అగ్నిహోత్రాన్ని ఆరాధించే అలవాటు ఉంది కాబట్టి, ఆర్య శబ్దం తో పిలిచారు ఈ జాతిని. ఇంటి యజమాని బ్రతికున్నంత కాలం వెలుగుతూనే ఉంటుంది. ఇంటి యజమాని శరీరం విచిపెట్టినప్పుడు ఈ అగ్ని హోత్రాన్ని తీసుకుని వెళ్లి కట్టేల్లో పెట్టి ఆయన శరీరం కాల్చేస్తారు. లేదా ఆయన సన్యసిస్తే ఆ అగ్ని ఆగిపోతుంది. ఎందుకంటే సన్యాసికి అగ్నితో సంబంధం ఉండదు. సూర్య భగవానుడి అనుగ్రహం కలిగితే ఆరోగ్యం నిలబడుతుంది. అలాగే అగ్నిహోత్రుని అనుగ్రహం కలిగితే ఐశ్వర్యం కలుగుతుంది.
ఇప్పుడు బృగువు స్నానం కి వెళ్తున్నాడు , ఆయన వెళుతూ భార్యకి పరాకు చెప్పాడు భార్యకి, అగ్నిశాల లో అగ్నిహోత్రుడు ఉన్నాడు జాగ్రత్త. అగ్ని హోత్రుడు సర్వదేవతా స్వరూపుడు. కేరళ రాష్ట్రము లో విగ్రాహాలకి వాటిల్కి పూజ చెయ్యరు. ఒక పెద్ద దీపం వెలిగిస్తారు , అదే అమ్మవారు అని పూజ చేస్తారు.
అసలు దీపం లేకుండా పూజ చెయ్యం మనం. అందుకే ఎంగిలి గాలితో అగ్ని ని నిధనం చెయ్యకూడదు. అటువంటి అగ్నిని జాగ్రత్త గా చూడామని చెప్పి సాయంత్రం పూట స్నానాని కి వెళ్తున్నాను, అగ్ని ని కాపాడు అని భార్య పులోమ కి చెప్పి వెళ్ళాడు. ఆవిడ అగ్నిని రక్షిస్తుంది. అగ్ని ని రక్షించడం అంటే ఏమి చేస్తారు అంటే కాస్త ఊక వెయ్యాలి , కాసిని అక్షింతలు వెయ్యాలి. అలా ఆవిడ అగ్ని ని సంరక్షిస్తుంది. అగ్ని వెలుగుతున్నాడు అంటే
ఈస్వరుడే ఉన్నాడు అని అర్ధం.
ఇప్పుడు పులోమ రాక్షసుడు అని ఒకాయన ఉన్నాడు, ఆయన కి ఎప్పటినించో ఈవిడ (పులోమ) మీద కన్ను. వాడికి ఆమె యందు ప్రీతీ ఉండటమే ఒకతప్పు , ఎందుకంటే తనకి ప్రీతీ ఎవరి మీద ఉండాలి, తన తండ్రి ఎవరినైతే తీస్కొచి తన పక్కన కూర్చోపెట్టాడో ఆమె యందు ప్రీతి ఉండాలి తప్ప వేరోకరియందు ఉండకూడదు. పెళ్లైపోయిన తరువాత కూడా ఆవిడ మీద మనసు పెట్టుకోవటం ఇంకో తప్పు. ఇప్పుడు పులోమ మీద పులోమ రాక్షసుడికి మనసుండి పోయింది. బృగువు స్నానా నికి వెళ్ళిన వెంటనే వచ్చాడు పులోమరాక్షసుడు, వచ్చిన వాడికి అనుమానం వచ్చింది, ఈవిడేనా పులోమ అని అనుమానం వచ్చింది. ఈవిడేనో కాదో తెలుసుకుని వ్యామోహ ప్రకటన చేద్దాం అని ఇప్పుడు ఎవరిని అడగాలి , అక్కడ అగ్నిహోత్రుడు ఉన్నాడు ,ఆవిడ ఉంది . ఇప్పుడు అగ్నిహోత్రుడు ఈశ్వరుడు అన్న భావన వాడికి ఉంటె ఆయన్ని అడుగుతాడు. కాబట్టి వాడికి అగ్ని ఈశ్వరుడు అన్న భావన ఉంది అగ్నిహోత్రున్ని అడిగాడు ఈవిడ పులోమ నేనా అని అడిగాడు. ఇప్పుడు అగ్ని హోత్రుడు సంకటం లో పడ్డాడు. ఆయన లోకం లో చేసి పాడవుతున్న వాళ్ళని , చెయ్యక పాడవుతున్న వాళ్ళని ఇద్దరినీ చూస్తున్నాడు , కాబట్టి ఆయనకీ సత్యము అసత్యము గురించి బాగా అవగాహన ఉంది , ఆయన అనుకున్నాడు ఈమె పులోమ అంటే వీడు రాక్షసుడు ఎత్తుకు పోతే బృగువు వచ్చి నన్ను శపిస్తాడు ఎందుకు చెప్పావ్ మా ఆవిడే పులోమ అని , చెప్పకపోతే నాకు తెలీదు అనో , ఈవిడ పులోమ కాదుఅనొ చెప్తే అసత్య దోషం వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమి చేసాడంటే ఏది తక్కువ దోషమో లెక్కలు మొదలుపెట్టాడు. అసత్యం ఆడటమా లేకపోతే ఈవిడే పులోమ అని చెప్పేస్తే వాడు ఏదో ఒక అపకారం చేస్తే ఈవిడ రక్షింపబడు తుంది , ఎందుకంటే నన్ను ఆరాధన చేస్తుంది , కాని ఏదో ఒక రకం గా బాధ కలుగుతుంది రాక్షసుని వలన అప్పుడు బ్రుగువుకి కోపం వస్తుంది , ఎవరు చెప్పారు అసలివిడ పులోమని అంటాడు అప్పుడు నన్ను శపిస్తాడు. శాపం పుచ్చుకోనా అబద్దం ఆడనా అని ఆలో చించాడు . అబద్దం ఆడటమే పెద్ద దోషం , శాపం ఇస్తే మళ్ళి ఆయన కాళ్ళ మీద పది శరణు వేడుకోవచ్చు. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు సత్యాసత్య గురించి ఎంత విచారణ ఉండేదో చుడండి.
ఇప్పుడు ఈవిడే పులోమ అని అనగానే ,ఆ రాక్షసుడు అన్నాడు అసలు ఈవిడకి పెళ్లి అవ్వక ముందు ఎప్పుడో ఈవిడని నేను చేస్కుందాం అనుకున్నాను , ఈవిడ పేరు నా పేరు ఒకటే నే చేస్కుందాం అనుకున్నాను కానీ బృగువు చేస్కున్నాడు , అయితేనేమి నేను పట్టుకుపోతాను అని పట్టుకు పోతున్నాడు. ఎత్తుకు పోయేటప్పుడు తేలిక గా ఉంటుందని వాడు పందిరూపం చేసుకుని ఎత్తుకు పోతున్నాడు . ఆవిడ కన్నీటి ధరతో ఏడుస్తూ , భర్త కోసం అరుస్తూ ఉండగా ఎత్తుకు పోయాడు. అలా ఎత్తుకు పోతూ ఉండగా ఆవిడ నిండు గర్భిణి ,ఆ పండి ఎత్తుకుపోయే కుదుపులకి ఆవిడ గర్భం లోనించి ఒక పిల్లవాడు జారి పడిపోయాడు. ఆ కింద జారి పడిపోయాడు కాబట్టి ఆ పిల్లవాడికి జవనుడు అని పేరు వచ్చింది. ఆ కింద పడి పోయిన పిల్లవాడు పరమ తేజో స్వరూపుడై , ప్రళయ కాలపు అగ్ని హోత్రం ఎలా ఉంటుందో, అలా ఆ పిల్లవాడు చూసాడు , ఎవడురా మా అమ్మ కి అపరాధం చేసిన వాడు అని చూసాడు ,పులోమ రాక్షసుని వంక , అంతే వెంటనే ఆ రాక్షసుడు బూడిదై పోయాడు. ఈవిడా ఆ పిల్లవాడిని చంకన ఏసుకుని మల్లి అంత దూరం నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. ఈలోగా ఎత్తుకు పోతుంటే ఏడ్చింది కదూ , మహాపతివ్రత యొక్క కంటి నీటి బిందువులు ఒక మహానది గా ప్రవహించాయి. అదేమన్నా సామాన్యమైన విషయమా , ఇప్పుడు ఈ నది ఒక మహా పతివ్రత కంటి ధరల నించి వచ్చింది కనుక ఇప్పుడు దీనికి పేరెవరు పెట్టాలి అని బ్రహ్మ గారిని అడిగారు ,ఆయన అన్నాడు దీనికి వధూసరా అని నామకరణం చేస్తున్నాను అన్నారు. ఇప్పుడు ఆవిడ ఇంటికి వచ్చింది. ఇప్పుడు బృగువు స్నానం చేసి వచ్చాడు ,బృగువు స్నానం చేసి వచ్చే లోపల ఈ అల్లరంత అయిపోయింది. ఇప్పుడు ఆవిడ చంకన పిల్లాణ్ణి పెట్టుకుని ఏడుస్తూ ఉంది డస్సి పోయింది ఎర్రగా పిల్లడు ఉన్నాడు. ఈ పిల్లడు ఎవరు అన్నాడు బృగువు.మన పిల్లవాడే చవనుడు అన్నది. ఎప్పుడు పుట్టాడు అన్నాడు . ఇప్పుడే పంది ఎత్తుకు పోతుంటే జారిపడ్డాడు అని చెప్పింది. పంది ఎత్తుకు పోవటం ఏమిటి అన్నాడు . అంటే ఎవరో పులోమ రాక్షసుడు వచ్చాడు , ఈవిడే పులోమా అని అడిగాడు ,నేనే పులోమ అని తెలియగానే పంది ఎత్తుకు పో యాడు. ఎత్తుకు పోతుంటే ఈ పిల్ల వాడు జారిపడ్డాడు, పడుతూనే కోపంగా చూసాడు వాడు బూడిదైపోయాడు. పిల్లవాడి తేజస్సు అటువంటిది , అగ్నిని ఆరాధించిన ఫలితం. ఇదిగో పిల్లవాడు అని చూపించింది. చాలా సంతోషం అన్నాడు , అసలు నువ్వు పులోమ అని చెప్పిన వాడేవ్వరు అని అడిగాడు. ఈయనే అని చెప్పిందావిడ అగ్నిహోత్రుడు ని చూపించి .
.
వెంటనే ఆయన అగ్నిహోత్రున్ని చూసి అన్నాడు , రొజూ నేతి అన్నం హవిస్సు ఇస్తుంటే ,రోజు ఊక , అక్షతలు వేస్తుంటే అన్ని తిని నీకు కొవ్వు పట్టి ఇలాంటి మాటలు చెప్పావు. కాబట్టి అన్నీ తినటం నీకు అలవాటు అవ్వు గాకా , అన్ని తింటావు ఇవ్వాళ నించి అని అన్నాడు. ఇప్పుడు ఆయన హడలి పోయాడు , ఏదో ఒక శాపం ఇస్తాడు అనుకున్నాను , ఇప్పడు అన్ని తినమని అంటున్నాడు ,ఇప్పుడు తినకుడ ని వి ఏవి లేవు అన్నాడు. అన్ని తినడం అంటే తేలికైన విషయం కదండీ , మనం వంకాయ కుర ఒకరోజు చేసి మరుసటిరోజు అదే కుర చేస్తే నే మనం తినలేనప్పుడు . సద బ్రాహ్మణుడు అయిన అగ్నిహోత్రుడు అన్ని తినేయడం అంటే బాధ కదండీ అటువంటి అగ్ని హోత్రుడు బ్రుగువుని చూసి అన్నాడు నేనూ ఇవ్వగలను శాపం ఎందుకు ఇవ్వగలను అంటే
సత్యము చెప్పుట అంటే కేవలము నిజాము చెప్పుట అని కాదు అర్థం, సత్యం చెప్పుట అన్న మాట కి అర్థం ఏమిటంటే మనుష్య సహజమైన ప్రేమ చేత అమాయకం గ ఉన్నటువంటి ఒక ప్రాణి యొక్క గౌరవన్ని కానీ ప్రాణికి కలగబోయే ఇబ్బందిని కానీ దృష్టిలో పెట్టుకుని రక్షించుట కొరకు ఆ సమయం లో నిజానికి బదులు అబద్దం చెప్పినా శాస్త్రం దాన్ని నిజం గానే తీస్కుంటుంది.
అగ్నిహోత్రుడు బృగువు యొక్క పత్ని మహా పతివ్రత ,నిండు చూలాలు, ఆమెని ఈమె పులోమ కాదు అని అబద్దం చెప్పినా సత్యం కిందనే లెక్కకి వస్తుంది. అగ్ని హోత్రుడు సత్యం చెప్తున్నాను అనుకుని సత్యం యొక్క పరిధిని దాటిపోయాడు . అక్కడ వచ్చింది దోషం అందుకు ఇవ్వవలసి వచ్చింది బృగువు శాపం అగ్నిహోత్రుడికి. ఇప్పుడు బృగువు ఇచ్చిన శాపం వలన దోషం చెయ్యని వాళ్ళు వచ్చి పడిపోయారు. ఎలా పడిపోయారో తెలుసా , ఇప్పుడు ఆయన ని అన్ని తిను అన్నాడు , ఇప్పుడు ఆయన ఆశుద్ది అయిపోయాడు, అందులో తీస్కెళ్ళి అశుద్ధం పారేసినా కలవల్సిందే. అలా అగ్నిహోత్రుడు అన్నీ తినేస్తుంటే ఆయన అసుచి అయిపోతాడు . మొన్న ఉదంకోపాఖ్యానం లో చూసాం కదా అమృతం తిన్నా ఆచమనం చెయ్యవలసి వచ్చింది.
ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమి కలుస్తున్నారో తెలీదు, మీరు ఇక్కడ చేసే యజ్ఞం నిష్పలం అయిపోతుంది. మీరు అగ్ని ముఖతా ఇచ్చింది పుచ్చుకోవటానికి ఆయనకీ అర్హత లేదు , ఎందుకంటే ఆయన అసుచిగా ఉన్నాడు . ఇప్పుడు దేవతలకి అన్నం దొరకదు. పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ. వర్షం కురిపించడం దేవతల చేతిలో ఉంటుంది. దేవతల ఆకలి తీర్చడం నీ చేతిలో ఉంటుంది. వాళ్ళు వర్షం కురిపిస్తారు, నీకు పంటలు పండుతాయి. నువ్వు పంటని ఇంటికి తెచ్చి యజ్ఞం చెయ్యాలి . ఆ హవిస్సుని వాళ్ళు పుచ్చుకుంటారు. వాళ్ళు భోజనం చేస్తారు . వాళ్ళు తృప్తి చెందుతారు. వర్షం కురిపిస్తారు. మళ్ళి పంటలు పండుతాయి. మళ్ళి యజ్ఞం చేసి కొంత పదార్థాన్ని హవిస్సుగా ఇవ్వు. దేవతలు త్రుప్తిచెండుతారు. ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉండాలి. ఈశ్వరుడు ఇలా నియమం చేసాడు.
ఇప్పుడు అగ్ని దేవుడు అసుచి అయ్యాడు కాబట్టి , దేవతలకి కడుపునిండదు. కవ్యం వెళ్ళదు కాబట్టి పిత్రుదేవతలకి పిండ ప్రధానం లేదు. ఇప్పుడు దేవతలకి అన్నం లేదు కాబట్టి , వర్షాలు కురవావ్ , పంటలు పండవు. నదుల్లో నీళ్ళు ఉండవు , కాబట్టి ఇప్పుడు లోకాలన్నీ ఇబ్బందిలో పడిపోయాయి. నీకు నేను అసత్యం పలికాను అనిపిస్తే నువ్వు వేరే ఏదైనా శాపం నాకు ఇవ్వాల్సింది , ఇప్పుడు నువ్వు ఇచ్చిన శాపం వలన లోకం వ్యవస్థ అంతా ఆగిపోయింది. కోపం వాళ్ళ వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయో చుడండి.
ఇప్పుడు అగ్ని హోత్రుడు అన్నాడు నేనుకూడా నిన్ను శపించ గలను , కానీ అనుస్టాన తత్పరులై , వేద వేదాంగములు చదువుకుని , నిత్యం దేవతలని పరమ ప్రీతితో ప్రార్థించే బ్రాహ్మణుల నోటివెంట వచ్చే మాట ఎంత దూరం వెళ్తుందో తెలిసి వాళ్ళు కొట్టినా పొడిచినా ఓర్పు వహించి మాట్లాడటలేదు తప్ప తిరిగి శపించలేని వాడను కాను. ఇంక తను చెయ్య గలిగింది లేక , లోకంలోని సర్వ ప్రనులలోను తన తేజస్సును ఉపసంహరించుకున్నాడు. అగ్నిహోత్రం ఆగిపాయింది , యజ్ఞాలు ఆగిపోయాయి , నిత్యగ్నిహోత్రాలు ఆగిపోయాయి. దేవతల కి హవిస్సులు ఆగిపోయాయి , పిత్రుదేవతలకి కవ్యాలు ఆగిపోయాయి , పిండాలు ఆగిపోయాయి , వర్షాలు ఆగిపోయాయి. లోకం అంతా సంక్షోభం లో మునిగి పోయింది. అందరు చతుర్ముఖ బ్రహ్మ గా రి దగ్గర్కి పరిగెత్తారు. ఏ ఆపద వచ్చినా అందరు ఆయన దగ్గరకి వెళ్తారు. అయ్యా ఇలా బృగువు అగ్నిహోత్రున్ని ఇలా శపించాడు , లోకం స్తంభించిపోయింది ఎలా అని అడిగారు . బ్రహ్మ దేవుడు అగ్నిహోత్రున్ని పిలిపించారు.
ఆయన తో బ్రహ్మగారు అన్నారు ఏమయ్యా నువ్వు ఈ భూత సంతతి అంతటికి భర్తవి , భారించేవాడివి, వేడి ఉన్నంత సేపే ప్రాణాలు ఉంతాయి. లోకం లో పధర్థములన్ని పచనమై రుచి వస్తుంది. వండుకోక పోతే రుచి ఎక్కడ ఉంటుoది. అటువంటి వాడివి కోపం వచ్చి నీ తేజస్సుని ఉపసంహారం చెయ్యొచ్చా? అంటే అగ్నిహోత్రుడు తనకి కలిగిన ఇబ్బందిని చెప్పాడు. ఇప్పుడు బృగువు మాట వెనక్కి తీయ్యటానికి వీలు లేదు కాబట్టి, నువ్వు సర్వ భాక్షకుడవే , నువ్వూ అన్నీ తింటావు , కానీ అన్నీ తిన్న నీ పవిత్రతకి లోపం రాదు. నువ్వు ఎప్పుడూ పవిత్రుడవే. నీకు వరం ఇస్తున్నాను. ఆచమనం కుడా చెయ్యక్కర్లేదు. అన్నాడు బ్రహ్మ గారు. ఇప్పుడు అంతా మాములు అయిపోయింది. దేవతలకి హవిస్సులు అన్డుతున్నై , వర్షాలు కురుస్తున్నై, సంతోషం గా కాలం గడుస్తుంది.
ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈకధ అంత అంటే
సర్ప యాగం లో పాముల్ని అగ్నిహోత్రుడు ఎలా తిన్నాడు అని అడిగిన ప్రశ్న కి జవాబు చెప్పటానికి , బృగువు దగ్గర జరిగిన కధ అంతా చెప్పి ఎందుకు అగ్ని సర్వభక్షకుడు అయ్యాడో అయినా పవిత్రుడు అయ్యాడో మహానుభావుడు సౌతి ఈ విషయాలన్నీ ఆ నైమిశారణ్యం లో ఉన్న ఋషులకి చెప్తూ , ఇప్పుడు బృగువు కి పులోమకి పుట్టిన చవనుడు, శర్యాతి అనే రాజు యొక్క కుమార్తె అయిన సుకన్య ని పెళ్లి చేసుకున్నాడు.
దేవి భాగవతం లో వస్తుంది, చవనుడు పుట్టలో కూర్చొని తపస్సు చేస్కుంటుంటే, ఆయన కళ్ళు మిణుగురు పురుగుల్లా కనపడుతున్నై అని ఆవిడ పొడవటం, వ్రుద్దుడైనా కూడా ఆవిడ వివాహం చేస్కోవటం, పరమ భక్తి తో భర్త ని అనుసరించడం. అశ్వని దేవతలు రావడం, నీకు నీ భర్త మీద అంత పాతివ్రత్యము , అంత మమకారము ఉంటె ఏది మేము చూస్తాము, ముగ్గురం కలసి స్నానం చేస్తాం , ముగ్గురం ఒక్క లా ఉంటాం . నీ భర్త ఎవరో నువ్వు గుర్తుపట్టు అనడం, ముగ్గురూ వెళ్లి ఆ నదిలో స్నానం చెయ్యడం , ముగ్గురూ అశ్వని దేవతలగానే కనపడటం , తన భర్త ఎవరో తాను గుర్తుపట్ట లేకపోతే తన పాతివ్రత్యానికి దోషం వస్తుంది కాబట్టి ఆవిడ వెంటనే దేవిభాగవతం లో అమ్మవారిని స్తోత్రం చెయ్యడం , అమ్మవారు అనుగ్రహించి ఆ శర్యాతి కుమార్తె అయిన సుకన్య కి తన భర్తని గుర్తుపట్ట గల బుద్ది ప్రచోదనం చెయ్యడం, దాని వల్ల ఆమె చవన మహర్షి ని గుర్తుపట్టడం , చావన మహర్షి కి నిత్య యవ్వనం రావడం , మళ్ళి యవ్వనం లోకి వచ్చి వాళ్ళిద్దరూ సంతోషంగా కాలం గడపటం. దేవిభాగవతం లోని ఈ ఘట్టాన్ని ఒక్కసారి విహంగ వీక్షణం చేశాను. ఇప్పుడు ఈ చవనమహర్షికి సుకన్య కి ప్రమతి అనే కుమారుడు కలిగాడు. ఈ ప్రమతి గ్రుతచి అనే క్షీర సాగర మదనం జరిగినప్పుడు పాలసముద్రం లో నించి పుట్టిన అప్సరస ని వివాహం చేస్కున్న ప్పుడు వారికి రురుడు అనే పిల్లవాడు పుట్టాడు. ఈ రురుడు గందర్వ రాజైన విశ్వావసుడు , మేనక వీరిద్దరికీ జన్మించిన ప్రమద్వర అనబడే పిల్ల స్తూల కేశుడు అనే ముని ఆశ్రమం లో పెరుగుతూ ఉంటె ఆమెని వివాహం చేస్కుందాం అని సంకల్పం చేసి , నిశ్చితార్దం చేసుకున్నాడు. అంటే తన భార్య అయిపోయినట్టే ఇoచుమిoగా భార్య అయిపోయినట్టే. ఒక నాటి సాయంకాలం చె లికత్తె ల తో కలిసి ప్రమద్వర ఆడుకుంటుంది. ఒక పెద్ద త్రాచుపాము ఒకటి వచ్చి ఆ ప్రమద్వర కాలి ని కాటువేసింది. వెంటనే ఆమె నురగలు కక్కుతూ చనిపోయింది. రురుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన ఏడవ సాగాడు. నేను నా మనసు ఈమె యందె పెట్టుకున్నాను. ఈమె ఇప్పుడు చనిపోయిoది అని ఏడుస్తున్నాడు. ఆ సమయానికి ఋషులoదరు అక్కడికి చేరుకున్నారు. రురుడు అక్కడ ఉండే వాళ్ళందరిని ప్రార్ధన చేసాడు. దేవతలని కూడా ప్రార్ధన చేసాడు. నేను గురువుల్ని జాగ్రత్తగా సేవించి ఉంటె , హోమాలు ఉంటె, యజ్ఞ యాగాది క్రతువులు చేసి ఉంటె, గురువులందు భక్తీ కలిగిన వాడనైతే, ఈమె తిరిగి బ్రతుకు గాక, అని ఎవరైనా విషం శరీరం లోకి ఎక్కిన విషం మాత్రతంత్రములతో తీసెయ్య గలిగిన వారుంటే వారికి నేను అధ్యయన ఫలాని , తపోఫలన్ని , గురువుల్ని సేవించిన ఫలాన్ని ధరపోసేస్తాను అని ఏడుస్తున్నాను.
దేవలోకం లో విహరిస్తున్న దేవత అన్నాడు , ఇంత చదువు కున్నావు అంత ఏడుస్తున్నావే , ఒక సరి ప్రాణి శరీరం విడిచి వెళ్ళిపోతే , కర్మ చేత , అలా అకాలంగా శరీరం విడిచిపెట్టేస్తారు , విదిచిపెట్టేస్తే మళ్లి తిరిగి వస్తారా?
కానీ నిన్ను చుస్తే నాకు జాలేస్తుంది , నీవు ఇంత ఏడుస్తున్నావ్ కాబట్టి నీకు ఒక ప్రత్యేక మైన మినహాయింపు ఇస్తున్నాను. ఎంతకాలం నీకు ఆయుర్దాయం ఉందొ అందులో సగం నువ్వు ఈ ప్రమద్వర కి ధర పోస్తే ఈమె బ్రతుకుతుంది. అప్పుడు ఇద్దరు కలిసి జీవనం గడుపుడురుగని అన్నాడు. అప్పుడు ఆ ప్రమద్వారకి ఆయన తన ఆయుర్దాయం లో సగ భాగాన్ని ధార పోశాడు, ఆమె బ్రతికింది. ఆయన రురుడు ప్రమద్వరని వివాహం చేస్కున్నాడు , ఇద్దరూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అప్పటినించి రురుడు ప్రతిరోజూ ఒక పని చేస్తూ ఉండేవాడు , ఏమిటి ఆ పని అంటే ఆయన చేత్తో ఒక లావు కర్ర ఒకటి పట్టుకునేవాడు, పట్టుకుని వెళ్తూ వెళ్తూ ఆయనకి పుట్ట ఎక్కడ కనపడితే అక్కడ తవ్వేసేవాడు తవ్వి అందులో ఉన్న పాములన్నీ చంపేసి వెళ్ళేవాడు. పాము అన్నది కనపడితే చాలు చంప కుండా వెళ్ళేవాడు కాదు. వెతికి వెతికి మరీ చంపేవాడు. ఎందుకని తన భార్య ని పాము కరిచింది ఒకసారి అందుకని . ఎంత చిత్రం గా లోపల క్రోధాలు ఉండిపోతాయో చుడండి. పాముకి విషం లేకపోతే దానికి దొరికింది చావదు దాన్ని ఇది మింగలేదు. విషం లేని పాముకి ఆహారం దొరకటం కష్టం. అలాంటి ఒక పెద్ద విషం లేని పాము డుండుభము అనే పేరుగల పాము రురుడికి కనపడింది, వెంటనే రురుడు కర్ర తీసి కొట్ట బోయాడు. అది వెంటనే ముని అయ్యింది . ముని అయ్యి అది అంది , నేను విషం లేని పాముని, నువ్వేమో బ్రుగు వంశం లో పుట్టిన బ్రాహ్మణుడివి, బ్రుగువంశం లో పుట్టిన బ్రాహ్మణుడు ఎక్కడా పామెక్కడ , ఎందుకయ్యా అలా పాముల్ని చంపుతూ ఉంటావు అంది. ఇప్పుడు రురుడు అన్నాడు చంపడం మాట అలా ఉంచు కొడదాం అని నేను వస్తే , ముని అయిన నువ్వెవరు అన్నాడు, నా పేరు సహస్రపాదు, నేను ఒకప్పుడు వేదం చదువుకుంటూ ఉండేవాడిని , నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు , ఆయన పేరు ఖగముడు ,అతడుకుడా వేదము చదువుకుంటూ అగ్నికార్యం చేస్కుంటూ ఉన్నాడు ఒకరోజునా , నాకెందుకో అక్కర్లేని బుద్ది ఒకటి పుట్టింది. వీడు అగ్ని కార్యం చేస్తున్నాడు, వీడి మీద పాము అనుకునేలాగా ఏదైనా వేస్తె అతడు పాము అనుకుని ముందుకి పడితే అగ్నిగుండంలో పడతాడు , వెనక్కి పడితే ఎలా ఉంటుందో చూదాం అనిపించింది. వికృత హాస్యo. అర్థం లేని హాస్యం చేస్తే ఇలానే ఉంటుంది.
ఒక గడ్డి పాము తయారుచేసి ఆ పాముని తీసి అగ్నికార్యం చేస్కుంటున్న ఆ ఖగముడి మీదకి విశిరాడు కిటికిలోంచి, అది వెళ్లి అతని మీద పడగానే అతడు అది పాము అనుకుని ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. అతడు లేచి నేను ఎంతో ధ్యానం తో అగ్నికార్యం చేస్తుంటే ఎవడు రా నా మీద ఇది వేసింది అని చూసాడు, స్నేహితుడే సహస్ర పాదుడు. విషం లేని పాము లా ఒక గడ్డి పాముని నా మీద వేసి నేను ఉలిక్కి పడితే నవ్వావు కాబట్టి , విషం లేని పామువై పుట్టి దాని బాధ అనుభవించు అన్నాడు . మితిమీరిన హాస్యo , అవతల వారిని భాద పెట్టె హాస్యం ఎంత దూరం వెళ్ళిపోతుందో చుడండి. కాబట్టి అర్థం పర్దం లేని హాస్యం మంచిది కాదు , కాబట్టి విషం లేని పాముగా పుట్టాను, అప్పుడు నా స్నేహితుడి దగ్గర ఏడ్చాను , ఎప్పుడు నాకు ఉపసమనం కలుగుతుంది అని అడిగాను . అప్పుడు నా స్నేహితుడు చెప్పాడు, బ్రుగు వంశంలో పుట్టిన బ్రాహ్మణుడు నీకు కనపడతాడు , అప్పుడు అంతా మంచే జరుగుతుంది లే అని చెప్పాడు.
ఇది సరే నువ్వు బ్రుగు వంశం లో పుట్టావే , వేదం చదువుకున్నావు , యజ్ఞం చేస్తున్నావు , ఇలా కర్రపెట్టి పాముల్ని కొట్టచ్చా. బ్రాహ్మణుడు అంటే ఎటువంటి వాడు,ఒక సచ్చీలుడైన బ్రాహ్మణుడు పుట్టగానే ఆ చుట్టు పక్కల ఉన్న వారిలో భూత దయ కలుగుతుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి , అప్పటి వరకు ఉన్న దుష్టమైన ఆలోచనలు పరిశీలనం చేత వేల్లిపోతై, అందరిని సమానం గా చూసే బుద్ది కలుగుతుంది,అల బ్రతకాలని శత్రాలన్నీ చెప్తున్నాయి , నువ్వేమయ్యా కనపడ్డ పాముల్నల్లా చంపుతూ హింస చేస్తున్నావు ఇలా చేయ్యోచా ? ఇప్పటికైనా ఆపెయ్యి , ఏదో కర్మ వశం నీ భార్య ని పాము కరిచింది , నువ్వు బ్రతికించు కున్నావు . అక్కడితో దాన్ని విడిచిపెట్టాలి అంతే కానీ కనపడ్డ పామునల్లా చంపుకుంటూ తిరిగితే ఈ హింస వల్ల పాపం నిన్ను కట్టి కుడపదా. నీ తండ్రి యొక్క శిష్యుడైన ఆస్తీక మహర్షి ఒకానొక అప్పుడు , జనమేజయుడు చేసిన సర్పయగాన్నే ఆపాడు , అటు వంశం లో పుట్టిన నీకు పాము లని చoపడా నికి సిగ్గుగా లేదా అన్నాడు. అయ్యా నాకు బుదోచ్చింది ఇంక నేను చంపను అన్నాడు.
అని సౌతి నైమిశా రణ్యం లో వారికి చెప్పాడు.
సత్యము చెప్పుట అంటే కేవలము నిజాము చెప్పుట అని కాదు అర్థం, సత్యం చెప్పుట అన్న మాట కి అర్థం ఏమిటంటే మనుష్య సహజమైన ప్రేమ చేత అమాయకం గ ఉన్నటువంటి ఒక ప్రాణి యొక్క గౌరవన్ని కానీ ప్రాణికి కలగబోయే ఇబ్బందిని కానీ దృష్టిలో పెట్టుకుని రక్షించుట కొరకు ఆ సమయం లో నిజానికి బదులు అబద్దం చెప్పినా శాస్త్రం దాన్ని నిజం గానే తీస్కుంటుంది.
అగ్నిహోత్రుడు బృగువు యొక్క పత్ని మహా పతివ్రత ,నిండు చూలాలు, ఆమెని ఈమె పులోమ కాదు అని అబద్దం చెప్పినా సత్యం కిందనే లెక్కకి వస్తుంది. అగ్ని హోత్రుడు సత్యం చెప్తున్నాను అనుకుని సత్యం యొక్క పరిధిని దాటిపోయాడు . అక్కడ వచ్చింది దోషం అందుకు ఇవ్వవలసి వచ్చింది బృగువు శాపం అగ్నిహోత్రుడికి. ఇప్పుడు బృగువు ఇచ్చిన శాపం వలన దోషం చెయ్యని వాళ్ళు వచ్చి పడిపోయారు. ఎలా పడిపోయారో తెలుసా , ఇప్పుడు ఆయన ని అన్ని తిను అన్నాడు , ఇప్పుడు ఆయన ఆశుద్ది అయిపోయాడు, అందులో తీస్కెళ్ళి అశుద్ధం పారేసినా కలవల్సిందే. అలా అగ్నిహోత్రుడు అన్నీ తినేస్తుంటే ఆయన అసుచి అయిపోతాడు . మొన్న ఉదంకోపాఖ్యానం లో చూసాం కదా అమృతం తిన్నా ఆచమనం చెయ్యవలసి వచ్చింది.
ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమి కలుస్తున్నారో తెలీదు, మీరు ఇక్కడ చేసే యజ్ఞం నిష్పలం అయిపోతుంది. మీరు అగ్ని ముఖతా ఇచ్చింది పుచ్చుకోవటానికి ఆయనకీ అర్హత లేదు , ఎందుకంటే ఆయన అసుచిగా ఉన్నాడు . ఇప్పుడు దేవతలకి అన్నం దొరకదు. పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ. వర్షం కురిపించడం దేవతల చేతిలో ఉంటుంది. దేవతల ఆకలి తీర్చడం నీ చేతిలో ఉంటుంది. వాళ్ళు వర్షం కురిపిస్తారు, నీకు పంటలు పండుతాయి. నువ్వు పంటని ఇంటికి తెచ్చి యజ్ఞం చెయ్యాలి . ఆ హవిస్సుని వాళ్ళు పుచ్చుకుంటారు. వాళ్ళు భోజనం చేస్తారు . వాళ్ళు తృప్తి చెందుతారు. వర్షం కురిపిస్తారు. మళ్ళి పంటలు పండుతాయి. మళ్ళి యజ్ఞం చేసి కొంత పదార్థాన్ని హవిస్సుగా ఇవ్వు. దేవతలు త్రుప్తిచెండుతారు. ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉండాలి. ఈశ్వరుడు ఇలా నియమం చేసాడు.
ఇప్పుడు అగ్ని దేవుడు అసుచి అయ్యాడు కాబట్టి , దేవతలకి కడుపునిండదు. కవ్యం వెళ్ళదు కాబట్టి పిత్రుదేవతలకి పిండ ప్రధానం లేదు. ఇప్పుడు దేవతలకి అన్నం లేదు కాబట్టి , వర్షాలు కురవావ్ , పంటలు పండవు. నదుల్లో నీళ్ళు ఉండవు , కాబట్టి ఇప్పుడు లోకాలన్నీ ఇబ్బందిలో పడిపోయాయి. నీకు నేను అసత్యం పలికాను అనిపిస్తే నువ్వు వేరే ఏదైనా శాపం నాకు ఇవ్వాల్సింది , ఇప్పుడు నువ్వు ఇచ్చిన శాపం వలన లోకం వ్యవస్థ అంతా ఆగిపోయింది. కోపం వాళ్ళ వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయో చుడండి.
ఇప్పుడు అగ్ని హోత్రుడు అన్నాడు నేనుకూడా నిన్ను శపించ గలను , కానీ అనుస్టాన తత్పరులై , వేద వేదాంగములు చదువుకుని , నిత్యం దేవతలని పరమ ప్రీతితో ప్రార్థించే బ్రాహ్మణుల నోటివెంట వచ్చే మాట ఎంత దూరం వెళ్తుందో తెలిసి వాళ్ళు కొట్టినా పొడిచినా ఓర్పు వహించి మాట్లాడటలేదు తప్ప తిరిగి శపించలేని వాడను కాను. ఇంక తను చెయ్య గలిగింది లేక , లోకంలోని సర్వ ప్రనులలోను తన తేజస్సును ఉపసంహరించుకున్నాడు. అగ్నిహోత్రం ఆగిపాయింది , యజ్ఞాలు ఆగిపోయాయి , నిత్యగ్నిహోత్రాలు ఆగిపోయాయి. దేవతల కి హవిస్సులు ఆగిపోయాయి , పిత్రుదేవతలకి కవ్యాలు ఆగిపోయాయి , పిండాలు ఆగిపోయాయి , వర్షాలు ఆగిపోయాయి. లోకం అంతా సంక్షోభం లో మునిగి పోయింది. అందరు చతుర్ముఖ బ్రహ్మ గా రి దగ్గర్కి పరిగెత్తారు. ఏ ఆపద వచ్చినా అందరు ఆయన దగ్గరకి వెళ్తారు. అయ్యా ఇలా బృగువు అగ్నిహోత్రున్ని ఇలా శపించాడు , లోకం స్తంభించిపోయింది ఎలా అని అడిగారు . బ్రహ్మ దేవుడు అగ్నిహోత్రున్ని పిలిపించారు.
ఆయన తో బ్రహ్మగారు అన్నారు ఏమయ్యా నువ్వు ఈ భూత సంతతి అంతటికి భర్తవి , భారించేవాడివి, వేడి ఉన్నంత సేపే ప్రాణాలు ఉంతాయి. లోకం లో పధర్థములన్ని పచనమై రుచి వస్తుంది. వండుకోక పోతే రుచి ఎక్కడ ఉంటుoది. అటువంటి వాడివి కోపం వచ్చి నీ తేజస్సుని ఉపసంహారం చెయ్యొచ్చా? అంటే అగ్నిహోత్రుడు తనకి కలిగిన ఇబ్బందిని చెప్పాడు. ఇప్పుడు బృగువు మాట వెనక్కి తీయ్యటానికి వీలు లేదు కాబట్టి, నువ్వు సర్వ భాక్షకుడవే , నువ్వూ అన్నీ తింటావు , కానీ అన్నీ తిన్న నీ పవిత్రతకి లోపం రాదు. నువ్వు ఎప్పుడూ పవిత్రుడవే. నీకు వరం ఇస్తున్నాను. ఆచమనం కుడా చెయ్యక్కర్లేదు. అన్నాడు బ్రహ్మ గారు. ఇప్పుడు అంతా మాములు అయిపోయింది. దేవతలకి హవిస్సులు అన్డుతున్నై , వర్షాలు కురుస్తున్నై, సంతోషం గా కాలం గడుస్తుంది.
ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈకధ అంత అంటే
సర్ప యాగం లో పాముల్ని అగ్నిహోత్రుడు ఎలా తిన్నాడు అని అడిగిన ప్రశ్న కి జవాబు చెప్పటానికి , బృగువు దగ్గర జరిగిన కధ అంతా చెప్పి ఎందుకు అగ్ని సర్వభక్షకుడు అయ్యాడో అయినా పవిత్రుడు అయ్యాడో మహానుభావుడు సౌతి ఈ విషయాలన్నీ ఆ నైమిశారణ్యం లో ఉన్న ఋషులకి చెప్తూ , ఇప్పుడు బృగువు కి పులోమకి పుట్టిన చవనుడు, శర్యాతి అనే రాజు యొక్క కుమార్తె అయిన సుకన్య ని పెళ్లి చేసుకున్నాడు.
దేవి భాగవతం లో వస్తుంది, చవనుడు పుట్టలో కూర్చొని తపస్సు చేస్కుంటుంటే, ఆయన కళ్ళు మిణుగురు పురుగుల్లా కనపడుతున్నై అని ఆవిడ పొడవటం, వ్రుద్దుడైనా కూడా ఆవిడ వివాహం చేస్కోవటం, పరమ భక్తి తో భర్త ని అనుసరించడం. అశ్వని దేవతలు రావడం, నీకు నీ భర్త మీద అంత పాతివ్రత్యము , అంత మమకారము ఉంటె ఏది మేము చూస్తాము, ముగ్గురం కలసి స్నానం చేస్తాం , ముగ్గురం ఒక్క లా ఉంటాం . నీ భర్త ఎవరో నువ్వు గుర్తుపట్టు అనడం, ముగ్గురూ వెళ్లి ఆ నదిలో స్నానం చెయ్యడం , ముగ్గురూ అశ్వని దేవతలగానే కనపడటం , తన భర్త ఎవరో తాను గుర్తుపట్ట లేకపోతే తన పాతివ్రత్యానికి దోషం వస్తుంది కాబట్టి ఆవిడ వెంటనే దేవిభాగవతం లో అమ్మవారిని స్తోత్రం చెయ్యడం , అమ్మవారు అనుగ్రహించి ఆ శర్యాతి కుమార్తె అయిన సుకన్య కి తన భర్తని గుర్తుపట్ట గల బుద్ది ప్రచోదనం చెయ్యడం, దాని వల్ల ఆమె చవన మహర్షి ని గుర్తుపట్టడం , చావన మహర్షి కి నిత్య యవ్వనం రావడం , మళ్ళి యవ్వనం లోకి వచ్చి వాళ్ళిద్దరూ సంతోషంగా కాలం గడపటం. దేవిభాగవతం లోని ఈ ఘట్టాన్ని ఒక్కసారి విహంగ వీక్షణం చేశాను. ఇప్పుడు ఈ చవనమహర్షికి సుకన్య కి ప్రమతి అనే కుమారుడు కలిగాడు. ఈ ప్రమతి గ్రుతచి అనే క్షీర సాగర మదనం జరిగినప్పుడు పాలసముద్రం లో నించి పుట్టిన అప్సరస ని వివాహం చేస్కున్న ప్పుడు వారికి రురుడు అనే పిల్లవాడు పుట్టాడు. ఈ రురుడు గందర్వ రాజైన విశ్వావసుడు , మేనక వీరిద్దరికీ జన్మించిన ప్రమద్వర అనబడే పిల్ల స్తూల కేశుడు అనే ముని ఆశ్రమం లో పెరుగుతూ ఉంటె ఆమెని వివాహం చేస్కుందాం అని సంకల్పం చేసి , నిశ్చితార్దం చేసుకున్నాడు. అంటే తన భార్య అయిపోయినట్టే ఇoచుమిoగా భార్య అయిపోయినట్టే. ఒక నాటి సాయంకాలం చె లికత్తె ల తో కలిసి ప్రమద్వర ఆడుకుంటుంది. ఒక పెద్ద త్రాచుపాము ఒకటి వచ్చి ఆ ప్రమద్వర కాలి ని కాటువేసింది. వెంటనే ఆమె నురగలు కక్కుతూ చనిపోయింది. రురుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన ఏడవ సాగాడు. నేను నా మనసు ఈమె యందె పెట్టుకున్నాను. ఈమె ఇప్పుడు చనిపోయిoది అని ఏడుస్తున్నాడు. ఆ సమయానికి ఋషులoదరు అక్కడికి చేరుకున్నారు. రురుడు అక్కడ ఉండే వాళ్ళందరిని ప్రార్ధన చేసాడు. దేవతలని కూడా ప్రార్ధన చేసాడు. నేను గురువుల్ని జాగ్రత్తగా సేవించి ఉంటె , హోమాలు ఉంటె, యజ్ఞ యాగాది క్రతువులు చేసి ఉంటె, గురువులందు భక్తీ కలిగిన వాడనైతే, ఈమె తిరిగి బ్రతుకు గాక, అని ఎవరైనా విషం శరీరం లోకి ఎక్కిన విషం మాత్రతంత్రములతో తీసెయ్య గలిగిన వారుంటే వారికి నేను అధ్యయన ఫలాని , తపోఫలన్ని , గురువుల్ని సేవించిన ఫలాన్ని ధరపోసేస్తాను అని ఏడుస్తున్నాను.
దేవలోకం లో విహరిస్తున్న దేవత అన్నాడు , ఇంత చదువు కున్నావు అంత ఏడుస్తున్నావే , ఒక సరి ప్రాణి శరీరం విడిచి వెళ్ళిపోతే , కర్మ చేత , అలా అకాలంగా శరీరం విడిచిపెట్టేస్తారు , విదిచిపెట్టేస్తే మళ్లి తిరిగి వస్తారా?
కానీ నిన్ను చుస్తే నాకు జాలేస్తుంది , నీవు ఇంత ఏడుస్తున్నావ్ కాబట్టి నీకు ఒక ప్రత్యేక మైన మినహాయింపు ఇస్తున్నాను. ఎంతకాలం నీకు ఆయుర్దాయం ఉందొ అందులో సగం నువ్వు ఈ ప్రమద్వర కి ధర పోస్తే ఈమె బ్రతుకుతుంది. అప్పుడు ఇద్దరు కలిసి జీవనం గడుపుడురుగని అన్నాడు. అప్పుడు ఆ ప్రమద్వారకి ఆయన తన ఆయుర్దాయం లో సగ భాగాన్ని ధార పోశాడు, ఆమె బ్రతికింది. ఆయన రురుడు ప్రమద్వరని వివాహం చేస్కున్నాడు , ఇద్దరూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అప్పటినించి రురుడు ప్రతిరోజూ ఒక పని చేస్తూ ఉండేవాడు , ఏమిటి ఆ పని అంటే ఆయన చేత్తో ఒక లావు కర్ర ఒకటి పట్టుకునేవాడు, పట్టుకుని వెళ్తూ వెళ్తూ ఆయనకి పుట్ట ఎక్కడ కనపడితే అక్కడ తవ్వేసేవాడు తవ్వి అందులో ఉన్న పాములన్నీ చంపేసి వెళ్ళేవాడు. పాము అన్నది కనపడితే చాలు చంప కుండా వెళ్ళేవాడు కాదు. వెతికి వెతికి మరీ చంపేవాడు. ఎందుకని తన భార్య ని పాము కరిచింది ఒకసారి అందుకని . ఎంత చిత్రం గా లోపల క్రోధాలు ఉండిపోతాయో చుడండి. పాముకి విషం లేకపోతే దానికి దొరికింది చావదు దాన్ని ఇది మింగలేదు. విషం లేని పాముకి ఆహారం దొరకటం కష్టం. అలాంటి ఒక పెద్ద విషం లేని పాము డుండుభము అనే పేరుగల పాము రురుడికి కనపడింది, వెంటనే రురుడు కర్ర తీసి కొట్ట బోయాడు. అది వెంటనే ముని అయ్యింది . ముని అయ్యి అది అంది , నేను విషం లేని పాముని, నువ్వేమో బ్రుగు వంశం లో పుట్టిన బ్రాహ్మణుడివి, బ్రుగువంశం లో పుట్టిన బ్రాహ్మణుడు ఎక్కడా పామెక్కడ , ఎందుకయ్యా అలా పాముల్ని చంపుతూ ఉంటావు అంది. ఇప్పుడు రురుడు అన్నాడు చంపడం మాట అలా ఉంచు కొడదాం అని నేను వస్తే , ముని అయిన నువ్వెవరు అన్నాడు, నా పేరు సహస్రపాదు, నేను ఒకప్పుడు వేదం చదువుకుంటూ ఉండేవాడిని , నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు , ఆయన పేరు ఖగముడు ,అతడుకుడా వేదము చదువుకుంటూ అగ్నికార్యం చేస్కుంటూ ఉన్నాడు ఒకరోజునా , నాకెందుకో అక్కర్లేని బుద్ది ఒకటి పుట్టింది. వీడు అగ్ని కార్యం చేస్తున్నాడు, వీడి మీద పాము అనుకునేలాగా ఏదైనా వేస్తె అతడు పాము అనుకుని ముందుకి పడితే అగ్నిగుండంలో పడతాడు , వెనక్కి పడితే ఎలా ఉంటుందో చూదాం అనిపించింది. వికృత హాస్యo. అర్థం లేని హాస్యం చేస్తే ఇలానే ఉంటుంది.
ఒక గడ్డి పాము తయారుచేసి ఆ పాముని తీసి అగ్నికార్యం చేస్కుంటున్న ఆ ఖగముడి మీదకి విశిరాడు కిటికిలోంచి, అది వెళ్లి అతని మీద పడగానే అతడు అది పాము అనుకుని ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. అతడు లేచి నేను ఎంతో ధ్యానం తో అగ్నికార్యం చేస్తుంటే ఎవడు రా నా మీద ఇది వేసింది అని చూసాడు, స్నేహితుడే సహస్ర పాదుడు. విషం లేని పాము లా ఒక గడ్డి పాముని నా మీద వేసి నేను ఉలిక్కి పడితే నవ్వావు కాబట్టి , విషం లేని పామువై పుట్టి దాని బాధ అనుభవించు అన్నాడు . మితిమీరిన హాస్యo , అవతల వారిని భాద పెట్టె హాస్యం ఎంత దూరం వెళ్ళిపోతుందో చుడండి. కాబట్టి అర్థం పర్దం లేని హాస్యం మంచిది కాదు , కాబట్టి విషం లేని పాముగా పుట్టాను, అప్పుడు నా స్నేహితుడి దగ్గర ఏడ్చాను , ఎప్పుడు నాకు ఉపసమనం కలుగుతుంది అని అడిగాను . అప్పుడు నా స్నేహితుడు చెప్పాడు, బ్రుగు వంశంలో పుట్టిన బ్రాహ్మణుడు నీకు కనపడతాడు , అప్పుడు అంతా మంచే జరుగుతుంది లే అని చెప్పాడు.
ఇది సరే నువ్వు బ్రుగు వంశం లో పుట్టావే , వేదం చదువుకున్నావు , యజ్ఞం చేస్తున్నావు , ఇలా కర్రపెట్టి పాముల్ని కొట్టచ్చా. బ్రాహ్మణుడు అంటే ఎటువంటి వాడు,ఒక సచ్చీలుడైన బ్రాహ్మణుడు పుట్టగానే ఆ చుట్టు పక్కల ఉన్న వారిలో భూత దయ కలుగుతుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి , అప్పటి వరకు ఉన్న దుష్టమైన ఆలోచనలు పరిశీలనం చేత వేల్లిపోతై, అందరిని సమానం గా చూసే బుద్ది కలుగుతుంది,అల బ్రతకాలని శత్రాలన్నీ చెప్తున్నాయి , నువ్వేమయ్యా కనపడ్డ పాముల్నల్లా చంపుతూ హింస చేస్తున్నావు ఇలా చేయ్యోచా ? ఇప్పటికైనా ఆపెయ్యి , ఏదో కర్మ వశం నీ భార్య ని పాము కరిచింది , నువ్వు బ్రతికించు కున్నావు . అక్కడితో దాన్ని విడిచిపెట్టాలి అంతే కానీ కనపడ్డ పామునల్లా చంపుకుంటూ తిరిగితే ఈ హింస వల్ల పాపం నిన్ను కట్టి కుడపదా. నీ తండ్రి యొక్క శిష్యుడైన ఆస్తీక మహర్షి ఒకానొక అప్పుడు , జనమేజయుడు చేసిన సర్పయగాన్నే ఆపాడు , అటు వంశం లో పుట్టిన నీకు పాము లని చoపడా నికి సిగ్గుగా లేదా అన్నాడు. అయ్యా నాకు బుదోచ్చింది ఇంక నేను చంపను అన్నాడు.
అని సౌతి నైమిశా రణ్యం లో వారికి చెప్పాడు.