేవతంశలలో వచ్చిన వారు కొందరు, రాక్షసంసలలో పుట్టేసినవారు కొందరు, ఇప్పుడు రాక్షస అంశలలో పుట్టిన వాళ్ళు అందరూ దేవతంశాలలో పుట్టిన వాళ్ళ వల్ల చచ్చిపోవాలి. చచ్చిపోతే భూ భారం తీరుతుంది.

భారతం లో గమత్తు ఏమిటో తెలుసా , దేవతంశలలో వచ్చిన వారు రాక్షసాంసలలో పుట్టిన వారి దగ్గర నించొని యుద్ధం చేసారు. భీష్ముడు దేవతాంస, ద్రోణుడు  దేవతాంస బృహస్పతి అంశ వీళ్ళు కౌరవుల పనుపున యుద్ధం చేసారు. అలా ఎందుకు చేసారు? ఒక పెద్ద ధర్మ సంభందమైన అనుమానం కదండి!

ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పా వలసి ఉంటుంది. మంట రాజుకోవాలి అంటే ఏమి చేస్తాం ,మీరు ముందు మీ కళ్ళ కి మంట కలిగినా , ఖేదం కలిగినా ఆ పొగ ని భరిస్తూ ఒక గొట్టం పట్టుకుని, మంట దగ్గర కి వెళ్లి ఊదాలి, మీరు ఊదితే రాజుకుంటుంది, రాజుకుని మంట పుట్టింది అనుకోండి, ఇంకా ఆ తర్వాత అన్నం వండుకోవచ్చు, నీలు కాగాబెట్టుకోవచ్చు, ముందు కష్ట పడాల వద్దా , దుర్యోధనుడు యుద్దానికి వచ్చి నిలబడాలి అనుకోండి, భీష్ముడు ,ద్రోణుడు , కృపుడు అందరు అటువెళ్లి పోయారు అనుకోండి, ఇక దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు, పన్నాగాలు పన్నుతూ నే ఉంటాడు. ఇంక ఎలా రక్షసాంస లు పోవటం.

రక్షసాంసలు దేవతంస ల తో తలపడాలంటే వాడికి ధైర్యం కలగటానికి కొన్ని దేవతంసలు తమ స్వరూపమునందు మార్పు లేకుండా నే వెళ్లి అక్కడ నించోవాలి. అందుకు నించున్నాడు, భీష్ముడు , ద్రోణుడు. అది మహా భారతం లో అత్యంత చమత్కారం. అందుకని నించున్నారు తప్ప ,చేత కాకో , దుర్యోదనుడి మోచేతి నీళ్ళ కోసమో కాదు. ఊదటం కోసం పొయ్యిని ,నించున్నారు. అందుకని వాళ్ళు అక్కడ నిలబడక పోతే ఆ యుద్ధం లో వాళ్ళు పడరు,
రాక్షసులు , అందుకని కొంతమందిని అక్కడ నించోపెట్ట వలసి వచ్చింది కృష్ణ భగవానుడు.

కాబట్టి ఒక్కొక్కళ్ళు ఎలా జన్మించారంటే, ఎన్నడూ దుఖం లేని పరమాత్మా ఈలోకం లో ధర్మాన్ని స్థాపించడం కోసం , దేవకీ వసుదేవులకి కుమారుడిగా పుట్టాడు. ప్రలంభుడు మొదలైన రాక్షసులని సంహరించటానికి , ఆదిశేషుడు యొక్క అంస  , బలరాముడి గా రోహిణి వసుదేవులకు జన్మించింది. సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా వచ్చాడు. పదహారువేల మంది అప్సరసలు గోపికలుగా వచ్చారు.

దేవతలే యదు , భోజ, అంధక వంశాలలో రాజులుగా వచ్చారు.  వసువులలో ప్రభాసుడు అనే ఒక గొప్ప వసువు భీశ్మాచార్యుడి గా వచ్చాడు. దేవతల గురువైన బృహస్పతి ద్రోణాచార్యుడి గా వచ్చాడు, కామము క్రోధము కలగలిసి ఉంటె ఎంతో ప్రమాదం, ఈ రెండిటిని కలకలిస్తే పుట్టిన వాడు అస్వర్థామ. ఏకాదశ రుద్రుల అంశలో పుట్టిన వాడు కృపాచార్యుడు. అందుకే కురుక్షేత్ర యుద్దంలో అందరూ మడిసి పోయిన, ఎప్పటికీ గురుత్వం వహించాడు కృపాచార్యుడు..
 
సూర్యుని యొక్క అంశ లో వచ్చిన వాడు కర్ణుడు,   హంసుడు అనే గంధర్వుడు ద్రుతరాస్త్రుడిగా వచ్చాడు. మతి గాంధారి గా వచ్చింది. కలి పురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు. పౌలస్త్యభాత్రు వంశం అంతా కుడా రాక్షసులు అంతా కలిసి దుర్యోధనుని యొక్క సోదరులుగా వచ్చారు. హిరణ్య కశ్యపుడు  శిశుపాలుడి గా పుట్టాడు ,సమ్హలాదుడు శల్యుడిగా పుట్టాడు, విప్పలా దుడు జరసందుడిగా పుట్టాడు.

కాలనేమి కంసుడిగా పుట్టాడు, శ్రీమహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది. స్త్రీ పుంస స్వరూపము రెండు కలిసి ఉండే ఒక దేవత శిఖండి గా పుట్టాడు. మరుత్గణాoశ తో పుట్టిన వాడు పాండురాజు, మండవ్యుని శాపం వలన యమధర్మ రాజు మళ్ళి పుట్ట వలసి వస్తే విదురుడిగా పుట్టాడు , సిద్ది బుద్ది ఇద్దరు , కుంతీ మాద్రిగా పుట్టారు. అనేకమైన దేవతల అనుగ్రహం తో యమధర్మ రాజు అంశగా ధర్మరాజు, వాయుదేవుని అంశలో భీముడు, ఇంద్రుని అంశలో అర్జనుడు , అశ్వినీ దేవతల యొక్క అంశలలో నకుల సహదేవులు, అలాగే సాక్షాత్తు శ్రీ రూపం గా లక్ష్మీ స్వరూపం గా , సంపద రూపంగా యాజ్ఞ సేని జన్మించింది. యాజ్ఞ సేని అంటే ద్రౌపది , ద్రౌపది దేవి యజ్ఞం లోనించి ఆవిర్భవించింది. అగ్ని ద్రుస్తాజ్మ్నుని గా వచ్చాడు

మరుత్యకి ద్రుపద , విరాట లుగా వచ్చారు , ఇంతమంది దేవతలు కాకుండా ఇంకా ఎంత మంది , ఈ భూమి మీద రాక్షసంసలతో జన్మించిన వారిని మత్తు పెట్టటానికి, దేవతలందరూ ఇన్ని అంశలలో జన్మించారు. శ్రీమహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా ఆవిర్భవించారు.

రాక్షసంస లలో ఉన్నవాళ్లు కనుక మాట వినలేదు. అందుకని వచ్చింది భారత యుద్ధం అంతాను, వాళ్ళని మట్టు పెట్టటానికి  భూభారం తగ్గించటానికి వచ్చింది. అంటే జనమేజయుడు అడిగాడు అసలు మా వంశం ఎక్కడ ప్రారంభం , భరతుని యొక్క వంశం ఎక్కడ ప్రారంభం అయ్యింది. దాని యొక్క విశేషం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు.
వైశంపాయనుడు , వ్యాసుడు దొరికినప్పుడు కదండీ చెప్పించుకోవటం , లేనప్పుడు ఎవరిని అడుగుతాం. కాబట్టి చెప్పండి అన్నాడు.

అంటే ఆయన ఎక్కడికి తీస్కెళ్ళి ప్రారంభం చేసాడంటే , పూర్వం దేవతల గురువు అయిన బృహస్పతి, ఆయన యొక్క కుమారుడు కచుడు. రాక్షసులందరికి గురువు శుక్రాచార్యుల వారు, శుక్రాచార్యుల వారికి ఒక్కత్తే కూతురు ఆమె పేరు దేవయాని, దేవతల గురువైన బృహస్పతి యొక్క కుమారుడైన కచుడి దగ్గరకి దేవతలందరూ వెళ్లి ప్రార్ధన చేసారు , ఏమని అంటే

శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవనీ విద్య ఉంది, ఆయన వృష పర్వుడు అనే రాక్షసుడి దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాడు బ్రాహ్మణుడి గా ఉన్నాడు ఆయన పురోహితుడు. ఆయనకి మృత సంజీవనీ విద్య వున్న కారణం చేత దేవతలకి , రాక్షసులకి యుద్ధం జరిగితే, చచ్చిపోయిన రాక్షసులని అందరినీ మృతసంజీవని విద్య తో బ్రతికించే స్తాడు దేవతలని బ్రతికించే వాళ్ళు లేరు.

కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని విద్య తెలుసుకోవాలి, శుక్రాచార్యుల వారు ఇంత గొప్ప విద్యా ఎందుకు ఇస్తారు, తక్కరితనం తో నేర్చుకున్నరనుకోండి, గురువుగారి దగ్గర విద్య, తెలిసిన తరువాత గురువుగారు ఆ విద్య నీకు పనికిరకుండు గాక అంటాడు. అందువలన గురువుల్ని మోసం చేసి తెలుసుకోలేరు, గురువుగారి అనుగ్రహం తోనే తెలుసుకోవాలి.

గురువు ఎందుకు వచ్చినా సరే ఎందుకు అనుగ్రహించేస్తాడు, గురు సుశ్రుష త్రికరణ శుద్ధి గా చేస్తే గురువు అనుగ్రహించేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్లి చెప్పు నేను దేవ గురువు బృహస్పతి యొక్క కుమారుడిని అని చెప్పు , చెప్పి నువ్వు బాగా సుక్రచార్యులవారి సేవ చెయ్యి, శుక్రాచార్యుల వారి ఒక్కరి కి సేవ చేస్తే సరిపోదు , శుక్రుడి ప్రీతీ అంతా తన ఒక్క కూతురు దేవయాని మీద ఉంది, దేవయాని ప్రేమకూడా నువ్వు చొరగొను , ఇప్పుడు నువ్వు దేవయాని ప్రేమ నువ్వు పొందితే , దేవయాని చెప్తే ఎదోక కారణం చేత నీకు మృత సంజీవనీ విద్య నీకు దొరుకుతుంది.

కాబట్టి త్రికరణ శుద్ధి గా ఇద్దరినీ సేవించి , గురువుగారిని , గురువుగారి కూతుర్ని కూడా. అంటే తప్పకుండ చేస్తాను అని కచుడు శుక్రాచార్యుల వారిదగ్గరకి వెళ్ళాడు. వెళ్లి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు , శుక్రాచార్యుల వారితో, ఆయన అన్నాడు నేను చాల నియమములు కలిగినట్టి వాడిని , దేవగురువైన బృహస్పతి కుమారున్ని, నన్ను కచుడు అంటారు , నేను నీకు సేవ చేసి నీదగ్గర , విద్య నేర్చుకోవాలని వచ్చాను. కాబట్టి మీకు సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వండి అని అడిగాడు.


అడిగితే గురువు అన్నవాడి హృదయం ఎంత గొప్పగా ఉంటుందో చుడండి, శుక్రాచార్యులవారు అన్నారు , బృహస్పతి మహానుభావుడు , బృహస్పతి కి నమస్కరించటం ఒకటి , నిన్ను శిష్యుని గా స్వీకరించటం ఒకటి కాదు, కాబట్టి నాయనా సంతోషంగా రా , నీ మాటలు మృదు వచనములు నాకు ఎంతగానో నచ్చాయి. చక్కగా ఆశ్రమం లో ఉండి నా దగ్గర విద్యలు అన్ని నేర్చుకో అన్నాడు. అది ఆయన సహృదయం అంటే .

ఆ వెళ్ళిన కచుడు త్రికరణ శుద్ధి గా సేవ చేయ సాగాడు. ఫలములు తెమ్మంటే ఫలములు తెచ్చాడు, సమిధలు తెమ్మంటే సమిధలు తెచ్చారు, పుష్పములు తెమ్మంటే పుష్పములు తెచ్చారు. వాళ్ళిద్దరి అపారమైన ప్రీతిని పొందాడు, ఇప్పుడు వాళ్ళిద్దరి అపారమైన ప్రీతిని పొందిన కుడా మృత సంజీవనీ ఆయన చేతికి వచ్చే లోపల కధ ఎన్ని మలుపులు తిరగాలో, ఆ భారత వంశం ఎలా రావాలో, ఎన్ని ధర్మాలు ఉంటాయో, ఎంత ఆశ్చర్యమో చూద్దాం.


Sunday, September 28, 2014

ఆదిపర్వం 17

అసలు యాగము అంటూ చేస్తే రెండు ప్రజనములు కొరకు చేస్తారు
ఒకటి ,యజమాని ఉండి  , ఏదో ప్రయోజనం కొరకు చేస్తే ఇహము , ఇక్కడ ప్రయోజనం నెరవేరుతుంది.
రెండు , ఇక్కడ ప్రయోజనం కొరకు కాదు అని చేస్తే ఊర్ధ్వ లోకాలలో నివసించ గల గొప్ప శక్తిని యాగము కృప చేస్తుంది. ఈ రెండూ కాదు లోక శాంతి అసలు భారత ప్రారంభం లో జనమేజయుడు అటువంటి యాగం తో ప్రారంభం భారతం.
ఇప్పుడు జనమేజయుడు చేసే  యాగం ఈ మూడిటి లో ఇందులోకి వస్తుంది, ఈ మూడి టి లో ఎందులోకి రాదు , ఇహము లేదు, పరము లేదు, లోకోపకారము లేదు , మిగిలనిది ఏమిటి అయ్యింది కక్ష, కక్ష కొరకు యాగము చెయొచ్చా , ఇన్ని చేసాడు, అంతటి అనుభవం ఏమైనట్టు ? ఇన్ని చేశాను అంటున్నావ్ , ఇంతమంది బ్రాహ్మణుల్ని ఆదరించాను అంటున్నావ్ , ఇన్ని యజ్ఞాలు చేసావు, ఇంత పరిపాలన చేసావు, తుట్ట తుదకు నీ మనసు యొక్క వ్యగ్రత కి లొంగిపోయావు , లొంగిపోయి ఆ యాగం దేని కొరకు చేస్తున్నావ్ అంటే ఎప్పుడో మీ నాన్న ని కరిచినటువంటి ఒక పాము యొక్క ఉద్దతి ని మనసులో స్మరణ చేసి, మొత్తం పాముల్ని చంపటానికి యాగం చేస్తున్నావ్. పోనీ అదైనా నీంతట నీకు కలిగిన సంకల్పమా , ఉదంకుడు వచ్చి ప్రచోదనం చేసాడు అటువంటి యాగం చెయ్యమని. ఉదంకుడు ఎందుకు చెయ్యాలి ఆయన కోపం ఆయన కి ఉంది.

తక్షకుడు ఎప్పుడో ఆ ఉదంకుడికి అడ్డం వచ్చాడు. గురు పత్నియొక్క యొక్క కోరికమేరకు , మహారాజు పౌష్యుని యొక్క భార్య కుండలములను తెస్తుంటే ఆయన అపహరించి తీస్కెళ్ళి ఇబ్బంది పెట్టాడు అని ,భూత దయ లేకుండా చేసే యాగం ఏ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆపుచేసేయి అన్నాడు అస్తీకుడు. చాలా గొప్ప విషయం ఏమిటంటే లోకంలో తనకి తట్టక పోయిన పెద్దలు చెప్పినప్పుడు వినగలగడం. ఇదొక్కటి ఉండటం చంద్ర వంశం లో పాండవుల ఆస్తి, వాళ్లకి తట్టక పోవచ్చు కానీ కృష్ణుడు చెప్తే వింటారు పాండవులు, అలా జనమేజయుడు విన్నాడు, విని ఉత్తర క్షణం లో యాగాన్ని ఆపు చేసేయండి అన్నాడు.

ఇప్పుడు యాగo ఆపుచేసిన తరువాత అది ఒక సంఘటన గా జనమేజయుడు విడిచి పెట్టి ఉంటె , వైశంపా యనుడు భారతం చెప్పడు. ఇక్కడ జనమేజయుడు ఒక్క సారి విచారణా స్థితి కి వెళ్ళాడు. అసలు నేను ఎందుకు చేశాను ఈ యాగం, నిజమే అస్తీకుడు చెప్పిన దాంట్లో నిజం ఉంది. కేవలం కక్ష తో చేశాను. ఈ కక్ష కి కారణం పోనీ తక్షకుడు నాకేమైనా అపకారం చేసాడా అంటే లేదు.

మా నాన్న గారిని మట్టుపెట్టాడని ఇప్పడు నేను యజ్ఞం చేసి, కొన్ని వేల లక్షల సర్పములనె కాల్చేసాను. మనిషి మనసులోకి కక్ష అన్నది ప్రేవేసిస్తే , అంతకుముందు విన్నవి, అంతకు ముందు నేర్చుకున్నవి, ఎంత తేలికగా కొట్టుకుపోయాయో కదా ,ఇంకో ఆలోచన లేకుండా యాగం చేసేసాను.

నాకు ఎవరూ అలా యాగం చెయ్యొద్దు అని చెప్పలేదు. ఆస్తీకుడు చెప్పగానే ఆపేసాను. కానీ నాకన్నా ముందు పుట్టి ఈ రాజ్యాన్ని పరిపాలించిన , పాండవులు కౌరవులు నాకు తండ్రులు, వాళ్ళకి చెప్పటానికి పరమ ధర్మ మూర్తి అయిన వ్యాసుడు ఉన్నాడు. సాక్షాత్తు ఆత్మ బంధువు, ఆ వ్యాస స్పర్స లేకుండా బిడ్డలు పుట్టలేదు. కాబట్టి ఆయన వంశ కర్త అయ్యి ఉన్నాడు. పెద్దరికం వహించి చెప్పటానికి భీష్ముడు ఉన్నాడు. అడగకుండా నే చెప్తాడు భీష్ముడు, మహా పురుషుడు ఆచార్యుడు ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు ఇంత మంది ఉండీ  మరి ఎవరు చెప్పింది వినకపోవటం చేత అంత పెద్ద యుద్ధం (కురుక్షేత్రం )జరిగింది ? వాళ్ళు కూడా ఎక్కడో మాట వినకుండా ఉండటం వలన ఇది జరిగింది. కాబట్టి వ్యాసుడు ఉండగా ఇది ఎలా జరిగింది అసలు ?

ఎవరు మాట వినపోవటం వల్ల జరిగింది. మాట వినకపోవటం కేవలం స్వభావ రిత్యా వినకపోవటం జరిగిందా ? అంత కన్నా ఇంకా వెనకాతల కారణం ఏమైనాఉందా ? ఒక వ్యక్తి స్వభావ రీత్యా మాట వినక పోయి ఉంటె , ఇంత మంది మహాత్ములు ఉన్న చోట ఆ ఒక్కడే పోయి ఉండాలి. అలా పోలేదు.

ఇనుప రజను మొత్తము ఐస్కాంతం ఆకర్షించి నట్టు , దుష్ట శక్తుల ను అన్నింటినీ దుర్యోధనుడు ఆకర్షించాడు. దేవతలు అందరు ఈశ్వరుని ముందు నించున్నట్టు దేవత శక్తులందు ఆవిర్భవించిన వాళ్ళు అందరూ పాండవుల వైపుకి  వెళ్లారు. మరి వాళ్లైన మాట విని ఉండాలి కదా? మరి పాండవులు ఎందుకు వినలేదు , వీళ్ళిద్దరికీ యుద్ధం ఎందుకు జరిగింది అసలు కురుక్షేత్రం లో ?

ఆస్తీకుడు చెప్పగా నే నేను విని యజ్ఞం ఆపినట్టు, వాళ్ళు కుడా వ్యాసుడి మాటొ , భీష్ముడి మాటో , విదురుడి మాటో అంత మంది మహానుభావులు ఉన్నారు ఆ సభలో , ఎక్కడ నించో తెచుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ నా అదృష్టం కొద్ది ఇక్కడ సభలో వ్యాసుడు ఉన్నాడు అడగటానికి. వాళ్ళు ఎప్పుడూ ధర్మం మాట్లాడుతూ నే ఉండాలి.
ఎక్కడ వచ్చింది దోషం. ఎక్కడ మాట వినకపోవటం అన్నది వచ్చింది. ఎవరెవరు మంచి మాటలు చెప్పారు , ఎవరెరు వినలేదు, ఎవరెవరు ఏ ఏ స్వభావముల చేత ,ఏ ఏ కరణముల చేత ఇంత భారత యుద్ధం జరగ వలసి వచ్చింది.
ఈ సంఘర్షణ లో ఏవో చాలా గొప్ప గొప్ప విషయాలే ఉంది ఉంటాయి.

ఇప్పడు కధ ని కధ గా చెప్పేవాడు కాదు కావాల్సింది , కధ లో ఉన్న ధర్మ సుక్ష్మముల తో చెప్పే వాడు కావలి.
అదృష్టం ఏంటంటే ,వ్యాసుడు ఉన్నాడు సభలో , యజ్ఞ పరీక్షకుడి గా కూర్చొని ఉన్నాడు. ఆ వ్యాసుడే మహాభారత రచన చేసిన వాడు , ఇతిహాస రచన, పెద్దలు మనం అడిగుతే చెప్పాలని లేదు . ఎందుకు చెప్పాలి అంటే కృప కలిగి చెప్పాలి. కృప ఎప్పుడు కలుగుతుంది, మన ఆర్తి అర్థం అయితే కృప కలుగుతుంది. ఏదో తెలుసుకోవాలన్న ఆర్తి అవతల వారి యందు ఉన్నది. అంతే గురువుగారు మాట్లాడటానికి అంత కన్నా ఇంకో విషయాన్నీ ప్రాతిపదిక గా తీస్కోరు.

కాబట్టి ఇప్పుడు నా ఆర్తి అర్థం అయితే మాట్లాడుతాడు. ఆయన యందు నా పూజ్య భావము కూడా ఆయన కి స్పష్టము కావలి అప్పుడే మాట్లాడుతాడు. ఈ కోణం లో జనమేజయుడు అడుగుతున్నాడు. ఆ సమయం లోనే మహాభారతం ప్రవచన రూపం లోకి మారింది.

ఇప్పడు జనమేజయుడు వ్యాసుని స్మరిస్తున్నాడు, సాక్షాత్తు పరబ్రహ్మమే రాసీ భూతమై నా ఎదుట కూర్చుంది. పరస మహర్షి యొక్క కుమారుడు , బ్రహ్మర్షుల లో ముఖ్యమైన వాడు, దయ కలిగిన వాడు , కురువంశము అంతటికీ కూడా పితామహ స్తనము నందు ఉన్నవాడు, జనమునంతటికి కూడా హితమును కల్పించటము అనేటటు వంటి మార్గము నందు, అష్టాదస పురాణములను , వేదములను విభామును చేసి , లోకమునకు నాలుగు మంచిమాటలు చెప్పి , జనాన్ని మంచి మార్గం లోకి మళ్ళించటం అనే మహా ప్రక్రియని , ప్రారంభం చేసిన మహా పురుషుడు, కృష్ణా జీనం కట్టుకున్న వాడు, నల్లని మేఘం ఎలా ఉంటుందో అటువంటి శరీరం కలిగిన వాడు, పేరుకి తగిన గుణములు కలిగిన వాడు, అప్పుడే ఉదయించిన సుర్యభింబం నుంచి వచ్చే కాంతి ఎలా ఉంటుందో , అటువంటి కాంతి తో మెరిసి పోతున్నటువంటి , ఎర్రని జటలతో మెరిసిపోతున్న టువంటి వాడు , రాగాద్వేషములు లేని వాడు, ఏ మాత్సర్యము లేని వాడు, ఇప్పుడు వ్యాసుడు , జనమేజయుని గుండెల్లో ఎలా ఉన్నాడో చెప్తున్నారు.

అటువంటి వ్యాసుని వంక చూసి జనమేజయుడు ప్రశ్న వేస్తున్నాడు. మునులందరి చేత నమస్కరింప బడే స్వరూపం కలిగిన వాడా ! పరమ ధర్మాత్ములు , సమస్త శస్త్రములు తెలిసున్న మీరు , కురువ్రుద్దులు , భీష్ముడు , వీరందరూ కలిసి రాజ్యాన్ని విభాగం చేసారు. ఇవ్వకుండా ఊరుకుని పంచుకోవటానికి దెబ్బలాడుకుంటే, అది వేరు. కానీ ఇక్కడ దెబ్బలాడు కోవ టానికి అవకాసం లేకుండా విభజించి ఇచ్చేసారు. ఎవరు విభజించారు , పరమ ధర్మాత్ములు విభజించారు , కాబట్టి ఇహ దెబ్బలాడుకోవటానికి ఏమి ఉండదు,

మీ మాట విని ఎవరికిచ్చిన రాజ్యం వాళ్ళు ఎందుకు పరిపాలించలేదు, వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నారు . అంటే తాను మాట వినటం వలన ఎంత గట్టేకేసాడో లోపల గుర్తొస్తుంది. ఎందుకు వాళ్ళు యుద్ధం చేస్తే అంత ప్రజక్షయం అయింది , ఎందుకు అంతమంది చచ్చిపోయారు? బంధువుల్లో ఇంత కలహం ఎందుకు వచ్చింది, వాళ్ళని ఎవరు ఆపలేక పోయారా? కాబట్టి నాకు అసలు ఈ గొడవలు ఎందుకు వచ్చాయి . ఎందుకు మాట వినలేదు మీ వంటి పెద్దలు ఉండగా? తెలియక తప్పు చెయ్యటం తప్పుకాదు , తెలిసున్న వారు చెప్పినప్పు దిద్దుకోవటం గొప్ప.

ఈ ప్రశ్న అడిగితే మహానుభావుడు వ్యాసుడు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. వైశంపాయనుడి వైపు చూసి నువ్వు చెప్పు అన్నట్టు గా సైగ చేసాడు.  అంటే ఆయన రచన చేసి కూర్చో పెట్టుకుని , మొట్ట మొదట తన శిష్యులకి చెప్పాడు. సుమంత్రుడు , పైలుడు , వైశంపాయనుడు , జైమిని వీళ్ళని కూర్చో పెట్టి చెప్పాడు.

ఇక ఇక్కడ నించి భారతం లో శ్రోత , వక్త మారుతున్నారు, ఇప్పటి వరకు ప్రవచనం చేసింది శౌతి , విన్నవారు , నైమిశారణ్యం లో మహర్షులు. ఇంకా ఇక్కడ నించి ప్రవచనం చేస్తున్న వాడు , వైశంపాయనుడు. వింటున్న వాడు జనమేజయుడు , కూర్చున్న వాడు వేదవ్యాసుడు.

మొట్ట మొదట భారతాన్ని వ్యాస సమక్షం లో ప్రవచనం చేసిన ఘనత వైశంపాయను కు దక్కింది. వైశంపాయను ఏ కారణం చేత వ్యాసుని యొక్క పాదాల దగ్గర నిలబడి , తడుము కో కుండా ,అంత గొప్ప గా భారతాన్ని చెప్పగలిగాడు. ఒకే ఒక్క కారణానికి చెప్పగలిగాడు , అది ఏమిటంటే తన గురించి ఒక్కపద్యం కూడా చెప్పక పోవటం వలన. ఇది భారతం లోని పరమ రహస్యం. ఇంత భారతం గురించి చెప్పిన వైశంపాయనుడు తన గురించి కానీ , తన తల్లి తండ్రుల గురించి కాని ఇంత భారతం చెప్పినటువంటి వాడు ఈ వైశంపాయనుడు అని ఎక్కడా చెప్పలేదు.

ఆయన భారతం చెప్పు అనగానే , గురువుగారి పాదాలమీద పది సాష్టాంగ నమస్కారం చేసాడు. చేసి గురువర్యా మీరు ఆనతి ఇచ్చారు అంటే , కార్యం జరిగిపోయినట్టే, ప్రవచనం చేస్తాను, మీరు శాసించినట్లే భారతం చెప్తాను. వ్యాసుడు గురించి చెప్పాడు తప్ప అసలు ఆయన గొప్ప తనం గురించి ఆయన ఎక్కడా మాట్లాడలేదు. సంక్షేపంగా ఒక్కసారి మహాభారతాన్ని  అంతట్ని ఒక్కసారి చెప్పేసాడు.

ఆర్తి కలిగిన శిష్యుడైతే ప్రశ్న వేస్తె వివరణ చెయ్యాలి. వేద వ్యాసుని యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. మహానుభావుడయ్య ఈ వ్యాసుడు , ఈయనే అష్టాదశ పురాణములను ఇచ్చాడు. ఈయనే పంచమ వేదమైన భారతాన్ని ఇచ్చాడు. ఈయనే వేద విభాగం చేసాడు , అటువంటి వ్యాస మహర్షి పనుపు న నేను, ఇదిగో ఈ భారతాన్ని ప్రవచనం చేస్తున్నాను. అదొక్కటే మాట , తన గురించి ఒక పద్యాన్ని వైశాపయనుడు చెప్పలేదు.

అంటే అసలు మహాభారతాన్ని వినేటటువంటి శ్రోత ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని వినాలి. వైశామపయనునకు అంత కీర్తి ఎలా కలిగింది , సొంతంగా ఎదీ చెప్పలేదు. వ్యాసుడు చెప్పిందే చెప్పాడు , కానీ వ్యాసుడు చెప్పింది చెప్పటం వల్ల నేను ధన్యుణ్ణి అని చెప్పుకుని శాశ్వతుడు అయిపోయాడు. తప్ప నేను ఫలానా అని చెప్పుకుని చెప్పలేదు.

భగవత్ సంభందమైన విషయాన్ని ప్రవచనం చేసే వాడికి ఉండవలసిన ఏకైక ఆ భగవంతుని యందు , నిరతిశయ భక్తి , భగవత్ కధ ను రచన చేసిన ఋషి పాదముల యందు భక్తి,తన గురించి తెలియవలసిన అవసరం లేదు.  ఇప్పుడు ఆయన భారత కధ ని ప్రారంభం చేస్తున్నాడు.

ఒకానొకప్పుడు ఇంద్రునితో సమానమైన బలపరాక్రమము కలిగిన రాజు వసువు అనే పేరుకల రాజు చేది రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. లోకంలో ఉండే మంచివారి చేత కీరితింప బడిన వాడు. ఆయన కూడా వేట నెపం మీద అడివికి వెళ్ళాడు. వెళ్లి జంతువులని వేటాడాడు. ఒక ఆశ్రమం లోకి వెళ్లి అక్కడ తపస్సు చేస్కున్తున్నటువంటి ఋషులని చూశాడు,

ఏముంటుంది ఆశ్రమం లో తాటాకుతో నేశిన కప్పు లేదా జనుముతో నేసిన కప్పు, వెదురుతో కట్టి మట్టితో అలికిన గోడలు, కర్రతో చేసిన ఒక ఆచమన పాత్ర, ఏదో కొద్దిగా కావలసిన సంబారములు, ఇన్ని పువ్వులు ఇన్ని పత్రాలు, కాస్త తేనే , నాలుగు పళ్ళు, ఇన్ని దుంపలు తప్ప ఇంకా భోగ వస్తువు అనేది ఏదీ ఉండదు.

ఇప్పడు రాజుకు నిర్వేదము కలిగింది. చేది రాజ్యాన్ని పరిపలించాను , ఇంద్రుడితో సమానం అనిపించుకున్న వాడ్ని , ఇంత బలపరాక్రమాలు ఉన్న వాడిని, కానీ ఏమిటి నేను సాధించింది, అంతపురాల్లో తిరిగాను , చలువరాతి మేడల్లో ఉన్నాను, హంస తూలికా తల్పాల మీద పడుకున్నాను , కానీ శాంతి ఒక్కటే లేదు. ఎప్పుడూ మనసులో బెంగే , మనసులో ఏదో పీడ గురించినటువంటి ఆలోచనే, ఈయనో పరమేస్వరున్ని ఒక్కణ్ణి నమ్ముకుని , ఇంత తేనే నాలుగు పళ్ళు ఇన్ని పువ్వులు , నాలుగు దుంపలు ఇంత పత్రీ పెట్టుకుని , హాయిగా ఈ కుటీరo లో ఈ ఆశ్రమం లోఎంత శాంతి తో ఉన్నాడు.

నేను రాజ దండం పట్టుకుంటే ,నా చాటున కొట్టుకుంటున్నారు అందరు. ఈయన అలా కుర్చుని , ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుంటే, సహజంగా జాతి వైరం ఉన్న జంతువులూ ,జాతి వైరాన్ని మరిచి చెలిమి చేసి తిరుగుతున్నాయి, ఈయన తపః ప్రభావానికి , ఇది మనసు శాంతిగా గడపటం అంటే ఇది.

ఏమిటి నేను పొందింది ఆ రాచ రికంలో ,ఆ ఐశ్వర్యం లో  వద్దు అని , నేను చేసింది నాకు దేనికి పనికి వచ్చింది అన్న భావన కలిగింది. కలిగి ఆయన కూడా శైన్యాన్ని దూరం గా పెట్టేసి , ఆ అస్త్రాలు శస్త్రాలు అవతల పారేసి, వీటి గొడవ ఇక వద్దని , ప్రశాంతం గా కుర్చుని తపస్సు చేస్కోవటం మొదలుపెట్టాడు.

చాలా చిత్రమైన విషయం కదండీ, మార్పు రావటాన్ని మాట్లాడుతుంది భారతం అని మీరు గుర్తుపట్టాలి. ఇప్పడు ఆయనదగ్గరకి దేవతా గణములతో కూడినటువంటి వాడై ఇంద్రుడు వచ్చాడు , వచ్చి ఒక గొప్ప విమానాన్ని ఒక దాన్ని ఆయన దగ్గర పెట్టాడు.  ఉన్నవి కాకా కొత్త వి ఇచ్చాడు, ఇచ్చి అన్నాడు నీవు నాకు స్నేహితుడవు. కేవలం భూమి మీద గొప్పతనం కాదు ఈ విమానం లో నువ్వు స్వర్గ లోకానికి వస్తావు.

కాసేపు ఒకటి రెండు రోజులు ఉండి వెళ్ళు, ఇప్పడు ఇంద్రుడు ఈయన శాంతికి మించి ఇవన్ని ఇస్తున్నాడు , ఇప్పుడు శాంతి ఉంటుందా , ఇంకా కొత్త అల్లర్లు మొదలవుతాయా ? కొత్త అల్లరే ప్రారoభం అవుతుంది. బాహ్యం లో గొప్ప వైభావాన్నే కృప చేస్తున్నాడు.

ఇప్పడు ఇంద్రుడు ఒక దివ్య విమానం తో పాటు నీ శరీరానికే ఒక దివ్యత్వం ఇచ్చేస్తున్నాను అన్నాడు. వాడని పద్మాలతో కూడిన మాల ఒకటి నీకు ఇస్తున్నాను, అది వేస్కుని ఉంటె నీకు శత్రువులైన రాజులు, నీ మీద విడిచి పెట్టె బాణములు నీ శరీరానికి వచ్చి తగలవు, అది నిన్ను అలా కాపాడుతుంది, ఆ పద్మాలు ఎన్నటికీ వాడిపోవు,అలాగే అవి ఎప్పుడూ గుబాళిస్తూ ఉంటుంది, అటువంటి మాల ఇస్తున్నాను.

దీనితో పాటుగా దుష్ట శిక్షణ , శిష్ట రక్షణా చెయ్యటానికి ఒక వెదురు కర్ర ఒకటి ఇస్తున్నాను, అదొక దివ్యమైన కర్ర. కాబట్టి ఇవన్నీ ఇస్తున్నాను . కాబట్టి నువ్వు చక్కగా హాయిగా కాలం గడుపు అన్నాడు. ఇప్పుడు ఆయన దేవేంద్రుడు, ఏ సంవత్సరం లో ఏ తిధి నాడు తనకి ఇవన్ని ఇచ్చాడో జ్ఞాపకం పెట్టుకుని, ఆ తిధి నాడు ఒక ఉత్సవం చేస్తూ ఉండే వాడు.

ఈ విమానాన్ని , ఈ మాలని , ఈ వేనుస్టి ఇంద్రుడు నాకు కృప చేసిన రోజని , ఇంద్రోచ్చవము అని చేస్తుండే వాడు. ఈయన్ని చూసి ఈ ఇంద్రోచ్చవాన్ని పక్కన ఉన్న రాజులు కూడా ప్రారంభం చేసారు , చిత్రం ఏమిటంటే, పరమేస్వరున్ని ఉద్దేసించి ఇంద్రుణ్ణి ఇద్దేసించి ఈ ఇంద్రోచ్చవం ఎవరు చేస్తారో,అటువంటి రాజులందరికీ కుడా ఆయుర్దాయం పెరుగుతుంది. సంతతి వృద్ధి లోకి వస్తారు.

ఎప్పుడూ కుడా వారు పరిపాలించే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. కాబట్టి ఆ ఉత్సవం చేసి అందరూ సుఖముగా ఉన్నారు. ఆ ఇంద్రుడు ఇచ్చిన వరముతో ఈ వసువుకి బృహద్రదుడు , మణివాహనుడు, సౌబలుడు , యదువు , రాజన్యుడు అనబడే ఐదుగురు కుమారులు జన్మించారు. పరమ సంతోషం గా ఉన్నాడు , ఇంద్రోత్సవం చేస్తున్నడు , పక్క రాజులు కూడా నేర్చుకున్నారు. ఆనందంగా కాలం గడిచి పోతుంది.

ఈ కాలం గడిచి పోతున్న రోజులలోనే ఒక చిత్రమైన సంఘటనల పరంపర ఒకటి జరిగింది. ఈయన రాజధాని నగరానికి చాలా దగ్గరలో సూక్తి మతి అని ఒక నది ప్రవహిస్తూ ఉండేది. సాధారణగా రాజుగారి కోటకి చాల దగ్గరలో ఏదో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. కందకాలలో నీటిని నింపటానికి, తోటలో చెట్ల కి నీరు పెట్టటానికి నది ఒడ్డునే కోట కడతారు, కాబట్టి అక్కడ ఆ శుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉంది.

నదిని స్త్రీ వాచకం తో పిలుస్తారు, సముద్రాన్ని పుం వాచకం తో పిలుస్తారు. ఈ నది అలా ప్రవహిస్తూ వెళ్తుంటే, ఆ నది యొక్క అందచందాలని చూసింది ఒక పర్వతం, ఆ పర్వతం పేరు కోలాహలము. ఆ పర్వతానికి నది నచ్చింది. ఈవిడ మీద మనసు పెంచుకున్నాడు. అలా ఉంటుందా లోకం లో అని మీరు అనుకోకూడదు, జీవుడు అని ఒకడు ఉంటాడు. అసలు యదర్దమునకు జీవుడు సుఖ దుఃఖాలని అనుభవించటానికే శరీరం వస్తుంది.

ఈ శరేరాన్ని ఈశ్వరుడు ఎలా ఇస్తాడు అంటే , పాపం తియ్యాలి , పుణ్యం తీసేయ్యాలి. ఈ రెండు ఎలా తీస్తాడు? శరీరాన్ని ఇస్తారు , ఇచ్చి జీవుణ్ణి ఇందులో పెడతాడు. జీవుడు కనపడదు, శరీరం కనిపిస్తుంది. వీళ్ళు జీవుడు స్థాయి లో మాట్లాడుతున్నారు అని మీరు అర్థం చేస్కోవాలి. అందుకని ఈ కోలాహలం అన్న పర్వతానికి , శుక్తి మతి అన్న నది నచ్చింది.

ఆ కోలాహలం అనే పర్వతం అమాంతం లేచి వచ్చి , ఈ శుక్తిమతి అనే నదికి అడ్డంగా కూర్చుంది. అనగా స్త్రీ పురుష సంభందం గా అనుభవించింది అని ఒక మాట అంటే దోషం ఏమి లేదు. కానీ బలత్కారము ఆ నదిని అనుభవించింది ఆ కోలాహలం అనే పర్వతం. ఆ శుక్తిమతి పొందిన పరితపాన్ని రాజు అర్థం చేస్కున్నాడు. రాజు అంటే ఎవరు , క్షితి నాధుడు. లోకంలో ఏ జీవికి బాధ కలిగినా ఆయన తీర్చాలి. అందుకని ఆయన వెళ్లి ఆయన కాలు తో తన్నాడు కోలాహలo అన్న పర్వతాన్ని, అది ఎగిరి ఎక్కడో పడింది.

ఆ వసువు కి ఉన్న బలం అలాంటిది. ఆయన ఇంద్రుడు ఇచ్చిన విమానం లో పైన తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన్ని ఉపరిచర వసువు అని పిలిచారు. ఆ ఉపరిచర వసువు కాలితో తంతే ఆ కోలాహలం అన్న పర్వతం ఎక్కడో పడింది. అంటే మీరు ఒకటి గమనించాలి. ఏదో కధ కింద చదవటం కాదు. రాజు అనగా ఎంత ధర్మాన్ని పాటించి ప్రాణుల యొక్క బాధ ని చూస్తూ ఉంటాడో, సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని రాజు ఎలా చూడాలో చెప్తోంది.

ఆ పర్వతo ఆ నదితో సంఘమించడం చేత ఆ నదికి ఒక కొడుకు పుట్టాడు, ఒక కూతురు పుట్టింది. వాళ్ళు మనుష్య శరీరం తో పుట్టారు , ఇది ఈశ్వరాజ్ఞ. ఇప్పుడు ఆ పుట్టిన కొడుకు పేరు సుపదుడు. ఆ పుట్టిన ఆడపిల్ల పేరు గిరిజ . ఆ నది అన్నది మహానుభావుడు ఆ ఉపరిచర వసువు వచ్చి ఆ కోలాహలం అన్న పర్వతాన్ని కాల్తో తన్నాడు కాబట్టి ఆ పర్వతం ఎక్కడో పడింది. నాకు ఆ కోలాహలం అన్న పర్వతం వల్ల ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. వీళ్ళని రాజుకి ఇచ్చేస్తాను అని రాజుకి ఇచ్చేసింది.

రాజు ఈ గిరిక యొక్క అండ చందాలు చూసి ఆమెని పెళ్లి చేస్కున్నాడు. ఈ పిల్లవాడు ఉన్నదే సుపదుడు వీడిని తన సేనాపతిగా నియామకం చేసాడు. మీరు ఇక్కడ కొంచం విశాల హృదయం తో వినవలసి ఉంటుంది. వ్యాసుడు , నన్నయ గారు ఇంత తక్కువగా రాయవలసిన అగత్యం లేని వాళ్ళు అన్న పవిత్ర హృదయం తో వినవలసి ఉంటుంది.

ఈ గిరిక అందచందాల మీద రాజు మనసు నిలబడింది. ఎప్పుడు నిలబడింది , ఆమె రుతుమతి అయ్యి ఉన్నది ఒకసారి, అప్పుడు ఉపరిచర వసువు యొక్క పితృదేవతలు పిలిచి  నీ భార్య ఋతుమతి అయ్యి ఉన్నది , అందుకని నీవు వెళ్లి ఆమెకి మంసాహరమును తెచ్చి పెట్టు.









Thursday, September 25, 2014

ఆదిపర్వం 16

ఇప్పుడు జరకత్కారుడు , జరత్కారువు పెళ్లి చేస్కున్నారు. ఇప్పుడు  జరత్కారువు కత్తి మీద మనిషి ఎలా నడుస్తాడో , అలా రేయనక పగలనక ,భర్తని అనువర్తిస్తూ కాలం గడుపుతుంది. అపారమైన అనురాగం తో ఆయన ని అనువర్తించిన కారణo చేత, భర్త యొక్క అనురాగమును పొందినదై ఆయన యొక్క అనురాగము యొక్క ఫలితముగా ఆమె గర్భం దాల్చింది. ఇప్పుడు ఆమె గర్భం తో ఉన్నప్పుడు ఎలా ఉందొ చెప్తున్నారు ననయ్య గారు, సూర్యుడు అనే బిడ్డను తూర్పు దిక్కు అన్న కాంత ఎలా ఉంటుందో గర్భిణి అయిన జరత్కారువు అలా ఉందిట.  ఇక్కడ ఈవిడ గర్భం పండి పిల్లడు పుడితే పాములకి అలుముకున్న చీకట్లు పోతాయి. జరత్కారు వంశం లో ఒక్క వేరు పట్టుకుని వేలాడుతున్న తాత తండ్రులు ఊర్ధ్వ లోకాలకి వెళ్ళిపోతారు. అందుకని పూర్వ దిక్కుతో పోల్చారు ఆమె ని.

ఒక నాడు ఆయన కృష్ణా చీనాన్ని వేస్కుని భార్య తోడ మీద తల పెట్టుకుని , నిద్ర పోతున్నాడు. సూర్యాస్తమయం అయిపోతుంది, ఆశ్రమం లో అందరూ సంధ్యా వందనం చేస్కున్తున్నారు. సంధ్యా వందనం అత్యంత ప్రధానం. సూర్యాస్తమయ సమయం లో ఎట్టి పరిస్థితుల్లో నిద్ర పోకూడదు. కాబట్టి నిద్రపోతున్నాడు ఒక తప్పు , సంధ్యా వందనం చెయ్యట్లేదు ఇంకో తప్పు.

లేపకపోతే వేళకి సంధ్యావందనం చెయ్యాలి కదా. చేస్తానని నీకు తెలుసు కదా , నేను నిద్రపోతున్నాను అని తెలిసి కూడా నన్ను లేపక పోవటం నన్ను అగౌరవ పరచటం కాదా?మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపో అంటే. 
రెండు నిద్రపోతున్న వాడిని నిద్ర లేపటం కన్నా మహా పాపం ఈ లోకం లో ఇంకొకటి లేదు. అందుకే నిద్ర పోతున్న వాడిని నిద్ర లేపితే ధర్మ కార్యం చెప్పి నిద్ర లేపాలి. యెదీ చెప్పకుండా నిద్ర లేపితే , మహా పాపాన్ని తీస్కెళ్ళి నిద్ర లేపిన వాడి ఖాతా లో వేస్తారు. 

ఇప్పుడు ధర్మ కార్యం కోసం లేపితే తప్పులేదు , కానీ నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావు అని కోప్పడితే జరత్కారుడు? సరే అలా కోప్పడినా పరువలేదు, లేపుతాను , ఎందుకని ఆయన ధర్మం నిలబెట్టిన దానిని అయ్యాను. కాబట్టి నిద్ర లేపెస్తాను , ఆయన్ని నిద్ర లేపి ఆశ్రమం లో అందరూ సంధ్యా వందనం చేస్కున్తున్నారు. నువ్వు కుడా సంధ్యా వందనం చేస్కోవాలి కదా లేవండి నిద్ర అన్నది. అంటే ఆయన దిగ్గున నిద్ర లేచాడు. అంటే ప్రతి చిన్న విషయాన్నీ ఎందుకు చుపిస్తారంటే , ధర్మం ఎంత గొప్పదో తెలియ చెప్పటానికి. 

ఇప్పుడు ఆయన లేచి అన్నాడు ,దేనికి లేపావు నిద్రపోతున్న వాడిని? నిద్రపోతున్న వాడిని లేపటం తప్పని నీకు తెలియదా ? అంటే నా పట్ల అగౌరవం కాదా అన్నాడు. ఆవిడ అంది కాదు ధర్మం చెడిపోతుంది. అవతల సూర్యాస్తమయం అయిపోతుంది . సంధ్యావందనం చెయ్యాలి మీరు అన్నది. కాబట్టి నేను మిమల్ని నిద్రలేపక పోతే మీ ధర్మం పాడవుతుంది కాబట్టి నిద్ర లేపాను , ఇందులో అగౌరవo ఎక్కడ ఉంది. అన్నది.
ఆయన ఏమన్నాడో తెల్సా  ఏమిటి నేను నిద్రపోతుండగా నేను లేచి సంధ్యావందనం చెయ్యక ముందు సూర్యుడు అస్తమించడమే? జరత్కారుడు నిద్రపోతున్నాడు , కాబట్టి నేను అస్తమిస్తే జరత్కారుడి ధర్మానికి భంగం వస్తుంది అని సూర్యుడు అలా ఉండిపోతాడు అంతే  అన్నాడు జరత్కారుడు. నా తపో ప్రభావం అటువంటిది, నేను నిద్ర లేచే వరకు సూర్యుడు అస్తమించడు అన్నాడు జరత్కారుడు. నా శక్తిని సూర్యుడు అంత లేక్కకట్టినవాడు.

అటువంటి సూర్యుడు నా శక్తి ని లెక్క కట్టి అస్తమించలేదు , నువ్వు మాత్రం సూర్యుడు అస్తమిస్తాడు నిద్రలే అని నన్ను నిద్రలేపావు. అంటే నా శక్తి ని అంత తక్కువ అంచనా వేసావు , ఇది నాకు అగౌరవo కాదా? కాబట్టి నువ్వు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపో నేను ఆశ్రమానికి వెళ్తాను అన్నాడు. ఇంకా చెప్పాడు నీ కడుపులో అగ్నిహోత్రుడు , సూర్యుడు కలిసిన తేజోవంతుడు పెరుగుతున్నాడు. ఆ బిడ్డడు చాలు మన జీవితాలు తరించిపోతాయి అన్నాడు.

అస్తీకుడు అని పేరున్న పిల్లవాడు ఆ యొక్క జరత్కారువు యొక్క గర్భం లోనించి పుట్టాడు.  ఆయన పూర్ణమైన తేజస్సు కలిగినవాడు , అసలు పాపము తనకి అంటని వాడు. భవభందములకు చిక్కని వాడు , పుడుతూ నే అటు తల్లి వైపు వాళ్ళని ఇటు తండ్రి వైపు వాళ్ళని తరింపచేసిన వాడు. ఎందుకని ఇప్పుడు జరత్కారుడికి పిల్లలు పుట్టారు కాబట్టి ఆ ఒంటి వేరు పట్టుకుని వేలాడుతున్న వారు ఉర్త్వ లోకాలకి వెళ్ళిపోయారు. ఇటు జరత్కారువు కి పిల్లడు పుట్టాడు కాబట్టి సర్పయాగం లో పడిపోయే పాములైన మేనమామ లు అందరు బతికి పోయారు.

కాబట్టి పుట్టీ పుట్టకుండానే ఇరువంశాలని ఉద్ధరించిన మహా పురుషుడు , ఆస్తీకుడు. ఆయన చవనుడి యొక్క కుమారుడైన ప్రమతి దగ్గర విద్యాభ్యాసం అంతా చేసాడు. విద్యాభ్యాసం చేసి సర్వ శాస్త్రములు తెలుసుకున్న తరువాత, ఈయన పరమ సంతోషం తో పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఇప్పుడు కధ ఇంకోవైపుకి వెళ్తుంది.

ఇప్పుడు ఉదంకుడు , జనమేజయుడి దగ్గరకి వెళ్లి తన కోపాన్ని జనమేజయుడికి ఆపాదించాడు.
ఇప్పుడు జనమేజయుడు మంత్రులతో అన్నాడు, ఈ ఉదంకుడు నా తండ్రిని తక్షకుడు చంపాడు అంటున్నారు , అసలు ఆ కధ ఏమిటో చెప్పండి అన్నాడు.

అప్పుడు ఆ మంత్రులు లేచి అన్నారు , నీ తండ్రి అయిన పరిక్షిత్తు , విరాట రాజు కుమార్తె అయిన ఉత్తర ని అభిమన్యుడు  వివాహం చేస్కున్నప్పుడు, వారిరువురికి పుట్టిన వాడు  పరీక్షిత్. ఆ పరీక్షిత్ నీ తాత అయినటవంటి  అర్జునిడి తో సమానం, వంశం లో పోలికలు ఎలా వస్తాయి అంటే ఎక్కడో ముత్తాత అయిన పాండురాజు కి వేట అంటే ఇష్టం , అదే ఇష్టం పరీక్షిత్  కి ఉంది, అందుకే ఆ వేటకు వెళ్లి తపస్సు చేస్కుంటున్న ఋషి మెడలో చచ్చిపోయిన పామును వేసాడు.


పరిక్షితుడు 60 సంవత్సరములు ధర్మార్థ కామములు తప్పకుండా రాజ్యం చేసినటువంటి మహానుభావుడు. అటువంటివాడు , నీ వంటి సత్పుత్రుణ్ణి కన్నాడు. అటువంటి వాడు సింహాసనం మీద కుర్చుని, పాద పీఠo మీద పాదములు పెడితే , అన్య  దేశ రాజుల యొక్క కిరీటములు నీ తండ్రి , పాదముల యందు తలలు వంచి నమస్కరిస్తే వాళ్ళ కిరీటముల లోని మణులు నీ తండ్రి పాదములకు నీరాజనములు పట్టేవి.  అంత కీర్తి గడించిన మహానుభావుడు.

కానీ మీ వంశం లో ఉన్నటువంటి మీ ముత్తాత పాండురాజుకు ఉన్నటువంటి, బలహీనత లాగే మీ తండ్రి కూడా వేటాడటం కోసం అని చెప్పి, అరణ్యం లోకి ప్రవేశించి వేటాడుతుండగా ,ఒక లేడి కనిపించి ఆ లేడిని ఎలా అయినా వేటాడి పట్టుకోవాలని, తన పరివారం అంతా వెనకపడిపోయినా తాను ఒక్కడే ఉండి, ఆ లేడి ని తీస్కోస్తానని ఆ లేడి వెంట పరిగెడుతూ , బాణాన్ని విదిచిపెడుతూ , బాణం తగిలన లేడి పరీక్షిత్ కి దక్కకుండా , శమీకుని  యొక్క ఆశ్రమం లోకి వెళ్ళిపోతే, ఆ శమీకుని ఆశ్రమం లోకి వెళ్లి ,కన్నులు మూసుకుని అంతర్ముఖుడై ,ధ్యానం లో ఉన్న శమీక మహర్షిని , ఇటు గా లేడి పర్గేట్టిందా అని శామీకున్ని అడిగితే , బహిర్ముఖుడు కాదు కాబట్టి, జవాబు చెప్పక పోతే ఉద్దతిచేత ఆకలి చేత , దప్పిక చేత కలిగిన టువంటి ప్రకోపం చేత చచ్చి పోయిన పాముని ధనస్సు యొక్క మూపుతో




 ఆ శమీకుని మెడలో వేస్తె ఆ శమీకుని కుమారుడు అయిన శృంగి కి ఈ విషయం తెలిసి నా తండ్రిని ఇంత అగౌరవ పరుస్తాడా దేశమునేలే రాజు అని నేటికి ఏడవ రోజు , తక్షకుని యొక్క విషాగ్ని చేత , తండ్రి మూపురమున విష సర్పాన్ని వేసిన పరీక్షిత్ తక్షకుని యొక్క అగ్ని జ్వాలల యందు కాలి బూడిద అవుగాక అని శాప వాక్కు విడిచి పెట్టి తండ్రి దగ్గరకి వచ్చి, అభివాదం చేసి గోత్ర నామాలు చెప్పుకుని , భూమి మీద పడి నమస్కరిస్తున్న సమయంలో ఆ మహానుభావుడైన శమీకుడు కన్నులు విప్పి , తన కొడుకైన శృంగిని చూసి ఏ రా  బాధ గా ఉన్నావ్ అని అడిగితే, నాన్న గారు మీ మోపు మీద పరీక్షిత్ మృత సర్పాన్ని విడిచిపెడితే నేటికి ఏడవ నాడు ఆయన మరణించాలి అని శాప వాక్కు విడిచి పెట్టాను అని చెప్తే.

శమీకుడు చూసి ,ఎంత పని చేసావురా ! చంద్ర వంశం లో పుట్టిన మహా పురుషుడు , రాజ్యమును ధర్మము గా పరిపాలిస్తున్న వాడు, అందరినీ కాపాడే ప్రభువుని , నీ యొక్క వ్యగ్రమైన వాక్కు చేత అర్థాయుశ్కున్ని చేసి పడగోడుతున్నావ్ ! కోపం అనేది రానేకూడదు , కోపం వస్తే ఎన్ని ఉపద్రవాలో వస్తాయి అని ఆ రోజున శృంగితో శమీకుడు అన్నాడు.

క్రోధము ఆవహించిన వాని యొక్క తపస్సు చెడిపోతుంది. క్రోధము వలన అణిమాది సిద్దులు గుణములు అన్నీ నశించి పోతాయి. క్రోధము ధార్మికమైన పనులు చెయ్య నివ్వదు. క్రోధము ఉన్న వాడు ఇక తపస్వి ఎలా అవుతాడు.
ఓర్పు లేని తపస్సు , అలాగే పరాకుగా ఉండక పోవటం వల్ల ఐశ్వర్యం నిలబడక పోవటం అనేటటు వంటి లక్షణం. ధర్మం విదిచిపెట్టిన రాజుకి రాజ్యం ఎలా నశిస్తుందో. అది పగిలిపోయిన కుండలో పోసిన నీరు కారిపోయినట్టే. ఎంత తప్పు పని చేసావు రా ! అని గౌరముఖుడు అనే ఒక మునిని పిలిచి, నేటికి ఏడవ రోజు మరణించాలని నా కొడుకు రాజుకు శాపం ఇచ్చాడు ,వెంటనే, భద్రతా ఏర్పాట్లు చేస్కుని , మంత్ర తంత్రములు తెలిసున్న బ్రాహ్మణుల్ని పక్కన పెట్టుకుని , ఎంత మాత్రమూ పరాకు లేకుండా, తనకి తను రక్షించుకొమ్మని , పరీక్షిత్ మహారాజుకి నా వాక్కు గా చెప్పండి అని, ఆ గౌరముఖుడనే  మునిని రాజుదగ్గరకి పంపిస్తే, ఆయన వెళ్లి పరిక్షిత్  కి చెప్తే

శమీక మహర్షి , కొడుకు ని అడిగాడు ఆ రోజున, నీ శాపాన్ని వెనక్కి తియ్యలేవా అని . నాన్న గారు నేనేమీ చెయ్యలేను , ఇప్పటికే నేను ఇచ్చిన శాపవాక్కు , తక్షకుడి లో ప్రచోదనం చేసి , బయలుదేరిపోయి ఉంటాడు , కరవటానికి పరిక్షిత్తు ని అన్నాడు. ఆ మాట చెప్పినట్టుగానే , మహానుభావుడు బయలు దేరాడు , బయలుదేరి  గబగబా వచ్చేస్తున్నాడు. వచ్చి ఇంక పరిక్షిత్తు ని కాటు వెయ్యాలి , అది ఏడవ రోజు, ఇంక ఆ ఒక్క రోజు దాటి పోయిoదా, పరిక్షిత్తు బతికేస్తాడు.

ఇప్పుడు పరిక్షిత్తు ఒక పెద్ద ఒంటి స్తంభం మెడ కట్టుకుని , మంత్ర తంత్రములు తెలిసున్న వాళ్ళని పక్కన పెట్టుకుని, ఆయన బోలెడంత మంది వడ్రగుల్ని కార్మికుల్ని పిలిపించుకుని , ఒంటి స్థంబం మేడ కట్టించుకుని, అందులో తన బ్రుత్యుల్ని చుట్టూ పెట్టుకుని , విషాన్ని విరగొట్ట గల మంత్రాలు తెలిసున్న బ్రాహ్మణుల్ని తన వెంట పెట్టుకుని, అందులోనే ఉంటూ , నేను ఏడూ రోజులయ్యే వరకు కిందకు దిగి రానని, కూర్చున్నాడు, కుర్చుని ఉండగా ఏడవరోజు వచ్చింది.

బయలుదేరాడు , ఎవరు , తక్షకుడు ఆయన్ని కరుస్తాను అని. ఈలోగా బ్రహ్మ గారు ఏమి చేసారంటే, లోకంలో పాములు ఎవరిని పడితే వారిని కరిచేస్తున్నాయి, కరిస్తే వాళ్ళు చనిపోతున్నారు. పాము కరిస్తే చనిపోకుండా ఉండ టానికి నేను కశ్యపుడు అనే ఋషి కి పాము యొక్క విషాన్ని విరగొట్ట గల మంత్రాన్ని ఉపదేశం చేస్తాను అని, సాక్షాత్తు గా చతుర్ముఖ బ్రహ్మ గారే కశ్యప ప్రజాపతికి ఉపదేశం చేసారు.

ఆ కశ్యప మహర్షి ఎంత గొప్ప వాడంటే, తక్షకుడు కాటువేసి పరిక్షిత్తు మరనిన్చేలోపు, రాజుని నేను రక్షిస్తాను అని కశ్యపుడు బయలుదేరాడు. ఇద్దరూ బయలు దేరారు , వృద్ద బ్రాహ్మణ వేషం లో తక్షకుడు ఉన్నాడు, కశ్యపుడు వెళ్తున్నాడు , ఇద్దరూ కలుసుకున్నారు , కలుసుకున్న తరువాత , అడిగాడు. ఏమయ్యా నువ్వు ఎవరు ? ఎక్కడికి వెళ్తున్నావు అంటే కశ్యపుడు అన్నాడు

రాజుని ఇవ్వాళా ఏడవ రోజు తక్షకుడు కారుస్తాడు , కరిచినప్పుడు , నేను ఆయన ని విషం పోగొట్టి బ్రతికించడానికి వెళ్తున్నాను అన్నాడు. పిచ్చి వాడా నువ్వు ఆ కోరిక విడిచి పెట్టు , వజ్రాయుధం తగిలిన వాడు బ్రతుకుతాడెమో కాని , తక్షకుడు కరిచిన వాడు బ్రతకడు అన్నాడు. నేనే తక్షకున్ని , నేను ఒక్క సరి కరిస్తే  బూది కుప్ప గా పడిపోతాడు , మనిషి బ్రతికి ఉండటం కాదు. కాబట్టి నువ్వు బ్రతికిన్చాలేవు అన్నాడు. అంటే కశ్యపుడు అన్నాడు బూది కుప్ప గా నువ్వు చేసినా నేను బ్రతికించ గలను అన్నాడు.

అయితే ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది , దాని కొమ్మలు ఎంత వరకు వ్యపించాయో తెలియట్ల, పచ్చటి చెట్టు నేను మొదట్లో కారుస్తాను , బూడిద కుప్ప గా పడిపోతుంది, బ్రతికించు చూస్తాను అన్నాడు. తక్షకుడు . కాటు వేశాడు, అది బూడిద కుప్ప కింద పడిపోయింది చెట్టు. వెంటనే ఈ కశ్యప రుషి , బ్రహ్మ గారు తనకి ఉపదేశం చేసిన మంత్రాన్ని జపం చేసి ప్రయోగించాడు. వెంటనే ఆ మర్రి చెట్టు మళ్ళి వచ్చింది. వచ్చేటప్పటికి  తక్షకుడు ఆశ్చర్య పోయాడు.

అయితే ఈ విషయం హస్తినాపురం లో ఎలా తెలిసింది అంటారేమో , ఒక వ్యక్తి అరణ్యం లోకి వచ్చి ఆ మర్రి చెట్టు ఎక్కి ఎండు  పుల్లలు ఎరుకుంటున్నాడు, అకస్మాత్తు గా తక్షకుడు ఆ చెట్టుని కరవటం లో ఈ వ్యక్తి కుడా కాలి బుడిదైపోయి కింద పడిపోయాడు. మళ్ళి కశ్యప ఋషి మాత్ర ప్రభావం చేత చెట్టుతో పాటు ఆయన కుడా బ్రతికాడు. ఆయన తరువాత పరిగెత్తుకుంటూ హస్తినా పురం వెళ్లి ఈ విషయం అంత చెప్పాడు.

ఇప్పుడు తక్షకుడు అన్నాడు , నేను కాటు వెయ్యటం అనేది , పరమ సత్యం, నువ్వెందుకు ఆయన్ని బ్రతికించాలి అనుకుంటున్నావ్! ఒకటి మహానుభావుడు కాబట్టి బ్రతికిస్తావు. రెండు రాజుని బ్రతికిస్తే , రాజు అపారమైన ధనం ఇస్తాడు. రాజు ఎంత ధనం ఇస్తాడో అంత కన్నా అధికమైన ధనం ఇస్తాను నువ్వు , బ్రతికంచ వద్దు అన్నాడు తక్షకుడు. కశ్యప ఋషి కన్నులు ముస్కుని అంతర్ముఖుడై చూశాడు . రాజుకి మరణము తధ్యము అని తెల్సిపోయింది. ఋషి వాక్కు జరగక మానదు , కాబట్టి ఇప్పుడు తక్షకుడు ఇచ్చిన డబ్బు పట్టుకుని కశ్యపుడు వెళ్ళిపోయాడు.

ఇప్పుడు తక్షకుడు ఈ ఒంటి స్థంభం మేడలోకి లోకి ప్రవేశించాలి, ఇప్పుడు తన సోదరులైన పాముల్ని కొందరిని పిలిచి, మీరు బ్రాహ్మణ కుమారుల వేషాలు వేస్కుని , ఋగ్వేద , యజుర్వేద మంత్రాలు చెప్తూ వెళ్ళండి, కొన్ని పువ్వులు పళ్ళు పట్టుకుని వెళ్లి ప్రసాదం రాజా , నీకు రక్ష గా ఇస్తున్నాము అని చెప్పి ఇవ్వండి. వేదం చదువుతున్న బ్రాహ్మణ కుమారులని చుస్తే రాజు కాదనడు , తీస్కుంటాడు.

అంటే వాళ్ళు అలాగే వెళ్లారు , వెళ్తే రాజు ప్రసాదం , కదా అని పుచ్చుకున్నాడు, ఆయన ఆ పళ్ళు తన చుట్టూ ఉన్నమంత్రులకి ఇస్తున్నాడు.  ఇస్తూ చాలా ధైర్యంగా ఆయన ఆ మంత్రులతో ఒక మాట అన్నాడు. అదిగో సూర్యుడు పశ్చిమ దిక్కున అస్తమిస్తున్నాడు , కాబట్టి ఏడవ రోజు పూర్తయింది , ఇంకా తక్షకుడు నన్నేమి చెయ్యడు. ఇది బ్రాహ్మణ ప్రసాదం. కాబట్టి మీరు తినండి అని వారందరికి ఇచ్చాడు, ఒక పండు తీసి నేను తింటాను అని ఆ పండుని ఇలా విప్పాడు.

విప్పీ విప్పగానే నల్లటి గుడ్లతో ఒక పురుగు , కనపడింది. ఆ పురుగు మెల్లగా ఎర్రటి రక్త వర్ణం తో పాము అయ్యింది.
ఆ పాము తక్షకుడు. అది వెంటనే రాజుని కరచి, పెద్ద స్వరూపాన్ని పొంది, అగ్నిహోత్రాన్ని చిమ్మి అక్కడ ఉన్నటువంటి , మేడని కుడా కాల్చేసి, దూకి పారిపోయింది. అలా నీ తండ్రి చచ్చి పోయాడయ్యా అన్నారు మంత్రులు  జనమేజయుడితో.

ఇప్పుడు జనమేజయుడు చాలా వ్యగ్రత పొందాడు. నిజంగా కూడా తక్షకుడు యుక్తాయుక్త విచక్షణ లేని పాము. ఒక బ్రాహ్మణ వాక్కు ఫలించాలని తక్షకుడు ఇంత పన్నాగం పన్ని, మీ నాన్న ని చంపేసాడు, మీ నాన్న మంచితనాన్ని దేన్నీ పరిగణ లోకి తీస్కోకుండా చంపేసాడు. బ్రాహ్మణ వాక్కు కి అంత గౌరవమ్ ఇచ్చాడుగా నువ్వూ బ్రాహ్మణుల్ని తీస్కొచ్చి యాగం చెయ్యి. యాగం చేసి మొత్తం పాముల సంతతి అంతటినీ అగ్నిహోత్రం లో పారేయి. తక్షకున్ని కూడా పడగొట్టు. కాబట్టి నువ్వు ప్రతీకారం చెయ్యవలసిందే చెయ్యి అన్నారు.

అనగానే అయితే యాగ శాల నిర్మాణం చెయ్యండి అన్నాడు జనమేజయుడు. ఋత్విక్కు ల్ని పిలవండి , నేను యాగ దీక్ష తీస్కున్తున్నాను అన్నాడు. దీక్షా అన్న మాట యాగామునకే వర్తిస్తుంది. కాబట్టి నేను దీక్షితున్ని అవుతున్నాను అన్నాడు. యాగశాల నిర్మాణం చేసారు.

యాగ శాల నిర్మాణం చేసినా , ఇల్లు కట్టినా వస్తూ అన్నది , దాని యొక్క ప్రభావం దానికి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. ఎవరు ఎన్ని మాటలు చెప్పిన , మనం శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళం అయినప్పుడు మనం అలాగే మాట్లాడవలసి ఉంటుంది, అలాగే పాటించ వలసి ఉంటుంది.

అందులో ఒక పౌరాణికుడు , ఒక శాస్త్రము తెలిసున్న మహానుభావుడు వచ్చి జనమేజయుడితో అన్నాడు, ఈ యాగ శాల నిర్మాణం లో దోషం ఉంది, ఈ యాగ శాల నిర్మాణం లో దోషం ఉండుట వలన నువ్వు ఎంత గొప్ప బ్రాహ్మణుల్ని తీస్కొచ్చినా ఎంత గొప్ప యాగ సంబరాలు నువ్వు తీస్కోచ్చినా , ఈ యాగం మధ్యలో ఒక బ్రాహ్మణుడి వలన ఆగిపోతుంది, అన్నాడు

జనమేజయుడు లక్ష్య పెట్టలేదు , లక్ష్య పెట్టకుండా ఆయన ఆ యాగం చెయ్యటం కోసం అని చెప్పి సిద్ధ పడ్డాడు. జనమేజయుడి యొక్క భార్య , కాశీ రాజు యొక్క కుమార్తె అయిన వపుస్టమ. ఆ వపుస్టమ తో కలిసి ,( భార్య లేని వాడు యాగం చెయ్యటానికి అనర్హుడు. ) ఆ సర్పయాగం చెయ్యటానికి కూర్చున్నాడు.

బ్రాహ్మణులూ అందరు కూర్చున్నారు. కుర్చుని ఒక్కొక్క పాము పేరు చెప్పి పిలుస్తున్నారు. ఒక్కొక్క పేరు చెప్పి ఋత్విక్కులు పిలుస్తుంటే బ్రహ్మదండం పడ్డట్టు గా పడిపోతున్నాయి.

ఒక పడగ పాము , మూడు పడగల పాము, మూడు పడగల పాము , తొమ్మిది పడగల పాము పెక్కు తలలు కలిగిన పాములు , పసుపురంగు కలిగిన పాములు , తెల్లరంగు పాములు , ఎర్ర రంగు పాములు, నల్ల పాములు , పొడుగు పాములు , పొట్టి పాములు, లావు పాములు సన్న పాములు , ఇన్ని రకాల పాములు , ఆకాశం లో గిర గిరా తిరుగుతూ విషాన్ని చిమ్ముతూ అగ్నిహోత్రంలో పడిపోయి, తలలు పగిలిపోతుంటే , పెట్టేల్లున శబ్దం చేస్తూ ,అరుస్తూ విషం చిమ్ముతూ అగ్నిహోత్రం లో కాలిపోతుంటే దిక్చక్రమ్ అంతా సర్పముల యొక్క వింత శబ్దములతో నిండిపోయింది ట. 



అలా అందరూ చిత్ర విచిత్రము గా ఇదేమి యాగం అని చూస్తుండగా, ఆకాశం లోంచి రంగురంగుల పాములు , అనేక తలల పాములు వచ్చి ఆ యాగం లో పడిపోయి, అగ్నిహోత్రం లో కాలిపోతున్నాయి. తక్షకుడు భయపడిపోయి, దేవేంద్రుడు ఆయనకీ స్నేహితుడు , వెళ్లి రక్షించు! , రక్షించు!రక్షించు ! అని వెళ్లి ఇంద్రుడి చాటున దాక్కున్నాడు. 

ఇంద్రుడు బ్రహ్మ గారు చెప్పినట్టు కొన్ని పాములు బ్రతుకుతాయి అని విని ఆగు తక్షకా ! కంగారుపడకు , ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ యాగాన్ని ఆపుతాడు , నువ్వు బ్రతుకుతావు, బెంగాపెట్టుకోకు అలా కూర్చో అని ఆ తక్షకున్ని ఇంద్రలోకం లో కూర్చోపెట్టాడు. 

ఇంతలో మహానుభావుడు వాసుకి గబ గబా పరిగెత్తుకుంటూ చెల్లెలు దగ్గరకి వెళ్ళాడు. వెళ్లి అమ్మ ఈ జనమేజయుడు చేస్తున్న యజ్ఞం లో మా సోదరులమైన మా జాతి అంతా పడిపోతుంది , ఇప్పటికే కొన్ని లక్షల పాములు కాలిపోయాయి. వెంటనే నా మేనల్లుడైన ఆస్తీకున్ని పమ్పించమ్మా, నీ పేరు జరత్కారువు, నిన్ను జరత్కారుడికి ఇచ్చి వివాహం చేసింది, మీ ఇద్దరికీ పుట్టే పిల్లాడి వల్ల, సర్ప జాతిని కాపాడ టానికి , కాబట్టి వెంటనే నీ కొడుకును పంపు అన్నాడు. 

మీరు బెంగ పెట్టుకోకండి , పడిపోయిన కద్రువ పుత్రులు పడిపోయారు , మిగిలిన వారిని రక్షించే భారం నాది అన్నాడు ఆస్తీకుడు బయలుదేరి, జనమేజయుడు చేస్తున్న ఆ సర్ప యాగ శాల లోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే మహా తేజోమూర్తి ఆ ఆస్తీకుడు నడిచి వస్తు ఉంటె, రజూ ఋత్విక్కులు అందరూ ఆయన వంక చూస్తున్నారు.  


ఆస్తికుడు అన్నాడు , మహానుభావా జనమేజయ, నీవు చంద్రవంశం లో పెద్ద రాజువై , ప్రజలందరినీ దయతో, ధర్మంతో పరిపాలన చేస్తూ , ఆనాడు ధర్మరాజు , నాభాగు , భగీరధుడు, దశరధుడు, మాంధాత , రాముడు, రఘుమహారాజు , అర్జునుడు ఎలా పరిపాలన చేసారో అలా పరిపలించావయ్యా. 

నాయనా! ఈ భూమండలం అంతటికీ నువ్వు చక్రవర్తి వి అయిన తరువాత, నీ రాజ్య పరిపాలన లో నువ్వు అనేక యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ రుత్విక్కులని పిలిచి నువ్వు ఇచ్చిన సంభావనల చేత ఆ యజ్ఞ దీక్షితులైన రుత్విక్కులకి నువ్వు ఇచ్చిన దక్షిణ ల చేత, బ్రాహ్మణులూ అంత ఎంతో తృప్తి పొంది ఉన్నారు . (ఈ స్తోత్రం లో ఒక రహస్యం ఉంది , దాన్ని చివర మీకు చెప్తాను ). 

నువ్వు ఇక్కడ నిమంత్రణం చేసిన ఋత్విక్కులు ఉన్నారే , వాళ్ళు ఆగ్రహించినా అనుగ్రహించినా, ఏదైనా చెయ్య గలిగిన టువంటి సమర్ధులు. ఒకనుకోకనాడు బ్రహ్మ గారు చేసిన యజ్ఞo ఉందే పూర్వ దిక్కున , ఆ చేసినటువంటి , యజ్ఞం ఉండే ఆ యజ్ఞం కన్నా , ఇవ్వాళ నువ్వు చేసే యజ్ఞం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఋత్విక్కులు గొప్పవాళ్ళయ్యా! ఓ కురువంశ వర్ధనా నువ్వు చేసే ఈ యాగం ఎంత గొప్పదో తెల్సా , ఒకనాడు మహారాజైన నలుడు చేసిన యజ్ఞం, ధర్మ రాజు చేసిన రజసూయ యాగం, ప్రయాగ లో బ్రహ్మ గారు చేసిన యజ్ఞం , పాశం చేతిలో పెట్టుకునే వరుణుడు చేసిన యజ్ఞo, కృష్ణుడు చేసిన యజ్ఞం, చంద్రుడు చేసిన యజ్ఞం , నువ్వు చేసిన యజ్ఞం , ఇవయ్యా యజ్ఞాలంటే. 

ఎంత గొప్ప యజ్ఞం చేశావయ్యా , అసలు యజ్ఞాలు అంతటికి నీ యజ్ఞం ఎంత గొప్పదో తెలుసా! ఒక మహానుభావుడు  ఇక్కడ కుర్చుని ఉన్నాడు ఈ యజ్ఞం లో .  మహానుభావుడు , అపారమైన విద్వత్తు కలిగినవాడు, మూడు లోకముల యందు ఖ్యాతి గడించిన వాడు , కృష్ణ ద్వైపాయనుడు అన్న పేరు కలిగిన వాడు, వేదవ్యాసుడు , శిష్య ప్రసిష్యులతో వచ్చి ఈ యాగం లో కుర్చుని ఈ యజ్ఞాన్ని అంతటిని పరీక్షిస్తున్నాడు. అంతటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు అంటే ఈ యాగం ఎంత గొప్పదో వేరే చెప్పాలా నాయన అన్నాడు. 

నువ్వు చేసే యాగాలలో అగ్నిహోత్రుడు సంతతము నీ పక్కన కుర్చుని హవిస్సులు  స్వీకరిస్తూ ,కుడిపక్కకి తిరిగేతతువంటి జ్వాలలు కలవాడై. నీ కోర్కెలను ఈడేర్చే వాడు అగుగాక ! నీవు అంత కీర్తి వంతుడవు అవుగాక! అని ఆశీర్వచనం చేసాడు. 

ఇంత కీర్తి కల వంశం లో పుట్టిన వాడివి , ఇంత దయాళువు వి, ఇంత పేరు తెచ్చుకున్నవాడివి, ఇంతమంది పెద్దల్ని కూర్చోపెట్టి యాగం చేస్తున్నవాడివి. ఇంత దాన ధర్మాలు చేస్తున్న వాడివి, ఏదో నిమిత్తం లేకుండా బొంది పోతుందా. ఏదో కారణానికి తండ్రి పడిపోవాల్సి వచ్చింది పడిపోయాడు. ఆ నింద కాక పోతే వేరొ కారణానికి వెళ్ళిపోతాడు. దానికి మనసులో క్రౌర్యమ్ పెట్టుకుని, నీ కీర్తికి మచ్చ తెచ్చుకుంటావా ? చెయ్యవచ్చా ఇలాంటి యాగాలు. 

జనమేజయుడు అన్నాడు మహానుభావా  నీ దివ్యమైనటు వంటి వాక్కులు , తేజస్సు, చుస్తే చాల సంతోషం గా ఉంది అయ్యా నీకు ఏమి కావలి చెప్పు ఇచ్చేస్తాను అన్నాడు. వెంటనే ఆస్తికుడు అన్నాడు " నీవు నా బంధువులు అయిన సర్పములన్ని ఇలా కాలి పోయి మరణించ కుండా, వాళ్ళ మనోవేదన తీరేటట్టు గా నేను సంతోషించే టట్టు గా నీవు దయతో, ప్రాణులపట్ల కక్ష పెంచుకోవటం అనేదే విషం, ప్రాణుల పట్ల దయ పెంచుకోవటమే అమృతం. కాబట్టి నాయనా నువ్వు వేరుగా అమృతం తాగాక్కర్లేదు, దయ తో ఉండటమే అమృతం తాగటం. కాబట్టి ఆ కక్ష అన్న దాన్ని పక్కన పెట్టి , దయా అన్న దాన్ని నీ మనసులోకి తెచ్చుకో. 

ఎందుకు ఇంత మందిని కాల్చాలి . ఒకణ్ణి చంపినందుకు ఇంతమందిని చంపటమా అన్న భావన తో అలోచించి నీకు చంపబుద్ధి వెయ్యదు. కాబట్టి పరమ దయతో ఈ యజ్ఞాన్ని ఇంతటితో ఇంక ఆపు చేసేయి. చనిపొఇన వాళ్ళు చనిపోయారు ఇంక ఇప్పటికైనా ఆపితే , నా బంధు కులం, నా తల్లి వైపు బంధువులు సర్పాలు , మిగిలిన వాళ్ళు సంతోషిస్తారు. 

ఇటువంటి మహా మూర్తి , తేజోశాలి అయిన వాడు తపో మంటపం లోకి వచ్చి, నాకు ఇది కావలి అని అడిగితే అది ఇచ్చినంత మాత్రం చేత అక్షయమైన ఫలితాలని ఇస్తుంది. అంతటి మహానుభావుడు వచ్చి యాచించటమే గొప్ప, అటువంటి వాడు వచ్చి యాచించ టం కన్నా అదృష్టం ఏమి ఉంటుందయ్యా. ఇవ్వాళా నువ్వు యాగం ఒకందుకు మొదలుపెట్టావ్ , నీ అదృష్టం పండి ఆయన ఒకందుకు వచ్చాడు. ఆయన మనసులో పుట్టిన కోర్కె తీర్చి నువ్వు ఈ యాగం ఆపేయి. ఆయన మనసు సంతోషించినదా నువ్వు అపారమైన పుణ్యాన్ని పొందుతావు. 

కొడుకు అంత పుణ్యం చేసాడా , నీ తండ్రి ఉన్నత గతులు పొందుతాడు. ఇంక ఇంతకన్నా ఏమి కావలి , కాబట్టి ఆపెసేయి యాగాన్ని అన్నాడు. వెంటనే ఆ యాగాన్ని ఆపు చేసారు. కానీ అప్పటికే అక్కడ ఉన్న ఋత్విక్కులు చెప్పిన మంత్రాలకి తక్షకుడు అగ్నిహోత్రాన్ని వెదజల్లుతూ , ఇంద్రుడి సింహాసనం నించి వేరైపోయి, ఆయన ఆ మంత్రం శక్తి కి ఆగలేక , వచ్చి హోమ గుండం లో పడిపోతున్నాడు. 

వెంటనే ఆస్తికుడు అలా ఉండు నువ్వేమి భయపడక్కర్లేదు, అందులో పడక్కర్లేదు యాగాగ్ని యందు అన్నాడు. ఆస్తికుని మాట యొక్క ప్రభావానికి , తక్షకుడు , అగ్ని యందు పడకుండా తప్పుకుని పక్కకు పడ్డాడు. పడి బ్రతికి పోయాడు, ఆ కారణం చేత ఇప్పటికి ఎక్కడ ఆస్తీకుని యొక్క కధ ని చెప్పుకుంటారో, ఎక్కడ ఆస్తీక మహర్షిని తలుచుకుంటారో, అక్కడ ఎంత విషపూరితమైన సర్పములు తలలు దిన్చేస్తాయిట. 

ఆస్తీకుని కధ విన్నవారికి, భక్తితో ఆయన ని నమస్కరించిన వారికి పాములు రావు. ఎవరైతే  ఆ జరత్కారుడికి  ఈ జరత్కారువు కి పుట్టిన ఈ ఆస్తీకుని వలన ఉభయ వంశములు తరించి , సర్ప యాగం లో పాములు పడకుండా రక్షింప బడి నటువంటి వారికి పాముల వంటి పాపములు తొలగి వారు భగవంతుణ్ణి చేరటానికి , భగవంతుని అనుగ్రహం పొందటానికి యోగ్యమైన స్థితిని పొందుతారు అని ఫలశ్రుతి చెప్పారు. 

మహోత్క్రుష్ట మైనటువంటి జనమేజయ సర్ప యాగం ఆస్తీక మహర్షి వల్ల అగింతువంటి సందర్భాన్ని, కద్రువ కృత యుగం లో ఇచ్చిన శాపం కలియుగం లో ఎలా కట్టి కుడిపిందో , బ్రహ్మ గారు అన్న వాక్కు నిజమై ఆస్తీకుడు అనేటువంటి ఒక మహా పురుషుడు యాగాన్ని ఆపి, దుష్ట సర్పములు నశించిన తరువాత మిగిలిన పాములు ఎలా బ్రతికయో,ఈ కధలో చెప్పబడింది. 

అంటే ఒక్కసారి మహా పురుషులైన వారు కోపం తో కానీ , అనుగ్రహం తో కాని ఒక వాక్కు ని విడిచి పెట్టేసారు అది ఎప్పుడో అప్పుడు అనుభవం లోకి వచ్చి తీరుతుంది అని మనకి అనేకమైన ధర్మ సూక్ష్మములతో కూడినటువంటి ఈ కధా భాగాన్ని మహానుభావుడు మనకి అందించి నన్నయ్య భట్టారకుడు మానని కృతార్ధులని చేసారు. 














Friday, September 12, 2014

ఆదిపర్వం 15

గరుత్మంతుడు అమృతాన్ని తీస్కుని వచ్చినా , పాములు ఆ అమృతాన్ని పొందలేని స్థితి ని  విన్న ఆది శేషుడు,ఆయన  కుడా కద్రువ యొక్క సంతానములో ఒక్కడే కానీ ఆయన తీవ్రమైన పరితాపాన్ని పొందాడు. మా అమ్మా నా సోదరులు కుడా చాలా ప్రవర్తించ కూడని విధానం లో ప్రవర్తిస్తున్నారు, ఆ వినతని ఆమె కుమారుడైన గరుత్మంతుణ్ణి మిక్కిలి ఖేదమునకు గురిచేసారు. అటువంటి సోదరులతో నేను కలిసి ఉండను అనుకున్నాడు.

అయితే ధర్మ పక్షపాతి అయినటువంటి వ్యక్తి కి ఎప్పుడూ  ఈశ్వర అనుగ్రహం ఉంటుంది. ఎవరితో కలిసి ఉన్నాడు ఎవరితో విడిపోయాడు అన్న దానికి ప్రాతిపదిక ధర్మం అయితే, దానికి భగవంతుని కృప ఉంటుంది. ఆది శేషుని యొక్క ఖేదం , సోదరులమీద ఎందుకు అంటే వారు సరియైన  ప్రవర్తన కలిగిన వారు కారు అని  కా బట్టి ఆయన చతుర్ముఖ బ్రహ్మ గారి గురించి తపస్సు చేసారు. ఆ తపస్సు కూడా ఒక్క చోట చేసిన తపస్సు కాదు , ఆయనా గంధ మాదన పర్వతం దగ్గర మొదలుపెట్టి  భదరి క్షేత్రం లో హిమాలయలమీద , గోకర్ణం లో పుష్కరార ణ్యం లో అత్యంత పుణ్య క్షేత్రాల లో తపస్సు చేసాడు.

ఆయన తపస్సు చేస్తే ఆయన తపస్సుకి మెచ్చి చతుర్ముఖ బ్రహ్మ గారు ప్రత్యక్షం అయ్యారు, అయ్యి ఏమి కావలి అని  అడిగారు. అప్పుడు ఆయన బ్రహ్మ గారి వైపు చూసి ఇలా అన్నాడు "నా తల్లి కద్రువా , నా సోదరులు కలిసి వినత ను గరుత్మంతుని అనేక ఇబ్బందులు  పెట్టారు. ఆ సోదరులలో  ఒకడనైన నాకు కూడా ఆ పాపం లో కొంత వస్తుంది. కాబట్టి నాకు ఇంక ఈ శరీరం లో ఉండాలి అని లేదు , కాబట్టి ఈ శరీరాన్ని విడిచి పెట్టాలి అంటే ఆత్మ హత్య చేస్కోవాలి. అది మహా పాతకం చెయ్యకూడదు , కాబట్టి నేను తపస్సు చేసి ఈ శరీరాన్ని విడిచి పెట్టాలి  అనుకుంటున్నాను. నేను చేసి ఉండకపోవచ్చు మా అమ్మ మాట విని మా తమ్ములు చేసిన పనికి నాకు కూడా పాపం కలిగి ఉండొచ్చు, కాబట్టి నేను ఆ పాపం నుండి వినుర్ముక్తుడను అవుతాను అన్నాడు.

అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు ఒక చిరునవ్వు నవ్వి , నీవు నిత్య సత్య నిరతుండవు, నీకు సత్యమునందు , ధర్మం నందు తాపత్రయం ఉంది. ఎప్పుడైతే నీకు అలాంటి భావన ఉందో అప్పుడే నీ పాపం కాలిపోయింది. నిత్య సత్య ధర్మ వ్రతుడైన వాడు ,  దేనినైన భరించే స్థితి ని  పొందుతాడు. ఆదిశేషుడు సోదరులు ఇలా ప్రవర్తిస్తునారు అని  ఆయన కి ఉన్న బాలానికి ఆయనే చంపెయ్యోచ్చు వారిని కానీ చంపలేదు  భరించాడు, ఇంత భరించగల శక్తి ఉందే , అది పనికి రావాలి ఇప్పుడు. దేవతలు దాన్ని వాడుకోవాలి, అంతే కానీ నువ్వు శరీరం వదిలేస్తే ఏమి వస్తుంది, అందుకని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నేను ఒక బృహత్కర కార్యం చెప్తాను , నువ్వు ఈ భూమండలాన్ని అంతటినీ నీ పడగల మీద భరించి ఉంచు అన్నాడు బ్రహ్మ గారు.

భూమికి ఎప్పుడు బరువు అవుతుంది అంటే , ధర్మ నిరతిని ప్రజలు విడిచి పెట్టేసినా , సత్య నిష్టను వదిలి పెట్టినా , భూమికి బరువు అవుతుంది. భూమి ఎవరికి చెప్తుoది అంటే రక్షణ చెయ్య గలిగిన వాడు స్థితి కారుడు  విష్ణువు కాబట్టి ఆయనకి చెప్తుంది. నేను ఈ భూభారమును అంటే పాపం ను మొయ్యలేక పోతున్నాను అంటుంది. అప్పుడు ఈశ్వరుడు ఏమి చేస్తాడు అంటే అవతార స్వీకారం చేస్తాడు. ఎవరు అధర్మం పెచ్చరిల్ల టానికి కారణం అయ్యి ఉన్నారో  వారిని చనకుతారు.

కాబట్టి ఇప్పుడు భూమి భారము ను పంచుకోవటానికి ఎవరు సమర్ధుడు, సత్య ధర్మం యందు ఉన్న వారు భూమి తో ఉంటె , భూమాత సంతోషిస్తుంది , వాళ్ళు ఉన్నారు అని. అంత సత్య ధర్మ వ్రతుడవైన నువ్వు ఈ భూ భారము ను మొయ్య టానికి అర్హుడవు, కాబట్టి నీ పడగల చేత ఈ భారమును వహించు అని ఆయన ఒక సలహా చెప్పారు బ్రహ్మ గారు   నీ సోదరులు కేవలము పాములే కాదు గరుత్మంతుడు కూడా నీకు సోదరుడే మిగిలిన పాముల విషయం పక్కన    పెట్టు. పుణ్యాత్ముడు , ధర్మాత్ముడు , గొప్ప ఈశ్వర విభూతి కలిగిన వాడితో సంభంధాన్ని ఎన్నడూ విడిచి పెట్టుకోవద్దు. ఇది ఏనాటికి అందరికి తెలియవలసిన విషయం. ప్రయత్న పూర్వకం గా నువ్వు గరుత్మంతుని తో నువ్వు చెలిమి చెయ్యి అని చెప్పి , ఆదిసేషుణ్ణి భూ భారం  వహిoచటానికి నియత్రించారు బ్రహ్మ గారు. అప్పటి నించి ఆయన ఆ భూ భారమును వహిస్తున్నాడు.

అందరూ అన్నతమ్ములే కానీ భగవంతుని స్మరిస్తూ ఆయన తో సంబంధం పెట్టుకున్న వారు ఇద్దరు తల్లి శాపం నించి తప్పుకున్నారు , ఒకరు ఆదిశేషుడు , ఇంకొకరు వాసుకి.
క్షీర సాగర మదనం అప్పుడు మందర పర్వతాన్ని కవ్వం గా చేసుకుని చిలకటానికి ఒక తాడు కావాల్సి వచ్చింది. అప్పుడు వాసుకిది చాలా పెద్ద శరీరం కాబట్టి , వాసుకి ని చుట్టారు మందర పర్వతానికి.  అది అంత తేలికైన విషయం కాదు , పర్వతం కి వేసి తిప్పుతుంటే అది ఎంత బాధ కలుగుతుందో శరీరానికి , కానీ వారి కోరిక మేరకు , అమృతం పుట్టటం కోసం ,శారీరకం గా అంత డస్సి పోయి, ఈశ్వరుని కొరకు తన శరీరం అంత బడలి పోవటానికి స్వీకరించాడు.

అమ్రుతోత్పాదనం అయిన తరువాత ,దేవతలు  బ్రహ్మ గారికి చెప్పారు, ఈయన ఎంత కష్ట పడ్డాడో తెలుసా మహానుభావుడు . ఎంత బడలిపోయాడో ఆ వొళ్ళంతా ఎంత కంది పోయిoదో. అయినా ఒర్చుకున్నాడు మాకు అమృతం ఇవ్వటానికి , ఈయనని ఏదైనా కృప  చెయ్యాలి అన్నారు , అంటే బ్రహ్మ గారు అన్నారు వీళ్ళ అమ్మ శాపం ఉంది, పాములన్నీ జనమేజయుడు చేసే యాగం లో పడి మరణించాలి. కానీ ఇతను చేసిన దైవ సేవ వలన ఇతన్ని మినహా ఇస్తున్నాను అన్నాడు. ఇతనికి అలా యాగం లో పడి మరణించ వలసిన అగత్యము ఇతనికి కలగదు.

ఆదిశేషుడు బ్రహ్మ గారిదగ్గర వరం పొందాడు , ఆయన బ్రహ్మ గారి యొక్క ఆజ్ఞ అవుదల దాలుస్తు ఉండి పోయాడు.
ఇవతల నా సోదరులకు వచ్చే ఆపద గురించి ఆయన ఆలోచించట్లేదు ,జనమేజయుడు ఏదో ఒక రోజు మొదలు పెట్టేస్తాడు సర్పయాగాన్ని, ఎప్పుడు కృత యుగం లో ఇచ్చింది ఆవిడా శాపం , ఎప్పుడు చేసాడు యజ్ఞం , కలియుగ ప్రారంభం లో చేసాడు యజ్ఞం. ఒక్క సారి ఇచ్చిన శాప వాక్కు కట్టి కుడుప వలసిందే. ఆదిశేషుడు పట్టించు కోడు, అవతల పాములు పట్టించు కోవట్లేదు, ఎప్పుడు సర్ప యాగం జరుగుతుందో అని ఆందోళన తో వాసుకు ఏడుస్తున్నాడు.

ఐరవతాధులు అన్న పాముల జాతిని పిలిచి ఆయన తన బాధ వ్యక్తం చేస్తున్నాడు. వాళ్ళు దుoదుడుకు  స్వభావం కలిగిన వారు. వాళ్ళకి ఎంత మంచి మాట చెప్పినా తలకి ఎక్కదు. ఒకడు చెప్తే తలకి ఎక్కించు కొని వాడే భూమికి భారం. వాళ్ళన్నారు ఏమిటన్నయ్యా అంత బెంగ పెట్టుకుంటావు , యాగం చేసేది ఆయన అయితే , పాడుచేయ్యటం మనకి రాదా ? బోలెడు మార్గాలు ఉన్నాయి యాగం పాడుచెయ్యాటానికి.

జనమేజయుడికి బ్రాహ్మణులు అంటే భక్తి కాబట్టి ,మనం బ్రాహ్మణ వేషాల తో వెళ్దాం. వెళ్తే బ్రాహ్మణులు వచ్చారని స్వాగతం చెప్పి కూర్చోబెట్టి ఏమిటి అంటాడు. చాలా తప్పు ఇలాంటి యాగం చెయ్యకూడదు , చేశావా నీకు రెండూ  పోతాయి , ఇహము  పోతుoది  పరము పోతుంది. ఇక్కడా సుఖం ఉండదు , పైలోకాల లో సుఖం ఉండదు , రెండు పోయే యాగం ఎందుకు చేస్తావ్? అని మనం చెప్తాం , బ్రాహ్మణ భక్తి తో యాగం చెయ్యటం మానేస్తాడు.

ఒక వేళ వినకపోతే మన లోనే కోoదరిని ఆoతరoగికుల మంత్రుల వేషాలు వేయిద్దాం, కామ రూపులం కాబట్టి , మంత్రుల మాట కాదనడుగా. వెళ్లి పరమ ప్రేమతో జనమేజయా ఇటువంటి యాగం చెయ్యొద్దు అని చెప్దాం, వింటాడు.

ఇంకా వినలేదు అనుకో యాగం మొదలు పెట్టి ఋత్విక్కులు కూర్చుంటారు. భక్ష్యం , భోజ్యం , లేహ్యము , చోష్యము. తినేవి తాగేవి నాకేవి ,చప్పరించేవి , ఇవన్ని ఉంటాయిగా , వాటన్నిటి మీదా పాకేద్దాం మనందరం. మనదరం పాకేస్తే విష తుల్యం అయిపోతుంది , దాన్ని హవిస్సు గా ఇవ్వరు గా. అక్కడ హవిస్సు పాత్ర ఉంటుంది , నేతి పాత్ర ఉంటుంది ,వాటన్నింటి మీదా పాకేద్దాం.  అంతేకాదు ఒజ్జలు అంటే ఉపాధ్యాయుడు వాళ్ళు కుర్చుని ఉంటారు యాగం చేద్దాం అని వెళ్లి వాళ్ళ మీద పడదాం పడి తలలెత్తి బుస్స్ అందాం వాళ్ళు లేచి పారిపోతారు. ఇంక దీక్షాభంగం అవుతుంది, ఇంకా యాగం జరగదు. ఏమిటన్నయ్యా బాధ పడతావు వదిలేయి అన్నారు

అందులో ఉన్న కొంతమంది పెద్దలు అన్నారు, మీరు చాలా తేలికగా చేస్తున్నారు రా , ఒక సారి బ్రాహ్మణుడు మత్రోచ్చాటనం చేసి మనం అందులో పడిపోవాలి అన్న సంకల్పం చేసిన వెంటనే అపకారం చెయ్యటానికి వెళ్ళిన మనం ఎక్కడ ఉన్నామో వెతుక్కుంటూ వస్తాయి అగ్ని కీలలు తినటానికి. నువ్వు వాళ్ళ మీద పాకటం కాదు నీ మీదకి అగ్ని పాకుతుంది. ఎందుకంటే అగ్ని కి వ్యాపించే గుణం ఉంది అందుకే అశ్వ శబ్దం తో పిలుస్తారు దాన్ని. నువ్వు నేను దాని మీద పాకటం ఏమిటి , బ్రాహ్మణుల మీద పడటం ఏమిటి ఎమన్నా మతి  ఉందా నువ్వు చేసే ఆలోచనకి , ఏమీ బావోలేదు నువ్వు చెప్పిన ఆలోచన.

వాసుకి తెల్లబోయి వింటున్నాడు , ఎలా దీనికి పరిష్కారం ఏమిటి, మరి వీళ్ళు ఎలా రక్షింపబడతారు. అందులో ఎలా పుత్రుడు అని ఒక పాము , హఠాత్తు గా లేచి  ఒక మాట అన్నాడు. కద్రువ మనందరికీ శాపం పెట్టిన రోజు రాత్రి ఆమె వడిలో తల పెట్టుకుని , నిద్ర రాక పోయిన, నిద్ర వచ్చినట్టు గా నటించి పడుకుని ఉన్నాను. ఆ సమయం లో ఒక ఆశ్చర్య కరమైన సంఘటన జరిగింది.

బ్రహ్మ గారి దగ్గరకి దేవతలంతా వెళ్లారు , వెళ్లి మహా పరాక్రమ వంతులు కదా పాములు. అంత పరాక్రమ వంతులైన జాతిని తన అధర్మానికి , తన అసత్యానికి, చనిపోమ్మని కద్రువ ఎలా శపించిందయ్యా, ఆవిడ ఇచ్చిన వాక్కు కి పాముల జాతంతా నశించి పోవటమే? ఇంత బలవంతులైన పాములు అగ్నిలో పడిపోవాల్సిందే? అందులో ఆదిశేషుడు ఉన్నాడు , వాసుకి ఉన్నాడు, మహానుభావులు ఉన్నారు , వెళ్ళందరూ కూడా మడిసి పోతారా అని అడిగారు దేవతలు.

అడిగితే బ్రహ్మ గారు అన్నారు , అసలు కద్రువ నోటివెంట ఆ మాట వచ్చే లాగా ప్రేరణ ఎందుకు చేసామో తెలుసా మీకు క్రురాకారుల , జగత్తు కి అపకారం చేస్తాయి, అటువంటి పాముల యొక్క పాపపు నడక ,నడత నేను భరించ లేక పోతున్నాను అని భూదేవి ఏడుస్తుంది. అందుకు అవన్నీ నశించిపోవాలి , అవన్నీ నశించి పోవటనికే కద్రువ నోటి వెంట ఆ మాట వచ్చింది. కాబట్టి అవన్నీ నశించి పోవటం దేవతలకి ప్రీతీ కరమే, కాబట్టి మీరేమి బెంగ పెట్టుకోవద్దు. అని

ఇందులో దేవతా సర్పములు కొన్ని ఉన్నాయి, దేవతలకి , మనుష్యులకు ఉపకారం చేసే వి కొన్ని ఉన్నాయి, అవన్నీ ఆ అగ్నిలో పడిపోకుండా ఒకానొకప్పుడు వాసుకి చెల్లెలైన జరత్కారువు వేరొక మునిశ్రేష్టుడైన జరత్కారువు ని వివాహం చేస్కుంటుంది. ఇద్దరి పేరూ కూడా జరత్కారువే , వారిద్దరికీ కూడా అస్తీకుడు అనే ఒక ముని పుడతాడు. ఆ ముని వెళ్లి  జనమేజయుడి యొక్క సర్ప యాగాన్ని ఆపు చేస్తాడు. పాప భూయిస్ట మైన సర్పము లు అన్ని అప్పటివరకు అగ్నిలో పడి కాలిపోతాయి. ఆ తర్వాత కొన్ని కొన్ని సర్పములు , దేవతలతో చెలిమి చేసినవి, పుణ్యం చేసినవి, లోకోపకారం చెయ్యవలసిన పాములు కొన్ని మిగిలి పోతాయి. ఆ విధం గా వాటి సంఖ్య ని తగ్గించేస్తాం. లేకపోతే వాటి సంఖ్య ద్విగుణీకృతo అయిపోతే ఈలోకం లో ప్రాణులు ఏమి మిగలవు. భయం తో చాలా భీభత్స  వాతావరణం ఏర్పడుతుంది . అందుకే ఈ ఏర్పాటు చేసింది. అన్నారు బ్రహ్మ గారు.

కాబట్టి ఇప్పుడు ఆ అస్తీకుడు పుట్టడానికి ,ఆ జరత్కారువు ఎక్కడ ఉన్నాడు , జరకారువు దొరికితే , వాసుకి చెల్లెలైన జరత్కారువు ని ఇచ్చి పెళ్లి చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఆయన వైపుకి కధ తిరిగింది. ఆయన యయావర వంశము నందు శ్రేష్టుడు బ్రహ్మ చారి గొప్ప నియమ పాలనం చేసే వాడు. ఇంక ఎంత ఘోరమైన బ్రహ్మ చర్యం అంటే ఆయన ఊర్థ్వ రేతస్కుడు. ఆయన భార్య అన్న మాటని కూడా స్మరణ లోకి రానివ్వలేదు.  అంత గొప్పగా శాస్త్రాధ్యయనం చేశాడు , అంత గొప్ప తపస్సు చేసాడు. కానీ బ్రహ్మ చారిగా తపస్సు చెయ్యటం చాల గొప్ప పని , కానీ ఇవి ఎంత వరకూ పనికి వస్తాయి, ఒక వయస్సు వరకు, ఒక వయసు తర్వాత వివాహం నేను చేస్కోవటమా చేస్కోక పోవటమా అన్న విషయం లో నాకు స్వేచ్చ ఉండదు.

సనాతన ధర్మం లో ఎట్టి పరిస్థితులలో, మీరు వివాహం చేస్కో కుండా ఉండరాదు , ఎందుకంటే , దాని వలన మీరు రుణపడిపోతారు. తండ్రికి కొడుకు పుట్టీ పుట్ట గానే ఋణ పడిపోతాడు, ఆయన నన్ను ఎలా కన్నడో అలాగే నేను ఒక కొడుకుని కనాలి. కంటే తప్ప ఆ ఋణం పోదు, ఒక వేళ తండ్రి శరీరం విడిచి పెట్టేసినా, పితృదేవతలు చూస్తూ ఉంటారు ,వీడు కన్నడా కొడుకుని అని.

ఇప్పడు ఆ జరత్కారువు అనుకున్నాడు , ఇప్పుడు భార్యని స్వీకరిస్తే , పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే మాయ కమ్ముతుంది. అసలు నేను పాణిగ్రహణం చెయ్యను, నాకు భార్య  వద్దు,  గృహస్తాశ్రమం వద్దు అని పెళ్లి చేస్కోకుండా ఉండిపోయాడు. ఒకరోజు ఎందుకో ఈశ్వరుని యొక్క అనుగ్రహం , ఒక ప్రాంతం లో తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్న సమయం లో అక్కడ నీటి తో కూడిన ఒక చిన్న సరస్సు ఒకటి ఉంది.  అక్కడ అవురు గడ్డి తో చెయ్య బడ్డ  దుబ్బులు కొన్ని ఉన్నాయి. ఆ దుబ్బుల యొక్క వేరులు ఎలుకలు కోరికేసాయి. ఒకే ఒక వేరు ఉంది . అసలే అది గడ్డి దుబ్బు , ఆ గడ్డిదుబ్బు కి ఉన్నది ఒక్క వేరు ఆ గడ్డి దుబ్బుకి గడ్డి పరకలు చాలా ఉంటై కదండీ, ఆ పరకలన్ని పట్టుకుని కొంత మంది తల కిందులు గా వేలాడుతూ సూర్య కిరణాలూ తింటున్నారు.

వాళ్ళని చూసి ఈయన అన్నాడు , అబ్బో ఇదొక గొప్ప తపస్సు లా ఉంది. ఒకవేరు ఉన్న గడ్డి దుబ్బుకున్న గడ్డి పరకల కి వేలాడుతూ ఇంతమంది సూర్యకిరణాలు తింటున్నారు . గడ గడ వణికిపోతూ ఉన్నారు , తలలు కంపిస్తున్నాయి , నాడులు పైకి వచ్చి ఉన్నాయి. ఇంత గొప్ప తపస్సు ఎలా చేస్తున్నారు , దీని గొప్పతనం ఏంటో నాకు చెప్తే నేనూ  చేస్తాను అన్నాడు.

 ఆ తల కిందులుగా  వేలాడుతున్న వారు అన్నారు, మా వంశం లో జరత్కారువు అనబడే వాడు ఒకడు పుట్టాడు. వాడు పెళ్లి చేస్కోను అని భీష్మి చాడు , ఆ కారణం చేత ఇలా తిరగేసి కట్ట బడ్డాo. ఆ వేరులు ఆ పిల్లవాడు పెళ్లి చేస్కోకుండా ఉన్నకొద్ది ,యమ ధర్మ రాజు ఎలక రూపం లో కోరికేస్తునాడు ఆ వేర్లని, ఇప్పుడు మా పుణ్యం , మేము చేసిన తపస్సు మమల్ని రక్షించ కుండా పోతుంది. మేము చాలా ధార్మికం గా జీవించాం , మేము చాలా గొప్ప తపస్సు చేసాం కాని, ఉపయోగం ఏముంది , మా వంశం లో పుట్టిన వాడు పెళ్లి చేస్కోవటం మానేసాడు , దానివల్ల ఇంకొక్క వేరు ఉండిపో యింది.

అంటే ఇంకా వాడు పెళ్లి చేసుకుని కొడుకుని కనటానికి చాలా కొంచం సమయమే మిగిలి ఉంది, వాడుకనుక ఈ కొంత సమయo కూడా పెళ్లి చేస్కోకుండా ఉండి పోతే, యమధర్మ రాజు ఈ వేరు కూడా కోరికేస్తాడు, కోరక గానే అంతే వేగం తో మేము అధో లోకములకి వెళ్లి పోతాము. ఇక మాకు ఊర్ధ్వ లోక వాసం ఉండదు. మేము చెయ్యని పాపానికి , మేము చెయ్యని నేరానికి, ఒక ధూర్థుడైన కొడుకు , పెళ్లి చేస్కోకుండా ఉండి పోయి మేము లోకాన్ని ఉద్ద రిస్తున్నాన ని చెప్పు కుంటున్న వాడి వల్ల మేము ఇంతటి నేరాన్ని పొందాము.

వాడు తప్పస్సు చెయ్యక్కర్లేదు ఇంకోటీ చెయ్యకర్లేదు ,వాడు గృహస్తాశ్రమం స్వీకరించి , వాడి ధర్మం వాడు చేసి ఉంటె, మేమందరం తరించే వాళ్ళo కాబట్టి నాయనా నువ్వెవరో మా యందు ప్రీతీ కలిగిన బందువు మాట్లాడినట్టు మాట్లాడవు , నీకు ఎప్పుడైనా ఆ జర్కారువు అన్న వాడు కనపడితే వాడికి చెప్పవయ్యా మా బతుకు
ఇలా ఉంది అని అన్నారు.

అంటే ఆయన అన్నాడు , అయ్యయ్యో మీరు వెతక మన్న జరకారువు ఎవరో కాదు ,నేనే , మీరే నా తాత తండ్రులు, నేను ఎంత అపరాధం చేశాను , ఏమిటో ఇన్నాళ్ళు పెల్లిచేస్కో కుండ ఉండిపోవటo గొప్ప అని ఇలా ఉండిపోయాను. కాబట్టి నేను పెల్లిచేస్కుంటాను . మిమ్మల్ని చూసి భాద పడ్డాను , నేను పెళ్లి చేస్కోక పోవటం వలన ఎంత ప్రమాదం వచ్చింది అని ఇప్పుడు అర్థం అయ్యింది. కాబట్టి నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి నేను వివాహం చేస్కుంటాను. చేస్కుని తప్పకుండా సంతానాన్ని కాంటాను, నేను సంతానాన్ని కంటే మీరు ఉర్థ్వ లోకాలకి  వెళ్తారు. కాబట్టి ఈ ఒక్క వేరు కోరక బడే లోపలే నేను వివాహం చేస్కుంటాను.

ఇప్పుడు ఆయన తండ్రి తాతలు అంటున్నారు, యజ్ఞాలే చెయ్యనీ , యాగాలే చెయ్యని , ఘోర నిష్ట తో తపస్సులే చెయ్యనీ వివాహము చేసుకుని సంతానము ని కానని వాడిని ,ఎట్టి పరిస్థితుల లో స్వర్గ ద్వారము చూడ నివ్వరు. కాబట్టి వివాహం చేస్కోవలసిందే.

ఇప్పుడు ఆ జరత్కారువు ఆయన తండ్రి తాతల తో అంటున్నాడు, నేను వివాహం చేస్కుంటాను కాని నాది ఒక్క కోరిక నాకు ఎ పేరు ఉందొ ఆ పేరే ఉన్న పిల్ల దొరికితే చేస్కుంటాను అన్నాడు. ఇప్పుడు జరత్కారువు అనే పిల్ల కోసం తిరుగుతున్నాడు దేశం అంతా , ఇలా వెతుక్కుంటుంటే వాసుకి చూసాడు, ఆ వాసుకి జరత్కారుడి తో మాట్లాడుతున్నాడు.

నువ్వు  బ్రహ్మచారి వి కనుక, ఏమిటో తెలుసా భిక్ష , మీది అద్భతమైన వంశం , నిశ్చితార్దం చేస్కునే ముందు ఈ మాటలు చెప్పి చేస్కోవాలి. మీ వంశం చాలా గొప్పది , మా వంశము చాలా గొప్పది, ఇవ్వాళ  మా వంశం ధన్యత
 చెందింది మీ వంశం తో వియ్యం పొందటం వలన, నా చెల్లెలు ఉంది ఆమె పేరు జర్కరువు, నీ పేరు జరత్కారుడు, ఇద్దరి పేర్లు ,గుణములు కలిసాయి, అన్నిటికన్నా ప్రధానము ఏది అంటే వివాహంలో గుణములు కలవాలి. ఇప్పుడు ఇద్దరి పేర్లు , గుణాలు కలిసాయి పెళ్లి చేస్కుంటాను అన్నాడు జర్కారువు. కానీ  ఎన్నాళ్ళు నువ్వు






Wednesday, September 10, 2014

ఆదిపర్వం 14 (అమ్రుతాపహరణం)

అమ్రుతాపహరణం కొరకు గరుత్మంతుడు , స్వర్గం వైపుకు బయలుదేరాడు. స్వర్గలోకానికి వెళ్లేసరికి దేవేంద్రుడి సభ జరుగుతుంది. ఆ దేవేంద్ర సభలో కొన్ని దుశ్శకునములు కనపడ్డాయి అన్నారు. ఏమిటి అవి అంటే , అకస్మాత్తుగా నిప్పు రవ్వ లు పడ్డాయి, దానితో పాటుగా వజ్రాయుధం యొక్క అంచులు మొక్కవోయాయి, దిక్కులన్ని కూడా కాంతి విహినం అయిపోయాయి, అకస్మాత్తుగా  దిక్పా లకుల మనస్సులలో  భయము , ఉద్వేగము కలిగాయి. వెంటనే దేవేంద్రుడు బృహస్పతి వంక చూసాడు , గురువుగారు ఇన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, దుశ్శకునములు కనపడుతున్నాయి, ఎందువలన ఇలా కనపడుతున్నాయి అని అడిగారు.
అంటే బృహస్పతి అన్నాడు "నా యనా ఇంద్రా ! కశ్యప ప్రజాపతి పుత్ర్కమేష్టి చేస్తే పుట్టిన వాడు , అపర తేజోవంతుడు, వాలఖిల్యుల యొక్క వరం చేత పుట్టిన పిల్లవాడు అత్యుగ్రమైన ప్రాణులైన నిషాదులందరినీ  ఒక్క క్షణం లో మింగినటువంటి మహానుభావుడు, ఏనుగును తాబేటిని రోహిణి యొక్క కొమ్మ మీద పెట్టినప్పుడు ,అది విరగాబోతుంటే రెండు పదములతో ఏనుగుని , తాబేలుని , ముక్కుతో వలఖిల్యులున్న కొమ్మని ముక్కుతో పట్టుకుని వెళ్లి వలఖిల్యులని రక్షించిన తెజోముర్తి, తన తల్లి దాస్యం పోగాట్టటం కోసమని, అమృతాన్ని పాములకి ఇవ్వడం కోసమని.
కామ రూప సంపన్నుడు , అంటే ఆయన అనుకుంటే చిన్న వాడు అయిపోతాడు, లేదా ఇం కా   పెరిగి పోతాడు , ఇంకో రూపం ధరిస్తాడు. అన్ని శక్తులు ఉన్నటువంటి వాడు , అష్ట సిద్దులు ఉనటువంటి వాడు. కామా గమనుడు అతడు అమృత భాoడం కోసం స్వర్గలోకం వస్తున్నాడు, అతన్ని నువ్వు గెలవలేవు ఇంద్రా అన్నాడు బృహస్పతి.
అతను వాలఖిల్యుల అనుగ్రహం తో పుట్టిన వాడు అన్నాడు. అనగానే వాలఖిల్యుల అనుగ్రహం తోటి ఎందుకు పుట్ట వలసి వచ్చింది గరుత్మన్తుండు అని అడిగాడు ఇంద్రుడు.
ఆ వాలఖిల్యులు బ్రహ్మ గారి పుత్రులు, ఇంద్రుడు కశ్యప ప్రజాపతి కుమారుడు , కశ్యప ప్రజాపతికి అదితి అన్న భార్య యందు పుట్టిన వాడు. ఇంద్రుడు , వాలఖిల్యులు కూడా కశ్యప ప్రజాపతి చేసే యజ్ఞానికి వెళ్లారు , ఎప్పుడు చేశాడు యజ్ఞం , ముందు చెప్పినట్టు వినత , కద్రువ పిల్లలు కోరుకునప్పుడు , దైవానుగ్రహం కోరి పుత్ర కామేష్టి చేసాడు. యజ్ఞం చేసేటప్పుడు వీళ్ళందరూ వెళ్లారు , యజ్ఞం చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది. యజ్ఞం చేసే వాడు దీక్షితుడై ఉంటాడు.పీటల మీద నించి లేవకూడదు.  ఆయన మీద ప్రేమ ఉన్నవారు , ఆయన కి సహకరించాలి. వాలఖిల్యులు అంగుస్ట మాత్రమే ఉన్నా వారు బ్రహ్మ పుత్రులు ,మహాతేజోవంతులు , ఆజన్మ బ్రహ్మ చారులు ,అయినప్పటికీ  కశ్యప యజ్ఞం చేస్తున్నాడు , మనం మనకి తోచిన సాయం చెయ్యాలి అనుకున్నారు. దానికి కోసం వాళ్ళు కాసిని పువ్వులు కోసి , దర్భలు కోసి , మోదుగ పుల్లలు కోసి, అవి అగ్నిహోత్రం లో వేస్తారు , ఇంత ఉన్నవాళ్లు ఎన్ని పుల్లల కట్టలు ఎత్తుతారు. మీరు ఏమి చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు , ఎంత ప్రేమ తో చేస్తున్నారు అనేది ముఖ్యం.
ఇప్పుడు ఇంద్రుడు కూడా  పుల్లల కట్ట  సమిధల కట్టా , తనూ ఎందుకు చెయ్యాలి , ధర్మానికి చేస్తున్నాడు. తండ్రిగారు యజ్ఞం చేస్తుంటే కొడుకు చెయ్యక ఎవరు చేస్తారు.
ఇప్పుడు వలఖిల్యులని చూసి ఇంద్రుడు  వీళ్ళు ఎంత వాళ్ళు తెచ్చే సమిధలు ఎన్ని దీనికి అంత అగరపు అంత అలుపునా అని వీలు తెచ్చేవి ఏ మూలకి వస్తాయి అని ఇంద్రుడు పక పక నవ్వాడు. అప్పుడు ఆ వాలఖిల్యులు అన్నారు నువ్వు ఇంద్రుడివి అని కదా నవ్వావు , నీకంటే గొప్ప వాడు , యుద్దము నందు గెలవబడని వాడు , ఆయన ముందు ఎవరు యుద్ధం లో గెలవలేరు. స్వత్తఃసిద్దంగా అణిమాది అష్ట సిద్దులూ సాధించుకున్న వాడు, అటువంటి మహా పురుషుడు ఒకడు ఇప్పుడు ఈ పుత్రా కామేష్టి వలన కశ్యప ప్రజాపతి కి పుత్రుడిగా జన్మించు గాక
అన్నారు. ఈ ఇంద్రుడి కి ఇంద్రుడు అవుతాడు. వెంటనే కశ్యప ప్రజాపతి ధర్మమ్  చుడండి ఆయన అన్నాడు ఈ ఇంద్రుడు తన భుజ బాల శక్తి తో లోకాన ఉండే ప్రనులన్నింటిని కాపాడుతున్నాడు. ఇంద్రుడు అని మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మ గారు నిర్ణయం చేసారు , (ఒక పెద్ద వారు నిర్ణయం చేసినప్పుడు ఎంత గౌర్వమ్థొ ఆ నిర్ణయాన్ని అవుదల దాల్చాలో చుడండి) ఒక ఇంద్రుడు ఉండగా మళ్ళి ఇప్పుడు పుట్టబోయే పిల్లవాడిని ఇంద్రుణ్ణి చేస్తే బ్రహ్మగారు నోచ్చుకోరటయ్యా అని ఎవరిమానన వారు ఇంత మంది ఇంద్రుళ్ళ లో ఎవరు ఏది చెయ్యాలి అని పరమేస్టి కి ఎంత తలపోటు ?  కాబట్టి వద్దు , కానీ మీ మాట వృధా పోరాదు , ఈ పుట్ట బోయే పిల్లవాడు పక్షులకు ఇంద్రుడు అవుగాక అని అన్నాడు.
కాబట్టి శరీరం పక్షి శరీరం అయినా ఇంద్రుడు గెలవలేడు , అన్ని గుణములు కలవాడు.  ఇప్పుడు వలఖిల్యులలో కూడా గొప్పతనం ఎక్కడ ఉంది అంటే , వాళ్ళు పెంకితనానికి పోకుండా వొప్పుకుని తదాస్తు అన్నారు.  అందుకే ఉత్తముడైన వాడి కోపం ఒక్క క్షణం ఉంటుంది.
ఇప్పుడు ఈ కధ నీకు తెలియంది కాదు కదా అని బృహస్పతి ఇంద్రుడితో చెప్తున్నాడు. కాబట్టి వాలఖిల్యుల అనుగ్రహం తో పుట్టిన వాడు ,  అమృతాపహరణా ని కి వస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఆపగలవు, ఆపలేవు అని బృహస్పతి చెప్పా వలసిన మాట చెప్పేసారు. ఇప్పుడు ప్రయత్నం పురుష లక్షణం. కాబట్టి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తే , అమృతం అమృతాన్నే పండిస్తుంది మహాభారతం లో. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు కొంత మంది రక్షకులని పిలిపించి  అమృత భాండానికి రక్షణ చేస్తూ గరుత్మంతుని తో యుద్ధం చెయ్యండి అని అన్నాడు. ఆయన కుడా వెళ్ళాడు. ఆ అమృత భాండా న్ని రక్షణ చేసే వాళ్ళు సామాన్య మైన టువంటి వారు కాదు గొప్ప బాహు బలము కలిగిన తువంటి వాళ్ళు ,  బాగా  వాడి అయిన కడ్గాలు పట్టు కున్న వాళ్ళు,   నల్ల ని పచ్చ ని యెర్రని మెరిసి పోతున్నటు వంటి కవచములు కట్టుకున్న వాళ్ళు. వాళ్ళందరూ కూడా గరుత్మంతునితో యుద్ధాన్ని ప్రారంభం చేసారు. ఆయన కి వేరే ఆయుధం అక్కర్లేదు ఆయన ముక్కూ , రెక్కలే చాలు.
 ఇప్పుడు యుద్ధం మొదలైంది. ఆ గరుత్మంతుడు, ఆయన రెక్కలని అల్లారుస్తూ, ఆ స్వర్గలోకం లో ఒక్కసారి విహరించి , వాళ్ళని తన రెక్కలతో కొట్టి ముక్కుతో వాళ్ళని పొడుస్తుంటే, అక్కడ ఒక్కసారి ,పిడుగులు కొన్ని వేల పిడుగులు  పడితే గాలి  ఎలా వస్తుందో  అలా   ఉంది అక్కడ వాతావరణం. తెల్లటి మబ్బులు గాలికి కొట్టబడితే ఎలా ఉంటాయో అలా అక్కడ కాపు కాస్తున్న వీరులందరినీ చెదరగోట్టాడు. ఆయన రెక్కల చేత కొట్టబడి, ముక్కు తో పోడవ బడి, శరీరము నుండి  రక్త దారాలు కారుతుండగా ,వారందరూ కూడా ఇంద్రుడి వెనకకు వెళ్లి దాక్కున్నారు, సాత్యులు పూర్వ దిక్కుకు పారిపోయారు, వసువులు రుద్రులు దక్షిణ దిక్కు కు పారిపోయారు. డబ్బు లేని వారు దక్షిణ కొరకు ఆశ్రయించి నట్టు దక్షిణ దిక్కుని ఆశ్రయించారు అన్నారు. ఆదిచ్యులు , ఆస్వినులు వారందరూ ఉత్తర దిక్కు కు పారిపోయారు. ఇంకా మిగిలినటువంటి , అగ్ని , వాయువు , యముడు మిగిలనుటువంటి దేవతలు, శరీరము నకు కారుతున్నతువంటి ఆ రక్తము కారుతుండగా ఆ దేవలోకం విడిచి పెట్టి పారిపోయారు.
ఇప్పుడు ఆ అమృత భాండం దగ్గరకు వెళ్లి ఆ అమృత భాండం తీస్కొని వెళ్ళటానికి ఉద్యుక్తుడు అయ్యాడు. దానిపైన పదునైన ఆకులు కలిగిన ఒక చక్రం తిరుగుతుంది. ఆ చక్రం కింద రెండు పాములు ఉన్నాయ్ , ఆ రెండు పాముల నోటిలోనించి అగ్నిహోత్రాన్ని వేదజల్లుతున్నై. ఆ అగ్ని హోత్రం ఎలా పైకి లేస్తుంది అంటే, తలపైకి ఎత్తి ఏదో  అందిన మధురపదార్థం నాకుతున్నట్టు , వాటి నోట్లోనించి అగ్నిహోత్రం పైకి ఎగజిమ్ముతూ ఆకాశాన్ని  నాకుతుంది.
చూసాడు మహానుభావుడు, ఒక్క సారి భూమి మీదకి వచ్చి సమస్త జలాశయాల్లో ఉన్న నీటి ని తన దోసిట పట్టి, అకస్మాత్తుగా దేవలోకం వెళ్లి , ఆ చక్రం మధ్య గా వస్తున్న అగ్ని హోత్రం మీద ఇన్ని నదుల నీళ్లన్నీ పోసేసాడు. ఇప్పుడు ఆ అగ్ని హోత్రం చల్లరిపొయింది అది గరుత్మంతుని బలం అంటే, ఆ బలాన్ని స్మరించి దాన్ని వింటే చాలు అంత గొప్ప రక్షణ కలుగుతుంది.
 ఆయన కామరూపం కలిగిన వాడు కదండీ , ఆ చక్రం కింద ఉండి  ,  భయంకరం గా అగ్ని చూస్తున్న ఆ నగుల్ని చూసాడు. ఆ పైన తిరుగుతున్నా చక్రాన్ని చూసాడు.  సుక్ష్మ రూపాన్ని పొంది, చక్రం పైనించి కాకుండా చక్రం కిందనించి కిందకి దూరాడు.
కిందకి దూరి,  తన వైపే చూస్తూ అగ్నిహోత్రం విడిచిపెట్ట టానికి ప్రయత్నిస్తున్న ఆ నగుల కన్నులలో ధూళి పడి వాటికి కన్నులు కనపడకుండా ఆ రెక్కల్ని అల్లర్చి నందుకు ,కన్నులు కనపడక ఆ పాములు చెల్లా చెదురై పోయాయి.
ఇప్పుడు ఆ అమృత భండాన్ని పట్టుకుని , భూలోకం వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఆయన వేల్లిపోతున్నప్పుడు శ్రీ మహా విష్ణువు ఎదురువచ్చారు, ఎదురు వచ్చి అన్నారు
ఒక్కడు ఇంత మందిని జయించి ఆ అమృత భండాన్ని గైకొని, వెళ్లి పోతూ వెళ్ళిపోతూ  దేవాసురులు అందరూ కూడా తగలనుకునే అమృతం తనకి  చిక్కి నా  ఒక్క చుక్క కూడా ముక్కు పెట్టి తాగకుండా, అమ్మని దాస్యం నించి విడిపించటానికి మాట ఇచ్చిన ప్రకారం అన్నల కి ఇచ్చేయటం కోసం పట్టుకెళ్ళి పోతు అలోలుడై (అమృతం మీద లౌల్యమ్ పొందకుండా ) వెళ్ళిపోతున్న మహా పురుషుడు, కాబట్టి నేను చాలా సంతోషించాను నీకు ఏమివరం కావాలో కోరుకో అన్నాడు, నీ బలానికి నీ మనోజవానికి , నీ అలౌల్యానికి నీ సద్భావనకి , అమ్మని దస్యo నించి విడిపించాలి అని ఇంత కష్ట పడ్డ నిన్ను చూసి చాల సంతోషించాను గరుత్మంతా నీకు ఏమి కావలి కోరుకో అన్నారు శ్రీ మహా విష్ణువు.

అంటే గరుత్మంతుడు అన్నారు ఆయనకి నమస్కారం చేసి అన్నాడు అమృతం తాగితే వ్రుధప్యం రాదు, మృత్యువు రాదు , కానీ నువ్వు చాలా ఉద్దతి తో ఉన్న రాక్షసులను నిగ్రహించాగాలిగిన ధర్మ స్వరూపుడ వైనటు వంటి నారాయణా! నన్ను అనుగ్రహించి , ఈ అమృతాన్ని తాగకుండానే ,  మరణo  రాకుండా వరం ఇయ్యి , నువ్వు రాక్షస విద్వంసం చేస్తూ ఉంటావు , నీ ముందు నిలబడాలి, అప్పుడు ఏమవుతుంది , ఈ బలం ఈ జవం నువ్వు చేసే రాక్షస సంహారానికి పనికి వస్తే ఈ ఉండిపోయిన బలానికి ఒక సార్ధకత, కాబట్టి నాకు జరా మరణముల తో సంభంధం లేని జీవితం తో నీ సన్నిధి ని నిలబడే అదృష్టాన్ని కృపచెయ్యి అని అడిగాడు.

ఇప్పుడు ఆ గరుత్మంతుడు కోరుకున్న వరాన్ని ఇచ్చారు కానీ ఇంద్రుడు మాత్రం తన కర్తవ్య నిర్వహణ తానుచేయ్యాలి కదా , అక్కడ ఉన్న రక్షకులు ఒడిపోయారు.   అందుకని తన వజ్రాయుధం తీసాడు, ఆ వజ్రాయుధపు అంచులు మెరిసిపోతున్నై, అది గరుత్మంతునికి దగ్గరగా వెళ్ళింది , గరుత్మంతుడు ఒక నవ్వు నవ్వి అన్నాడు , నువ్వు  వచ్చావ్ మంచిదే, పాపం ఇంద్రుడు విడిచిపెట్టాడు , నువ్వు వచ్చావు, నీ బలం ఇతరుల మీద చూపించు, నా మీద చూపిస్తే నీకు ఏమి వస్తుంది. నువ్వు ఏమి చెయ్యలేవు, కాని నువ్వు ఏమీ చెయ్యలేక పోయావ్ అనుకో, నీకు కాదు అవమానం , ఎవరికి అవమానమో తెలుసా, నిన్ను దేనితో తయారు చేసారో తెలుసా దదీచి మహర్షి ఎముకలతో తాయారు చేసారు.
దదీచి మహర్షి ఎముకలు దేనితో తయారుచెయ్య బడ్డాయో తెలుసా, బ్రహ్మ జ్ఞానంతా యముకల్లో దాచుకున్నాడు దదీచి మహార్షి, అంత గొప్ప ఎముకలతో చేయ్యబడింది వజ్రాయుధం, ఇప్పుడు వచ్చిన వజ్రాయుధం ఏమీ చెయ్యలేక పోతె ఈ అవమానం ఎవరికి వెళ్తుంది , దదీచి మహర్షి యముకకి వెళ్తుంది . అందుకని ఒక పని చేయి ఒక ఈక ముక్కని తెంపి వెళ్ళిపో అన్నాడు గరుత్మంతుడు.  ఇప్పుడు ఆ వజ్రాయుధం ఆయన మాట మన్నించి ఒక ఈక ముక్కని కోసి వెల్లిపొయింది.
వెళ్లి పోతే అక్కడ ఉన్న ఋషులు మహర్షులు అన్నారు , అమ్మ బాబోయి ఆ రెక్కలేమి ఆ ఈకలేమి , ఆ బలమేమి కాబట్టి ఈయనని మేము సుపర్ణుడు అని కీర్తిస్తున్నాం అన్నారు. అప్పుడు గరుత్మంతునికి సుపర్ణుడు అని బిరుదు నామం వచ్చింది.

ఆ వజ్రాయుధం వెనక్కి వచ్చింది , ఆయన వెళ్ళిపోతున్నాడు అమృత భాండం పట్టుకుని, ఇంద్రుడు పరుగు పరుగు న వచ్చి మహానుభావా ! ఏమి బలం ఏమి   పరాక్రమం, ఏమి శౌర్యమ్, లోకం లో ఇంకేవారికైనా ఉందా , కాబట్టి నీతో నేను స్నేహం చెయ్యాలనుకుంటున్నాను, మనమిద్దరం శత్రువులం కాదు ఇంక నించి. అసలు యదార్ధానికి ఇద్దరూ కశ్యప ప్రజాపతి   బిడ్డలే  కదండీ!

నీకు అమృతం అవసరo  లేదు అంటున్నావు. అమృతం వాళ్ళ ఏమి వస్తుందో అది వచ్చేసింది మహా విష్ణువు వలన. నిన్ను చుస్తే నువ్వు అమరుడవు, అజరుడవు, నీకు వృద్దాప్యం రాదు, నిన్ను ఎవ్వరూ కుడా వోడించ లేరు అజితుడవు. అమేయుడవు, నీ బలం ఇంత అని లెక్క పెట్టటం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి నీకు అమృతం ఎందుకు అక్కర్లేదు, అక్కర్లేని అమృతాన్ని నువ్వు పట్టుకేల్తే వచ్చేఉపద్రవం ఏమిటో తెలుసా , నువ్వు ఎవరికో అమృతం పట్టుకేల్తున్నావు , వాళ్ళు అమృతం తగేస్తారు, వాళ్ళు  ఎటువంటి వాళ్ళో  తెలీదు , నువ్వు ఎవరికి ఇస్తావో  తెలియదు. వాళ్ళు  దేవత లు నిగ్రహించ టానికి వీలు లేని వాళ్ళు అయిపోతారు.

ఇప్పుడు వాళ్ళు పాపబుద్ధి కలిగిన వాళ్ళు  అధర్మాచరణ కలిగిన వాళ్లై , నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళు తాగేస్తే , వాళ్ళని మేము నిగ్రహించ లేకపోతే , ఆ సంతానం లోకం లో పెరిగిపోతే ,   అధర్మo  జడలు విప్పి  నాట్యం చేస్తే , ఇప్పుడు అమృతము నువ్వు ఇచ్చిన కారణం చేతే లోకం లో ధర్మం పాడైపోతే. నీకు ఇన్ని గుణాలు ఉన్నా, నువ్వు చేసిన తప్పు వలన లోకం లో ధర్మం పాడైపోలా కాబట్టి దేనికి పట్టుకేల్తున్నావు నాకు చెప్పు , నీకు ఏమి కావలి కోరుకో అది నేను ఇస్తాను , కానీ ఈ అమృత భాండం తీస్కెళ్ళి ఇవ్వకు , ఉపద్రవం వస్తుంది అన్నాడు. నేను  అమ్మని దాస్యం నించి విడిపించుకోవటానికి అమృతం తెచ్చిఇస్తానని పాములకి మాట ఇచ్చాను అని చెప్పాడు. తెచ్చి ఇమ్మని అడిగారు, తగించమని అనలేదు , కాబట్టి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే నా దాస్యం వదిలి పోతుంది. నువ్వేమి చేస్తావ్ అందకూడని వాళ్ళకి అందకూడదు అని కదా నువ్వు అనుకుంటున్నావ్, కాబట్టి నేను పట్టుకెళ్ళి అక్కడ పెడతాను , పెట్టి స్నానం చేసి వచ్చి తాగండి అని చెప్తాను. వాళ్ళు స్నానం చెయ్యటానికి వెళ్లి నప్పుడు అమృతం తెచ్చేస్కో నీ బలం తోటి మా అమ్మ దాస్యం పోతుంది, అయుగ్యులు వాళ్ళైతే వాళ్ళకి అందకుండా నువ్వు చేస్కో.
అంటే ఇంద్రుడు అన్నాడు చాలా బావుoది అలానే చేద్దాం

నువ్వు పట్టుకెళ్ళి అమృత భాండం వాళ్ళదగ్గర పెట్టి స్నానం చేసి వచ్చి తాగండి అని చెప్పు ఆ తర్వాత కాగల కార్యం గందర్వులు చుస్కుంటారు. మేము చుస్కుంటాం. అని ఆయన అన్నాడు. గరుత్మంతుని బలం గురించి బృహస్పతి చెప్తే విన్నాను , ఇప్పుడు యుద్ధం మాత్రమే చూసాను, మహానుభావా ! నీ శక్తి ఎంతో నాకు చెప్పు అన్నాడు ఇంద్రుడు. సుందరకాండ లో హనుమ ఎలా చెప్పుకోరో అలాగే గరుత్మంతుడు కూడా చెప్పుకోడు.

ఆయన అన్నాడు లోకం లో ఎక్కడైనా తనని తాను పొగుడుకోవటం, ఇతరుల్ని నింద చెయ్యటం ,ఈ రెండూ చెయ్యొచ్చా రెండూ చంపటం , చావటం తో సమానం, కాబట్టి అలా నాబలం ఇంత అని ఎలా చెప్పుకుంటాను , చెప్పకూడదు, కానీ నువ్వు పెద్దవాడివి దేవలోకాధిపతి వి పెద్ద వారు అడిగితే చెప్పాలి , నా బలాన్ని వినయం తో చెప్తున్నాను తప్ప అతిశయం తో మాత్రం కాదు , నువ్వు అడిగావని చెప్తున్నాను అంతే.

నా బలం ఎటువంటిదో  చెప్తున్నాను విను స్థావర జగమముల తో అంటే కదిలే ప్రాణులతో కదలని వాటితో ఉన్న ఈ భూమండలాన్ని అంతటిని కుడా   ఎత్తేసి నా రెక్కల మీద పెట్టుకుని తిప్పేస్తాను. ఈ సముద్ర గర్భం లో రత్నాలు ఉంటాయి , నేను సముద్రం దెగ్గరకి వెళ్లి రెక్కలు ఇలా అల్లరిస్తే ఆ సముద్రంలోని నీళ్ళు రత్నములతో సహా భూమి మీద పడిపోతాయి, చెల్లా చెదురై పడిపోతాయి భూమి మీద. ఇంకేమి ఉండవ్ అక్కడ చూడటానికి. మూడులోకములను క్షణం లో తిరిగి వచ్చేస్తా అది నా బలం , అంత కన్నా ఏమి చెప్పమంటావు బాగుండదు.

ఇంద్రుడు తెల్లబోయి, చాలా సంతోషించి మహానుభావా ! నేను కూడా నీకు ఒక వరo ఇవ్వాలనుకుంటున్నాను. దేవతలకు అదొక లక్షణం , వాళ్ళు ప్రసన్నమై కనపడితే వరం ఇవ్వకుండా ఉండరు.
 ఇప్పుడు ఇంద్రుడు గరుత్మంతునికి వరం ఇచ్చే స్థితి లో ఉన్నాడా , ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు పుచ్చుకోకుండా వెళ్ళిపోవచ్చా గరుత్మంతుడు, దేవతలు కనపడిన తరువాత అడిగి తీరాలి , లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు , అది వాళ్ళ ధర్మం, వాళ్ళ ధర్మo  తప్పితే అసహ్యం గా ఉంటుంది, కాబట్టి  అడగాలి , అడగటానికి ఇంద్రుడు అనుగ్రహిస్తే కానీ పొందలేనిది ఏముంది ఆయన కి ? శ్రీమన్నారాయణుని కే ధ్వజం అయిన వాడు , అమృతం తాగకుండానే , జరా మరణములు లేని వాడు , సహజం గానే ఇంత బలం ఉన్న వాడు, ఇటువంటి వాడికి ఇంద్రుడు ఏమి ఇవ్వాలి కనక.
కానీ వినయం ఉన్న వాడు అడగ గలిగింది అడిగాడు , గరుత్మంతుడు. అది ఆయన వినయం అంటే.  నువ్వు వరం అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను.
మా అమ్మని అంత బాధ పెట్టారు, పిన్నమ్మా అని జాలి చూపించలేదు. పాపం మా అమ్మ అంత ఊడిగం చేస్తుంటే ప్రేమతో వద్దులెమ్మా అక్కర్లేదు దాస్యం అని వదిలిపెట్ట లేదు. నేను పుట్టిన తరువాత నాతో కూడా దాస్యం చేయించు కున్నారు. నేనే బాధ తో వెళ్లి ఆడితే పోన్లే తమ్ముడు దీనికి నువ్వేదో వెళ్లి తీస్కువస్తే దాస్యం నించి విముక్తి పొందాలా అక్కర్లేదు లే, హాయి గా ఇవ్వాళ నించి నువ్వు ఎప్పుడూ మాకు తమ్ముడివే, అని అనలేదు. కారణం లేకుండా వైరం  పెట్టుకుని , మా బలాన్ని వాళ్ళ ఉన్నతి కి ఉపయోగించుకోవాలని కోరుకున్నారు, అది నాకు కడుపులో నిప్పు కణిక గా మిగిలిపొయింది. పోరు నష్టం పొందు లాభం. కాబట్టి ఇప్పుడు నిన్ను నేను అడుగుతున్నాను , ఈ  లోకాల లో ఎక్కడ ఉన్న పాములైన నాకు  ఆహారం అయిపోవాలి. కాబట్టి నాకు ఆ వరం ఇవ్వు అన్నాడు.

నేను ఆ పాముల్ని ఆహారం గా చేస్కోవటానికి నేను వరం ఇవ్వకర్లేదు , నేనే తినెయ్య గలను. అయినా నిన్ను ఎందుకు అడుగు తున్ననో తెలుసా , ఈ భువనముల అన్నిటికి నీకు ఆధిపత్యం ఉంది , పాములు అక్కడ తిరుగుతూ ఉంటాయి. నేను వెళ్లి తింటాను . అప్పుడు అవి నిన్ను ప్రార్ధిస్తే నువ్వు వచ్చి నా పరిపాలన లో ఉన్నాయి , అవి నన్ను ప్రార్ధించాయి , నువ్వు అలా తినేయోచ్చా అని అడుగొచ్చు , నీ పరిపాలన లో ఉన్నదాన్ని నేను తినే ముందు నీ అనుమతి అడిగితే గురవం గా ఉంటుంది. కాబట్టి వరం రూపం లో నీ అనుమతి పుచ్చు కుంటే, నువ్వు జోక్యం చేస్కోవు. అప్పుడు నువ్వు నా మీదకి యుద్దానికి రావక్కర లేదు,  నేను నిన్ను ఒడిoచక్కర లేదు, పది మాట్లు ఇంద్రుణ్ణి ఓడించొచ్చు , కానీ నువ్వు దేవలోకా ధిపతివి, నాకన్నా ముందు పుట్టిన వాడివి , నిన్ను అస్తమానం అగౌరవమ్ చేసి నాకేమి గౌరవమ్ అయ్యా . కాబట్టి నేను నిన్ను అనుమతి ఎందుకు అడిగానో తెలుసా భవిష్య త్తు లో పది మాట్లు నేను నీ జోలికి వచ్చానాన్న అపనింద నాకు రాకూడదు.

కాబట్టి చాలా సంతొషించి తప్పకుండా , నీకు ఆహరం గా ఇచ్చేస్తున్నాను తినేసేయి అన్నాడు.

ఇప్పుడు గరుత్మంతుడు అమృత భండాన్ని తెచ్చి దర్బలతో చెయ్య బడిన ఒక చిన్న చాప లాంటిది ఉంది అక్కడ. దాని మీదా ఆ అమృత భండాన్ని పెట్టాడు. పాములన్నీ గబా గబా సంతోషం గా వచ్చి తగేస్తాం అన్నాయి.

అప్పుడు గరుత్మంతుడు అన్నాడు. చంద్రుడు , సూర్యుడు , అగ్ని , వాయువు సాక్ష్యులు గా చెప్తున్నాను , ఇంద్రుడి చేత రక్షింప బడే అమృతాన్ని ఇమ్మని అడిగారు. నేను పట్టుకోచ్చి మీకు ఇచ్చను , కాబట్టి మా దాస్యం వదిలిపో యిందా ? వదిలిపొయింది అన్నాయి పాములు. ఇంక నించి నేను మా అమ్మా మీకు దాసులం కాము అన్నాడు గరుత్మంతుడు , కాదు అని ఒప్పుకున్నాయి పాములు.

ఈ అమృతాన్ని మీరు అలా ఎలా పడితే అలా వచ్చి తాగేయ్య కూడదు. స్నానం చేసి , చక్కగా ఆభరణములు అవి పెట్టుకుని వచ్చి తగేయండి, అలాగే తాగేస్తాం తమ్ముడు అన్నాయి పాములు. చాల సంతోషం మీకు ఆ అదృష్టం ఉంటె తాగెయ్యండి అని మనసులో అనుకున్నాడు గరుత్మంతుడు. ఆయన వెంటనే ఆయన మూపున అమ్మని కూర్చో పెట్టుకుని అమ్మా నీ దాస్యం అయిపొయింది అన్నాడు, ఎంత సంతోష పడిపోయిందో ఆ తల్లి. ఆ రెక్కలు అల్లారుస్తూ అమ్మని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు.

వెళ్ళు గబా గబా స్నానం చేద్దాం అని సముద్రం దగ్గరకి వెళ్లారు . వెళ్లి స్నానం చేసి వస్తున్నారు. గరుత్మంతుడు  వెళ్లి పోతూ వెళ్ళిపోతూ ఇతరులకి కనపడ కుండా ,తనకి మాత్రమే కనపడే టట్టు నించున్న ఇంద్రుణ్ణి చూసి ఒక నమస్కారం చేసి సౌజ్ఞ చేసి (వాళ్ళకి చెప్పాను , మీ పని మీరు చూస్కోండి అని) వెళ్ళిపోయాడు.
వాళ్ళు స్నానానికి వెళ్లారు , ఇంద్రుడు వచ్చి మాళ్ళి అమృత భండాన్ని పట్టుకు పోయి , రక్షణ లో పెట్టేసాడు. ఈయనంటే తెగలిగాడు , వాళ్ళు తెచ్చుకో గలరా ? వాళ్ళు తెచ్చుకో లేరు , అక్కర్లేని పేరాస లకి  పోవటం అంటే అదే.
ఇప్పుడు వాళ్ళు స్నానం చేసి వచ్చారు, అమృత భాండం అక్కడ లేదు.

అమృత భాండం అక్కడ లేదు కాబట్టి , ఆ భాండం పెట్టిన ఈ ధర్బలు నాకేద్దాం అనుకున్నారు. నాకారు . నాకితే ఆ దర్బల యొక్క అంచులు , చాలా సూది గా పదునుగా ఉంటాయి, నాలుకలు అన్నీ చీరుకు పోయి రెండు నాలుకలు అయ్యాయి.
 అప్పటినించి పాములన్నింటికి ద్విజిహ్వులు అని అప్పటినించి పెరోచింది. కాబట్టి అలా పాములకి  దక్కింది ఏమిటి అంటే రెండు నాలుకలు అయిపోయాయి. గరుత్మంతుడికి దక్కింది ఏమిటి అంటే , శ్రీ మహా విష్ణువుకి ద్వాజమై, ఆయన కి వాహనమై , అమృతం తాగ కుండా జరా మరణములు లేని వాడై , మహానుభావుడై , లోకములకు ఎన్నో ధర్మములు నేర్పిన వాడై , తల్లి దాస్యము విడిపించిన వాడై ,  ప్రయోజకుడై , తల్లితండ్రుల యొక్క ఆనందమునకు కారకుడై, దేవతల చేత కీర్తింప బడిన వాడై, స్మరించినంత మాత్రం చేత , కధ విన్నంత మాత్రం చేత, ఆయన అనుగ్రహంతో మన ని అందరిని కూడా రక్షించే స్వభావము కలిగిన మహా పురుషుడు అయ్యాడు.

అందుకే ఎక్కడ గరుత్మంతుని కధ చెప్తారో, అక్కడ శ్రీ మహా విష్ణువు , దేవతలు కూడా ప్రీతీ చెందుతారుట. ఎవరైతే ఈ గరుత్మంతుని యొక్క కధ ని వింటున్నారో, వాళ్ళందరికీ కూడా అధికమైన తువo టి  శ్రీ , సంపదా అంటే ఇస్వర్యం , ఇతరులకు ఉపయోగపడే సంపదా పొందుతారు, ఇతరుల కష్టమును , తమ యొక్క శక్తి తో తొలగ తోయ గలిగినటు వంటి మంచి బుద్ది , ఎవరు వచ్చి నిలబడితే హమ్మయ్య ఈయన ఉన్నాడు  చాలు అని  పది మంది సంతోషిస్తారో అలా ప్రయోజకుడు కాగలిగినటువంటి వ్యవస్థ ఈ సౌపరాఖ్యానమును, ఎవరు వింటున్నారో , ఎవరు చదువు తున్నారో , అటువంటి వాళ్ళ అందరికీ కలిగుతుంది అని మహానిభావుడు , రుషితుల్యుడు అయినటువంటి, నన్నయ్య గారు తన నోటితో అని అంతే కాదు, ఈ కధ ని పరమ భక్తి   తో  విని చేతులు జోడించి నమస్కరించిన వారందరికి పాపములు అన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. వాళ్ళు అమృతమును తాగిన వారితో సమానం అవుతారు.ఈశ్వరునుగ్రహము కలుగుతుంది అని ఫలశ్రుతి చెప్పారు.