గరుత్మంతుడు అమృతాన్ని తీస్కుని వచ్చినా , పాములు ఆ అమృతాన్ని పొందలేని స్థితి ని విన్న ఆది శేషుడు,ఆయన కుడా కద్రువ యొక్క సంతానములో ఒక్కడే కానీ ఆయన తీవ్రమైన పరితాపాన్ని పొందాడు. మా అమ్మా నా సోదరులు కుడా చాలా ప్రవర్తించ కూడని విధానం లో ప్రవర్తిస్తున్నారు, ఆ వినతని ఆమె కుమారుడైన గరుత్మంతుణ్ణి మిక్కిలి ఖేదమునకు గురిచేసారు. అటువంటి సోదరులతో నేను కలిసి ఉండను అనుకున్నాడు.
అయితే ధర్మ పక్షపాతి అయినటువంటి వ్యక్తి కి ఎప్పుడూ ఈశ్వర అనుగ్రహం ఉంటుంది. ఎవరితో కలిసి ఉన్నాడు ఎవరితో విడిపోయాడు అన్న దానికి ప్రాతిపదిక ధర్మం అయితే, దానికి భగవంతుని కృప ఉంటుంది. ఆది శేషుని యొక్క ఖేదం , సోదరులమీద ఎందుకు అంటే వారు సరియైన ప్రవర్తన కలిగిన వారు కారు అని కా బట్టి ఆయన చతుర్ముఖ బ్రహ్మ గారి గురించి తపస్సు చేసారు. ఆ తపస్సు కూడా ఒక్క చోట చేసిన తపస్సు కాదు , ఆయనా గంధ మాదన పర్వతం దగ్గర మొదలుపెట్టి భదరి క్షేత్రం లో హిమాలయలమీద , గోకర్ణం లో పుష్కరార ణ్యం లో అత్యంత పుణ్య క్షేత్రాల లో తపస్సు చేసాడు.
ఆయన తపస్సు చేస్తే ఆయన తపస్సుకి మెచ్చి చతుర్ముఖ బ్రహ్మ గారు ప్రత్యక్షం అయ్యారు, అయ్యి ఏమి కావలి అని అడిగారు. అప్పుడు ఆయన బ్రహ్మ గారి వైపు చూసి ఇలా అన్నాడు "నా తల్లి కద్రువా , నా సోదరులు కలిసి వినత ను గరుత్మంతుని అనేక ఇబ్బందులు పెట్టారు. ఆ సోదరులలో ఒకడనైన నాకు కూడా ఆ పాపం లో కొంత వస్తుంది. కాబట్టి నాకు ఇంక ఈ శరీరం లో ఉండాలి అని లేదు , కాబట్టి ఈ శరీరాన్ని విడిచి పెట్టాలి అంటే ఆత్మ హత్య చేస్కోవాలి. అది మహా పాతకం చెయ్యకూడదు , కాబట్టి నేను తపస్సు చేసి ఈ శరీరాన్ని విడిచి పెట్టాలి అనుకుంటున్నాను. నేను చేసి ఉండకపోవచ్చు మా అమ్మ మాట విని మా తమ్ములు చేసిన పనికి నాకు కూడా పాపం కలిగి ఉండొచ్చు, కాబట్టి నేను ఆ పాపం నుండి వినుర్ముక్తుడను అవుతాను అన్నాడు.
అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు ఒక చిరునవ్వు నవ్వి , నీవు నిత్య సత్య నిరతుండవు, నీకు సత్యమునందు , ధర్మం నందు తాపత్రయం ఉంది. ఎప్పుడైతే నీకు అలాంటి భావన ఉందో అప్పుడే నీ పాపం కాలిపోయింది. నిత్య సత్య ధర్మ వ్రతుడైన వాడు , దేనినైన భరించే స్థితి ని పొందుతాడు. ఆదిశేషుడు సోదరులు ఇలా ప్రవర్తిస్తునారు అని ఆయన కి ఉన్న బాలానికి ఆయనే చంపెయ్యోచ్చు వారిని కానీ చంపలేదు భరించాడు, ఇంత భరించగల శక్తి ఉందే , అది పనికి రావాలి ఇప్పుడు. దేవతలు దాన్ని వాడుకోవాలి, అంతే కానీ నువ్వు శరీరం వదిలేస్తే ఏమి వస్తుంది, అందుకని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నేను ఒక బృహత్కర కార్యం చెప్తాను , నువ్వు ఈ భూమండలాన్ని అంతటినీ నీ పడగల మీద భరించి ఉంచు అన్నాడు బ్రహ్మ గారు.
భూమికి ఎప్పుడు బరువు అవుతుంది అంటే , ధర్మ నిరతిని ప్రజలు విడిచి పెట్టేసినా , సత్య నిష్టను వదిలి పెట్టినా , భూమికి బరువు అవుతుంది. భూమి ఎవరికి చెప్తుoది అంటే రక్షణ చెయ్య గలిగిన వాడు స్థితి కారుడు విష్ణువు కాబట్టి ఆయనకి చెప్తుంది. నేను ఈ భూభారమును అంటే పాపం ను మొయ్యలేక పోతున్నాను అంటుంది. అప్పుడు ఈశ్వరుడు ఏమి చేస్తాడు అంటే అవతార స్వీకారం చేస్తాడు. ఎవరు అధర్మం పెచ్చరిల్ల టానికి కారణం అయ్యి ఉన్నారో వారిని చనకుతారు.
కాబట్టి ఇప్పుడు భూమి భారము ను పంచుకోవటానికి ఎవరు సమర్ధుడు, సత్య ధర్మం యందు ఉన్న వారు భూమి తో ఉంటె , భూమాత సంతోషిస్తుంది , వాళ్ళు ఉన్నారు అని. అంత సత్య ధర్మ వ్రతుడవైన నువ్వు ఈ భూ భారము ను మొయ్య టానికి అర్హుడవు, కాబట్టి నీ పడగల చేత ఈ భారమును వహించు అని ఆయన ఒక సలహా చెప్పారు బ్రహ్మ గారు నీ సోదరులు కేవలము పాములే కాదు గరుత్మంతుడు కూడా నీకు సోదరుడే మిగిలిన పాముల విషయం పక్కన పెట్టు. పుణ్యాత్ముడు , ధర్మాత్ముడు , గొప్ప ఈశ్వర విభూతి కలిగిన వాడితో సంభంధాన్ని ఎన్నడూ విడిచి పెట్టుకోవద్దు. ఇది ఏనాటికి అందరికి తెలియవలసిన విషయం. ప్రయత్న పూర్వకం గా నువ్వు గరుత్మంతుని తో నువ్వు చెలిమి చెయ్యి అని చెప్పి , ఆదిసేషుణ్ణి భూ భారం వహిoచటానికి నియత్రించారు బ్రహ్మ గారు. అప్పటి నించి ఆయన ఆ భూ భారమును వహిస్తున్నాడు.
అందరూ అన్నతమ్ములే కానీ భగవంతుని స్మరిస్తూ ఆయన తో సంబంధం పెట్టుకున్న వారు ఇద్దరు తల్లి శాపం నించి తప్పుకున్నారు , ఒకరు ఆదిశేషుడు , ఇంకొకరు వాసుకి.
క్షీర సాగర మదనం అప్పుడు మందర పర్వతాన్ని కవ్వం గా చేసుకుని చిలకటానికి ఒక తాడు కావాల్సి వచ్చింది. అప్పుడు వాసుకిది చాలా పెద్ద శరీరం కాబట్టి , వాసుకి ని చుట్టారు మందర పర్వతానికి. అది అంత తేలికైన విషయం కాదు , పర్వతం కి వేసి తిప్పుతుంటే అది ఎంత బాధ కలుగుతుందో శరీరానికి , కానీ వారి కోరిక మేరకు , అమృతం పుట్టటం కోసం ,శారీరకం గా అంత డస్సి పోయి, ఈశ్వరుని కొరకు తన శరీరం అంత బడలి పోవటానికి స్వీకరించాడు.
అమ్రుతోత్పాదనం అయిన తరువాత ,దేవతలు బ్రహ్మ గారికి చెప్పారు, ఈయన ఎంత కష్ట పడ్డాడో తెలుసా మహానుభావుడు . ఎంత బడలిపోయాడో ఆ వొళ్ళంతా ఎంత కంది పోయిoదో. అయినా ఒర్చుకున్నాడు మాకు అమృతం ఇవ్వటానికి , ఈయనని ఏదైనా కృప చెయ్యాలి అన్నారు , అంటే బ్రహ్మ గారు అన్నారు వీళ్ళ అమ్మ శాపం ఉంది, పాములన్నీ జనమేజయుడు చేసే యాగం లో పడి మరణించాలి. కానీ ఇతను చేసిన దైవ సేవ వలన ఇతన్ని మినహా ఇస్తున్నాను అన్నాడు. ఇతనికి అలా యాగం లో పడి మరణించ వలసిన అగత్యము ఇతనికి కలగదు.
ఆదిశేషుడు బ్రహ్మ గారిదగ్గర వరం పొందాడు , ఆయన బ్రహ్మ గారి యొక్క ఆజ్ఞ అవుదల దాలుస్తు ఉండి పోయాడు.
ఇవతల నా సోదరులకు వచ్చే ఆపద గురించి ఆయన ఆలోచించట్లేదు ,జనమేజయుడు ఏదో ఒక రోజు మొదలు పెట్టేస్తాడు సర్పయాగాన్ని, ఎప్పుడు కృత యుగం లో ఇచ్చింది ఆవిడా శాపం , ఎప్పుడు చేసాడు యజ్ఞం , కలియుగ ప్రారంభం లో చేసాడు యజ్ఞం. ఒక్క సారి ఇచ్చిన శాప వాక్కు కట్టి కుడుప వలసిందే. ఆదిశేషుడు పట్టించు కోడు, అవతల పాములు పట్టించు కోవట్లేదు, ఎప్పుడు సర్ప యాగం జరుగుతుందో అని ఆందోళన తో వాసుకు ఏడుస్తున్నాడు.
ఐరవతాధులు అన్న పాముల జాతిని పిలిచి ఆయన తన బాధ వ్యక్తం చేస్తున్నాడు. వాళ్ళు దుoదుడుకు స్వభావం కలిగిన వారు. వాళ్ళకి ఎంత మంచి మాట చెప్పినా తలకి ఎక్కదు. ఒకడు చెప్తే తలకి ఎక్కించు కొని వాడే భూమికి భారం. వాళ్ళన్నారు ఏమిటన్నయ్యా అంత బెంగ పెట్టుకుంటావు , యాగం చేసేది ఆయన అయితే , పాడుచేయ్యటం మనకి రాదా ? బోలెడు మార్గాలు ఉన్నాయి యాగం పాడుచెయ్యాటానికి.
జనమేజయుడికి బ్రాహ్మణులు అంటే భక్తి కాబట్టి ,మనం బ్రాహ్మణ వేషాల తో వెళ్దాం. వెళ్తే బ్రాహ్మణులు వచ్చారని స్వాగతం చెప్పి కూర్చోబెట్టి ఏమిటి అంటాడు. చాలా తప్పు ఇలాంటి యాగం చెయ్యకూడదు , చేశావా నీకు రెండూ పోతాయి , ఇహము పోతుoది పరము పోతుంది. ఇక్కడా సుఖం ఉండదు , పైలోకాల లో సుఖం ఉండదు , రెండు పోయే యాగం ఎందుకు చేస్తావ్? అని మనం చెప్తాం , బ్రాహ్మణ భక్తి తో యాగం చెయ్యటం మానేస్తాడు.
ఒక వేళ వినకపోతే మన లోనే కోoదరిని ఆoతరoగికుల మంత్రుల వేషాలు వేయిద్దాం, కామ రూపులం కాబట్టి , మంత్రుల మాట కాదనడుగా. వెళ్లి పరమ ప్రేమతో జనమేజయా ఇటువంటి యాగం చెయ్యొద్దు అని చెప్దాం, వింటాడు.
ఇంకా వినలేదు అనుకో యాగం మొదలు పెట్టి ఋత్విక్కులు కూర్చుంటారు. భక్ష్యం , భోజ్యం , లేహ్యము , చోష్యము. తినేవి తాగేవి నాకేవి ,చప్పరించేవి , ఇవన్ని ఉంటాయిగా , వాటన్నిటి మీదా పాకేద్దాం మనందరం. మనదరం పాకేస్తే విష తుల్యం అయిపోతుంది , దాన్ని హవిస్సు గా ఇవ్వరు గా. అక్కడ హవిస్సు పాత్ర ఉంటుంది , నేతి పాత్ర ఉంటుంది ,వాటన్నింటి మీదా పాకేద్దాం. అంతేకాదు ఒజ్జలు అంటే ఉపాధ్యాయుడు వాళ్ళు కుర్చుని ఉంటారు యాగం చేద్దాం అని వెళ్లి వాళ్ళ మీద పడదాం పడి తలలెత్తి బుస్స్ అందాం వాళ్ళు లేచి పారిపోతారు. ఇంక దీక్షాభంగం అవుతుంది, ఇంకా యాగం జరగదు. ఏమిటన్నయ్యా బాధ పడతావు వదిలేయి అన్నారు
అందులో ఉన్న కొంతమంది పెద్దలు అన్నారు, మీరు చాలా తేలికగా చేస్తున్నారు రా , ఒక సారి బ్రాహ్మణుడు మత్రోచ్చాటనం చేసి మనం అందులో పడిపోవాలి అన్న సంకల్పం చేసిన వెంటనే అపకారం చెయ్యటానికి వెళ్ళిన మనం ఎక్కడ ఉన్నామో వెతుక్కుంటూ వస్తాయి అగ్ని కీలలు తినటానికి. నువ్వు వాళ్ళ మీద పాకటం కాదు నీ మీదకి అగ్ని పాకుతుంది. ఎందుకంటే అగ్ని కి వ్యాపించే గుణం ఉంది అందుకే అశ్వ శబ్దం తో పిలుస్తారు దాన్ని. నువ్వు నేను దాని మీద పాకటం ఏమిటి , బ్రాహ్మణుల మీద పడటం ఏమిటి ఎమన్నా మతి ఉందా నువ్వు చేసే ఆలోచనకి , ఏమీ బావోలేదు నువ్వు చెప్పిన ఆలోచన.
వాసుకి తెల్లబోయి వింటున్నాడు , ఎలా దీనికి పరిష్కారం ఏమిటి, మరి వీళ్ళు ఎలా రక్షింపబడతారు. అందులో ఎలా పుత్రుడు అని ఒక పాము , హఠాత్తు గా లేచి ఒక మాట అన్నాడు. కద్రువ మనందరికీ శాపం పెట్టిన రోజు రాత్రి ఆమె వడిలో తల పెట్టుకుని , నిద్ర రాక పోయిన, నిద్ర వచ్చినట్టు గా నటించి పడుకుని ఉన్నాను. ఆ సమయం లో ఒక ఆశ్చర్య కరమైన సంఘటన జరిగింది.
బ్రహ్మ గారి దగ్గరకి దేవతలంతా వెళ్లారు , వెళ్లి మహా పరాక్రమ వంతులు కదా పాములు. అంత పరాక్రమ వంతులైన జాతిని తన అధర్మానికి , తన అసత్యానికి, చనిపోమ్మని కద్రువ ఎలా శపించిందయ్యా, ఆవిడ ఇచ్చిన వాక్కు కి పాముల జాతంతా నశించి పోవటమే? ఇంత బలవంతులైన పాములు అగ్నిలో పడిపోవాల్సిందే? అందులో ఆదిశేషుడు ఉన్నాడు , వాసుకి ఉన్నాడు, మహానుభావులు ఉన్నారు , వెళ్ళందరూ కూడా మడిసి పోతారా అని అడిగారు దేవతలు.
అడిగితే బ్రహ్మ గారు అన్నారు , అసలు కద్రువ నోటివెంట ఆ మాట వచ్చే లాగా ప్రేరణ ఎందుకు చేసామో తెలుసా మీకు క్రురాకారుల , జగత్తు కి అపకారం చేస్తాయి, అటువంటి పాముల యొక్క పాపపు నడక ,నడత నేను భరించ లేక పోతున్నాను అని భూదేవి ఏడుస్తుంది. అందుకు అవన్నీ నశించిపోవాలి , అవన్నీ నశించి పోవటనికే కద్రువ నోటి వెంట ఆ మాట వచ్చింది. కాబట్టి అవన్నీ నశించి పోవటం దేవతలకి ప్రీతీ కరమే, కాబట్టి మీరేమి బెంగ పెట్టుకోవద్దు. అని
ఇందులో దేవతా సర్పములు కొన్ని ఉన్నాయి, దేవతలకి , మనుష్యులకు ఉపకారం చేసే వి కొన్ని ఉన్నాయి, అవన్నీ ఆ అగ్నిలో పడిపోకుండా ఒకానొకప్పుడు వాసుకి చెల్లెలైన జరత్కారువు వేరొక మునిశ్రేష్టుడైన జరత్కారువు ని వివాహం చేస్కుంటుంది. ఇద్దరి పేరూ కూడా జరత్కారువే , వారిద్దరికీ కూడా అస్తీకుడు అనే ఒక ముని పుడతాడు. ఆ ముని వెళ్లి జనమేజయుడి యొక్క సర్ప యాగాన్ని ఆపు చేస్తాడు. పాప భూయిస్ట మైన సర్పము లు అన్ని అప్పటివరకు అగ్నిలో పడి కాలిపోతాయి. ఆ తర్వాత కొన్ని కొన్ని సర్పములు , దేవతలతో చెలిమి చేసినవి, పుణ్యం చేసినవి, లోకోపకారం చెయ్యవలసిన పాములు కొన్ని మిగిలి పోతాయి. ఆ విధం గా వాటి సంఖ్య ని తగ్గించేస్తాం. లేకపోతే వాటి సంఖ్య ద్విగుణీకృతo అయిపోతే ఈలోకం లో ప్రాణులు ఏమి మిగలవు. భయం తో చాలా భీభత్స వాతావరణం ఏర్పడుతుంది . అందుకే ఈ ఏర్పాటు చేసింది. అన్నారు బ్రహ్మ గారు.
కాబట్టి ఇప్పుడు ఆ అస్తీకుడు పుట్టడానికి ,ఆ జరత్కారువు ఎక్కడ ఉన్నాడు , జరకారువు దొరికితే , వాసుకి చెల్లెలైన జరత్కారువు ని ఇచ్చి పెళ్లి చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఆయన వైపుకి కధ తిరిగింది. ఆయన యయావర వంశము నందు శ్రేష్టుడు బ్రహ్మ చారి గొప్ప నియమ పాలనం చేసే వాడు. ఇంక ఎంత ఘోరమైన బ్రహ్మ చర్యం అంటే ఆయన ఊర్థ్వ రేతస్కుడు. ఆయన భార్య అన్న మాటని కూడా స్మరణ లోకి రానివ్వలేదు. అంత గొప్పగా శాస్త్రాధ్యయనం చేశాడు , అంత గొప్ప తపస్సు చేసాడు. కానీ బ్రహ్మ చారిగా తపస్సు చెయ్యటం చాల గొప్ప పని , కానీ ఇవి ఎంత వరకూ పనికి వస్తాయి, ఒక వయస్సు వరకు, ఒక వయసు తర్వాత వివాహం నేను చేస్కోవటమా చేస్కోక పోవటమా అన్న విషయం లో నాకు స్వేచ్చ ఉండదు.
సనాతన ధర్మం లో ఎట్టి పరిస్థితులలో, మీరు వివాహం చేస్కో కుండా ఉండరాదు , ఎందుకంటే , దాని వలన మీరు రుణపడిపోతారు. తండ్రికి కొడుకు పుట్టీ పుట్ట గానే ఋణ పడిపోతాడు, ఆయన నన్ను ఎలా కన్నడో అలాగే నేను ఒక కొడుకుని కనాలి. కంటే తప్ప ఆ ఋణం పోదు, ఒక వేళ తండ్రి శరీరం విడిచి పెట్టేసినా, పితృదేవతలు చూస్తూ ఉంటారు ,వీడు కన్నడా కొడుకుని అని.
ఇప్పడు ఆ జరత్కారువు అనుకున్నాడు , ఇప్పుడు భార్యని స్వీకరిస్తే , పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే మాయ కమ్ముతుంది. అసలు నేను పాణిగ్రహణం చెయ్యను, నాకు భార్య వద్దు, గృహస్తాశ్రమం వద్దు అని పెళ్లి చేస్కోకుండా ఉండిపోయాడు. ఒకరోజు ఎందుకో ఈశ్వరుని యొక్క అనుగ్రహం , ఒక ప్రాంతం లో తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్న సమయం లో అక్కడ నీటి తో కూడిన ఒక చిన్న సరస్సు ఒకటి ఉంది. అక్కడ అవురు గడ్డి తో చెయ్య బడ్డ దుబ్బులు కొన్ని ఉన్నాయి. ఆ దుబ్బుల యొక్క వేరులు ఎలుకలు కోరికేసాయి. ఒకే ఒక వేరు ఉంది . అసలే అది గడ్డి దుబ్బు , ఆ గడ్డిదుబ్బు కి ఉన్నది ఒక్క వేరు ఆ గడ్డి దుబ్బుకి గడ్డి పరకలు చాలా ఉంటై కదండీ, ఆ పరకలన్ని పట్టుకుని కొంత మంది తల కిందులు గా వేలాడుతూ సూర్య కిరణాలూ తింటున్నారు.
వాళ్ళని చూసి ఈయన అన్నాడు , అబ్బో ఇదొక గొప్ప తపస్సు లా ఉంది. ఒకవేరు ఉన్న గడ్డి దుబ్బుకున్న గడ్డి పరకల కి వేలాడుతూ ఇంతమంది సూర్యకిరణాలు తింటున్నారు . గడ గడ వణికిపోతూ ఉన్నారు , తలలు కంపిస్తున్నాయి , నాడులు పైకి వచ్చి ఉన్నాయి. ఇంత గొప్ప తపస్సు ఎలా చేస్తున్నారు , దీని గొప్పతనం ఏంటో నాకు చెప్తే నేనూ చేస్తాను అన్నాడు.
ఆ తల కిందులుగా వేలాడుతున్న వారు అన్నారు, మా వంశం లో జరత్కారువు అనబడే వాడు ఒకడు పుట్టాడు. వాడు పెళ్లి చేస్కోను అని భీష్మి చాడు , ఆ కారణం చేత ఇలా తిరగేసి కట్ట బడ్డాo. ఆ వేరులు ఆ పిల్లవాడు పెళ్లి చేస్కోకుండా ఉన్నకొద్ది ,యమ ధర్మ రాజు ఎలక రూపం లో కోరికేస్తునాడు ఆ వేర్లని, ఇప్పుడు మా పుణ్యం , మేము చేసిన తపస్సు మమల్ని రక్షించ కుండా పోతుంది. మేము చాలా ధార్మికం గా జీవించాం , మేము చాలా గొప్ప తపస్సు చేసాం కాని, ఉపయోగం ఏముంది , మా వంశం లో పుట్టిన వాడు పెళ్లి చేస్కోవటం మానేసాడు , దానివల్ల ఇంకొక్క వేరు ఉండిపో యింది.
అంటే ఇంకా వాడు పెళ్లి చేసుకుని కొడుకుని కనటానికి చాలా కొంచం సమయమే మిగిలి ఉంది, వాడుకనుక ఈ కొంత సమయo కూడా పెళ్లి చేస్కోకుండా ఉండి పోతే, యమధర్మ రాజు ఈ వేరు కూడా కోరికేస్తాడు, కోరక గానే అంతే వేగం తో మేము అధో లోకములకి వెళ్లి పోతాము. ఇక మాకు ఊర్ధ్వ లోక వాసం ఉండదు. మేము చెయ్యని పాపానికి , మేము చెయ్యని నేరానికి, ఒక ధూర్థుడైన కొడుకు , పెళ్లి చేస్కోకుండా ఉండి పోయి మేము లోకాన్ని ఉద్ద రిస్తున్నాన ని చెప్పు కుంటున్న వాడి వల్ల మేము ఇంతటి నేరాన్ని పొందాము.
వాడు తప్పస్సు చెయ్యక్కర్లేదు ఇంకోటీ చెయ్యకర్లేదు ,వాడు గృహస్తాశ్రమం స్వీకరించి , వాడి ధర్మం వాడు చేసి ఉంటె, మేమందరం తరించే వాళ్ళo కాబట్టి నాయనా నువ్వెవరో మా యందు ప్రీతీ కలిగిన బందువు మాట్లాడినట్టు మాట్లాడవు , నీకు ఎప్పుడైనా ఆ జర్కారువు అన్న వాడు కనపడితే వాడికి చెప్పవయ్యా మా బతుకు
ఇలా ఉంది అని అన్నారు.
అంటే ఆయన అన్నాడు , అయ్యయ్యో మీరు వెతక మన్న జరకారువు ఎవరో కాదు ,నేనే , మీరే నా తాత తండ్రులు, నేను ఎంత అపరాధం చేశాను , ఏమిటో ఇన్నాళ్ళు పెల్లిచేస్కో కుండ ఉండిపోవటo గొప్ప అని ఇలా ఉండిపోయాను. కాబట్టి నేను పెల్లిచేస్కుంటాను . మిమ్మల్ని చూసి భాద పడ్డాను , నేను పెళ్లి చేస్కోక పోవటం వలన ఎంత ప్రమాదం వచ్చింది అని ఇప్పుడు అర్థం అయ్యింది. కాబట్టి నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి నేను వివాహం చేస్కుంటాను. చేస్కుని తప్పకుండా సంతానాన్ని కాంటాను, నేను సంతానాన్ని కంటే మీరు ఉర్థ్వ లోకాలకి వెళ్తారు. కాబట్టి ఈ ఒక్క వేరు కోరక బడే లోపలే నేను వివాహం చేస్కుంటాను.
ఇప్పుడు ఆయన తండ్రి తాతలు అంటున్నారు, యజ్ఞాలే చెయ్యనీ , యాగాలే చెయ్యని , ఘోర నిష్ట తో తపస్సులే చెయ్యనీ వివాహము చేసుకుని సంతానము ని కానని వాడిని ,ఎట్టి పరిస్థితుల లో స్వర్గ ద్వారము చూడ నివ్వరు. కాబట్టి వివాహం చేస్కోవలసిందే.
ఇప్పుడు ఆ జరత్కారువు ఆయన తండ్రి తాతల తో అంటున్నాడు, నేను వివాహం చేస్కుంటాను కాని నాది ఒక్క కోరిక నాకు ఎ పేరు ఉందొ ఆ పేరే ఉన్న పిల్ల దొరికితే చేస్కుంటాను అన్నాడు. ఇప్పుడు జరత్కారువు అనే పిల్ల కోసం తిరుగుతున్నాడు దేశం అంతా , ఇలా వెతుక్కుంటుంటే వాసుకి చూసాడు, ఆ వాసుకి జరత్కారుడి తో మాట్లాడుతున్నాడు.
నువ్వు బ్రహ్మచారి వి కనుక, ఏమిటో తెలుసా భిక్ష , మీది అద్భతమైన వంశం , నిశ్చితార్దం చేస్కునే ముందు ఈ మాటలు చెప్పి చేస్కోవాలి. మీ వంశం చాలా గొప్పది , మా వంశము చాలా గొప్పది, ఇవ్వాళ మా వంశం ధన్యత
చెందింది మీ వంశం తో వియ్యం పొందటం వలన, నా చెల్లెలు ఉంది ఆమె పేరు జర్కరువు, నీ పేరు జరత్కారుడు, ఇద్దరి పేర్లు ,గుణములు కలిసాయి, అన్నిటికన్నా ప్రధానము ఏది అంటే వివాహంలో గుణములు కలవాలి. ఇప్పుడు ఇద్దరి పేర్లు , గుణాలు కలిసాయి పెళ్లి చేస్కుంటాను అన్నాడు జర్కారువు. కానీ ఎన్నాళ్ళు నువ్వు
ఆయన తపస్సు చేస్తే ఆయన తపస్సుకి మెచ్చి చతుర్ముఖ బ్రహ్మ గారు ప్రత్యక్షం అయ్యారు, అయ్యి ఏమి కావలి అని అడిగారు. అప్పుడు ఆయన బ్రహ్మ గారి వైపు చూసి ఇలా అన్నాడు "నా తల్లి కద్రువా , నా సోదరులు కలిసి వినత ను గరుత్మంతుని అనేక ఇబ్బందులు పెట్టారు. ఆ సోదరులలో ఒకడనైన నాకు కూడా ఆ పాపం లో కొంత వస్తుంది. కాబట్టి నాకు ఇంక ఈ శరీరం లో ఉండాలి అని లేదు , కాబట్టి ఈ శరీరాన్ని విడిచి పెట్టాలి అంటే ఆత్మ హత్య చేస్కోవాలి. అది మహా పాతకం చెయ్యకూడదు , కాబట్టి నేను తపస్సు చేసి ఈ శరీరాన్ని విడిచి పెట్టాలి అనుకుంటున్నాను. నేను చేసి ఉండకపోవచ్చు మా అమ్మ మాట విని మా తమ్ములు చేసిన పనికి నాకు కూడా పాపం కలిగి ఉండొచ్చు, కాబట్టి నేను ఆ పాపం నుండి వినుర్ముక్తుడను అవుతాను అన్నాడు.
అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు ఒక చిరునవ్వు నవ్వి , నీవు నిత్య సత్య నిరతుండవు, నీకు సత్యమునందు , ధర్మం నందు తాపత్రయం ఉంది. ఎప్పుడైతే నీకు అలాంటి భావన ఉందో అప్పుడే నీ పాపం కాలిపోయింది. నిత్య సత్య ధర్మ వ్రతుడైన వాడు , దేనినైన భరించే స్థితి ని పొందుతాడు. ఆదిశేషుడు సోదరులు ఇలా ప్రవర్తిస్తునారు అని ఆయన కి ఉన్న బాలానికి ఆయనే చంపెయ్యోచ్చు వారిని కానీ చంపలేదు భరించాడు, ఇంత భరించగల శక్తి ఉందే , అది పనికి రావాలి ఇప్పుడు. దేవతలు దాన్ని వాడుకోవాలి, అంతే కానీ నువ్వు శరీరం వదిలేస్తే ఏమి వస్తుంది, అందుకని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నేను ఒక బృహత్కర కార్యం చెప్తాను , నువ్వు ఈ భూమండలాన్ని అంతటినీ నీ పడగల మీద భరించి ఉంచు అన్నాడు బ్రహ్మ గారు.
భూమికి ఎప్పుడు బరువు అవుతుంది అంటే , ధర్మ నిరతిని ప్రజలు విడిచి పెట్టేసినా , సత్య నిష్టను వదిలి పెట్టినా , భూమికి బరువు అవుతుంది. భూమి ఎవరికి చెప్తుoది అంటే రక్షణ చెయ్య గలిగిన వాడు స్థితి కారుడు విష్ణువు కాబట్టి ఆయనకి చెప్తుంది. నేను ఈ భూభారమును అంటే పాపం ను మొయ్యలేక పోతున్నాను అంటుంది. అప్పుడు ఈశ్వరుడు ఏమి చేస్తాడు అంటే అవతార స్వీకారం చేస్తాడు. ఎవరు అధర్మం పెచ్చరిల్ల టానికి కారణం అయ్యి ఉన్నారో వారిని చనకుతారు.
కాబట్టి ఇప్పుడు భూమి భారము ను పంచుకోవటానికి ఎవరు సమర్ధుడు, సత్య ధర్మం యందు ఉన్న వారు భూమి తో ఉంటె , భూమాత సంతోషిస్తుంది , వాళ్ళు ఉన్నారు అని. అంత సత్య ధర్మ వ్రతుడవైన నువ్వు ఈ భూ భారము ను మొయ్య టానికి అర్హుడవు, కాబట్టి నీ పడగల చేత ఈ భారమును వహించు అని ఆయన ఒక సలహా చెప్పారు బ్రహ్మ గారు నీ సోదరులు కేవలము పాములే కాదు గరుత్మంతుడు కూడా నీకు సోదరుడే మిగిలిన పాముల విషయం పక్కన పెట్టు. పుణ్యాత్ముడు , ధర్మాత్ముడు , గొప్ప ఈశ్వర విభూతి కలిగిన వాడితో సంభంధాన్ని ఎన్నడూ విడిచి పెట్టుకోవద్దు. ఇది ఏనాటికి అందరికి తెలియవలసిన విషయం. ప్రయత్న పూర్వకం గా నువ్వు గరుత్మంతుని తో నువ్వు చెలిమి చెయ్యి అని చెప్పి , ఆదిసేషుణ్ణి భూ భారం వహిoచటానికి నియత్రించారు బ్రహ్మ గారు. అప్పటి నించి ఆయన ఆ భూ భారమును వహిస్తున్నాడు.
అందరూ అన్నతమ్ములే కానీ భగవంతుని స్మరిస్తూ ఆయన తో సంబంధం పెట్టుకున్న వారు ఇద్దరు తల్లి శాపం నించి తప్పుకున్నారు , ఒకరు ఆదిశేషుడు , ఇంకొకరు వాసుకి.
క్షీర సాగర మదనం అప్పుడు మందర పర్వతాన్ని కవ్వం గా చేసుకుని చిలకటానికి ఒక తాడు కావాల్సి వచ్చింది. అప్పుడు వాసుకిది చాలా పెద్ద శరీరం కాబట్టి , వాసుకి ని చుట్టారు మందర పర్వతానికి. అది అంత తేలికైన విషయం కాదు , పర్వతం కి వేసి తిప్పుతుంటే అది ఎంత బాధ కలుగుతుందో శరీరానికి , కానీ వారి కోరిక మేరకు , అమృతం పుట్టటం కోసం ,శారీరకం గా అంత డస్సి పోయి, ఈశ్వరుని కొరకు తన శరీరం అంత బడలి పోవటానికి స్వీకరించాడు.
అమ్రుతోత్పాదనం అయిన తరువాత ,దేవతలు బ్రహ్మ గారికి చెప్పారు, ఈయన ఎంత కష్ట పడ్డాడో తెలుసా మహానుభావుడు . ఎంత బడలిపోయాడో ఆ వొళ్ళంతా ఎంత కంది పోయిoదో. అయినా ఒర్చుకున్నాడు మాకు అమృతం ఇవ్వటానికి , ఈయనని ఏదైనా కృప చెయ్యాలి అన్నారు , అంటే బ్రహ్మ గారు అన్నారు వీళ్ళ అమ్మ శాపం ఉంది, పాములన్నీ జనమేజయుడు చేసే యాగం లో పడి మరణించాలి. కానీ ఇతను చేసిన దైవ సేవ వలన ఇతన్ని మినహా ఇస్తున్నాను అన్నాడు. ఇతనికి అలా యాగం లో పడి మరణించ వలసిన అగత్యము ఇతనికి కలగదు.
ఆదిశేషుడు బ్రహ్మ గారిదగ్గర వరం పొందాడు , ఆయన బ్రహ్మ గారి యొక్క ఆజ్ఞ అవుదల దాలుస్తు ఉండి పోయాడు.
ఇవతల నా సోదరులకు వచ్చే ఆపద గురించి ఆయన ఆలోచించట్లేదు ,జనమేజయుడు ఏదో ఒక రోజు మొదలు పెట్టేస్తాడు సర్పయాగాన్ని, ఎప్పుడు కృత యుగం లో ఇచ్చింది ఆవిడా శాపం , ఎప్పుడు చేసాడు యజ్ఞం , కలియుగ ప్రారంభం లో చేసాడు యజ్ఞం. ఒక్క సారి ఇచ్చిన శాప వాక్కు కట్టి కుడుప వలసిందే. ఆదిశేషుడు పట్టించు కోడు, అవతల పాములు పట్టించు కోవట్లేదు, ఎప్పుడు సర్ప యాగం జరుగుతుందో అని ఆందోళన తో వాసుకు ఏడుస్తున్నాడు.
ఐరవతాధులు అన్న పాముల జాతిని పిలిచి ఆయన తన బాధ వ్యక్తం చేస్తున్నాడు. వాళ్ళు దుoదుడుకు స్వభావం కలిగిన వారు. వాళ్ళకి ఎంత మంచి మాట చెప్పినా తలకి ఎక్కదు. ఒకడు చెప్తే తలకి ఎక్కించు కొని వాడే భూమికి భారం. వాళ్ళన్నారు ఏమిటన్నయ్యా అంత బెంగ పెట్టుకుంటావు , యాగం చేసేది ఆయన అయితే , పాడుచేయ్యటం మనకి రాదా ? బోలెడు మార్గాలు ఉన్నాయి యాగం పాడుచెయ్యాటానికి.
జనమేజయుడికి బ్రాహ్మణులు అంటే భక్తి కాబట్టి ,మనం బ్రాహ్మణ వేషాల తో వెళ్దాం. వెళ్తే బ్రాహ్మణులు వచ్చారని స్వాగతం చెప్పి కూర్చోబెట్టి ఏమిటి అంటాడు. చాలా తప్పు ఇలాంటి యాగం చెయ్యకూడదు , చేశావా నీకు రెండూ పోతాయి , ఇహము పోతుoది పరము పోతుంది. ఇక్కడా సుఖం ఉండదు , పైలోకాల లో సుఖం ఉండదు , రెండు పోయే యాగం ఎందుకు చేస్తావ్? అని మనం చెప్తాం , బ్రాహ్మణ భక్తి తో యాగం చెయ్యటం మానేస్తాడు.
ఒక వేళ వినకపోతే మన లోనే కోoదరిని ఆoతరoగికుల మంత్రుల వేషాలు వేయిద్దాం, కామ రూపులం కాబట్టి , మంత్రుల మాట కాదనడుగా. వెళ్లి పరమ ప్రేమతో జనమేజయా ఇటువంటి యాగం చెయ్యొద్దు అని చెప్దాం, వింటాడు.
ఇంకా వినలేదు అనుకో యాగం మొదలు పెట్టి ఋత్విక్కులు కూర్చుంటారు. భక్ష్యం , భోజ్యం , లేహ్యము , చోష్యము. తినేవి తాగేవి నాకేవి ,చప్పరించేవి , ఇవన్ని ఉంటాయిగా , వాటన్నిటి మీదా పాకేద్దాం మనందరం. మనదరం పాకేస్తే విష తుల్యం అయిపోతుంది , దాన్ని హవిస్సు గా ఇవ్వరు గా. అక్కడ హవిస్సు పాత్ర ఉంటుంది , నేతి పాత్ర ఉంటుంది ,వాటన్నింటి మీదా పాకేద్దాం. అంతేకాదు ఒజ్జలు అంటే ఉపాధ్యాయుడు వాళ్ళు కుర్చుని ఉంటారు యాగం చేద్దాం అని వెళ్లి వాళ్ళ మీద పడదాం పడి తలలెత్తి బుస్స్ అందాం వాళ్ళు లేచి పారిపోతారు. ఇంక దీక్షాభంగం అవుతుంది, ఇంకా యాగం జరగదు. ఏమిటన్నయ్యా బాధ పడతావు వదిలేయి అన్నారు
అందులో ఉన్న కొంతమంది పెద్దలు అన్నారు, మీరు చాలా తేలికగా చేస్తున్నారు రా , ఒక సారి బ్రాహ్మణుడు మత్రోచ్చాటనం చేసి మనం అందులో పడిపోవాలి అన్న సంకల్పం చేసిన వెంటనే అపకారం చెయ్యటానికి వెళ్ళిన మనం ఎక్కడ ఉన్నామో వెతుక్కుంటూ వస్తాయి అగ్ని కీలలు తినటానికి. నువ్వు వాళ్ళ మీద పాకటం కాదు నీ మీదకి అగ్ని పాకుతుంది. ఎందుకంటే అగ్ని కి వ్యాపించే గుణం ఉంది అందుకే అశ్వ శబ్దం తో పిలుస్తారు దాన్ని. నువ్వు నేను దాని మీద పాకటం ఏమిటి , బ్రాహ్మణుల మీద పడటం ఏమిటి ఎమన్నా మతి ఉందా నువ్వు చేసే ఆలోచనకి , ఏమీ బావోలేదు నువ్వు చెప్పిన ఆలోచన.
వాసుకి తెల్లబోయి వింటున్నాడు , ఎలా దీనికి పరిష్కారం ఏమిటి, మరి వీళ్ళు ఎలా రక్షింపబడతారు. అందులో ఎలా పుత్రుడు అని ఒక పాము , హఠాత్తు గా లేచి ఒక మాట అన్నాడు. కద్రువ మనందరికీ శాపం పెట్టిన రోజు రాత్రి ఆమె వడిలో తల పెట్టుకుని , నిద్ర రాక పోయిన, నిద్ర వచ్చినట్టు గా నటించి పడుకుని ఉన్నాను. ఆ సమయం లో ఒక ఆశ్చర్య కరమైన సంఘటన జరిగింది.
బ్రహ్మ గారి దగ్గరకి దేవతలంతా వెళ్లారు , వెళ్లి మహా పరాక్రమ వంతులు కదా పాములు. అంత పరాక్రమ వంతులైన జాతిని తన అధర్మానికి , తన అసత్యానికి, చనిపోమ్మని కద్రువ ఎలా శపించిందయ్యా, ఆవిడ ఇచ్చిన వాక్కు కి పాముల జాతంతా నశించి పోవటమే? ఇంత బలవంతులైన పాములు అగ్నిలో పడిపోవాల్సిందే? అందులో ఆదిశేషుడు ఉన్నాడు , వాసుకి ఉన్నాడు, మహానుభావులు ఉన్నారు , వెళ్ళందరూ కూడా మడిసి పోతారా అని అడిగారు దేవతలు.
అడిగితే బ్రహ్మ గారు అన్నారు , అసలు కద్రువ నోటివెంట ఆ మాట వచ్చే లాగా ప్రేరణ ఎందుకు చేసామో తెలుసా మీకు క్రురాకారుల , జగత్తు కి అపకారం చేస్తాయి, అటువంటి పాముల యొక్క పాపపు నడక ,నడత నేను భరించ లేక పోతున్నాను అని భూదేవి ఏడుస్తుంది. అందుకు అవన్నీ నశించిపోవాలి , అవన్నీ నశించి పోవటనికే కద్రువ నోటి వెంట ఆ మాట వచ్చింది. కాబట్టి అవన్నీ నశించి పోవటం దేవతలకి ప్రీతీ కరమే, కాబట్టి మీరేమి బెంగ పెట్టుకోవద్దు. అని
ఇందులో దేవతా సర్పములు కొన్ని ఉన్నాయి, దేవతలకి , మనుష్యులకు ఉపకారం చేసే వి కొన్ని ఉన్నాయి, అవన్నీ ఆ అగ్నిలో పడిపోకుండా ఒకానొకప్పుడు వాసుకి చెల్లెలైన జరత్కారువు వేరొక మునిశ్రేష్టుడైన జరత్కారువు ని వివాహం చేస్కుంటుంది. ఇద్దరి పేరూ కూడా జరత్కారువే , వారిద్దరికీ కూడా అస్తీకుడు అనే ఒక ముని పుడతాడు. ఆ ముని వెళ్లి జనమేజయుడి యొక్క సర్ప యాగాన్ని ఆపు చేస్తాడు. పాప భూయిస్ట మైన సర్పము లు అన్ని అప్పటివరకు అగ్నిలో పడి కాలిపోతాయి. ఆ తర్వాత కొన్ని కొన్ని సర్పములు , దేవతలతో చెలిమి చేసినవి, పుణ్యం చేసినవి, లోకోపకారం చెయ్యవలసిన పాములు కొన్ని మిగిలి పోతాయి. ఆ విధం గా వాటి సంఖ్య ని తగ్గించేస్తాం. లేకపోతే వాటి సంఖ్య ద్విగుణీకృతo అయిపోతే ఈలోకం లో ప్రాణులు ఏమి మిగలవు. భయం తో చాలా భీభత్స వాతావరణం ఏర్పడుతుంది . అందుకే ఈ ఏర్పాటు చేసింది. అన్నారు బ్రహ్మ గారు.
కాబట్టి ఇప్పుడు ఆ అస్తీకుడు పుట్టడానికి ,ఆ జరత్కారువు ఎక్కడ ఉన్నాడు , జరకారువు దొరికితే , వాసుకి చెల్లెలైన జరత్కారువు ని ఇచ్చి పెళ్లి చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఆయన వైపుకి కధ తిరిగింది. ఆయన యయావర వంశము నందు శ్రేష్టుడు బ్రహ్మ చారి గొప్ప నియమ పాలనం చేసే వాడు. ఇంక ఎంత ఘోరమైన బ్రహ్మ చర్యం అంటే ఆయన ఊర్థ్వ రేతస్కుడు. ఆయన భార్య అన్న మాటని కూడా స్మరణ లోకి రానివ్వలేదు. అంత గొప్పగా శాస్త్రాధ్యయనం చేశాడు , అంత గొప్ప తపస్సు చేసాడు. కానీ బ్రహ్మ చారిగా తపస్సు చెయ్యటం చాల గొప్ప పని , కానీ ఇవి ఎంత వరకూ పనికి వస్తాయి, ఒక వయస్సు వరకు, ఒక వయసు తర్వాత వివాహం నేను చేస్కోవటమా చేస్కోక పోవటమా అన్న విషయం లో నాకు స్వేచ్చ ఉండదు.
సనాతన ధర్మం లో ఎట్టి పరిస్థితులలో, మీరు వివాహం చేస్కో కుండా ఉండరాదు , ఎందుకంటే , దాని వలన మీరు రుణపడిపోతారు. తండ్రికి కొడుకు పుట్టీ పుట్ట గానే ఋణ పడిపోతాడు, ఆయన నన్ను ఎలా కన్నడో అలాగే నేను ఒక కొడుకుని కనాలి. కంటే తప్ప ఆ ఋణం పోదు, ఒక వేళ తండ్రి శరీరం విడిచి పెట్టేసినా, పితృదేవతలు చూస్తూ ఉంటారు ,వీడు కన్నడా కొడుకుని అని.
ఇప్పడు ఆ జరత్కారువు అనుకున్నాడు , ఇప్పుడు భార్యని స్వీకరిస్తే , పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే మాయ కమ్ముతుంది. అసలు నేను పాణిగ్రహణం చెయ్యను, నాకు భార్య వద్దు, గృహస్తాశ్రమం వద్దు అని పెళ్లి చేస్కోకుండా ఉండిపోయాడు. ఒకరోజు ఎందుకో ఈశ్వరుని యొక్క అనుగ్రహం , ఒక ప్రాంతం లో తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్న సమయం లో అక్కడ నీటి తో కూడిన ఒక చిన్న సరస్సు ఒకటి ఉంది. అక్కడ అవురు గడ్డి తో చెయ్య బడ్డ దుబ్బులు కొన్ని ఉన్నాయి. ఆ దుబ్బుల యొక్క వేరులు ఎలుకలు కోరికేసాయి. ఒకే ఒక వేరు ఉంది . అసలే అది గడ్డి దుబ్బు , ఆ గడ్డిదుబ్బు కి ఉన్నది ఒక్క వేరు ఆ గడ్డి దుబ్బుకి గడ్డి పరకలు చాలా ఉంటై కదండీ, ఆ పరకలన్ని పట్టుకుని కొంత మంది తల కిందులు గా వేలాడుతూ సూర్య కిరణాలూ తింటున్నారు.
వాళ్ళని చూసి ఈయన అన్నాడు , అబ్బో ఇదొక గొప్ప తపస్సు లా ఉంది. ఒకవేరు ఉన్న గడ్డి దుబ్బుకున్న గడ్డి పరకల కి వేలాడుతూ ఇంతమంది సూర్యకిరణాలు తింటున్నారు . గడ గడ వణికిపోతూ ఉన్నారు , తలలు కంపిస్తున్నాయి , నాడులు పైకి వచ్చి ఉన్నాయి. ఇంత గొప్ప తపస్సు ఎలా చేస్తున్నారు , దీని గొప్పతనం ఏంటో నాకు చెప్తే నేనూ చేస్తాను అన్నాడు.
ఆ తల కిందులుగా వేలాడుతున్న వారు అన్నారు, మా వంశం లో జరత్కారువు అనబడే వాడు ఒకడు పుట్టాడు. వాడు పెళ్లి చేస్కోను అని భీష్మి చాడు , ఆ కారణం చేత ఇలా తిరగేసి కట్ట బడ్డాo. ఆ వేరులు ఆ పిల్లవాడు పెళ్లి చేస్కోకుండా ఉన్నకొద్ది ,యమ ధర్మ రాజు ఎలక రూపం లో కోరికేస్తునాడు ఆ వేర్లని, ఇప్పుడు మా పుణ్యం , మేము చేసిన తపస్సు మమల్ని రక్షించ కుండా పోతుంది. మేము చాలా ధార్మికం గా జీవించాం , మేము చాలా గొప్ప తపస్సు చేసాం కాని, ఉపయోగం ఏముంది , మా వంశం లో పుట్టిన వాడు పెళ్లి చేస్కోవటం మానేసాడు , దానివల్ల ఇంకొక్క వేరు ఉండిపో యింది.
అంటే ఇంకా వాడు పెళ్లి చేసుకుని కొడుకుని కనటానికి చాలా కొంచం సమయమే మిగిలి ఉంది, వాడుకనుక ఈ కొంత సమయo కూడా పెళ్లి చేస్కోకుండా ఉండి పోతే, యమధర్మ రాజు ఈ వేరు కూడా కోరికేస్తాడు, కోరక గానే అంతే వేగం తో మేము అధో లోకములకి వెళ్లి పోతాము. ఇక మాకు ఊర్ధ్వ లోక వాసం ఉండదు. మేము చెయ్యని పాపానికి , మేము చెయ్యని నేరానికి, ఒక ధూర్థుడైన కొడుకు , పెళ్లి చేస్కోకుండా ఉండి పోయి మేము లోకాన్ని ఉద్ద రిస్తున్నాన ని చెప్పు కుంటున్న వాడి వల్ల మేము ఇంతటి నేరాన్ని పొందాము.
వాడు తప్పస్సు చెయ్యక్కర్లేదు ఇంకోటీ చెయ్యకర్లేదు ,వాడు గృహస్తాశ్రమం స్వీకరించి , వాడి ధర్మం వాడు చేసి ఉంటె, మేమందరం తరించే వాళ్ళo కాబట్టి నాయనా నువ్వెవరో మా యందు ప్రీతీ కలిగిన బందువు మాట్లాడినట్టు మాట్లాడవు , నీకు ఎప్పుడైనా ఆ జర్కారువు అన్న వాడు కనపడితే వాడికి చెప్పవయ్యా మా బతుకు
ఇలా ఉంది అని అన్నారు.
అంటే ఆయన అన్నాడు , అయ్యయ్యో మీరు వెతక మన్న జరకారువు ఎవరో కాదు ,నేనే , మీరే నా తాత తండ్రులు, నేను ఎంత అపరాధం చేశాను , ఏమిటో ఇన్నాళ్ళు పెల్లిచేస్కో కుండ ఉండిపోవటo గొప్ప అని ఇలా ఉండిపోయాను. కాబట్టి నేను పెల్లిచేస్కుంటాను . మిమ్మల్ని చూసి భాద పడ్డాను , నేను పెళ్లి చేస్కోక పోవటం వలన ఎంత ప్రమాదం వచ్చింది అని ఇప్పుడు అర్థం అయ్యింది. కాబట్టి నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి నేను వివాహం చేస్కుంటాను. చేస్కుని తప్పకుండా సంతానాన్ని కాంటాను, నేను సంతానాన్ని కంటే మీరు ఉర్థ్వ లోకాలకి వెళ్తారు. కాబట్టి ఈ ఒక్క వేరు కోరక బడే లోపలే నేను వివాహం చేస్కుంటాను.
ఇప్పుడు ఆయన తండ్రి తాతలు అంటున్నారు, యజ్ఞాలే చెయ్యనీ , యాగాలే చెయ్యని , ఘోర నిష్ట తో తపస్సులే చెయ్యనీ వివాహము చేసుకుని సంతానము ని కానని వాడిని ,ఎట్టి పరిస్థితుల లో స్వర్గ ద్వారము చూడ నివ్వరు. కాబట్టి వివాహం చేస్కోవలసిందే.
ఇప్పుడు ఆ జరత్కారువు ఆయన తండ్రి తాతల తో అంటున్నాడు, నేను వివాహం చేస్కుంటాను కాని నాది ఒక్క కోరిక నాకు ఎ పేరు ఉందొ ఆ పేరే ఉన్న పిల్ల దొరికితే చేస్కుంటాను అన్నాడు. ఇప్పుడు జరత్కారువు అనే పిల్ల కోసం తిరుగుతున్నాడు దేశం అంతా , ఇలా వెతుక్కుంటుంటే వాసుకి చూసాడు, ఆ వాసుకి జరత్కారుడి తో మాట్లాడుతున్నాడు.
నువ్వు బ్రహ్మచారి వి కనుక, ఏమిటో తెలుసా భిక్ష , మీది అద్భతమైన వంశం , నిశ్చితార్దం చేస్కునే ముందు ఈ మాటలు చెప్పి చేస్కోవాలి. మీ వంశం చాలా గొప్పది , మా వంశము చాలా గొప్పది, ఇవ్వాళ మా వంశం ధన్యత
చెందింది మీ వంశం తో వియ్యం పొందటం వలన, నా చెల్లెలు ఉంది ఆమె పేరు జర్కరువు, నీ పేరు జరత్కారుడు, ఇద్దరి పేర్లు ,గుణములు కలిసాయి, అన్నిటికన్నా ప్రధానము ఏది అంటే వివాహంలో గుణములు కలవాలి. ఇప్పుడు ఇద్దరి పేర్లు , గుణాలు కలిసాయి పెళ్లి చేస్కుంటాను అన్నాడు జర్కారువు. కానీ ఎన్నాళ్ళు నువ్వు
No comments:
Post a Comment