Wednesday, September 10, 2014

ఆదిపర్వం 14 (అమ్రుతాపహరణం)

అమ్రుతాపహరణం కొరకు గరుత్మంతుడు , స్వర్గం వైపుకు బయలుదేరాడు. స్వర్గలోకానికి వెళ్లేసరికి దేవేంద్రుడి సభ జరుగుతుంది. ఆ దేవేంద్ర సభలో కొన్ని దుశ్శకునములు కనపడ్డాయి అన్నారు. ఏమిటి అవి అంటే , అకస్మాత్తుగా నిప్పు రవ్వ లు పడ్డాయి, దానితో పాటుగా వజ్రాయుధం యొక్క అంచులు మొక్కవోయాయి, దిక్కులన్ని కూడా కాంతి విహినం అయిపోయాయి, అకస్మాత్తుగా  దిక్పా లకుల మనస్సులలో  భయము , ఉద్వేగము కలిగాయి. వెంటనే దేవేంద్రుడు బృహస్పతి వంక చూసాడు , గురువుగారు ఇన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, దుశ్శకునములు కనపడుతున్నాయి, ఎందువలన ఇలా కనపడుతున్నాయి అని అడిగారు.
అంటే బృహస్పతి అన్నాడు "నా యనా ఇంద్రా ! కశ్యప ప్రజాపతి పుత్ర్కమేష్టి చేస్తే పుట్టిన వాడు , అపర తేజోవంతుడు, వాలఖిల్యుల యొక్క వరం చేత పుట్టిన పిల్లవాడు అత్యుగ్రమైన ప్రాణులైన నిషాదులందరినీ  ఒక్క క్షణం లో మింగినటువంటి మహానుభావుడు, ఏనుగును తాబేటిని రోహిణి యొక్క కొమ్మ మీద పెట్టినప్పుడు ,అది విరగాబోతుంటే రెండు పదములతో ఏనుగుని , తాబేలుని , ముక్కుతో వలఖిల్యులున్న కొమ్మని ముక్కుతో పట్టుకుని వెళ్లి వలఖిల్యులని రక్షించిన తెజోముర్తి, తన తల్లి దాస్యం పోగాట్టటం కోసమని, అమృతాన్ని పాములకి ఇవ్వడం కోసమని.
కామ రూప సంపన్నుడు , అంటే ఆయన అనుకుంటే చిన్న వాడు అయిపోతాడు, లేదా ఇం కా   పెరిగి పోతాడు , ఇంకో రూపం ధరిస్తాడు. అన్ని శక్తులు ఉన్నటువంటి వాడు , అష్ట సిద్దులు ఉనటువంటి వాడు. కామా గమనుడు అతడు అమృత భాoడం కోసం స్వర్గలోకం వస్తున్నాడు, అతన్ని నువ్వు గెలవలేవు ఇంద్రా అన్నాడు బృహస్పతి.
అతను వాలఖిల్యుల అనుగ్రహం తో పుట్టిన వాడు అన్నాడు. అనగానే వాలఖిల్యుల అనుగ్రహం తోటి ఎందుకు పుట్ట వలసి వచ్చింది గరుత్మన్తుండు అని అడిగాడు ఇంద్రుడు.
ఆ వాలఖిల్యులు బ్రహ్మ గారి పుత్రులు, ఇంద్రుడు కశ్యప ప్రజాపతి కుమారుడు , కశ్యప ప్రజాపతికి అదితి అన్న భార్య యందు పుట్టిన వాడు. ఇంద్రుడు , వాలఖిల్యులు కూడా కశ్యప ప్రజాపతి చేసే యజ్ఞానికి వెళ్లారు , ఎప్పుడు చేశాడు యజ్ఞం , ముందు చెప్పినట్టు వినత , కద్రువ పిల్లలు కోరుకునప్పుడు , దైవానుగ్రహం కోరి పుత్ర కామేష్టి చేసాడు. యజ్ఞం చేసేటప్పుడు వీళ్ళందరూ వెళ్లారు , యజ్ఞం చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది. యజ్ఞం చేసే వాడు దీక్షితుడై ఉంటాడు.పీటల మీద నించి లేవకూడదు.  ఆయన మీద ప్రేమ ఉన్నవారు , ఆయన కి సహకరించాలి. వాలఖిల్యులు అంగుస్ట మాత్రమే ఉన్నా వారు బ్రహ్మ పుత్రులు ,మహాతేజోవంతులు , ఆజన్మ బ్రహ్మ చారులు ,అయినప్పటికీ  కశ్యప యజ్ఞం చేస్తున్నాడు , మనం మనకి తోచిన సాయం చెయ్యాలి అనుకున్నారు. దానికి కోసం వాళ్ళు కాసిని పువ్వులు కోసి , దర్భలు కోసి , మోదుగ పుల్లలు కోసి, అవి అగ్నిహోత్రం లో వేస్తారు , ఇంత ఉన్నవాళ్లు ఎన్ని పుల్లల కట్టలు ఎత్తుతారు. మీరు ఏమి చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు , ఎంత ప్రేమ తో చేస్తున్నారు అనేది ముఖ్యం.
ఇప్పుడు ఇంద్రుడు కూడా  పుల్లల కట్ట  సమిధల కట్టా , తనూ ఎందుకు చెయ్యాలి , ధర్మానికి చేస్తున్నాడు. తండ్రిగారు యజ్ఞం చేస్తుంటే కొడుకు చెయ్యక ఎవరు చేస్తారు.
ఇప్పుడు వలఖిల్యులని చూసి ఇంద్రుడు  వీళ్ళు ఎంత వాళ్ళు తెచ్చే సమిధలు ఎన్ని దీనికి అంత అగరపు అంత అలుపునా అని వీలు తెచ్చేవి ఏ మూలకి వస్తాయి అని ఇంద్రుడు పక పక నవ్వాడు. అప్పుడు ఆ వాలఖిల్యులు అన్నారు నువ్వు ఇంద్రుడివి అని కదా నవ్వావు , నీకంటే గొప్ప వాడు , యుద్దము నందు గెలవబడని వాడు , ఆయన ముందు ఎవరు యుద్ధం లో గెలవలేరు. స్వత్తఃసిద్దంగా అణిమాది అష్ట సిద్దులూ సాధించుకున్న వాడు, అటువంటి మహా పురుషుడు ఒకడు ఇప్పుడు ఈ పుత్రా కామేష్టి వలన కశ్యప ప్రజాపతి కి పుత్రుడిగా జన్మించు గాక
అన్నారు. ఈ ఇంద్రుడి కి ఇంద్రుడు అవుతాడు. వెంటనే కశ్యప ప్రజాపతి ధర్మమ్  చుడండి ఆయన అన్నాడు ఈ ఇంద్రుడు తన భుజ బాల శక్తి తో లోకాన ఉండే ప్రనులన్నింటిని కాపాడుతున్నాడు. ఇంద్రుడు అని మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మ గారు నిర్ణయం చేసారు , (ఒక పెద్ద వారు నిర్ణయం చేసినప్పుడు ఎంత గౌర్వమ్థొ ఆ నిర్ణయాన్ని అవుదల దాల్చాలో చుడండి) ఒక ఇంద్రుడు ఉండగా మళ్ళి ఇప్పుడు పుట్టబోయే పిల్లవాడిని ఇంద్రుణ్ణి చేస్తే బ్రహ్మగారు నోచ్చుకోరటయ్యా అని ఎవరిమానన వారు ఇంత మంది ఇంద్రుళ్ళ లో ఎవరు ఏది చెయ్యాలి అని పరమేస్టి కి ఎంత తలపోటు ?  కాబట్టి వద్దు , కానీ మీ మాట వృధా పోరాదు , ఈ పుట్ట బోయే పిల్లవాడు పక్షులకు ఇంద్రుడు అవుగాక అని అన్నాడు.
కాబట్టి శరీరం పక్షి శరీరం అయినా ఇంద్రుడు గెలవలేడు , అన్ని గుణములు కలవాడు.  ఇప్పుడు వలఖిల్యులలో కూడా గొప్పతనం ఎక్కడ ఉంది అంటే , వాళ్ళు పెంకితనానికి పోకుండా వొప్పుకుని తదాస్తు అన్నారు.  అందుకే ఉత్తముడైన వాడి కోపం ఒక్క క్షణం ఉంటుంది.
ఇప్పుడు ఈ కధ నీకు తెలియంది కాదు కదా అని బృహస్పతి ఇంద్రుడితో చెప్తున్నాడు. కాబట్టి వాలఖిల్యుల అనుగ్రహం తో పుట్టిన వాడు ,  అమృతాపహరణా ని కి వస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఆపగలవు, ఆపలేవు అని బృహస్పతి చెప్పా వలసిన మాట చెప్పేసారు. ఇప్పుడు ప్రయత్నం పురుష లక్షణం. కాబట్టి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తే , అమృతం అమృతాన్నే పండిస్తుంది మహాభారతం లో. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు కొంత మంది రక్షకులని పిలిపించి  అమృత భాండానికి రక్షణ చేస్తూ గరుత్మంతుని తో యుద్ధం చెయ్యండి అని అన్నాడు. ఆయన కుడా వెళ్ళాడు. ఆ అమృత భాండా న్ని రక్షణ చేసే వాళ్ళు సామాన్య మైన టువంటి వారు కాదు గొప్ప బాహు బలము కలిగిన తువంటి వాళ్ళు ,  బాగా  వాడి అయిన కడ్గాలు పట్టు కున్న వాళ్ళు,   నల్ల ని పచ్చ ని యెర్రని మెరిసి పోతున్నటు వంటి కవచములు కట్టుకున్న వాళ్ళు. వాళ్ళందరూ కూడా గరుత్మంతునితో యుద్ధాన్ని ప్రారంభం చేసారు. ఆయన కి వేరే ఆయుధం అక్కర్లేదు ఆయన ముక్కూ , రెక్కలే చాలు.
 ఇప్పుడు యుద్ధం మొదలైంది. ఆ గరుత్మంతుడు, ఆయన రెక్కలని అల్లారుస్తూ, ఆ స్వర్గలోకం లో ఒక్కసారి విహరించి , వాళ్ళని తన రెక్కలతో కొట్టి ముక్కుతో వాళ్ళని పొడుస్తుంటే, అక్కడ ఒక్కసారి ,పిడుగులు కొన్ని వేల పిడుగులు  పడితే గాలి  ఎలా వస్తుందో  అలా   ఉంది అక్కడ వాతావరణం. తెల్లటి మబ్బులు గాలికి కొట్టబడితే ఎలా ఉంటాయో అలా అక్కడ కాపు కాస్తున్న వీరులందరినీ చెదరగోట్టాడు. ఆయన రెక్కల చేత కొట్టబడి, ముక్కు తో పోడవ బడి, శరీరము నుండి  రక్త దారాలు కారుతుండగా ,వారందరూ కూడా ఇంద్రుడి వెనకకు వెళ్లి దాక్కున్నారు, సాత్యులు పూర్వ దిక్కుకు పారిపోయారు, వసువులు రుద్రులు దక్షిణ దిక్కు కు పారిపోయారు. డబ్బు లేని వారు దక్షిణ కొరకు ఆశ్రయించి నట్టు దక్షిణ దిక్కుని ఆశ్రయించారు అన్నారు. ఆదిచ్యులు , ఆస్వినులు వారందరూ ఉత్తర దిక్కు కు పారిపోయారు. ఇంకా మిగిలినటువంటి , అగ్ని , వాయువు , యముడు మిగిలనుటువంటి దేవతలు, శరీరము నకు కారుతున్నతువంటి ఆ రక్తము కారుతుండగా ఆ దేవలోకం విడిచి పెట్టి పారిపోయారు.
ఇప్పుడు ఆ అమృత భాండం దగ్గరకు వెళ్లి ఆ అమృత భాండం తీస్కొని వెళ్ళటానికి ఉద్యుక్తుడు అయ్యాడు. దానిపైన పదునైన ఆకులు కలిగిన ఒక చక్రం తిరుగుతుంది. ఆ చక్రం కింద రెండు పాములు ఉన్నాయ్ , ఆ రెండు పాముల నోటిలోనించి అగ్నిహోత్రాన్ని వేదజల్లుతున్నై. ఆ అగ్ని హోత్రం ఎలా పైకి లేస్తుంది అంటే, తలపైకి ఎత్తి ఏదో  అందిన మధురపదార్థం నాకుతున్నట్టు , వాటి నోట్లోనించి అగ్నిహోత్రం పైకి ఎగజిమ్ముతూ ఆకాశాన్ని  నాకుతుంది.
చూసాడు మహానుభావుడు, ఒక్క సారి భూమి మీదకి వచ్చి సమస్త జలాశయాల్లో ఉన్న నీటి ని తన దోసిట పట్టి, అకస్మాత్తుగా దేవలోకం వెళ్లి , ఆ చక్రం మధ్య గా వస్తున్న అగ్ని హోత్రం మీద ఇన్ని నదుల నీళ్లన్నీ పోసేసాడు. ఇప్పుడు ఆ అగ్ని హోత్రం చల్లరిపొయింది అది గరుత్మంతుని బలం అంటే, ఆ బలాన్ని స్మరించి దాన్ని వింటే చాలు అంత గొప్ప రక్షణ కలుగుతుంది.
 ఆయన కామరూపం కలిగిన వాడు కదండీ , ఆ చక్రం కింద ఉండి  ,  భయంకరం గా అగ్ని చూస్తున్న ఆ నగుల్ని చూసాడు. ఆ పైన తిరుగుతున్నా చక్రాన్ని చూసాడు.  సుక్ష్మ రూపాన్ని పొంది, చక్రం పైనించి కాకుండా చక్రం కిందనించి కిందకి దూరాడు.
కిందకి దూరి,  తన వైపే చూస్తూ అగ్నిహోత్రం విడిచిపెట్ట టానికి ప్రయత్నిస్తున్న ఆ నగుల కన్నులలో ధూళి పడి వాటికి కన్నులు కనపడకుండా ఆ రెక్కల్ని అల్లర్చి నందుకు ,కన్నులు కనపడక ఆ పాములు చెల్లా చెదురై పోయాయి.
ఇప్పుడు ఆ అమృత భండాన్ని పట్టుకుని , భూలోకం వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఆయన వేల్లిపోతున్నప్పుడు శ్రీ మహా విష్ణువు ఎదురువచ్చారు, ఎదురు వచ్చి అన్నారు
ఒక్కడు ఇంత మందిని జయించి ఆ అమృత భండాన్ని గైకొని, వెళ్లి పోతూ వెళ్ళిపోతూ  దేవాసురులు అందరూ కూడా తగలనుకునే అమృతం తనకి  చిక్కి నా  ఒక్క చుక్క కూడా ముక్కు పెట్టి తాగకుండా, అమ్మని దాస్యం నించి విడిపించటానికి మాట ఇచ్చిన ప్రకారం అన్నల కి ఇచ్చేయటం కోసం పట్టుకెళ్ళి పోతు అలోలుడై (అమృతం మీద లౌల్యమ్ పొందకుండా ) వెళ్ళిపోతున్న మహా పురుషుడు, కాబట్టి నేను చాలా సంతోషించాను నీకు ఏమివరం కావాలో కోరుకో అన్నాడు, నీ బలానికి నీ మనోజవానికి , నీ అలౌల్యానికి నీ సద్భావనకి , అమ్మని దస్యo నించి విడిపించాలి అని ఇంత కష్ట పడ్డ నిన్ను చూసి చాల సంతోషించాను గరుత్మంతా నీకు ఏమి కావలి కోరుకో అన్నారు శ్రీ మహా విష్ణువు.

అంటే గరుత్మంతుడు అన్నారు ఆయనకి నమస్కారం చేసి అన్నాడు అమృతం తాగితే వ్రుధప్యం రాదు, మృత్యువు రాదు , కానీ నువ్వు చాలా ఉద్దతి తో ఉన్న రాక్షసులను నిగ్రహించాగాలిగిన ధర్మ స్వరూపుడ వైనటు వంటి నారాయణా! నన్ను అనుగ్రహించి , ఈ అమృతాన్ని తాగకుండానే ,  మరణo  రాకుండా వరం ఇయ్యి , నువ్వు రాక్షస విద్వంసం చేస్తూ ఉంటావు , నీ ముందు నిలబడాలి, అప్పుడు ఏమవుతుంది , ఈ బలం ఈ జవం నువ్వు చేసే రాక్షస సంహారానికి పనికి వస్తే ఈ ఉండిపోయిన బలానికి ఒక సార్ధకత, కాబట్టి నాకు జరా మరణముల తో సంభంధం లేని జీవితం తో నీ సన్నిధి ని నిలబడే అదృష్టాన్ని కృపచెయ్యి అని అడిగాడు.

ఇప్పుడు ఆ గరుత్మంతుడు కోరుకున్న వరాన్ని ఇచ్చారు కానీ ఇంద్రుడు మాత్రం తన కర్తవ్య నిర్వహణ తానుచేయ్యాలి కదా , అక్కడ ఉన్న రక్షకులు ఒడిపోయారు.   అందుకని తన వజ్రాయుధం తీసాడు, ఆ వజ్రాయుధపు అంచులు మెరిసిపోతున్నై, అది గరుత్మంతునికి దగ్గరగా వెళ్ళింది , గరుత్మంతుడు ఒక నవ్వు నవ్వి అన్నాడు , నువ్వు  వచ్చావ్ మంచిదే, పాపం ఇంద్రుడు విడిచిపెట్టాడు , నువ్వు వచ్చావు, నీ బలం ఇతరుల మీద చూపించు, నా మీద చూపిస్తే నీకు ఏమి వస్తుంది. నువ్వు ఏమి చెయ్యలేవు, కాని నువ్వు ఏమీ చెయ్యలేక పోయావ్ అనుకో, నీకు కాదు అవమానం , ఎవరికి అవమానమో తెలుసా, నిన్ను దేనితో తయారు చేసారో తెలుసా దదీచి మహర్షి ఎముకలతో తాయారు చేసారు.
దదీచి మహర్షి ఎముకలు దేనితో తయారుచెయ్య బడ్డాయో తెలుసా, బ్రహ్మ జ్ఞానంతా యముకల్లో దాచుకున్నాడు దదీచి మహార్షి, అంత గొప్ప ఎముకలతో చేయ్యబడింది వజ్రాయుధం, ఇప్పుడు వచ్చిన వజ్రాయుధం ఏమీ చెయ్యలేక పోతె ఈ అవమానం ఎవరికి వెళ్తుంది , దదీచి మహర్షి యముకకి వెళ్తుంది . అందుకని ఒక పని చేయి ఒక ఈక ముక్కని తెంపి వెళ్ళిపో అన్నాడు గరుత్మంతుడు.  ఇప్పుడు ఆ వజ్రాయుధం ఆయన మాట మన్నించి ఒక ఈక ముక్కని కోసి వెల్లిపొయింది.
వెళ్లి పోతే అక్కడ ఉన్న ఋషులు మహర్షులు అన్నారు , అమ్మ బాబోయి ఆ రెక్కలేమి ఆ ఈకలేమి , ఆ బలమేమి కాబట్టి ఈయనని మేము సుపర్ణుడు అని కీర్తిస్తున్నాం అన్నారు. అప్పుడు గరుత్మంతునికి సుపర్ణుడు అని బిరుదు నామం వచ్చింది.

ఆ వజ్రాయుధం వెనక్కి వచ్చింది , ఆయన వెళ్ళిపోతున్నాడు అమృత భాండం పట్టుకుని, ఇంద్రుడు పరుగు పరుగు న వచ్చి మహానుభావా ! ఏమి బలం ఏమి   పరాక్రమం, ఏమి శౌర్యమ్, లోకం లో ఇంకేవారికైనా ఉందా , కాబట్టి నీతో నేను స్నేహం చెయ్యాలనుకుంటున్నాను, మనమిద్దరం శత్రువులం కాదు ఇంక నించి. అసలు యదార్ధానికి ఇద్దరూ కశ్యప ప్రజాపతి   బిడ్డలే  కదండీ!

నీకు అమృతం అవసరo  లేదు అంటున్నావు. అమృతం వాళ్ళ ఏమి వస్తుందో అది వచ్చేసింది మహా విష్ణువు వలన. నిన్ను చుస్తే నువ్వు అమరుడవు, అజరుడవు, నీకు వృద్దాప్యం రాదు, నిన్ను ఎవ్వరూ కుడా వోడించ లేరు అజితుడవు. అమేయుడవు, నీ బలం ఇంత అని లెక్క పెట్టటం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి నీకు అమృతం ఎందుకు అక్కర్లేదు, అక్కర్లేని అమృతాన్ని నువ్వు పట్టుకేల్తే వచ్చేఉపద్రవం ఏమిటో తెలుసా , నువ్వు ఎవరికో అమృతం పట్టుకేల్తున్నావు , వాళ్ళు అమృతం తగేస్తారు, వాళ్ళు  ఎటువంటి వాళ్ళో  తెలీదు , నువ్వు ఎవరికి ఇస్తావో  తెలియదు. వాళ్ళు  దేవత లు నిగ్రహించ టానికి వీలు లేని వాళ్ళు అయిపోతారు.

ఇప్పుడు వాళ్ళు పాపబుద్ధి కలిగిన వాళ్ళు  అధర్మాచరణ కలిగిన వాళ్లై , నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళు తాగేస్తే , వాళ్ళని మేము నిగ్రహించ లేకపోతే , ఆ సంతానం లోకం లో పెరిగిపోతే ,   అధర్మo  జడలు విప్పి  నాట్యం చేస్తే , ఇప్పుడు అమృతము నువ్వు ఇచ్చిన కారణం చేతే లోకం లో ధర్మం పాడైపోతే. నీకు ఇన్ని గుణాలు ఉన్నా, నువ్వు చేసిన తప్పు వలన లోకం లో ధర్మం పాడైపోలా కాబట్టి దేనికి పట్టుకేల్తున్నావు నాకు చెప్పు , నీకు ఏమి కావలి కోరుకో అది నేను ఇస్తాను , కానీ ఈ అమృత భాండం తీస్కెళ్ళి ఇవ్వకు , ఉపద్రవం వస్తుంది అన్నాడు. నేను  అమ్మని దాస్యం నించి విడిపించుకోవటానికి అమృతం తెచ్చిఇస్తానని పాములకి మాట ఇచ్చాను అని చెప్పాడు. తెచ్చి ఇమ్మని అడిగారు, తగించమని అనలేదు , కాబట్టి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే నా దాస్యం వదిలి పోతుంది. నువ్వేమి చేస్తావ్ అందకూడని వాళ్ళకి అందకూడదు అని కదా నువ్వు అనుకుంటున్నావ్, కాబట్టి నేను పట్టుకెళ్ళి అక్కడ పెడతాను , పెట్టి స్నానం చేసి వచ్చి తాగండి అని చెప్తాను. వాళ్ళు స్నానం చెయ్యటానికి వెళ్లి నప్పుడు అమృతం తెచ్చేస్కో నీ బలం తోటి మా అమ్మ దాస్యం పోతుంది, అయుగ్యులు వాళ్ళైతే వాళ్ళకి అందకుండా నువ్వు చేస్కో.
అంటే ఇంద్రుడు అన్నాడు చాలా బావుoది అలానే చేద్దాం

నువ్వు పట్టుకెళ్ళి అమృత భాండం వాళ్ళదగ్గర పెట్టి స్నానం చేసి వచ్చి తాగండి అని చెప్పు ఆ తర్వాత కాగల కార్యం గందర్వులు చుస్కుంటారు. మేము చుస్కుంటాం. అని ఆయన అన్నాడు. గరుత్మంతుని బలం గురించి బృహస్పతి చెప్తే విన్నాను , ఇప్పుడు యుద్ధం మాత్రమే చూసాను, మహానుభావా ! నీ శక్తి ఎంతో నాకు చెప్పు అన్నాడు ఇంద్రుడు. సుందరకాండ లో హనుమ ఎలా చెప్పుకోరో అలాగే గరుత్మంతుడు కూడా చెప్పుకోడు.

ఆయన అన్నాడు లోకం లో ఎక్కడైనా తనని తాను పొగుడుకోవటం, ఇతరుల్ని నింద చెయ్యటం ,ఈ రెండూ చెయ్యొచ్చా రెండూ చంపటం , చావటం తో సమానం, కాబట్టి అలా నాబలం ఇంత అని ఎలా చెప్పుకుంటాను , చెప్పకూడదు, కానీ నువ్వు పెద్దవాడివి దేవలోకాధిపతి వి పెద్ద వారు అడిగితే చెప్పాలి , నా బలాన్ని వినయం తో చెప్తున్నాను తప్ప అతిశయం తో మాత్రం కాదు , నువ్వు అడిగావని చెప్తున్నాను అంతే.

నా బలం ఎటువంటిదో  చెప్తున్నాను విను స్థావర జగమముల తో అంటే కదిలే ప్రాణులతో కదలని వాటితో ఉన్న ఈ భూమండలాన్ని అంతటిని కుడా   ఎత్తేసి నా రెక్కల మీద పెట్టుకుని తిప్పేస్తాను. ఈ సముద్ర గర్భం లో రత్నాలు ఉంటాయి , నేను సముద్రం దెగ్గరకి వెళ్లి రెక్కలు ఇలా అల్లరిస్తే ఆ సముద్రంలోని నీళ్ళు రత్నములతో సహా భూమి మీద పడిపోతాయి, చెల్లా చెదురై పడిపోతాయి భూమి మీద. ఇంకేమి ఉండవ్ అక్కడ చూడటానికి. మూడులోకములను క్షణం లో తిరిగి వచ్చేస్తా అది నా బలం , అంత కన్నా ఏమి చెప్పమంటావు బాగుండదు.

ఇంద్రుడు తెల్లబోయి, చాలా సంతోషించి మహానుభావా ! నేను కూడా నీకు ఒక వరo ఇవ్వాలనుకుంటున్నాను. దేవతలకు అదొక లక్షణం , వాళ్ళు ప్రసన్నమై కనపడితే వరం ఇవ్వకుండా ఉండరు.
 ఇప్పుడు ఇంద్రుడు గరుత్మంతునికి వరం ఇచ్చే స్థితి లో ఉన్నాడా , ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు పుచ్చుకోకుండా వెళ్ళిపోవచ్చా గరుత్మంతుడు, దేవతలు కనపడిన తరువాత అడిగి తీరాలి , లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు , అది వాళ్ళ ధర్మం, వాళ్ళ ధర్మo  తప్పితే అసహ్యం గా ఉంటుంది, కాబట్టి  అడగాలి , అడగటానికి ఇంద్రుడు అనుగ్రహిస్తే కానీ పొందలేనిది ఏముంది ఆయన కి ? శ్రీమన్నారాయణుని కే ధ్వజం అయిన వాడు , అమృతం తాగకుండానే , జరా మరణములు లేని వాడు , సహజం గానే ఇంత బలం ఉన్న వాడు, ఇటువంటి వాడికి ఇంద్రుడు ఏమి ఇవ్వాలి కనక.
కానీ వినయం ఉన్న వాడు అడగ గలిగింది అడిగాడు , గరుత్మంతుడు. అది ఆయన వినయం అంటే.  నువ్వు వరం అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను.
మా అమ్మని అంత బాధ పెట్టారు, పిన్నమ్మా అని జాలి చూపించలేదు. పాపం మా అమ్మ అంత ఊడిగం చేస్తుంటే ప్రేమతో వద్దులెమ్మా అక్కర్లేదు దాస్యం అని వదిలిపెట్ట లేదు. నేను పుట్టిన తరువాత నాతో కూడా దాస్యం చేయించు కున్నారు. నేనే బాధ తో వెళ్లి ఆడితే పోన్లే తమ్ముడు దీనికి నువ్వేదో వెళ్లి తీస్కువస్తే దాస్యం నించి విముక్తి పొందాలా అక్కర్లేదు లే, హాయి గా ఇవ్వాళ నించి నువ్వు ఎప్పుడూ మాకు తమ్ముడివే, అని అనలేదు. కారణం లేకుండా వైరం  పెట్టుకుని , మా బలాన్ని వాళ్ళ ఉన్నతి కి ఉపయోగించుకోవాలని కోరుకున్నారు, అది నాకు కడుపులో నిప్పు కణిక గా మిగిలిపొయింది. పోరు నష్టం పొందు లాభం. కాబట్టి ఇప్పుడు నిన్ను నేను అడుగుతున్నాను , ఈ  లోకాల లో ఎక్కడ ఉన్న పాములైన నాకు  ఆహారం అయిపోవాలి. కాబట్టి నాకు ఆ వరం ఇవ్వు అన్నాడు.

నేను ఆ పాముల్ని ఆహారం గా చేస్కోవటానికి నేను వరం ఇవ్వకర్లేదు , నేనే తినెయ్య గలను. అయినా నిన్ను ఎందుకు అడుగు తున్ననో తెలుసా , ఈ భువనముల అన్నిటికి నీకు ఆధిపత్యం ఉంది , పాములు అక్కడ తిరుగుతూ ఉంటాయి. నేను వెళ్లి తింటాను . అప్పుడు అవి నిన్ను ప్రార్ధిస్తే నువ్వు వచ్చి నా పరిపాలన లో ఉన్నాయి , అవి నన్ను ప్రార్ధించాయి , నువ్వు అలా తినేయోచ్చా అని అడుగొచ్చు , నీ పరిపాలన లో ఉన్నదాన్ని నేను తినే ముందు నీ అనుమతి అడిగితే గురవం గా ఉంటుంది. కాబట్టి వరం రూపం లో నీ అనుమతి పుచ్చు కుంటే, నువ్వు జోక్యం చేస్కోవు. అప్పుడు నువ్వు నా మీదకి యుద్దానికి రావక్కర లేదు,  నేను నిన్ను ఒడిoచక్కర లేదు, పది మాట్లు ఇంద్రుణ్ణి ఓడించొచ్చు , కానీ నువ్వు దేవలోకా ధిపతివి, నాకన్నా ముందు పుట్టిన వాడివి , నిన్ను అస్తమానం అగౌరవమ్ చేసి నాకేమి గౌరవమ్ అయ్యా . కాబట్టి నేను నిన్ను అనుమతి ఎందుకు అడిగానో తెలుసా భవిష్య త్తు లో పది మాట్లు నేను నీ జోలికి వచ్చానాన్న అపనింద నాకు రాకూడదు.

కాబట్టి చాలా సంతొషించి తప్పకుండా , నీకు ఆహరం గా ఇచ్చేస్తున్నాను తినేసేయి అన్నాడు.

ఇప్పుడు గరుత్మంతుడు అమృత భండాన్ని తెచ్చి దర్బలతో చెయ్య బడిన ఒక చిన్న చాప లాంటిది ఉంది అక్కడ. దాని మీదా ఆ అమృత భండాన్ని పెట్టాడు. పాములన్నీ గబా గబా సంతోషం గా వచ్చి తగేస్తాం అన్నాయి.

అప్పుడు గరుత్మంతుడు అన్నాడు. చంద్రుడు , సూర్యుడు , అగ్ని , వాయువు సాక్ష్యులు గా చెప్తున్నాను , ఇంద్రుడి చేత రక్షింప బడే అమృతాన్ని ఇమ్మని అడిగారు. నేను పట్టుకోచ్చి మీకు ఇచ్చను , కాబట్టి మా దాస్యం వదిలిపో యిందా ? వదిలిపొయింది అన్నాయి పాములు. ఇంక నించి నేను మా అమ్మా మీకు దాసులం కాము అన్నాడు గరుత్మంతుడు , కాదు అని ఒప్పుకున్నాయి పాములు.

ఈ అమృతాన్ని మీరు అలా ఎలా పడితే అలా వచ్చి తాగేయ్య కూడదు. స్నానం చేసి , చక్కగా ఆభరణములు అవి పెట్టుకుని వచ్చి తగేయండి, అలాగే తాగేస్తాం తమ్ముడు అన్నాయి పాములు. చాల సంతోషం మీకు ఆ అదృష్టం ఉంటె తాగెయ్యండి అని మనసులో అనుకున్నాడు గరుత్మంతుడు. ఆయన వెంటనే ఆయన మూపున అమ్మని కూర్చో పెట్టుకుని అమ్మా నీ దాస్యం అయిపొయింది అన్నాడు, ఎంత సంతోష పడిపోయిందో ఆ తల్లి. ఆ రెక్కలు అల్లారుస్తూ అమ్మని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు.

వెళ్ళు గబా గబా స్నానం చేద్దాం అని సముద్రం దగ్గరకి వెళ్లారు . వెళ్లి స్నానం చేసి వస్తున్నారు. గరుత్మంతుడు  వెళ్లి పోతూ వెళ్ళిపోతూ ఇతరులకి కనపడ కుండా ,తనకి మాత్రమే కనపడే టట్టు నించున్న ఇంద్రుణ్ణి చూసి ఒక నమస్కారం చేసి సౌజ్ఞ చేసి (వాళ్ళకి చెప్పాను , మీ పని మీరు చూస్కోండి అని) వెళ్ళిపోయాడు.
వాళ్ళు స్నానానికి వెళ్లారు , ఇంద్రుడు వచ్చి మాళ్ళి అమృత భండాన్ని పట్టుకు పోయి , రక్షణ లో పెట్టేసాడు. ఈయనంటే తెగలిగాడు , వాళ్ళు తెచ్చుకో గలరా ? వాళ్ళు తెచ్చుకో లేరు , అక్కర్లేని పేరాస లకి  పోవటం అంటే అదే.
ఇప్పుడు వాళ్ళు స్నానం చేసి వచ్చారు, అమృత భాండం అక్కడ లేదు.

అమృత భాండం అక్కడ లేదు కాబట్టి , ఆ భాండం పెట్టిన ఈ ధర్బలు నాకేద్దాం అనుకున్నారు. నాకారు . నాకితే ఆ దర్బల యొక్క అంచులు , చాలా సూది గా పదునుగా ఉంటాయి, నాలుకలు అన్నీ చీరుకు పోయి రెండు నాలుకలు అయ్యాయి.
 అప్పటినించి పాములన్నింటికి ద్విజిహ్వులు అని అప్పటినించి పెరోచింది. కాబట్టి అలా పాములకి  దక్కింది ఏమిటి అంటే రెండు నాలుకలు అయిపోయాయి. గరుత్మంతుడికి దక్కింది ఏమిటి అంటే , శ్రీ మహా విష్ణువుకి ద్వాజమై, ఆయన కి వాహనమై , అమృతం తాగ కుండా జరా మరణములు లేని వాడై , మహానుభావుడై , లోకములకు ఎన్నో ధర్మములు నేర్పిన వాడై , తల్లి దాస్యము విడిపించిన వాడై ,  ప్రయోజకుడై , తల్లితండ్రుల యొక్క ఆనందమునకు కారకుడై, దేవతల చేత కీర్తింప బడిన వాడై, స్మరించినంత మాత్రం చేత , కధ విన్నంత మాత్రం చేత, ఆయన అనుగ్రహంతో మన ని అందరిని కూడా రక్షించే స్వభావము కలిగిన మహా పురుషుడు అయ్యాడు.

అందుకే ఎక్కడ గరుత్మంతుని కధ చెప్తారో, అక్కడ శ్రీ మహా విష్ణువు , దేవతలు కూడా ప్రీతీ చెందుతారుట. ఎవరైతే ఈ గరుత్మంతుని యొక్క కధ ని వింటున్నారో, వాళ్ళందరికీ కూడా అధికమైన తువo టి  శ్రీ , సంపదా అంటే ఇస్వర్యం , ఇతరులకు ఉపయోగపడే సంపదా పొందుతారు, ఇతరుల కష్టమును , తమ యొక్క శక్తి తో తొలగ తోయ గలిగినటు వంటి మంచి బుద్ది , ఎవరు వచ్చి నిలబడితే హమ్మయ్య ఈయన ఉన్నాడు  చాలు అని  పది మంది సంతోషిస్తారో అలా ప్రయోజకుడు కాగలిగినటువంటి వ్యవస్థ ఈ సౌపరాఖ్యానమును, ఎవరు వింటున్నారో , ఎవరు చదువు తున్నారో , అటువంటి వాళ్ళ అందరికీ కలిగుతుంది అని మహానిభావుడు , రుషితుల్యుడు అయినటువంటి, నన్నయ్య గారు తన నోటితో అని అంతే కాదు, ఈ కధ ని పరమ భక్తి   తో  విని చేతులు జోడించి నమస్కరించిన వారందరికి పాపములు అన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. వాళ్ళు అమృతమును తాగిన వారితో సమానం అవుతారు.ఈశ్వరునుగ్రహము కలుగుతుంది అని ఫలశ్రుతి చెప్పారు.





















                 

No comments:

Post a Comment