Thursday, May 15, 2014

ఆదిపర్వం 6

బ్రాహ్మణుని యొక్క హృదయము అంత ప్రసన్నం గా అంత మెత్త గా ఉంటుంది. ఇప్పుడు ఆ కుండలములను పట్టుకున్నాడు వెళ్ళిపోతున్నాడు. వెళ్లిపోతు వెళ్ళిపోతూ ఆయన కి ఆచమనం చెయ్య వలసిన అవసరం వచ్చింది . శరీరానికి కొన్ని కొన్ని అవసరములు ఉంటాయి. లోపల ఉన్న పదార్ధాన్ని విసర్జించ వలసి ఉంటుంది. బయట ఉన్న పదార్థాన్ని లోపలి తీస్కోవాల్సి ఉంటుంది. ఆయా అవసరములు తీర్చుకున్నప్పుడు ఆచమనం చెయ్య వలసి ఉంటుంది. ఆచమనం చెయ్యాలి కాబట్టి ఒక నడివడ్డున ,ఇక్కడ మలమూత్ర విసర్జన జరగదు అని నమ్మి, కుండలములను నదివోడ్డున పెట్టి ఆచమనం చేస్తున్నాడు, చేస్తూ ఉంటె  తక్షకుడు  దిగంబరుడిగా , ఇంక లోకంలో అంతకన్నా అపవిత్రమైన స్థితి ఉండదు , అటువంటి స్థితిలో వచ్చి ఆ కుండలములను పట్టుకు పారిపోతున్నాడు. వెళ్లిపోతుంటే ఉదంకుడు వెంటపడ్డాడు , వెంటపడుతుంటే తక్షకుడు నాగరాజు గా మారి అక్కడే ఉన్న ఒక పుట్ట  కలుగులో కి వెళ్ళిపోయాడు.  గురుపత్ని నేటికి నాల్గవ రోజు వాటిని ధరిస్తాను, ఈలోపు దానికి కావలసినట్టుగా స్నానం చేసి సిద్దంగా ఉంటాను అంది గురుపత్ని. ఈలోపల ఈయన కుండలములు తీస్కొని వెళ్ళాలి.
ఇప్పుడు గురువుగారి దగ్గర చదువు నేర్చుకునే రోజులలో తనత తాను గా వచ్చిన అష్ట సిద్దులు ఉన్నాయే , అవి వాడుకుందాం అని ఆయన ఎప్పుడు అనుకోలేదు. అందుకనే పౌష్య మహారాజు దగ్గరికి నడిచి వెళ్ళాడు , పౌష్య మహారాజు దగ్గర నించి నడిచి వచ్చాడు.  లేకపోతే వాయుగమనం చేసి వెళ్ళిపోతారు. అసలు వాటిని వాడుకోవాలన్న కోరిక ఆయనకి లేదు, ఇప్పుడు వాటి అవసరం వచ్చింది, ఎందువలన వచ్చింది అంటే ఇప్పుడు గురుదక్షిణ సమయా నికి చెల్లించ వలసి ఉంది , కాబట్టి ఇప్పుడు ఆ అష్ట సిద్దులని ఆధారం చేస్కుని, తాను  కూడా తక్షకుడు వెళ్ళిన పుట్టలోనించి నాగలోకానికి వెళ్ళిపోయాడు.తీరా నాగలోకానికి వెళ్ళాక ఎవ్వరూ కనపడలా అంతా నిశ్శబ్దం గా ఉంది. ఇప్పుడు ఆయనకి ఆ నాగరాజులు కనపడాలి, కనపడి ప్రసన్నం అవ్వాలి, ప్రసన్నం 
అయితే అయ్యయో కుండలములు తీస్కుని వెళ్ళిపో అని ఇచ్చేసెయ్యాలి.  కాబట్టి ఇప్పుడు ఆయన ఆ నగరజులకి ప్రార్ధన చేసాడు. నాగరాజులు మహా తపస్సంపన్నులు, దేవతా స్వరూపాలు, ఆదిశేషుడు వంటి వారు ఉన్నారు కాబట్టి, దేవతా స్వరూపాల్ని ప్రసన్నం చేస్కోవాలి. అంతే తప్ప మీకు ఉన్న సామర్ద్యం తో వాటి మీద అధికారం చలాయించ కూడదు. 
సుందర కాండ లో హనుమంతుడు అంతటి వారు లంకని వశం చేస్కున్నారు, చంపటం కుదరదు. కాబట్టి దేవతలని ప్రసన్నం చేస్కోవాలి.  దేవతలకి ఒక లక్షణం ఉంది , దేవతలు కనపడ్డారనుకోండి, మీకు ఏమి కావలి అని అడుగుతారు. మీరు ఒకసారి అడిగేసిన తరువాత , అయ్యయో ఏదో సరదాకి అడిగాను అంటే వాళ్ళు వదలరు ఇచ్చేస్తారు . ఇప్పుడు వాళ్ళు కనపడాలంటే ప్రార్ధన చెయ్యాలి ప్రార్ధన చేస్తే కనపడతారు, కనపడితే కోరిక తీరుస్తారు. 
ఇప్పడు ఆయన ప్రార్ధన చేసాడు. 
ఆయన మొట్ట మొదట అనంతుడు అనే నాగ రాజు  గురించి ప్రార్ధన చేస్తున్నాడు.  కుల పర్వతాలతో పెద్ద పెద్ద పర్వతములతో , నదులతో ,  వనములతో ఈ భూమిని అంతటిని మోసే ఆది శేషుడు ఎవరైతే ఉన్నడో ,ఆయన ఈ భూభారాన్ని మోయ్యట మే కాకుండా, ఇటువంటి బ్రహ్మoడము నంతటిని తన బొజ్జలో పెట్టుకున్న శ్రీమన్నారాయణుడు పాల సముద్రం పైన పడుకొని ఉండగా , ఆయనని కూడా వహించగల శక్తి కలిగిన ఆది శేషుడు ఎవరున్నారో, అనంతుడు ఎవడున్నాడో ,ఆయన మాకు ప్రసంనుడయ్యేడున్. ఆయన  ఏ జాతిలో పుట్టాడో ఆ జాతికి దేవతల వలన రాక్షసుల వలన ఆపదలు రాకుండా గొప్ప తప్పస్సు చేసి , దేవతల చేత రాక్షసుల చేతా నమస్కరింప బడే వాడు. దేవతలు ,రాక్షసులు కూడా నమస్కరిస్తుంటే ఇరువురు యొక్క అలంకరములైన కిరీటములలో పొదగబడిన మణుల యొక్క కాoతు ల చేత ప్రకాశించే ట వంటి పాద పద్మములు కలిగిన పరమేశ్వరునికి ఆభరణము గా భాసించెడి వాసుకి మాకు ప్రసన్నం అయ్యేడు గాక. అని  ప్రా ర్థన చేసాడు. 
దేవలోకంలో మనుష్య లోకం లో తిరుగుతూ , అపారమైన కోపం తో ఉంటూ, తమ యొక్క విషం చేత దేన్నైనా కాల్చే ట టు వంటి శక్తి కలిగిన వారై, మహానుభావులై ఐరా వత  వoశo లో జన్మించిన వారందరు కూడా మాకు ప్రసంనంమయ్యేడున్. 
తక్షకుని గురించి ప్రార్థన చేస్తూ "పెద్ద పెద్ద పర్వతాల దగ్గర పుట్టలలో తిరిగే ట టు వంటి లక్షణం ఉన్న తక్షకుడు కన్ను చెవి యొక్క శక్తిని ఒక ఇంద్రియము నందే పెట్టుకున్న వాడు, అంటే చూస్తుంటే వినని వాడు , వింటుంటే చూడని వాడు , ఆ శూరుడైన తక్షకుడు మాకు ప్రసంనంయ్యేడు గాక "
 ఆయన ఆ నాగులను అన్నింటినీ కూడా స్తోత్రం చేసారు కాని ,వారెవ్వరూ ఆయనకి కనపడలేదు. అక్కడ ఒక గుర్రం మీద కుర్చున్నటువంటి ఒక పురుషుడు ఒకడు దర్శనం ఇచ్చాడు. ఆయన అన్నాడు "నాయన నా దగ్గరకి వచ్చి గుర్రం  చెవిలో ఒకసారి ఊదమన్నాడు , ఆయన నమ్మి ఆ గుర్రం దగ్గరకు వెళ్లి దాని చెవిలో ఒకసారి ఊదాడు. 
ఆ చెవిలో ఒక్కసారి ఊదేసరికి ఒక్కసారి పెద్ద అగ్ని హోత్రo  లేచింది , అది ప్రళయ కాలం లో వచ్చే అగ్నిలా వచ్చింది, ఒక్కసారి ఆ నాగ లోకన్నంతటిని చుట్టు ముట్టింది , ఆ చుట్టు ముట్టిన అగ్ని హోత్రానికి జడిసి గబా గబా తక్షకుడు బయలు దేరాడు. ఆయన అనుకున్నాడు పరమశివుని ఆగ్రహం ఎటు వంటిదో, తపో నిష్టా గరిస్టుడైన బ్రాహ్మణుని ఆగ్రహం అటువంటిది. కాబట్టి నేను చేసిన తప్పు దిద్దుకోవటము అంటే నేను తెచ్చిన  తాటంకములను/కుండలములను తిరిగి ఇవ్వటమే అని గబ గబా వచ్చి ఆ కుండలములను ఆయన చేతిలో పెట్టాడు.  ఇప్పుడు ఉదంకుడు అష్ట సిద్దులు కలిగిన వాడు ఇప్పుడు త్వరగా వెళ్ళాలి మా గురుపత్ని దగ్గరకి వెళ్ళాలి . ఎలా వెళ్ళాలి అని ఆ దివ్య పురుషుణ్ణి అడిగాడు. ఇదిగో ఈ గుర్రం ఎక్కి వెళ్ళు అన్నాడు. అక్కడే ఒక ఆశ్చర్య కరమైన  సంఘటన ఉదంకుడు. ఒక రాట్నం , ఆ రాట్నం దగ్గర తెల్ల దారాలు ,నల్ల దారాలు ఉన్నాయ్. ఇద్దరు ఆడవాళ్లు అక్కడ కూర్చొని ఉన్నారు , వాళ్ళిద్దరూ ఆ తెల్ల దారాలు , నల్ల దారాలు కండేకి కి చుడుతూ ఉన్నారు . పన్నెండు  ఆకులు కలిగిన చక్రము ఒకటి ఉంది. ఆ చక్రాన్ని బలిష్టమైన ఆరుగురు యువకులు తిప్పుతున్నారు. ఆ సన్నివేశం చూశాడు.  ఇప్పుడు ఆ దివ్య పురుషుడు నువ్వు ఈ గుర్రం ఎక్కి వెళ్ళిపో అన్నాడు. ఈయన గుర్రం ఎక్కాడు, వెంటనే సంకల్పం చెప్పాడు, వెంటనే గురుపత్ని దగ్గరకి వెళ్ళాడు. ఆవిడ అప్పుడే స్నానం చేసి , సుముహూర్తం అవుతోంది వచ్చాడా కుండలాలు తీస్కొని అని చూస్తోంది.  అమ్మా వచ్చానమ్మ అని గబగబా కుండలాలు తీస్కొని అని అన్నాడు. గురుపత్ని ఆ కుండలాలు పెట్టుకుంది. గురువుగారు గురుదక్షిణ ఇచ్చాను ఎంతో సంతోషం గా ఉంది అన్నాడు. ఇస్తే గురువ్గారు సంతోస్తారు అని కాదు, ఇచ్చి నేను సంతోషించాను, ఇప్పుడు ఆ  చదువుకి  సార్ధకత. 
కానీ గురువుగారూ నాకు ఒక అనుమానం, నేను నాగ లోకం వెళ్ళినప్పుడు ఒక రాట్నం కనిపించింది, ఇద్దరు యువతులు కనపడ్డారు, తెల్ల దారాలు నల్ల దారాలు కనపడ్డాయి. అక్కడ వాళ్ళు తెల్లదారాన్ని నల్లదారాన్ని తెర్చి ఆ కండె కి  అమరుస్తున్నారు. పన్నెండు ఆకుల చక్రాన్ని బలిష్ట మైన ఆరుగురు యువకులు తిప్పుతున్నారు, అక్కడ ఒక గుర్రం మీద ఒక దివ్య పురుషుడు కూర్చొని ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఒక దివ్య పురుషుడు ఒక ఎద్దు మీద కూర్చొని నాచేత పేద తినిపించాడు, ఇవన్ని ఏమిటో, తెలుసుకోవాలి అని ఉంది గురువుగారు అన్నాడు. 
పైలుడు విడమర్చాడు "నువ్వు గురువుగారిని సేవించావు కదా , గురువుమీద నమ్మకం పెట్టుకున్నావ్ కదా, గురు దక్షిణ కట్టాలని కదా వెళ్తున్నావు. గురుపత్ని అడిగింది అని బయలు దేరావ్, నీయొక్క చిట్టా శుద్ధికి మెచ్చుకున్నారు దేవతలు. మెచ్చుకుని అటువంటి కుండలములను తీస్కురవటానికి నీకు శక్తి ని ఇవ్వటానికి దేవేంద్రుడు ఐరావతాన్ని ఎద్దుగా మార్చుకు ఎద్దుగా మార్చుకుని నీకు కనపడ్డాడు, ఆ ఎద్దు పేడ వేసిందే అది పేడ కాదు అమృతం. నీతోటి అమృతాన్ని తినిపించాడు దేవేంద్రుడు. అంత మహా పతివ్రత ధరించిన కుండలములను పట్టుకోవాలంటే నువ్వు అమృతం తాగిన వాడై ఉండాలి. కాబట్టి నువ్వు ఆ కుండలములు పుచ్చుకుని, పుచ్చుకుని నువ్వు వస్తున్నప్పుడు తక్షకుడు వాటిని ఎత్తుకు పోయాడు, నువ్వు నాగ లోకానికి వెళ్ళావ్. అక్కడ ఒక పెద్ద రాట్నం దగ్గర ఇద్దరు స్త్రీలు కూర్చున్నారు వారు ధాత ,విధాత. ధాత అంటే  అర్థం ఏమిటంటే మళ్ళి మళ్ళి ఈ సృష్టిలో ఈశ్వరుని యొక్క ఒక స్వరూపమునకు ధాత అని పేరు. ఆయన జీవుడు ఏమి సంకల్పిస్తున్నాడో రాస్కుంటాడు , ఆ కర్మ ఫలితం గా మళ్ళి ఇంకో కొత్త శరీరాన్ని ఇస్తాడు. మళ్ళి రాసుకుంటూ ఉంటాడు. మళ్ళి ఆ కర్మ ఫలితం గా కొత్త జీవితం ఇస్తూ ఉంటాడు. ఇదిగో ఈ పాపం చేసావ్ , ఫలితం అనుభవిoచు ఈ పుణ్యం చేసావు  కనుక ఈ ఫలితం అనుభవించు, అలా ఫలితం అనుభవించడం చేత పాపం పోతుంది , పుణ్యం పోతుంది. అని పాప రూపములో కర్మలను ఆచరింప చేసే శక్తి స్వరూపమునకు విధాత అని పేరు. ఆ ఈశ్వరుడిని రూపములే నీకు సృష్టి కర్త గా లయకర్త గా ప్రలయానంతర సృష్టి కర్త గా మూడు మూర్తులుగా తిరిగే ఈశ్వరుడే రెండు రూపములలో నీకు అక్కడ కనపడింది. వాళ్ళు తెల్ల దారములు నల్ల దారములు పట్టుకున్నారు , అవే అహోరాత్రములు ,కాలముగా ఈ లోకమును తిప్పుతూ ఉంటాడు ఈశ్వరుడు ఆ కాలం లో తెల్లగా ఉన్న దారాలన్నీ పగళ్ళు , నల్ల గా ఉన్న దారాలన్నీ రాత్రిళ్ళు . పన్నెండు ఆకుల చక్రమే పన్నెండు నెలలు కలిగినటువంటి సంవత్సరం. కాలం లో సంవత్సరం ఒక ప్రమాణం , ఉపాసన లో కూడా, పన్నెండు నెలలు ఆ చక్రమునందు ఆకులుగా ,ఆ చక్రమును తిప్పే ఆరుగురు పురుషులు ఆ కాలమునందు ప్రక్రుతిలో వచ్చే తతువంటి ప్రబల మైన  మార్పు ని వ్యక్తీకరించే ట టు వంటి ఋతువు, ప్రకృతి లో మార్పు వస్తుంది. మొట్ట మొదట వచ్చేది 
వసంత ఋతువు, తరువాత
గ్రీష్మ ఋతువు 
వర్షఋతువు 
శరదృతువు 
హేమంత ఋతువు 
శిశిర ఋతువు 
ఈ రుతువులే అక్కడ బలిష్టమైన యువకులుగా ఉండి సంవత్సరం అనే చక్రాన్ని తిప్పుతున్నారు. 
తయారు అవుతున్న పటలం ఉన్నదే అదే వస్త్రము. బట్ట  తెలుస్తుంది , దారములు తెలియవు. 
మాయ చేత సంసారము నందు ఉంటాడు బ్రహ్మము తెలియదు. సంసారము నందు కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాడు. ఆ ఈశ్వరుడే ఈ ప్రణాళిక ని చేస్తున్నాడు. అందరికి కనపడేది సంవత్సరం , ఋతువులు తెలుస్తాయి , చలి తెలుస్తుంది ,ఆకులు రాలటం తెలుస్తుంది ఎండ గ్రీష్మo  తెలుస్తుంది, వర్షం తెలుస్తుంది కానీ నువ్వు గురువు పరిచర్య చేసి నందు వలన కాలాత్మకము గా ఉన్న ఈశ్వర స్వరూపము  స్తూలమైన వ్యక్తులు గా నీకు దర్శనం అయ్యింది. దీనికంతటికి కారణం నువ్వు చేసిన గురుసుసృష , నువ్వు చదువకున్న చదువు , వీటి వలన నీకు కాలత్మకం గా నీకు శ్రీ మన్నారయణుని దర్శనం జరిగింది.  నువ్వు  అదృష్ట వంతుడువిరా అమృతాన్ని తిన్నావ్ అన్నాడు. 
మనకి కాలమును ఈశ్వర స్వరూపముగా చూడటం చేత కాక కాలమును 9 మనములుగా లెక్క పెడుతూ ఉంటాము. 
1. బ్రహ్మ 2. దివ్య  3.పైత్రు 4. ప్రాజాపత్య 5.బహ్యస్వత్య 6. సౌర 7. సావన 8. చంద్ర 9. నక్షత్ర అని 9 మానములు గా లెక్కపెడుతూ ఉంటాము . ఇందులో కొన్ని ఉర్ద్వ లోకాలలో ఉండేవి, కొన్ని భూలోకం లో ఉండేవి ఇటువంటి మనముల చేత కాలాన్ని లెక్కపెడుతూ ఉంటారు. 
గుర్రము కి అశ్వము అని పేరు. అశ్వము అనగా గమనము చేత వ్యాప్తిని పొందినది అని అర్థం. అంటే తానూ ఎక్కడే క్కడికి వెళ్తుందో అక్కడక్కడ వ్యాపిస్తుంది.  భూత భవిష్యత్ వర్తమాన అని ఉన్న ఒక కాలాన్నే 3 భాగములు చేసి కదలడం లో ఈశ్వరుడు వ్యాప్తి చెందుతూ ఉంటాడు,ఈ వ్యాప్తిచెందే ఈశ్వరుడు యొక్క తత్వము ఎవ్వరికి కంటికి కనపడదు, కంటికి కనపడని వ్యాప్తి చెందే ఈశ్వరుని యొక్క తత్వము గుర్రం రూపం  లో నీకు దర్శనం అయ్యింది నువ్వు భాగ్యవంతుడవు. ఆ గుర్రం మీద కుర్చున్నాడే ఆయనే అగ్ని , ఆయనే పర్జన్యుడు. ఆ గుర్రం రూపం లో ఉన్న అగ్ని ,ఆయనే సమస్త ఫలితములను ఇస్తుంది, కాలమే సమస్త ఫలితములు ఇస్తుంది మృత్యువుతో సహా అదిగో దాని మీద కూర్చున్న వాడు పర్జన్యుడు. ఇంద్ర సఖుడు ఆయన వర్షాన్ని కురిపిస్తాడు , లోక క్షేమాన్ని అంత చూస్తాడు, స్థితి కారుడై శ్రీమహావిష్ణువు గా ప్రవర్తిస్తాడు. అటువంటి మహానుభావ అనుగ్రహం నీకు కలిగింది. అందుకే ఈశ్వర వ్యాప్తి చేత  భయపడ్డ తక్షకుడు నీకు దర్శనం ఇచ్చి నీకు ఆ కుండలములను ఇచ్చాడు . నువ్వు అటువంటి గుర్రం ఎక్కి రాగలిగావు అంటే గురు అనుగ్రహం  పొందిన వాడు, గురుముఖత గా నేర్చుకున్న వాడు, సిద్దుల కొరకు ప్రాకులాడని వాడు , బ్రహ్మ విద్య వశమైన వాడు. వాడు బ్రహ్మము నే దర్శించ గలడు అని ముందు ముందు మహాభారతం లో విశ్వరూప దర్శనం కొంతమందికి అనుగ్రహింప బడితే, గురు వైభవం ఎంత గొప్పదో గురువు ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని శిష్యునకు ఎలా అందించాడో . ఆ పైలుని యొక్క ప్రభావాన్ని , గురు దక్షిణ తేవటానికి శిష్యుడు ఎంత కష్ట పడ్డాడో దానివలన ఎంత అభ్యున్నతిని పొందాడో ,ఎదర ఎదర సాక్షాత్తు శ్రీమన్నారాయణు డే ఆయన ఆశ్ర మానికి వచ్చి దర్శనం ఇస్తాడు. అంత అభ్యున్నతిని
పొందటానికి గురువుకి నమస్కరించడం , గురువుపట్ల మర్యాద తో ప్రవర్తించటం ఎంత అవసరమో చూపటానికి మహాభారతం  మొదట్లో నన్నయ్య భట్టారకుడు , వ్యాసుల వారు మనల్ని కృతర్తులని చేసారు.   




No comments:

Post a Comment