Thursday, September 25, 2014

ఆదిపర్వం 16

ఇప్పుడు జరకత్కారుడు , జరత్కారువు పెళ్లి చేస్కున్నారు. ఇప్పుడు  జరత్కారువు కత్తి మీద మనిషి ఎలా నడుస్తాడో , అలా రేయనక పగలనక ,భర్తని అనువర్తిస్తూ కాలం గడుపుతుంది. అపారమైన అనురాగం తో ఆయన ని అనువర్తించిన కారణo చేత, భర్త యొక్క అనురాగమును పొందినదై ఆయన యొక్క అనురాగము యొక్క ఫలితముగా ఆమె గర్భం దాల్చింది. ఇప్పుడు ఆమె గర్భం తో ఉన్నప్పుడు ఎలా ఉందొ చెప్తున్నారు ననయ్య గారు, సూర్యుడు అనే బిడ్డను తూర్పు దిక్కు అన్న కాంత ఎలా ఉంటుందో గర్భిణి అయిన జరత్కారువు అలా ఉందిట.  ఇక్కడ ఈవిడ గర్భం పండి పిల్లడు పుడితే పాములకి అలుముకున్న చీకట్లు పోతాయి. జరత్కారు వంశం లో ఒక్క వేరు పట్టుకుని వేలాడుతున్న తాత తండ్రులు ఊర్ధ్వ లోకాలకి వెళ్ళిపోతారు. అందుకని పూర్వ దిక్కుతో పోల్చారు ఆమె ని.

ఒక నాడు ఆయన కృష్ణా చీనాన్ని వేస్కుని భార్య తోడ మీద తల పెట్టుకుని , నిద్ర పోతున్నాడు. సూర్యాస్తమయం అయిపోతుంది, ఆశ్రమం లో అందరూ సంధ్యా వందనం చేస్కున్తున్నారు. సంధ్యా వందనం అత్యంత ప్రధానం. సూర్యాస్తమయ సమయం లో ఎట్టి పరిస్థితుల్లో నిద్ర పోకూడదు. కాబట్టి నిద్రపోతున్నాడు ఒక తప్పు , సంధ్యా వందనం చెయ్యట్లేదు ఇంకో తప్పు.

లేపకపోతే వేళకి సంధ్యావందనం చెయ్యాలి కదా. చేస్తానని నీకు తెలుసు కదా , నేను నిద్రపోతున్నాను అని తెలిసి కూడా నన్ను లేపక పోవటం నన్ను అగౌరవ పరచటం కాదా?మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపో అంటే. 
రెండు నిద్రపోతున్న వాడిని నిద్ర లేపటం కన్నా మహా పాపం ఈ లోకం లో ఇంకొకటి లేదు. అందుకే నిద్ర పోతున్న వాడిని నిద్ర లేపితే ధర్మ కార్యం చెప్పి నిద్ర లేపాలి. యెదీ చెప్పకుండా నిద్ర లేపితే , మహా పాపాన్ని తీస్కెళ్ళి నిద్ర లేపిన వాడి ఖాతా లో వేస్తారు. 

ఇప్పుడు ధర్మ కార్యం కోసం లేపితే తప్పులేదు , కానీ నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావు అని కోప్పడితే జరత్కారుడు? సరే అలా కోప్పడినా పరువలేదు, లేపుతాను , ఎందుకని ఆయన ధర్మం నిలబెట్టిన దానిని అయ్యాను. కాబట్టి నిద్ర లేపెస్తాను , ఆయన్ని నిద్ర లేపి ఆశ్రమం లో అందరూ సంధ్యా వందనం చేస్కున్తున్నారు. నువ్వు కుడా సంధ్యా వందనం చేస్కోవాలి కదా లేవండి నిద్ర అన్నది. అంటే ఆయన దిగ్గున నిద్ర లేచాడు. అంటే ప్రతి చిన్న విషయాన్నీ ఎందుకు చుపిస్తారంటే , ధర్మం ఎంత గొప్పదో తెలియ చెప్పటానికి. 

ఇప్పుడు ఆయన లేచి అన్నాడు ,దేనికి లేపావు నిద్రపోతున్న వాడిని? నిద్రపోతున్న వాడిని లేపటం తప్పని నీకు తెలియదా ? అంటే నా పట్ల అగౌరవం కాదా అన్నాడు. ఆవిడ అంది కాదు ధర్మం చెడిపోతుంది. అవతల సూర్యాస్తమయం అయిపోతుంది . సంధ్యావందనం చెయ్యాలి మీరు అన్నది. కాబట్టి నేను మిమల్ని నిద్రలేపక పోతే మీ ధర్మం పాడవుతుంది కాబట్టి నిద్ర లేపాను , ఇందులో అగౌరవo ఎక్కడ ఉంది. అన్నది.
ఆయన ఏమన్నాడో తెల్సా  ఏమిటి నేను నిద్రపోతుండగా నేను లేచి సంధ్యావందనం చెయ్యక ముందు సూర్యుడు అస్తమించడమే? జరత్కారుడు నిద్రపోతున్నాడు , కాబట్టి నేను అస్తమిస్తే జరత్కారుడి ధర్మానికి భంగం వస్తుంది అని సూర్యుడు అలా ఉండిపోతాడు అంతే  అన్నాడు జరత్కారుడు. నా తపో ప్రభావం అటువంటిది, నేను నిద్ర లేచే వరకు సూర్యుడు అస్తమించడు అన్నాడు జరత్కారుడు. నా శక్తిని సూర్యుడు అంత లేక్కకట్టినవాడు.

అటువంటి సూర్యుడు నా శక్తి ని లెక్క కట్టి అస్తమించలేదు , నువ్వు మాత్రం సూర్యుడు అస్తమిస్తాడు నిద్రలే అని నన్ను నిద్రలేపావు. అంటే నా శక్తి ని అంత తక్కువ అంచనా వేసావు , ఇది నాకు అగౌరవo కాదా? కాబట్టి నువ్వు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపో నేను ఆశ్రమానికి వెళ్తాను అన్నాడు. ఇంకా చెప్పాడు నీ కడుపులో అగ్నిహోత్రుడు , సూర్యుడు కలిసిన తేజోవంతుడు పెరుగుతున్నాడు. ఆ బిడ్డడు చాలు మన జీవితాలు తరించిపోతాయి అన్నాడు.

అస్తీకుడు అని పేరున్న పిల్లవాడు ఆ యొక్క జరత్కారువు యొక్క గర్భం లోనించి పుట్టాడు.  ఆయన పూర్ణమైన తేజస్సు కలిగినవాడు , అసలు పాపము తనకి అంటని వాడు. భవభందములకు చిక్కని వాడు , పుడుతూ నే అటు తల్లి వైపు వాళ్ళని ఇటు తండ్రి వైపు వాళ్ళని తరింపచేసిన వాడు. ఎందుకని ఇప్పుడు జరత్కారుడికి పిల్లలు పుట్టారు కాబట్టి ఆ ఒంటి వేరు పట్టుకుని వేలాడుతున్న వారు ఉర్త్వ లోకాలకి వెళ్ళిపోయారు. ఇటు జరత్కారువు కి పిల్లడు పుట్టాడు కాబట్టి సర్పయాగం లో పడిపోయే పాములైన మేనమామ లు అందరు బతికి పోయారు.

కాబట్టి పుట్టీ పుట్టకుండానే ఇరువంశాలని ఉద్ధరించిన మహా పురుషుడు , ఆస్తీకుడు. ఆయన చవనుడి యొక్క కుమారుడైన ప్రమతి దగ్గర విద్యాభ్యాసం అంతా చేసాడు. విద్యాభ్యాసం చేసి సర్వ శాస్త్రములు తెలుసుకున్న తరువాత, ఈయన పరమ సంతోషం తో పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఇప్పుడు కధ ఇంకోవైపుకి వెళ్తుంది.

ఇప్పుడు ఉదంకుడు , జనమేజయుడి దగ్గరకి వెళ్లి తన కోపాన్ని జనమేజయుడికి ఆపాదించాడు.
ఇప్పుడు జనమేజయుడు మంత్రులతో అన్నాడు, ఈ ఉదంకుడు నా తండ్రిని తక్షకుడు చంపాడు అంటున్నారు , అసలు ఆ కధ ఏమిటో చెప్పండి అన్నాడు.

అప్పుడు ఆ మంత్రులు లేచి అన్నారు , నీ తండ్రి అయిన పరిక్షిత్తు , విరాట రాజు కుమార్తె అయిన ఉత్తర ని అభిమన్యుడు  వివాహం చేస్కున్నప్పుడు, వారిరువురికి పుట్టిన వాడు  పరీక్షిత్. ఆ పరీక్షిత్ నీ తాత అయినటవంటి  అర్జునిడి తో సమానం, వంశం లో పోలికలు ఎలా వస్తాయి అంటే ఎక్కడో ముత్తాత అయిన పాండురాజు కి వేట అంటే ఇష్టం , అదే ఇష్టం పరీక్షిత్  కి ఉంది, అందుకే ఆ వేటకు వెళ్లి తపస్సు చేస్కుంటున్న ఋషి మెడలో చచ్చిపోయిన పామును వేసాడు.


పరిక్షితుడు 60 సంవత్సరములు ధర్మార్థ కామములు తప్పకుండా రాజ్యం చేసినటువంటి మహానుభావుడు. అటువంటివాడు , నీ వంటి సత్పుత్రుణ్ణి కన్నాడు. అటువంటి వాడు సింహాసనం మీద కుర్చుని, పాద పీఠo మీద పాదములు పెడితే , అన్య  దేశ రాజుల యొక్క కిరీటములు నీ తండ్రి , పాదముల యందు తలలు వంచి నమస్కరిస్తే వాళ్ళ కిరీటముల లోని మణులు నీ తండ్రి పాదములకు నీరాజనములు పట్టేవి.  అంత కీర్తి గడించిన మహానుభావుడు.

కానీ మీ వంశం లో ఉన్నటువంటి మీ ముత్తాత పాండురాజుకు ఉన్నటువంటి, బలహీనత లాగే మీ తండ్రి కూడా వేటాడటం కోసం అని చెప్పి, అరణ్యం లోకి ప్రవేశించి వేటాడుతుండగా ,ఒక లేడి కనిపించి ఆ లేడిని ఎలా అయినా వేటాడి పట్టుకోవాలని, తన పరివారం అంతా వెనకపడిపోయినా తాను ఒక్కడే ఉండి, ఆ లేడి ని తీస్కోస్తానని ఆ లేడి వెంట పరిగెడుతూ , బాణాన్ని విదిచిపెడుతూ , బాణం తగిలన లేడి పరీక్షిత్ కి దక్కకుండా , శమీకుని  యొక్క ఆశ్రమం లోకి వెళ్ళిపోతే, ఆ శమీకుని ఆశ్రమం లోకి వెళ్లి ,కన్నులు మూసుకుని అంతర్ముఖుడై ,ధ్యానం లో ఉన్న శమీక మహర్షిని , ఇటు గా లేడి పర్గేట్టిందా అని శామీకున్ని అడిగితే , బహిర్ముఖుడు కాదు కాబట్టి, జవాబు చెప్పక పోతే ఉద్దతిచేత ఆకలి చేత , దప్పిక చేత కలిగిన టువంటి ప్రకోపం చేత చచ్చి పోయిన పాముని ధనస్సు యొక్క మూపుతో




 ఆ శమీకుని మెడలో వేస్తె ఆ శమీకుని కుమారుడు అయిన శృంగి కి ఈ విషయం తెలిసి నా తండ్రిని ఇంత అగౌరవ పరుస్తాడా దేశమునేలే రాజు అని నేటికి ఏడవ రోజు , తక్షకుని యొక్క విషాగ్ని చేత , తండ్రి మూపురమున విష సర్పాన్ని వేసిన పరీక్షిత్ తక్షకుని యొక్క అగ్ని జ్వాలల యందు కాలి బూడిద అవుగాక అని శాప వాక్కు విడిచి పెట్టి తండ్రి దగ్గరకి వచ్చి, అభివాదం చేసి గోత్ర నామాలు చెప్పుకుని , భూమి మీద పడి నమస్కరిస్తున్న సమయంలో ఆ మహానుభావుడైన శమీకుడు కన్నులు విప్పి , తన కొడుకైన శృంగిని చూసి ఏ రా  బాధ గా ఉన్నావ్ అని అడిగితే, నాన్న గారు మీ మోపు మీద పరీక్షిత్ మృత సర్పాన్ని విడిచిపెడితే నేటికి ఏడవ నాడు ఆయన మరణించాలి అని శాప వాక్కు విడిచి పెట్టాను అని చెప్తే.

శమీకుడు చూసి ,ఎంత పని చేసావురా ! చంద్ర వంశం లో పుట్టిన మహా పురుషుడు , రాజ్యమును ధర్మము గా పరిపాలిస్తున్న వాడు, అందరినీ కాపాడే ప్రభువుని , నీ యొక్క వ్యగ్రమైన వాక్కు చేత అర్థాయుశ్కున్ని చేసి పడగోడుతున్నావ్ ! కోపం అనేది రానేకూడదు , కోపం వస్తే ఎన్ని ఉపద్రవాలో వస్తాయి అని ఆ రోజున శృంగితో శమీకుడు అన్నాడు.

క్రోధము ఆవహించిన వాని యొక్క తపస్సు చెడిపోతుంది. క్రోధము వలన అణిమాది సిద్దులు గుణములు అన్నీ నశించి పోతాయి. క్రోధము ధార్మికమైన పనులు చెయ్య నివ్వదు. క్రోధము ఉన్న వాడు ఇక తపస్వి ఎలా అవుతాడు.
ఓర్పు లేని తపస్సు , అలాగే పరాకుగా ఉండక పోవటం వల్ల ఐశ్వర్యం నిలబడక పోవటం అనేటటు వంటి లక్షణం. ధర్మం విదిచిపెట్టిన రాజుకి రాజ్యం ఎలా నశిస్తుందో. అది పగిలిపోయిన కుండలో పోసిన నీరు కారిపోయినట్టే. ఎంత తప్పు పని చేసావు రా ! అని గౌరముఖుడు అనే ఒక మునిని పిలిచి, నేటికి ఏడవ రోజు మరణించాలని నా కొడుకు రాజుకు శాపం ఇచ్చాడు ,వెంటనే, భద్రతా ఏర్పాట్లు చేస్కుని , మంత్ర తంత్రములు తెలిసున్న బ్రాహ్మణుల్ని పక్కన పెట్టుకుని , ఎంత మాత్రమూ పరాకు లేకుండా, తనకి తను రక్షించుకొమ్మని , పరీక్షిత్ మహారాజుకి నా వాక్కు గా చెప్పండి అని, ఆ గౌరముఖుడనే  మునిని రాజుదగ్గరకి పంపిస్తే, ఆయన వెళ్లి పరిక్షిత్  కి చెప్తే

శమీక మహర్షి , కొడుకు ని అడిగాడు ఆ రోజున, నీ శాపాన్ని వెనక్కి తియ్యలేవా అని . నాన్న గారు నేనేమీ చెయ్యలేను , ఇప్పటికే నేను ఇచ్చిన శాపవాక్కు , తక్షకుడి లో ప్రచోదనం చేసి , బయలుదేరిపోయి ఉంటాడు , కరవటానికి పరిక్షిత్తు ని అన్నాడు. ఆ మాట చెప్పినట్టుగానే , మహానుభావుడు బయలు దేరాడు , బయలుదేరి  గబగబా వచ్చేస్తున్నాడు. వచ్చి ఇంక పరిక్షిత్తు ని కాటు వెయ్యాలి , అది ఏడవ రోజు, ఇంక ఆ ఒక్క రోజు దాటి పోయిoదా, పరిక్షిత్తు బతికేస్తాడు.

ఇప్పుడు పరిక్షిత్తు ఒక పెద్ద ఒంటి స్తంభం మెడ కట్టుకుని , మంత్ర తంత్రములు తెలిసున్న వాళ్ళని పక్కన పెట్టుకుని, ఆయన బోలెడంత మంది వడ్రగుల్ని కార్మికుల్ని పిలిపించుకుని , ఒంటి స్థంబం మేడ కట్టించుకుని, అందులో తన బ్రుత్యుల్ని చుట్టూ పెట్టుకుని , విషాన్ని విరగొట్ట గల మంత్రాలు తెలిసున్న బ్రాహ్మణుల్ని తన వెంట పెట్టుకుని, అందులోనే ఉంటూ , నేను ఏడూ రోజులయ్యే వరకు కిందకు దిగి రానని, కూర్చున్నాడు, కుర్చుని ఉండగా ఏడవరోజు వచ్చింది.

బయలుదేరాడు , ఎవరు , తక్షకుడు ఆయన్ని కరుస్తాను అని. ఈలోగా బ్రహ్మ గారు ఏమి చేసారంటే, లోకంలో పాములు ఎవరిని పడితే వారిని కరిచేస్తున్నాయి, కరిస్తే వాళ్ళు చనిపోతున్నారు. పాము కరిస్తే చనిపోకుండా ఉండ టానికి నేను కశ్యపుడు అనే ఋషి కి పాము యొక్క విషాన్ని విరగొట్ట గల మంత్రాన్ని ఉపదేశం చేస్తాను అని, సాక్షాత్తు గా చతుర్ముఖ బ్రహ్మ గారే కశ్యప ప్రజాపతికి ఉపదేశం చేసారు.

ఆ కశ్యప మహర్షి ఎంత గొప్ప వాడంటే, తక్షకుడు కాటువేసి పరిక్షిత్తు మరనిన్చేలోపు, రాజుని నేను రక్షిస్తాను అని కశ్యపుడు బయలుదేరాడు. ఇద్దరూ బయలు దేరారు , వృద్ద బ్రాహ్మణ వేషం లో తక్షకుడు ఉన్నాడు, కశ్యపుడు వెళ్తున్నాడు , ఇద్దరూ కలుసుకున్నారు , కలుసుకున్న తరువాత , అడిగాడు. ఏమయ్యా నువ్వు ఎవరు ? ఎక్కడికి వెళ్తున్నావు అంటే కశ్యపుడు అన్నాడు

రాజుని ఇవ్వాళా ఏడవ రోజు తక్షకుడు కారుస్తాడు , కరిచినప్పుడు , నేను ఆయన ని విషం పోగొట్టి బ్రతికించడానికి వెళ్తున్నాను అన్నాడు. పిచ్చి వాడా నువ్వు ఆ కోరిక విడిచి పెట్టు , వజ్రాయుధం తగిలిన వాడు బ్రతుకుతాడెమో కాని , తక్షకుడు కరిచిన వాడు బ్రతకడు అన్నాడు. నేనే తక్షకున్ని , నేను ఒక్క సరి కరిస్తే  బూది కుప్ప గా పడిపోతాడు , మనిషి బ్రతికి ఉండటం కాదు. కాబట్టి నువ్వు బ్రతికిన్చాలేవు అన్నాడు. అంటే కశ్యపుడు అన్నాడు బూది కుప్ప గా నువ్వు చేసినా నేను బ్రతికించ గలను అన్నాడు.

అయితే ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది , దాని కొమ్మలు ఎంత వరకు వ్యపించాయో తెలియట్ల, పచ్చటి చెట్టు నేను మొదట్లో కారుస్తాను , బూడిద కుప్ప గా పడిపోతుంది, బ్రతికించు చూస్తాను అన్నాడు. తక్షకుడు . కాటు వేశాడు, అది బూడిద కుప్ప కింద పడిపోయింది చెట్టు. వెంటనే ఈ కశ్యప రుషి , బ్రహ్మ గారు తనకి ఉపదేశం చేసిన మంత్రాన్ని జపం చేసి ప్రయోగించాడు. వెంటనే ఆ మర్రి చెట్టు మళ్ళి వచ్చింది. వచ్చేటప్పటికి  తక్షకుడు ఆశ్చర్య పోయాడు.

అయితే ఈ విషయం హస్తినాపురం లో ఎలా తెలిసింది అంటారేమో , ఒక వ్యక్తి అరణ్యం లోకి వచ్చి ఆ మర్రి చెట్టు ఎక్కి ఎండు  పుల్లలు ఎరుకుంటున్నాడు, అకస్మాత్తు గా తక్షకుడు ఆ చెట్టుని కరవటం లో ఈ వ్యక్తి కుడా కాలి బుడిదైపోయి కింద పడిపోయాడు. మళ్ళి కశ్యప ఋషి మాత్ర ప్రభావం చేత చెట్టుతో పాటు ఆయన కుడా బ్రతికాడు. ఆయన తరువాత పరిగెత్తుకుంటూ హస్తినా పురం వెళ్లి ఈ విషయం అంత చెప్పాడు.

ఇప్పుడు తక్షకుడు అన్నాడు , నేను కాటు వెయ్యటం అనేది , పరమ సత్యం, నువ్వెందుకు ఆయన్ని బ్రతికించాలి అనుకుంటున్నావ్! ఒకటి మహానుభావుడు కాబట్టి బ్రతికిస్తావు. రెండు రాజుని బ్రతికిస్తే , రాజు అపారమైన ధనం ఇస్తాడు. రాజు ఎంత ధనం ఇస్తాడో అంత కన్నా అధికమైన ధనం ఇస్తాను నువ్వు , బ్రతికంచ వద్దు అన్నాడు తక్షకుడు. కశ్యప ఋషి కన్నులు ముస్కుని అంతర్ముఖుడై చూశాడు . రాజుకి మరణము తధ్యము అని తెల్సిపోయింది. ఋషి వాక్కు జరగక మానదు , కాబట్టి ఇప్పుడు తక్షకుడు ఇచ్చిన డబ్బు పట్టుకుని కశ్యపుడు వెళ్ళిపోయాడు.

ఇప్పుడు తక్షకుడు ఈ ఒంటి స్థంభం మేడలోకి లోకి ప్రవేశించాలి, ఇప్పుడు తన సోదరులైన పాముల్ని కొందరిని పిలిచి, మీరు బ్రాహ్మణ కుమారుల వేషాలు వేస్కుని , ఋగ్వేద , యజుర్వేద మంత్రాలు చెప్తూ వెళ్ళండి, కొన్ని పువ్వులు పళ్ళు పట్టుకుని వెళ్లి ప్రసాదం రాజా , నీకు రక్ష గా ఇస్తున్నాము అని చెప్పి ఇవ్వండి. వేదం చదువుతున్న బ్రాహ్మణ కుమారులని చుస్తే రాజు కాదనడు , తీస్కుంటాడు.

అంటే వాళ్ళు అలాగే వెళ్లారు , వెళ్తే రాజు ప్రసాదం , కదా అని పుచ్చుకున్నాడు, ఆయన ఆ పళ్ళు తన చుట్టూ ఉన్నమంత్రులకి ఇస్తున్నాడు.  ఇస్తూ చాలా ధైర్యంగా ఆయన ఆ మంత్రులతో ఒక మాట అన్నాడు. అదిగో సూర్యుడు పశ్చిమ దిక్కున అస్తమిస్తున్నాడు , కాబట్టి ఏడవ రోజు పూర్తయింది , ఇంకా తక్షకుడు నన్నేమి చెయ్యడు. ఇది బ్రాహ్మణ ప్రసాదం. కాబట్టి మీరు తినండి అని వారందరికి ఇచ్చాడు, ఒక పండు తీసి నేను తింటాను అని ఆ పండుని ఇలా విప్పాడు.

విప్పీ విప్పగానే నల్లటి గుడ్లతో ఒక పురుగు , కనపడింది. ఆ పురుగు మెల్లగా ఎర్రటి రక్త వర్ణం తో పాము అయ్యింది.
ఆ పాము తక్షకుడు. అది వెంటనే రాజుని కరచి, పెద్ద స్వరూపాన్ని పొంది, అగ్నిహోత్రాన్ని చిమ్మి అక్కడ ఉన్నటువంటి , మేడని కుడా కాల్చేసి, దూకి పారిపోయింది. అలా నీ తండ్రి చచ్చి పోయాడయ్యా అన్నారు మంత్రులు  జనమేజయుడితో.

ఇప్పుడు జనమేజయుడు చాలా వ్యగ్రత పొందాడు. నిజంగా కూడా తక్షకుడు యుక్తాయుక్త విచక్షణ లేని పాము. ఒక బ్రాహ్మణ వాక్కు ఫలించాలని తక్షకుడు ఇంత పన్నాగం పన్ని, మీ నాన్న ని చంపేసాడు, మీ నాన్న మంచితనాన్ని దేన్నీ పరిగణ లోకి తీస్కోకుండా చంపేసాడు. బ్రాహ్మణ వాక్కు కి అంత గౌరవమ్ ఇచ్చాడుగా నువ్వూ బ్రాహ్మణుల్ని తీస్కొచ్చి యాగం చెయ్యి. యాగం చేసి మొత్తం పాముల సంతతి అంతటినీ అగ్నిహోత్రం లో పారేయి. తక్షకున్ని కూడా పడగొట్టు. కాబట్టి నువ్వు ప్రతీకారం చెయ్యవలసిందే చెయ్యి అన్నారు.

అనగానే అయితే యాగ శాల నిర్మాణం చెయ్యండి అన్నాడు జనమేజయుడు. ఋత్విక్కు ల్ని పిలవండి , నేను యాగ దీక్ష తీస్కున్తున్నాను అన్నాడు. దీక్షా అన్న మాట యాగామునకే వర్తిస్తుంది. కాబట్టి నేను దీక్షితున్ని అవుతున్నాను అన్నాడు. యాగశాల నిర్మాణం చేసారు.

యాగ శాల నిర్మాణం చేసినా , ఇల్లు కట్టినా వస్తూ అన్నది , దాని యొక్క ప్రభావం దానికి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. ఎవరు ఎన్ని మాటలు చెప్పిన , మనం శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళం అయినప్పుడు మనం అలాగే మాట్లాడవలసి ఉంటుంది, అలాగే పాటించ వలసి ఉంటుంది.

అందులో ఒక పౌరాణికుడు , ఒక శాస్త్రము తెలిసున్న మహానుభావుడు వచ్చి జనమేజయుడితో అన్నాడు, ఈ యాగ శాల నిర్మాణం లో దోషం ఉంది, ఈ యాగ శాల నిర్మాణం లో దోషం ఉండుట వలన నువ్వు ఎంత గొప్ప బ్రాహ్మణుల్ని తీస్కొచ్చినా ఎంత గొప్ప యాగ సంబరాలు నువ్వు తీస్కోచ్చినా , ఈ యాగం మధ్యలో ఒక బ్రాహ్మణుడి వలన ఆగిపోతుంది, అన్నాడు

జనమేజయుడు లక్ష్య పెట్టలేదు , లక్ష్య పెట్టకుండా ఆయన ఆ యాగం చెయ్యటం కోసం అని చెప్పి సిద్ధ పడ్డాడు. జనమేజయుడి యొక్క భార్య , కాశీ రాజు యొక్క కుమార్తె అయిన వపుస్టమ. ఆ వపుస్టమ తో కలిసి ,( భార్య లేని వాడు యాగం చెయ్యటానికి అనర్హుడు. ) ఆ సర్పయాగం చెయ్యటానికి కూర్చున్నాడు.

బ్రాహ్మణులూ అందరు కూర్చున్నారు. కుర్చుని ఒక్కొక్క పాము పేరు చెప్పి పిలుస్తున్నారు. ఒక్కొక్క పేరు చెప్పి ఋత్విక్కులు పిలుస్తుంటే బ్రహ్మదండం పడ్డట్టు గా పడిపోతున్నాయి.

ఒక పడగ పాము , మూడు పడగల పాము, మూడు పడగల పాము , తొమ్మిది పడగల పాము పెక్కు తలలు కలిగిన పాములు , పసుపురంగు కలిగిన పాములు , తెల్లరంగు పాములు , ఎర్ర రంగు పాములు, నల్ల పాములు , పొడుగు పాములు , పొట్టి పాములు, లావు పాములు సన్న పాములు , ఇన్ని రకాల పాములు , ఆకాశం లో గిర గిరా తిరుగుతూ విషాన్ని చిమ్ముతూ అగ్నిహోత్రంలో పడిపోయి, తలలు పగిలిపోతుంటే , పెట్టేల్లున శబ్దం చేస్తూ ,అరుస్తూ విషం చిమ్ముతూ అగ్నిహోత్రం లో కాలిపోతుంటే దిక్చక్రమ్ అంతా సర్పముల యొక్క వింత శబ్దములతో నిండిపోయింది ట. 



అలా అందరూ చిత్ర విచిత్రము గా ఇదేమి యాగం అని చూస్తుండగా, ఆకాశం లోంచి రంగురంగుల పాములు , అనేక తలల పాములు వచ్చి ఆ యాగం లో పడిపోయి, అగ్నిహోత్రం లో కాలిపోతున్నాయి. తక్షకుడు భయపడిపోయి, దేవేంద్రుడు ఆయనకీ స్నేహితుడు , వెళ్లి రక్షించు! , రక్షించు!రక్షించు ! అని వెళ్లి ఇంద్రుడి చాటున దాక్కున్నాడు. 

ఇంద్రుడు బ్రహ్మ గారు చెప్పినట్టు కొన్ని పాములు బ్రతుకుతాయి అని విని ఆగు తక్షకా ! కంగారుపడకు , ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ యాగాన్ని ఆపుతాడు , నువ్వు బ్రతుకుతావు, బెంగాపెట్టుకోకు అలా కూర్చో అని ఆ తక్షకున్ని ఇంద్రలోకం లో కూర్చోపెట్టాడు. 

ఇంతలో మహానుభావుడు వాసుకి గబ గబా పరిగెత్తుకుంటూ చెల్లెలు దగ్గరకి వెళ్ళాడు. వెళ్లి అమ్మ ఈ జనమేజయుడు చేస్తున్న యజ్ఞం లో మా సోదరులమైన మా జాతి అంతా పడిపోతుంది , ఇప్పటికే కొన్ని లక్షల పాములు కాలిపోయాయి. వెంటనే నా మేనల్లుడైన ఆస్తీకున్ని పమ్పించమ్మా, నీ పేరు జరత్కారువు, నిన్ను జరత్కారుడికి ఇచ్చి వివాహం చేసింది, మీ ఇద్దరికీ పుట్టే పిల్లాడి వల్ల, సర్ప జాతిని కాపాడ టానికి , కాబట్టి వెంటనే నీ కొడుకును పంపు అన్నాడు. 

మీరు బెంగ పెట్టుకోకండి , పడిపోయిన కద్రువ పుత్రులు పడిపోయారు , మిగిలిన వారిని రక్షించే భారం నాది అన్నాడు ఆస్తీకుడు బయలుదేరి, జనమేజయుడు చేస్తున్న ఆ సర్ప యాగ శాల లోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే మహా తేజోమూర్తి ఆ ఆస్తీకుడు నడిచి వస్తు ఉంటె, రజూ ఋత్విక్కులు అందరూ ఆయన వంక చూస్తున్నారు.  


ఆస్తికుడు అన్నాడు , మహానుభావా జనమేజయ, నీవు చంద్రవంశం లో పెద్ద రాజువై , ప్రజలందరినీ దయతో, ధర్మంతో పరిపాలన చేస్తూ , ఆనాడు ధర్మరాజు , నాభాగు , భగీరధుడు, దశరధుడు, మాంధాత , రాముడు, రఘుమహారాజు , అర్జునుడు ఎలా పరిపాలన చేసారో అలా పరిపలించావయ్యా. 

నాయనా! ఈ భూమండలం అంతటికీ నువ్వు చక్రవర్తి వి అయిన తరువాత, నీ రాజ్య పరిపాలన లో నువ్వు అనేక యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ రుత్విక్కులని పిలిచి నువ్వు ఇచ్చిన సంభావనల చేత ఆ యజ్ఞ దీక్షితులైన రుత్విక్కులకి నువ్వు ఇచ్చిన దక్షిణ ల చేత, బ్రాహ్మణులూ అంత ఎంతో తృప్తి పొంది ఉన్నారు . (ఈ స్తోత్రం లో ఒక రహస్యం ఉంది , దాన్ని చివర మీకు చెప్తాను ). 

నువ్వు ఇక్కడ నిమంత్రణం చేసిన ఋత్విక్కులు ఉన్నారే , వాళ్ళు ఆగ్రహించినా అనుగ్రహించినా, ఏదైనా చెయ్య గలిగిన టువంటి సమర్ధులు. ఒకనుకోకనాడు బ్రహ్మ గారు చేసిన యజ్ఞo ఉందే పూర్వ దిక్కున , ఆ చేసినటువంటి , యజ్ఞం ఉండే ఆ యజ్ఞం కన్నా , ఇవ్వాళ నువ్వు చేసే యజ్ఞం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఋత్విక్కులు గొప్పవాళ్ళయ్యా! ఓ కురువంశ వర్ధనా నువ్వు చేసే ఈ యాగం ఎంత గొప్పదో తెల్సా , ఒకనాడు మహారాజైన నలుడు చేసిన యజ్ఞం, ధర్మ రాజు చేసిన రజసూయ యాగం, ప్రయాగ లో బ్రహ్మ గారు చేసిన యజ్ఞం , పాశం చేతిలో పెట్టుకునే వరుణుడు చేసిన యజ్ఞo, కృష్ణుడు చేసిన యజ్ఞం, చంద్రుడు చేసిన యజ్ఞం , నువ్వు చేసిన యజ్ఞం , ఇవయ్యా యజ్ఞాలంటే. 

ఎంత గొప్ప యజ్ఞం చేశావయ్యా , అసలు యజ్ఞాలు అంతటికి నీ యజ్ఞం ఎంత గొప్పదో తెలుసా! ఒక మహానుభావుడు  ఇక్కడ కుర్చుని ఉన్నాడు ఈ యజ్ఞం లో .  మహానుభావుడు , అపారమైన విద్వత్తు కలిగినవాడు, మూడు లోకముల యందు ఖ్యాతి గడించిన వాడు , కృష్ణ ద్వైపాయనుడు అన్న పేరు కలిగిన వాడు, వేదవ్యాసుడు , శిష్య ప్రసిష్యులతో వచ్చి ఈ యాగం లో కుర్చుని ఈ యజ్ఞాన్ని అంతటిని పరీక్షిస్తున్నాడు. అంతటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు అంటే ఈ యాగం ఎంత గొప్పదో వేరే చెప్పాలా నాయన అన్నాడు. 

నువ్వు చేసే యాగాలలో అగ్నిహోత్రుడు సంతతము నీ పక్కన కుర్చుని హవిస్సులు  స్వీకరిస్తూ ,కుడిపక్కకి తిరిగేతతువంటి జ్వాలలు కలవాడై. నీ కోర్కెలను ఈడేర్చే వాడు అగుగాక ! నీవు అంత కీర్తి వంతుడవు అవుగాక! అని ఆశీర్వచనం చేసాడు. 

ఇంత కీర్తి కల వంశం లో పుట్టిన వాడివి , ఇంత దయాళువు వి, ఇంత పేరు తెచ్చుకున్నవాడివి, ఇంతమంది పెద్దల్ని కూర్చోపెట్టి యాగం చేస్తున్నవాడివి. ఇంత దాన ధర్మాలు చేస్తున్న వాడివి, ఏదో నిమిత్తం లేకుండా బొంది పోతుందా. ఏదో కారణానికి తండ్రి పడిపోవాల్సి వచ్చింది పడిపోయాడు. ఆ నింద కాక పోతే వేరొ కారణానికి వెళ్ళిపోతాడు. దానికి మనసులో క్రౌర్యమ్ పెట్టుకుని, నీ కీర్తికి మచ్చ తెచ్చుకుంటావా ? చెయ్యవచ్చా ఇలాంటి యాగాలు. 

జనమేజయుడు అన్నాడు మహానుభావా  నీ దివ్యమైనటు వంటి వాక్కులు , తేజస్సు, చుస్తే చాల సంతోషం గా ఉంది అయ్యా నీకు ఏమి కావలి చెప్పు ఇచ్చేస్తాను అన్నాడు. వెంటనే ఆస్తికుడు అన్నాడు " నీవు నా బంధువులు అయిన సర్పములన్ని ఇలా కాలి పోయి మరణించ కుండా, వాళ్ళ మనోవేదన తీరేటట్టు గా నేను సంతోషించే టట్టు గా నీవు దయతో, ప్రాణులపట్ల కక్ష పెంచుకోవటం అనేదే విషం, ప్రాణుల పట్ల దయ పెంచుకోవటమే అమృతం. కాబట్టి నాయనా నువ్వు వేరుగా అమృతం తాగాక్కర్లేదు, దయ తో ఉండటమే అమృతం తాగటం. కాబట్టి ఆ కక్ష అన్న దాన్ని పక్కన పెట్టి , దయా అన్న దాన్ని నీ మనసులోకి తెచ్చుకో. 

ఎందుకు ఇంత మందిని కాల్చాలి . ఒకణ్ణి చంపినందుకు ఇంతమందిని చంపటమా అన్న భావన తో అలోచించి నీకు చంపబుద్ధి వెయ్యదు. కాబట్టి పరమ దయతో ఈ యజ్ఞాన్ని ఇంతటితో ఇంక ఆపు చేసేయి. చనిపొఇన వాళ్ళు చనిపోయారు ఇంక ఇప్పటికైనా ఆపితే , నా బంధు కులం, నా తల్లి వైపు బంధువులు సర్పాలు , మిగిలిన వాళ్ళు సంతోషిస్తారు. 

ఇటువంటి మహా మూర్తి , తేజోశాలి అయిన వాడు తపో మంటపం లోకి వచ్చి, నాకు ఇది కావలి అని అడిగితే అది ఇచ్చినంత మాత్రం చేత అక్షయమైన ఫలితాలని ఇస్తుంది. అంతటి మహానుభావుడు వచ్చి యాచించటమే గొప్ప, అటువంటి వాడు వచ్చి యాచించ టం కన్నా అదృష్టం ఏమి ఉంటుందయ్యా. ఇవ్వాళా నువ్వు యాగం ఒకందుకు మొదలుపెట్టావ్ , నీ అదృష్టం పండి ఆయన ఒకందుకు వచ్చాడు. ఆయన మనసులో పుట్టిన కోర్కె తీర్చి నువ్వు ఈ యాగం ఆపేయి. ఆయన మనసు సంతోషించినదా నువ్వు అపారమైన పుణ్యాన్ని పొందుతావు. 

కొడుకు అంత పుణ్యం చేసాడా , నీ తండ్రి ఉన్నత గతులు పొందుతాడు. ఇంక ఇంతకన్నా ఏమి కావలి , కాబట్టి ఆపెసేయి యాగాన్ని అన్నాడు. వెంటనే ఆ యాగాన్ని ఆపు చేసారు. కానీ అప్పటికే అక్కడ ఉన్న ఋత్విక్కులు చెప్పిన మంత్రాలకి తక్షకుడు అగ్నిహోత్రాన్ని వెదజల్లుతూ , ఇంద్రుడి సింహాసనం నించి వేరైపోయి, ఆయన ఆ మంత్రం శక్తి కి ఆగలేక , వచ్చి హోమ గుండం లో పడిపోతున్నాడు. 

వెంటనే ఆస్తికుడు అలా ఉండు నువ్వేమి భయపడక్కర్లేదు, అందులో పడక్కర్లేదు యాగాగ్ని యందు అన్నాడు. ఆస్తికుని మాట యొక్క ప్రభావానికి , తక్షకుడు , అగ్ని యందు పడకుండా తప్పుకుని పక్కకు పడ్డాడు. పడి బ్రతికి పోయాడు, ఆ కారణం చేత ఇప్పటికి ఎక్కడ ఆస్తీకుని యొక్క కధ ని చెప్పుకుంటారో, ఎక్కడ ఆస్తీక మహర్షిని తలుచుకుంటారో, అక్కడ ఎంత విషపూరితమైన సర్పములు తలలు దిన్చేస్తాయిట. 

ఆస్తీకుని కధ విన్నవారికి, భక్తితో ఆయన ని నమస్కరించిన వారికి పాములు రావు. ఎవరైతే  ఆ జరత్కారుడికి  ఈ జరత్కారువు కి పుట్టిన ఈ ఆస్తీకుని వలన ఉభయ వంశములు తరించి , సర్ప యాగం లో పాములు పడకుండా రక్షింప బడి నటువంటి వారికి పాముల వంటి పాపములు తొలగి వారు భగవంతుణ్ణి చేరటానికి , భగవంతుని అనుగ్రహం పొందటానికి యోగ్యమైన స్థితిని పొందుతారు అని ఫలశ్రుతి చెప్పారు. 

మహోత్క్రుష్ట మైనటువంటి జనమేజయ సర్ప యాగం ఆస్తీక మహర్షి వల్ల అగింతువంటి సందర్భాన్ని, కద్రువ కృత యుగం లో ఇచ్చిన శాపం కలియుగం లో ఎలా కట్టి కుడిపిందో , బ్రహ్మ గారు అన్న వాక్కు నిజమై ఆస్తీకుడు అనేటువంటి ఒక మహా పురుషుడు యాగాన్ని ఆపి, దుష్ట సర్పములు నశించిన తరువాత మిగిలిన పాములు ఎలా బ్రతికయో,ఈ కధలో చెప్పబడింది. 

అంటే ఒక్కసారి మహా పురుషులైన వారు కోపం తో కానీ , అనుగ్రహం తో కాని ఒక వాక్కు ని విడిచి పెట్టేసారు అది ఎప్పుడో అప్పుడు అనుభవం లోకి వచ్చి తీరుతుంది అని మనకి అనేకమైన ధర్మ సూక్ష్మములతో కూడినటువంటి ఈ కధా భాగాన్ని మహానుభావుడు మనకి అందించి నన్నయ్య భట్టారకుడు మానని కృతార్ధులని చేసారు. 














No comments:

Post a Comment