మహాను భావుడైన వ్యాసుడు వేదాన్ని విభాగం చేసారు. ఆ వేదాన్ని ఋగ్వేదము , యజుర్వేదము , సామ వేదము , అధర్వణ వేదము అని నాలుగు విభాగాలు చేసారు. ఋగ్వేదాన్ని అంతా తన శిష్యుడైన పైలుడు అనబడే వానికి ఉపదేశం చేసాడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఉపదేశం చేశాడు , సామ వేదాన్ని జైమినికి ఇచ్చారు . అథర్వణ వేదాన్ని సుమంత్రునికి ఇచ్చారు. ఈ నలుగురు శిష్యుల వలన ప్రశిష్యులు ఏర్పడ్డారు, అంటే ఈ నలుగురు ఆ వేద భాగాన్ని వారి శిష్యులకి చెప్పారు. వేదానికి శ్రుతి అని పేరుఅంటే చెవికి సంబంధించింది అని , అది పుస్తకం చూసి చదువు కుంటే వచ్చేది కాదు. స్వరంతో నేర్చుకోవాల్సింది . అందుకని గురువుగారు చెప్తుంటే ఆ మంత్రభాగాన్ని స్వరం తో పట్టుకుని దానికి తగినట్టుగా ఉచ్చరించ వలసిన స్థితి శ్రవణము వలన వస్తుంది కాబట్టి దానికి శ్రుతి అని పేరు.
వేదవ్యాసుడు వేదాన్ని విభాగం చేసి నలుగురు శిష్యులకి ఇస్తే అది తర్వాతి కాలం లో ఎందరో విద్వాంసులని తాయారు చేసింది. అష్టాదస పురాణాలని సుతునికి ఇచారు. ప్రత్యేకించి భాగవతాన్ని తనకుమారుడైన శుఖ బ్రహ్మ కి ఇచ్చారు, ఇస్తే ఆ శుక బ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి ప్రవచనం చేసారు. కాబట్టి ఆ నలుగురు శిష్యులలో ఒకడైన వాడు పైలుడు. ఆ పైలుడు మహానుభావుడు , విశేషమైన గురు భక్తి తత్పరుడు, ఆయన యొక్క అత్యంత ఉత్తమమైన శిష్యులలో ఒకడు ఉదంకుడు. ఆ ఉదంకుడు గురువుగారికి అత్యంత వినయం తో గురువుగారికి సుసృష చేసాడు. లోకంలో శిష్యుల్ని అనేక పేర్ల తో పిలుస్తారు, ఆ పేర్లలో ఒకటి వినీయుడు , వినీయుడు అంటే అత్యంత వినయం నేర్చుకున్న వాడు , గురువు పట్ల వినయం తో ఉండు వాడు అందుకే శిష్యుడికి వినీయుడు అని పేరు.
సిక్కు మతంలో శిష్య అన్న శబ్దమే సిక్కు గా మారింది, వాళ్ళు గురువుగారిని ఎక్కువ గౌరవిస్తరు, ఎక్కువ ప్రేమిస్తారు, అందుకే ఆ మతం లో గురు కి విశేషమైన ప్రాధాన్యత, సనాతన ధర్మం యందు అసలు చెప్పవలసిన అవసరమే ఉండదు "గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షత్త్పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః "
గురుగారుచేత ఉపదేశం చెయ్యబడిన మంత్రము అంగన్యాస కరన్యాసలతో చదువుతున్నప్పుడు ఆ మాత్రం యొక్క అధిష్టాన దేవత యందు మనసు నిలబడ క పోతే , గురువుగారి యొక్క పాద ములు గుర్తు తెచ్చుకోవటం చేత మీకు సమస్త దేవతలయొక్క అనుగ్రహములు కలుగును . అది గురువు యొక్క శక్తా లేక శిష్యుని గురా అంటే అన్ని వేళలా గురువుగారి శక్తే అని చెప్పటం కుదరదు. మీకు గురువుగారి మీద ఎంత గురి ఉంటె మీకు గురువుగారి యొక్క శక్తి భాసిచడం ఉంటుంది.
అందుకే రమణ మహర్షి గురువు గురించి మాట్లాడుడు తు శిష్యునికి గురువుగారి మీద ఉన్న గురికే గురువు అని పేరు అంటారు. ఆ గురుత్వము అంటే అదే, గురువు అంటే బరువు. ఆయన కన్నా నేను తక్కువ ఆయన దగ్గర నేను తలవంచాలన్న చిన్నతనము మనం అనుకోవడమే మనము లఘువు, ఆయన్ని గురువు అని అనుకుoటా మొ అప్పుడు మనము లఘువు , కాబట్టి గురువు బరువు మనము లఘువు అని గుర్తుంచుకోవాలి. గురువుగారు ఏది చెప్పారో అది మనకు శ్రేయోదాయకం అని మనం భావించాలి తప్ప మీకు ఏమి తెలియదు గురువుగారు నేను చెప్తా వినండి అన కూడదు, కాబట్టి ఆ గురుశిష్యుల సంభందం ఎంతో పవిత్రమైనది. గురువుగారిని ఎంతో భక్తి తో సేవించిన శిష్యులు మీకు మహాభారతం లో చాల మంది కనపడతారు. మనం కి చాలా ఆశ్చర్య కరములైన సంభందములు కనపడతాయి. "శాశితుం యోగ్యః శిష్యః " ఎవరిని గురువుగారు శాశిస్తాడో వాడు శిష్యుడు. ఎవరు శిష్యుడు అవతాడు అంటే శాసించడానికి అనువైన రీతిలో శిష్యుని నడవడి ఉండాలి. గురువు ఒక మాట చెప్తే అది తండ్రి చెప్పిన మాట కంటే గొప్పది. తల్లీ తండ్రీ శరీరాన్ని ఇస్తారు, గురువు మళ్లీ ఈ శరీరాన్ని పొందకర్లేని జ్ఞానం ఇస్తాడు. గురువుగారి తాపత్రయం అంతా ఎలా ఉంటుంది అంటే శిష్యుణ్ణి ఎంత వృద్దిలోకి తీస్కొద్దాం , ఎంత ఆత్మోధరణ కల్పిద్దాం, ఎంత జ్ఞానం సముపార్జించే టట్టు గా అనుగ్రహిద్దాం , దీనితో పాటుగా లౌకికం గా కూడా శిష్యునకి సమస్త ప్రయోజనములు ఒనగూడే టట్టు గా గురువు ప్రార్ధన చేస్తూ ఉంటారు. గురువు యొక్క మనసు వెన్నపూసలా ఉంటుంది , అందుకని ఎప్పుడూ శిష్యుని యొక్క అభ్యున్నతి కి ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాకపోతే గురువుగారి దగ్గర తగిన శిష్యుడు అని పేరు తెచ్చుకోవాలి. అది ఎలా తెచ్చుకోవాలి అంటే. గురువుగారు ప్రేత్యేకించి ఏ ప్రయోజనాన్ని కోరుకునేవాడు కాడు, గురువుగారు మీరు ఎలా ఉండాలి అని కోరుకుoటుoన్నారో , మీరు అలా ఉండగలగటమే మీరు చెయ్యవలసిన సేవ. రెండవది శిష్యునికి ఛాత్రుడు అని ఒక పేరు చట్రము అంటే గొడుగు , గొడుగు ఏమి చేస్తుంది అంటే గురువుగారు లేదా వేసుకున్న వ్యక్తి కన్నా పైన ఉంటుంది. నేను ఈయన కంటే గొప్ప అని అనుకోదు, తాను అలా పైన ఉంది పైనించి పడే ఎండా వానా, తన మీద పడేలా చేస్కుని కింద ఉన్న వ్యక్తి ని కాపాడు తూ ఉంటుంది . శిష్యుడు ఏమి చేస్తూ ఉంటాడు అంటే , గురువుగారు డస్సి పోకుండా ఉంటె , సోక్కిపోకుండా ఉంటె తాను ఇంకొంత కాలం ఇంకా బాగా వేదాధ్యయనం, ఇంకా బాగా ఈశ్వరుని సేవకి , ఆయన ఇంకా బాగా గ్రంధ పటనం కొరకు వినియోగిoచుకుంటే, దాని అమృతత్వం కలిగిన ఆ గురువు ఆ విద్యని మళ్ళి పదిమందికి పంచి పెడతారు, కాబట్టి ఆ గురువు కొన్ని వేలమందికి విద్య అందించేటట్టు గా , ఆయన కి ఎక్కువ సమయం మిగిలేటట్టు గా నేను చెయ్యాలి.
రెండు గురువుకున్న లక్షణం గురువు తన అయుర్ధం తగ్గించేసుకుంటాడు. ఈశ్వరుడు ఊపిరుల రూపంలో ఆయుర్దాయం ఇస్తాడు. దీర్ఘవాఖ్య నిర్మాణం లో , లఘువాఖ్య నిర్మాణం లో లేకపోతే ఎక్కడెక్కడ వాక్యం విరవాలో అక్కడక్కడ ఊపిరి ఆపి పీల్చి విడిచి పెట్టడo చేత , లోపల ఆ ఊపిరుల సంఖ్యా ఎక్కువై ఆయుర్దాయం క్షీణించిపోతుంది. కనుక ఆయుర్దాయం తనకుతాను క్షీణింప చేస్కున్తున్నాడు తెలిసికూడా. భగవంతుడు మనుష్యునకి ఒక అద్భుతమైన కానుక స్వరపేటిక, ఆస్వరపేటికకి ఒక లక్షణం ఉంది, అది అరిగిపోతుంది. అది కాల క్రమంలో మాట్లాడగా మాట్లాడగా జీర వచ్చి అది మూగబోతుంది. అంటే పనిచెయ్యదు. ఇది తెలిసి కూడా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎవరి కోసం మాట్లాడతాడు. నేను చెప్పక పోతే నేను చదువుకున్న చదువు ఎందుకు , పోతేపోని స్వరపేటిక, తగ్గిపోతే తగ్గిపోని ఆయుర్ధాయం, నావల్ల పదిమంది బాగుపడితే నాకు అంతకన్నా ఏమికావాలి అని మాట్లాడతాడు గురువు. తన శరీరాన్ని, స్వర పేటికనే త్యాగం చేస్తున్న గురువు మీ నించి ఏమి కోరుకుంటాడు. ఆయనకి మిగిలిన సమయలలో ఆయన డస్సి పోకుండా నువ్వు చెయ్య కలిగితే, కనీసం ఆయన ఆయుర్ధాయం కొంచం పెరుగుతుంది. కాబట్టి గురువుని చంపు కోవటం అంటే గురువు ని ఇబ్బంద్ది పెట్టడం. ఇప్పుడు ఉన్న పరిస్థితులకి నేను అన్వయం చెయ్యట్లేదు. పూర్వ విద్యార్థులు ఆశ్రమాలకి వెళ్లి చదువుకునే వారు అప్పుడు గురుపత్ని అన్నం పెడుతుంది. గురు పత్ని ఏమికోరుకుoతుందంటే, ఆయన అలానే ఉండాలి తన సౌభగ్యమ్ ఉండాలి అని కోరుకుంటుంది. కాబట్టి గురువు గారి ప్రాణo నిలబెట్టటం లో ఉండే సుసృష గురుపత్ని యొక్క అనుగ్రహానికి కారణం అవుతుంది. గురుపత్ని యొక్క అనుగ్రహం తో సమానమే.
నన్నయ్య గారు మహా భారతాన్ని ఆంధ్రీకరిస్తూ , ఉదంకోపాఖ్యానం ప్రారంభం చేస్తూ పైలుడి దగ్గర ఉదంకుడు గురువుగారి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు, పైలుడు ఏమి చెప్పాడు ఉదంకుడు ఏమి నేర్చుకున్నాడు అని చెప్తూ గురుకులమునందు గురువుగారికి పరిచర్యలు చేస్తూ , గురుపత్ని కి పరిచర్యలు చేస్తూ , గురువుగారు చెప్పిన దాన్ని వింటూ ఆయన చెప్పినదాన్ని త్రికరణ ఆచరిస్తూ, ఆయన విద్యలు నేర్చుకున్నాడు దానితో పాటుగా అణిమ, గరిమ, లఘిమ ఇటువంటి అష్ట శిద్దులు ఆయనకి వచేసాయి , ఆయన అనుకుంటే గాలిలో వెళ్ళ గలడు, ఎక్కడ ఏమి జరుగుతుందో ఆయన తెలుసుకో గలడు , అలా అష్ట సిద్దులు ఆయన కి వశం అయ్యాయి. ఆ అష్ట సిద్దుల కోసం విద్య నేర్చుకోలేదు. కానీ వాటంత అవే వశం అయ్యాయి.
శంకరా చార్యుల వారు దక్షిణా మూర్తి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు. దక్షిణా మూర్తి స్తోత్రం రొజూ చదువుతూ, ఆ స్తోత్రాన్ని బాగా పరిశీలనం చేసిన వాడికి ఆత్మ ఎరుకలోకి రావడమే కాకుండా, అష్ట సిద్దులు వశం అవుతాయి , కానీ ఈ అష్ట సిద్దులు ఏలాంటివి అంటే కాకి పెంట ఎటువంటిదో , అటువంటివి. ఆత్మ ని తెలుసుకోవటం ప్రధానం కానీ అటువంటి సిద్దుల కోసం వెంపర్లాడటం అతి హేయతిహేయ మైన విషయం. కాబట్టి ఆత్మ జ్ఞాని వాటినికి చూసి మురిపోడు. అటువంటి స్థితిని ఉదంకుండు పొందాడు , అంతా గురువుగారి యొక్క అనుగ్రహం వలననే. అష్ట సిద్దుల తో పాటుగా వేద విద్యలను పొందాడు. పొందిన తరువాత ఆశ్రమ నియమం ఒకటి ఉంది, గురువు నిత్య త్రుప్తుడైన గురువుగారి ని అడుగుతారు , గురుదక్షిణ , గురువుగారు మీరేదైనా కోరండి మేముసమర్పిస్తాంఅని. గురువు నిత్య తృప్తుడు కాబట్టి ఏమి కోరాడు. ఒక్కొక్కచో శిష్యులకి అన్నం పెట్టడానికో ఏదైనా కోరితే కోరచ్చు. పైలుడు ఒక చిరునవ్వు నవ్వి నాకేమి కావలయ్య , ఏమి అక్కర్లలేదు, అప్పుడు ఉదంకుడు గురువుగారి దగ్గర ఇన్ని నేర్చుకుని దక్షిణ ఇవ్వకుండా వెళ్ళ కూడదు, కాబట్టి నేను మీకు ఏమైనా ఇవ్వాలని అనుకుంటున్నాను, మీరేమైనా అడగండి అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. కాబట్టి ఇప్పుడు గురువుగారు ఏమి మాట్లాడట్లేదు, ఇప్పుడు గురువుగారితో సమానస్థానం ఎవరిదక్కడ , గురుపత్నిది , కాబట్టి ఆమె ని వెళ్లి అడిగాడు ఉదంకుడు. అమ్మ గురువుగారి దగ్గర ఇన్ని నేర్చుకున్నాను , మీరు నాకు అన్నం పెట్టరంమ్మా , నేను గురు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, ఏమి కావాలమ్మా అని అడిగాడు, ఆవిడ అంది పక్కనే ఉన్నాడయ్యా పౌష్య మహారాజు రాజ్యం చేస్తూ ,ఆ పౌష్య మహారాజు యొక్క భార్య కుండలములను నాకు తెచ్చి ఇవ్వు అన్నది. అలా అడగటానికి కారణం ఏమిటి అంటే
కుండలములు ఐదో తనానికి చిహ్నాలు , అంటే అటువంటి శక్తి కలిగినవి అవి, ఒక్కొక్క వస్తువు కి ఆ శక్తి ఎలా వస్తుంది అంటే ఆ వస్తువుని పట్టుకున్న వ్యక్తి వలన వస్తుంది. గురువుగారి దగ్గర నించి వచ్చిన పూచిక పుల్లకు కూడా శక్తి ఉంటుంది. వారి శక్తి ఆ వస్తువులోకి కొంత వస్తుంది. కాబట్టి గురువుగారు మహా ఉపాసకులు ,మహా పతివ్రతలు ఇటువంటి వారు ఉపయోగించిన వస్తువులకు తత్సంబంధం మైన శక్తి వస్తుంది. వివాహం అయిపొయిన టువంటి సువాసినులు పెట్టుకే కుండలములకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. చెవికి కర్ణాభరణం లేకుండా భర్త కి కనపడ కూడదు. ఒకవేళ ఏకారణం చేత నై నా కర్ణా భరణములు తీసేయ్య వలసి వస్తే, భర్త కి పరాకు చెప్తారు, అయ్యా కొంచం సేపు ఇటుపక్కకు రావద్దు అని చెప్తారు. చెప్పి తలుపు మూసేసి, జాగ్రత్త గా కర్ణాభరణంములు తీసేసి, మళ్ళి వెంటనే పెట్టేసుకుంటారు. ఒకవేళ కర్ణాభరణం తీసేసి మరో కర్ణాభరణం పెట్టుకునే మధ్యలో వేరొక ఆభరణo పెట్టుకోటానికి వీలు లేని పరిస్థితి వస్తే ఐదో తనం లో అమ్మవారి యొక్క సాక్షాత్ స్వరూపం కనుక ఒక చిన్న తాటాకు ముక్క అయిన పెట్టాలి తప్ప, చెవులకు ఏమి లేకుండా భర్త కు ఆడది ఎట్టి పరిస్తితులలో కనపడ కూడదు.నిషిద్దం. ఎందుకంటే అది భర్త యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంది అని చెప్పినవి శాస్త్రాలు. పౌ ష్య మహాదేవి ఆవిడ అంత పతివ్రత, ఈయనే నాకు ఈశ్వరుడు అని భర్తకి ప్లేటులో ఇడ్లీ పట్టుకొచ్చి ఇస్తే పరమేశ్వరుడికి బాలభోగం చేసిన ఫలితం ఆమె ఖాతా లో వేస్తాడు. అందుకే ఆడదానిగా తరించడం తేలిక పురుషుడిగా తరించడం చాల కష్టం నిజానికి, అందునా భర్త విశేషమైన భక్తి తత్పరుడైతే, ఆయన చేసే పూజలలో సగం వంతు భార్య ఖాతా లో పడిపోతుంది, ఆవిడా ఇంకొంత చెస్కుదనుకోండి, ఈయన కన్నా ఆవిడ పుణ్యమే ఎక్కువ ఉంటుంది నిజానికి.
పౌష్య మహాదేవి అంత పతివ్రత , భర్తని అంత గా అనువర్తించింది. ఆయన పుష్యాభిషేకాన్ని పొందాడు కాబట్టి పౌష్యుడు అని పేరొచ్చింది ఆయనకి. కాబట్టి అటువంటి పతివ్రత యొక్క కుండలములకు ఆ శక్తి ఉంటుంది , కాబట్టి ఆ కుండలములు అడిగి తెచ్చి పెట్టు అన్నది. ఇప్పుడు గురువు గారు ఒప్పుకోవాలా. గురువు నిశబ్దం గా ఉంటె గురువుపత్ని ఆజ్ఞ గురువుగారి ఆజ్ఞే. ఇక్కడ మహాభారతం ఏమి చెప్తుంది అంటే, గురు గారితో సమానం గా సేవించాలి అని చెప్తుంది.
ఇప్పుడు ఆవిడ తీసుకురా కుండలములు అంటే ఆయన బయలు దేరాడు. ఎంతో దూరం కాదు. దగ్గరలో నే ఉంది పౌష్యుని రాజ్యం. ఆ వెళ్తుండగా ఒక ఆశ్చర్య కర సంఘటన జరిగిoది. ఒక దివ్య పురుషుడు, మనుష్య తేజస్సు తో పోల్చలేని తేజస్సు తో ఒక వ్యక్తి, ఒక ఎద్దు మీద కూర్చొని ఉన్నాడు. మాములు గా ఉన్న ఎవరో ఒక వ్యక్తి ఒక ఎద్దు మీద కుర్చుని దీని పేడ తిను అంటే ఛా అవతలికి పో అంటాడ లేదా , కాని ఆ వ్యక్తి దివ్య మైన తేజస్సు తో ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క తేజస్సు చూడగానే ఆయన చుట్టూ ఉన్న వలయం చూడగానే, ఈయన సామాన్యుడు కాదు , ఈయన మనుష్యుల కన్నా బిన్నమైన జాతికి చెందిన వాడు. దేవతా స్వరూపుడు ,కాబట్టి ఈయన మాట నేను అవుదల దాల్చాల్సిందే అనే టటు వంటి ప్రచోదనం కలిగే టట్టు ఆయన ఉన్నాడు. స్వభావము గురువుగారి మాటలు విన్నందు వలన వచ్చిన వినయాన్ని మింగేస్తుంది. అప్పుడు తన స్వభావం తో ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఆ దివ్య తేజస్సు కలిగిన వ్యక్తి వంక చూసాడు. ఆ వ్యక్తి ఇది గో నేను ఎక్కిన ఎద్దు పేడ వేసింది. ఈ పేడ కొద్దిగా తిను అన్నాడు. తిన్నాడు. ఆయన దివ్యత్వం అంగీకరించి నప్పుడు,ఆయన ఎందుకు అంత గొప్పగా ఉన్నాడో తెలియదు కానీ గురువుగారిని అడుగుదాం తరువాత, ప్రస్తు తానికి ఆయన మాట విందాంఅని కాస్త పేడ తీస్కొని తినేసాడు. ఆ బయలు దేరు. వెళ్ళిపోయాడు. తర్వాత పౌష్య మహారాజు దగ్గరకి వెళ్ళాడు. పౌష్య మహారాజు అడిగాడు ఏమిటి దేనికి వచ్చావు అని అడిగాడు, అప్పుడు ఉదంకుడు అన్నాడు నేను గురుదక్షిణ ఇవ్వటానికి బయలు దేరి వచ్చాను అన్నాడు. మా అమ్మ వంటి గురుపత్ని నీ భార్య యొక్క కుండలములు అడిగింది అన్నాడు.
ఇవచ్చా రాజు అంటే రాజుకి రెండు కర్తవ్యములు ఉంటాయి. ఒకటి
ఆశ్రమం లో విద్యాభ్యసించి బ్రహ్మ చర్యం విడిచి పెట్టి గృహస్తాశ్రమం లో కి వెళ్లేవా డికి పెళ్లి ఖర్చు పెట్టుకోవాల్సిన భాద్యత రాజుదే. నిజమైన స్నాతకము అంటే అప్పటివరకు కాటుక పెట్టుకోకూడదు, అప్పటివరకు తల దువ్వుకో కూడదు, అప్పటివరకు పూల దండ వేస్కోకూడదు తాంబూలం తినకూడదు, అద్దం చుస్కోకూడదు. ఇన్ని నియములు పాటించిన వాడు అన్ని విడిచి పెడతాడు. ఇవన్ని పాటించిన వాడు బ్రహ్మ చర్యం విడిచి పెట్టి గృహస్తాశ్రమం లోకి వస్తాడు. గురువుగారి కి గురుదక్షిణ ఇవ్వవలసి వస్తే , ఏముంటుంది శిష్యుని దగ్గర ఏముంటుంది, ఇవ్వటానికి అందుకని రాజు దగ్గరకి వెళ్తాడు. రాజా నేను ఇవి చడువుకున్నాను, ఇప్పుడు నేను గురుదక్షిణ ఇవ్వాలి అంటాడు , ఏది నువ్వు చదువు కున్న వాటిలో రెండు మాటలు చెప్పు అంటాడు, చెప్తే శేభాష్ వీడు బాగా చదువుకున్నాడు వీడికి గురుదక్షిణ కట్ట దానికి డబ్బు ఇవ్వండి అంటదు. రాజా నేను గృహస్తాశ్రమం లోకి వెళ్తున్నాను , బ్రహ్మచర్యం విడిచిపెట్టి అంటాడు అప్పుడు రాజు అయితే ఇదిగో ద్రవ్యం ఇస్తున్నాను వెళ్లి పెళ్లి చేస్కో అంటాడు. కాబట్టి గురుదక్షిణ కోసం రాజుని ఆశ్రయించాలి కాబట్టి ఆ గురుదక్షిణ తన భార్య కుండలములే అయినా రాజు తన ధర్మం తాను నెరవేర్చాలి, మహా భారతం అంతా ధర్మమే మాట్లాడుతుంది. కాబట్టి రాజు ఇప్పుడు తన భార్య కుండలములను పట్టుకు వెళ్ళు అని చెప్పాలి, ఆవిడ తన భర్త ఏది చెప్తే అది చేస్తుంది పతివ్రత, ఆవిడ ధర్మం ఆవిడ చెయ్యాలి. ఇప్పుడు భర్త చెప్పాడు కాబట్టి ఇచ్చెయ్యాలి, కాబట్టి పట్టుకెళ్ళు అన్నాడు రాజు. నువ్వు వెళ్లి అడుగు ఆవిడ ఇస్తుంది అన్నాడు రాజు. ఇప్పుడు పౌష్య ని యొక్క భార్య , రాణిగారి యొక్క అంతఃపురం లోకి వెళ్ళాడు , అలా వెళ్ళో చ్చా , అంటే ఆయన చదువుకున్న వేదం అటువంటిది . ప్రతి ఒక్కరికి ఐదుగురు తల్లులు ఉంటారు, ఐదుగురు తల్లుల్లో రాజు భార్య ఒకతె. గురువుగారికి గురుదక్షిణ కట్టటానికి వచ్చిన వాడు , గురుదక్షిణ కట్టటం అంటే చదువు పూర్తి అయ్యింది. చదువు పూర్తైన వాడికి ఏమి తెలిసి ఉండాలి దేశాన్ని ఏలే రాజు భార్య తల్లితో సమానం. రాణి వాసం లోకి వెళ్లి చుస్తే మాత్రం బిడ్డడు తల్లిని ఎలా చూస్తాడో అలా చూస్తాడు . కాబట్టి ఇప్పుడు రాణి వాసం లో కి వెళ్లి చుస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి. ఒక గురువు దగ్గర చదువుకున్న వాడి మీద రాజుకి అంత గౌరవం ఉండేది. సంస్కారం చదువు ఎంత విడదీయ్య రానివిగా ఉండేవో భారతం చెప్తుంది. సంస్కారం లేని చదువు ఈ జాతి ఊహించలేదు. సంస్కారం లేని విద్యావంతుడు "జ్ఞాన ఖలుని లోని శారద వోలె" ఉంటాడని ఊహించలేదు.
ఇప్పుడు ఉదంకుడు రాణివాసం లోకి వెళ్ళాడు . రాణిగారు ఏరి అని అడిగాడు, రాణివాసం లో అదిగో గదిలో కూర్చున్నారు అన్నారు వెళ్లి మాట్లాడు అన్నారు. వెళ్లి చూసాడు కనపడలేదు. అదిగో అక్కడే ఉన్నారు అంటారు పరిచారికలు. వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నా ఆసనం కనపడుతుంది, ఆవిడ కనపడట్లేదు. అదేవిటి కనపడట్లేదు ఇందులో ఏదో మాయ ఉంది. ఇప్పుడు ఆవిడ కనపడక పోతే ఎవరిని వెళ్లి అడగాలి, ఆయన్ని అడగాలి కాబట్టి తిన్నగా రాజుగారి దగ్గరకి వెళ్లి మహారాజా! నేను రాణివాసం లో మహారాణి వారికోసం వెతికాను నాకు కనపడట్లేదు అన్నాడు. ఎట్లా కుండలములు తీస్కొని వెళ్ళను అని అడిగాడు. అప్పుడు మహారాజు ఓ భూవినుత! నువ్వు అన్ని గురువుగారిదగ్గర చదువుకున్న వాడివి , అందరిచేత గురవింప బడ వలసిన వాడివి, నేను నిన్ను ఒక మాట అనకూడదు , నువ్వు అపవిత్రుడవు అని నేను అనకూడదు కానీ నీవు అపవిత్రం గా ఉన్నావు అన్న విషయం నువ్వు తెలుసుకోవటానికే నేను వెళ్లి రాణిగారి దగ్గర కుండలాలు తీస్కో అన్నాను. ఎందుకు అన్నానో తెలుసా అవి పవిత్రమినవి అయిత్ర్ అవి పుచ్చుకునే వాడివి నువ్వు ఎలా ఉండాలి , నువ్వూ పవిత్రం గానే ఉండాలి. నువ్వు పవిత్రంగా లేనప్పుడు , పవిత్రమైన వాటిని పుచ్చుకోవటానికి నీకు ఏమి అర్హత ఉంది. అని నేను అనచ్చా , అనకూడదు అందుకని నేను అనలేక పోయను. కానీ నీకు ఒక విషయం చెప్తున్నాను విను నా భార్య మహా పవిత్రురాలు , మహా పతివ్రత , సౌచము లేనివారికి కనపడదు, నీకు సౌచమ్ లేదు , కాబట్టి కనపడలేదు. అందుకని నువ్వు సౌచుడ వై వెళ్ళు, అప్పుడు ఆయన ఆలోచించాడు నాకు ఎక్కడ సౌచమునకు అంతరము వచ్చింది , అప్పుడు ఆయన కి గుర్తు కు వచ్చింది ఆ.. పేడ తిన్నాను. ఆచమనం చెయ్యలేదు.
స్నానం చేసే వీలు లేనప్పుడు ఎక్కడకైన ముఖ్యమైన పనికి వెళ్ళవలసి వచ్చిన ప్పుడు ఒకసారి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని ఒక్కసారి ఆచమనం చెయ్యాలి, ఆచమనం చేస్తే మళ్ళి సౌచమ్ మొదలు అవుతుంది . నేను ఆచమనo చెయ్యలేదు పేడ తిన్న తరువాత, అక్కడ వచ్చింది నాకు అసౌచమ్ అని అనుకుని వెంటనే కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కొని మూడుమార్లు ఆచమనం చేసాడు. ఆ ఆచమనం చెయ్యడానికి కారణం అందుకు వచ్చింది. అది లోపలి సౌచన్ని తీస్కువచ్చి పెడుతుంది, బాహ్య సౌచమ్ స్నానం వలన వస్తుంది. ఇప్పుడు ఆయన తిన్న పదార్ధము వలన అసౌచమ్ ఎదిఅయితే ఉందొ అందువలన ఆవిడ కనపడలేదు. అంటే ఆచార కాండ యొక్క ప్రాముఖ్యం నన్నయ్య గారు మనకి పెద్ద పీట వేసి చూపిస్తున్నారు. ఆచమనం చేసి వెళ్ళాడు , వెళ్ళగానే ఆ పౌష్య మహారాణి కనపడింది. ఆవిడ అంది నాయన ! ఇదిగో కుండలములు అడిగావ్ , గురుదక్షిణ గా ఇస్తాను అంటున్నావ్ , ఇదిగో తీస్కెళ్ళు, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, తక్షకుడు అనే ఒక సర్పరాజు ఉన్నాడు , ఆయన మహాబలవంతుడు ,మాయావి ఎప్పటినించో ఈ కుండలములను తస్కరించాలని కోరుకుంటున్నాడు, ఎందుకు తస్కరించ లేక పోయాడు, పరమ పవిత్ర, పతివ్రతా అయిన నేను ఉన్న చోటికి ఎలా రాగలదు , అపవిత్రమైన ఆలోచనలు ఉన్న వాడు, రాలేడు . ఇప్పుడు నువ్వు పట్టుకెళ్తున్నావ్ , చూసావా గబుక్కుని లోపలకి వచ్చావ్ , ఆచమనం చెయ్యకుండా. అలా ఏమాత్రం నీదగ్గర దోషం వచ్చిన వీటిని తీసుకుపోతాడు. తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా నేను ఇచ్చను కుండలములు, నీవు నీ శ్రద్దని నిలపలేక పోవటం చేత , గురుదక్షిణ చెల్లించలేని వాడివి అవుతావు. చాలా జాగ్రత్త గా వెళ్ళు అని పరాకు చెప్పింది ఆవిడ. ఇప్పుడు చాల సంతోషం గా ఆ కుండలాలు తీస్కున్నాడు. రాజుగారి దగ్గర కి వెళ్లి ఇంక సెలవు తీస్కుంటాను అని చెప్పాడు. రాజుగారు అన్నారు నాయన చాలా దూరం నించి వచ్చావు , వేళ దాటి పోయింది, మద్యాహ్నం అయ్యింది , కాస్త భోజనం చేసి బయలు దేరు . బ్రహ్మచారి వి ఇంటికి వచ్చావు.
బ్రహ్మ చారి , సన్యాసి వీళ్ళిద్దరూ ఆహరం కొరకు గృహస్తు మీద ఆధారపడతారు. కాబట్టి గృహస్తు యొక్క ధర్మం ఏమిటంటే వాళ్ళిద్దరికీ బిక్ష పెట్టాలి. తాను గృహస్తు పిలిస్తే తింటాను అన్నాడు. కాబట్టి కూర్చున్నాడు భోజనం అంతా పెట్టారు. భోజనం మొదలు పెడుతుంటే అందులో ఒక తల వెంట్రుక వచ్చింది.
లోకం లో దేని వెంట్రుకా పవిత్రం కాదు ఒక్క ఏనుగు వెంట్రుక వినా, ఎనుగ వెంట్రుక కి ఉన్న శక్తి ఎమితన్తెఅది ద్రుష్టి దోషాన్ని తీసేస్తుంది.
కాబట్టి ఆయన భోజనం లో వెంట్రుక చూసాడు. వెంట్రుక అనేది అత్యంత హేయము , ఉత్తర క్షణం లో ఆ పదార్ధాన్ని విసర్జించ వలసి ఉంటుంది. ఇప్పుడు ఏమైంది అంటే అర్థాకలి తో లేచి పోయాడు , బ్రహ్మ చారి ఉత్తరాపోసన పట్టేయాలి. ఆ పదార్థము తినకూడదు , అది దూష్యము తింటే. బ్రహ్మచారి అర్థాకలి తోలేచి పోతే బాధ కదండీ.పిల్ల వాడు కదు , ఆకలి శ్రద్ద తో పెట్టొద్దు అన్నం పెట్టినప్పుడు, ఇప్పుడు అర్థాకలితో లేచిపోయను, ఒకసారి లేచి పోయాను మళ్లి ఎప్పుడో సాయంత్రం తింటాను , ఎంత దూరం నడవాలి ఈ ఆకలి తోటి, ఎంత ఇబ్బంది పెట్టావ్ నన్ను. ఆయన కి కోపం వచ్చి నీకు ద్రుష్టి పోవుగాక అన్నాడు పౌష్య మహారాజుని. అనగానే పౌష్యమహారాజు అన్నాడు నీవు బ్రహ్మ చరివి నేను గృహస్తుని , నీకు భోజనం పెట్టడం నా ధర్మమే , నేను వండా నా లేక కావాలని వెంట్రుక వేసి పెట్టాన , పొరపాటున వెంట్రుక వచ్చింది "సర్వేంద్రియానం నయనం ప్రధానం " ద్రుష్టి ఎంత ముఖ్యం , ద్రుష్టి లేనివాడు రాచరికం ఏమి చేస్తాడు. ఇప్పుడు నాతో పోలేదు , మొత్తం రాజ్యమే సంకట స్థితిలోకి వెళ్ళింది. నీకు వచ్చిన కోపానికి నువ్వు నన్ను మాత్రమే శిక్షించలేదు అమాయకమైన ప్రజల ను కుడా శిక్షించావు, ఇది పౌష్యు డి యొక్క హృదయం. ఇప్పుడు నువ్వు పరిధి దాటావు కాబట్టి, నీకు శాప వాక్కు ఇవ్వాలి. నీకు సంతానము కలుగకుండు గాక అని శపించాడు. ఇప్పుడు ఏమైంది పుస్తకాలు చదువుకున్నాడు , ఋషి ఋణం తీరింది. యజ్ఞాలు చేస్తాడు, హోమాలు చేస్తాడు దేవతల ఋణం తీరింది. సంతానము కలుగదు పితృ ఋణం తీరదు. ఒక ఋణం ఉండిపోయిన వాడికి స్వర్గ లోక ద్వారం కూడా చూడలేడు. ఉన్నత లోకాలు పొందలేడు. నువ్వు నన్ను అంత దూరం తీస్కేళ్ళావు కాబట్టి నిన్నింత దూరం తీస్కెళ్ళాను. కాబట్టి ఇద్దరిలో స్వభావాలు బయటకి వచ్చాయి. ధర్మం లేదు అనుకోకండి ఉంది. స్వభావము అనేది దుందుడుకు గా రజోగుణ తమోగుణ ప్రకోపం తో ధర్మాన్ని నొక్కేసి అంత దూరం తీస్కెళ్ళి పోతుంది. నువ్వు చదువుకున్న చదువు నిన్ను ఉన్నత లోకాలని చేరనివ్వదు. వాక్కు యొక్క శక్తి ఎంతో గొప్పది . తపశ్శక్తి ఉన్న వాడు తొందర పడి శాప వాక్కు విడిచి పెడితే అవతల వాడు ఎంత బాధ పడవలసి ఉంటుందో కూడా తెలిసి ఉండాలి లేదా అంత తపో నిష్టా గరిస్టు లైన వారి నోటి వెంట ఇలాంటి వాక్కు వచ్చింది అంటే దాని వెనక ఏదో బలీయ మైన కారణం ఏదో తరుము కుంటూ వచ్చి ఉండోచ్చు.
కాబట్టి నీ శాపవాక్కు ఉపసంహారం చెయ్యి అన్నాడు పౌష్య మహారాజు , నేను ఉపసంహారం చేస్తాను , నువ్వు నీ శాపాన్ని ఉపసంహారం చెయ్యి అన్నాడు ఉదంకుడు. అప్పుడు రాజు స్వభావము గురించి మాట్లాడాడు. త్రికరణ సుద్ది గా స్వభావాన్ని గురించి మాట్లాడే వాడు ఉండడు. పైకి ఒకలా ఉంటాడు లోపల ఇంకోలా ఉంటారు . స్వభావము చెప్పడం చాల కష్టం.
బ్రాహ్మణుల మనసు నవనీతం లా ఉంటుంది , అప్పుడే తీసిన వెన్న ముద్ద లా ఉంటుంది. పలుకో చాల కఠినమ్ గా ఉంటుంది. మాట అలా మాట్లాడాడు అంటే , అవతల వారిని దిద్ద డానికే మాట్లాడుతాడు తప్ప , వారి స్వభావం చాల మంచిది, అమృత హృదయులు బ్రాహ్మణులు. వాక్కు క ఠి నంగా వచ్చినా మళ్ళి దాన్ని తిప్పి అనుగ్రహిచ గలిగిన
గుణం బ్రాహ్మణుడికి సహజం గా ఉంటుంది . రాజుయందు మాట మధురంగా ఉంటుంది ,మనసు వజ్రంలా కాఠిన్యము తో ఉంటుంది. మాట మంచిగా ఉన్నా మనసు కఠినo కాబట్టి తియ్యలేడు శాప వాక్కు. కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివి కాబట్టి నువ్వు తియ్యి తియ్యలేను అన్నాడు.
అందుకే రమణ మహర్షి గురువు గురించి మాట్లాడుడు తు శిష్యునికి గురువుగారి మీద ఉన్న గురికే గురువు అని పేరు అంటారు. ఆ గురుత్వము అంటే అదే, గురువు అంటే బరువు. ఆయన కన్నా నేను తక్కువ ఆయన దగ్గర నేను తలవంచాలన్న చిన్నతనము మనం అనుకోవడమే మనము లఘువు, ఆయన్ని గురువు అని అనుకుoటా మొ అప్పుడు మనము లఘువు , కాబట్టి గురువు బరువు మనము లఘువు అని గుర్తుంచుకోవాలి. గురువుగారు ఏది చెప్పారో అది మనకు శ్రేయోదాయకం అని మనం భావించాలి తప్ప మీకు ఏమి తెలియదు గురువుగారు నేను చెప్తా వినండి అన కూడదు, కాబట్టి ఆ గురుశిష్యుల సంభందం ఎంతో పవిత్రమైనది. గురువుగారిని ఎంతో భక్తి తో సేవించిన శిష్యులు మీకు మహాభారతం లో చాల మంది కనపడతారు. మనం కి చాలా ఆశ్చర్య కరములైన సంభందములు కనపడతాయి. "శాశితుం యోగ్యః శిష్యః " ఎవరిని గురువుగారు శాశిస్తాడో వాడు శిష్యుడు. ఎవరు శిష్యుడు అవతాడు అంటే శాసించడానికి అనువైన రీతిలో శిష్యుని నడవడి ఉండాలి. గురువు ఒక మాట చెప్తే అది తండ్రి చెప్పిన మాట కంటే గొప్పది. తల్లీ తండ్రీ శరీరాన్ని ఇస్తారు, గురువు మళ్లీ ఈ శరీరాన్ని పొందకర్లేని జ్ఞానం ఇస్తాడు. గురువుగారి తాపత్రయం అంతా ఎలా ఉంటుంది అంటే శిష్యుణ్ణి ఎంత వృద్దిలోకి తీస్కొద్దాం , ఎంత ఆత్మోధరణ కల్పిద్దాం, ఎంత జ్ఞానం సముపార్జించే టట్టు గా అనుగ్రహిద్దాం , దీనితో పాటుగా లౌకికం గా కూడా శిష్యునకి సమస్త ప్రయోజనములు ఒనగూడే టట్టు గా గురువు ప్రార్ధన చేస్తూ ఉంటారు. గురువు యొక్క మనసు వెన్నపూసలా ఉంటుంది , అందుకని ఎప్పుడూ శిష్యుని యొక్క అభ్యున్నతి కి ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాకపోతే గురువుగారి దగ్గర తగిన శిష్యుడు అని పేరు తెచ్చుకోవాలి. అది ఎలా తెచ్చుకోవాలి అంటే. గురువుగారు ప్రేత్యేకించి ఏ ప్రయోజనాన్ని కోరుకునేవాడు కాడు, గురువుగారు మీరు ఎలా ఉండాలి అని కోరుకుoటుoన్నారో , మీరు అలా ఉండగలగటమే మీరు చెయ్యవలసిన సేవ. రెండవది శిష్యునికి ఛాత్రుడు అని ఒక పేరు చట్రము అంటే గొడుగు , గొడుగు ఏమి చేస్తుంది అంటే గురువుగారు లేదా వేసుకున్న వ్యక్తి కన్నా పైన ఉంటుంది. నేను ఈయన కంటే గొప్ప అని అనుకోదు, తాను అలా పైన ఉంది పైనించి పడే ఎండా వానా, తన మీద పడేలా చేస్కుని కింద ఉన్న వ్యక్తి ని కాపాడు తూ ఉంటుంది . శిష్యుడు ఏమి చేస్తూ ఉంటాడు అంటే , గురువుగారు డస్సి పోకుండా ఉంటె , సోక్కిపోకుండా ఉంటె తాను ఇంకొంత కాలం ఇంకా బాగా వేదాధ్యయనం, ఇంకా బాగా ఈశ్వరుని సేవకి , ఆయన ఇంకా బాగా గ్రంధ పటనం కొరకు వినియోగిoచుకుంటే, దాని అమృతత్వం కలిగిన ఆ గురువు ఆ విద్యని మళ్ళి పదిమందికి పంచి పెడతారు, కాబట్టి ఆ గురువు కొన్ని వేలమందికి విద్య అందించేటట్టు గా , ఆయన కి ఎక్కువ సమయం మిగిలేటట్టు గా నేను చెయ్యాలి.
రెండు గురువుకున్న లక్షణం గురువు తన అయుర్ధం తగ్గించేసుకుంటాడు. ఈశ్వరుడు ఊపిరుల రూపంలో ఆయుర్దాయం ఇస్తాడు. దీర్ఘవాఖ్య నిర్మాణం లో , లఘువాఖ్య నిర్మాణం లో లేకపోతే ఎక్కడెక్కడ వాక్యం విరవాలో అక్కడక్కడ ఊపిరి ఆపి పీల్చి విడిచి పెట్టడo చేత , లోపల ఆ ఊపిరుల సంఖ్యా ఎక్కువై ఆయుర్దాయం క్షీణించిపోతుంది. కనుక ఆయుర్దాయం తనకుతాను క్షీణింప చేస్కున్తున్నాడు తెలిసికూడా. భగవంతుడు మనుష్యునకి ఒక అద్భుతమైన కానుక స్వరపేటిక, ఆస్వరపేటికకి ఒక లక్షణం ఉంది, అది అరిగిపోతుంది. అది కాల క్రమంలో మాట్లాడగా మాట్లాడగా జీర వచ్చి అది మూగబోతుంది. అంటే పనిచెయ్యదు. ఇది తెలిసి కూడా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎవరి కోసం మాట్లాడతాడు. నేను చెప్పక పోతే నేను చదువుకున్న చదువు ఎందుకు , పోతేపోని స్వరపేటిక, తగ్గిపోతే తగ్గిపోని ఆయుర్ధాయం, నావల్ల పదిమంది బాగుపడితే నాకు అంతకన్నా ఏమికావాలి అని మాట్లాడతాడు గురువు. తన శరీరాన్ని, స్వర పేటికనే త్యాగం చేస్తున్న గురువు మీ నించి ఏమి కోరుకుంటాడు. ఆయనకి మిగిలిన సమయలలో ఆయన డస్సి పోకుండా నువ్వు చెయ్య కలిగితే, కనీసం ఆయన ఆయుర్ధాయం కొంచం పెరుగుతుంది. కాబట్టి గురువుని చంపు కోవటం అంటే గురువు ని ఇబ్బంద్ది పెట్టడం. ఇప్పుడు ఉన్న పరిస్థితులకి నేను అన్వయం చెయ్యట్లేదు. పూర్వ విద్యార్థులు ఆశ్రమాలకి వెళ్లి చదువుకునే వారు అప్పుడు గురుపత్ని అన్నం పెడుతుంది. గురు పత్ని ఏమికోరుకుoతుందంటే, ఆయన అలానే ఉండాలి తన సౌభగ్యమ్ ఉండాలి అని కోరుకుంటుంది. కాబట్టి గురువు గారి ప్రాణo నిలబెట్టటం లో ఉండే సుసృష గురుపత్ని యొక్క అనుగ్రహానికి కారణం అవుతుంది. గురుపత్ని యొక్క అనుగ్రహం తో సమానమే.
నన్నయ్య గారు మహా భారతాన్ని ఆంధ్రీకరిస్తూ , ఉదంకోపాఖ్యానం ప్రారంభం చేస్తూ పైలుడి దగ్గర ఉదంకుడు గురువుగారి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు, పైలుడు ఏమి చెప్పాడు ఉదంకుడు ఏమి నేర్చుకున్నాడు అని చెప్తూ గురుకులమునందు గురువుగారికి పరిచర్యలు చేస్తూ , గురుపత్ని కి పరిచర్యలు చేస్తూ , గురువుగారు చెప్పిన దాన్ని వింటూ ఆయన చెప్పినదాన్ని త్రికరణ ఆచరిస్తూ, ఆయన విద్యలు నేర్చుకున్నాడు దానితో పాటుగా అణిమ, గరిమ, లఘిమ ఇటువంటి అష్ట శిద్దులు ఆయనకి వచేసాయి , ఆయన అనుకుంటే గాలిలో వెళ్ళ గలడు, ఎక్కడ ఏమి జరుగుతుందో ఆయన తెలుసుకో గలడు , అలా అష్ట సిద్దులు ఆయన కి వశం అయ్యాయి. ఆ అష్ట సిద్దుల కోసం విద్య నేర్చుకోలేదు. కానీ వాటంత అవే వశం అయ్యాయి.
శంకరా చార్యుల వారు దక్షిణా మూర్తి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు. దక్షిణా మూర్తి స్తోత్రం రొజూ చదువుతూ, ఆ స్తోత్రాన్ని బాగా పరిశీలనం చేసిన వాడికి ఆత్మ ఎరుకలోకి రావడమే కాకుండా, అష్ట సిద్దులు వశం అవుతాయి , కానీ ఈ అష్ట సిద్దులు ఏలాంటివి అంటే కాకి పెంట ఎటువంటిదో , అటువంటివి. ఆత్మ ని తెలుసుకోవటం ప్రధానం కానీ అటువంటి సిద్దుల కోసం వెంపర్లాడటం అతి హేయతిహేయ మైన విషయం. కాబట్టి ఆత్మ జ్ఞాని వాటినికి చూసి మురిపోడు. అటువంటి స్థితిని ఉదంకుండు పొందాడు , అంతా గురువుగారి యొక్క అనుగ్రహం వలననే. అష్ట సిద్దుల తో పాటుగా వేద విద్యలను పొందాడు. పొందిన తరువాత ఆశ్రమ నియమం ఒకటి ఉంది, గురువు నిత్య త్రుప్తుడైన గురువుగారి ని అడుగుతారు , గురుదక్షిణ , గురువుగారు మీరేదైనా కోరండి మేముసమర్పిస్తాంఅని. గురువు నిత్య తృప్తుడు కాబట్టి ఏమి కోరాడు. ఒక్కొక్కచో శిష్యులకి అన్నం పెట్టడానికో ఏదైనా కోరితే కోరచ్చు. పైలుడు ఒక చిరునవ్వు నవ్వి నాకేమి కావలయ్య , ఏమి అక్కర్లలేదు, అప్పుడు ఉదంకుడు గురువుగారి దగ్గర ఇన్ని నేర్చుకుని దక్షిణ ఇవ్వకుండా వెళ్ళ కూడదు, కాబట్టి నేను మీకు ఏమైనా ఇవ్వాలని అనుకుంటున్నాను, మీరేమైనా అడగండి అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. కాబట్టి ఇప్పుడు గురువుగారు ఏమి మాట్లాడట్లేదు, ఇప్పుడు గురువుగారితో సమానస్థానం ఎవరిదక్కడ , గురుపత్నిది , కాబట్టి ఆమె ని వెళ్లి అడిగాడు ఉదంకుడు. అమ్మ గురువుగారి దగ్గర ఇన్ని నేర్చుకున్నాను , మీరు నాకు అన్నం పెట్టరంమ్మా , నేను గురు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, ఏమి కావాలమ్మా అని అడిగాడు, ఆవిడ అంది పక్కనే ఉన్నాడయ్యా పౌష్య మహారాజు రాజ్యం చేస్తూ ,ఆ పౌష్య మహారాజు యొక్క భార్య కుండలములను నాకు తెచ్చి ఇవ్వు అన్నది. అలా అడగటానికి కారణం ఏమిటి అంటే
కుండలములు ఐదో తనానికి చిహ్నాలు , అంటే అటువంటి శక్తి కలిగినవి అవి, ఒక్కొక్క వస్తువు కి ఆ శక్తి ఎలా వస్తుంది అంటే ఆ వస్తువుని పట్టుకున్న వ్యక్తి వలన వస్తుంది. గురువుగారి దగ్గర నించి వచ్చిన పూచిక పుల్లకు కూడా శక్తి ఉంటుంది. వారి శక్తి ఆ వస్తువులోకి కొంత వస్తుంది. కాబట్టి గురువుగారు మహా ఉపాసకులు ,మహా పతివ్రతలు ఇటువంటి వారు ఉపయోగించిన వస్తువులకు తత్సంబంధం మైన శక్తి వస్తుంది. వివాహం అయిపొయిన టువంటి సువాసినులు పెట్టుకే కుండలములకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. చెవికి కర్ణాభరణం లేకుండా భర్త కి కనపడ కూడదు. ఒకవేళ ఏకారణం చేత నై నా కర్ణా భరణములు తీసేయ్య వలసి వస్తే, భర్త కి పరాకు చెప్తారు, అయ్యా కొంచం సేపు ఇటుపక్కకు రావద్దు అని చెప్తారు. చెప్పి తలుపు మూసేసి, జాగ్రత్త గా కర్ణాభరణంములు తీసేసి, మళ్ళి వెంటనే పెట్టేసుకుంటారు. ఒకవేళ కర్ణాభరణం తీసేసి మరో కర్ణాభరణం పెట్టుకునే మధ్యలో వేరొక ఆభరణo పెట్టుకోటానికి వీలు లేని పరిస్థితి వస్తే ఐదో తనం లో అమ్మవారి యొక్క సాక్షాత్ స్వరూపం కనుక ఒక చిన్న తాటాకు ముక్క అయిన పెట్టాలి తప్ప, చెవులకు ఏమి లేకుండా భర్త కు ఆడది ఎట్టి పరిస్తితులలో కనపడ కూడదు.నిషిద్దం. ఎందుకంటే అది భర్త యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంది అని చెప్పినవి శాస్త్రాలు. పౌ ష్య మహాదేవి ఆవిడ అంత పతివ్రత, ఈయనే నాకు ఈశ్వరుడు అని భర్తకి ప్లేటులో ఇడ్లీ పట్టుకొచ్చి ఇస్తే పరమేశ్వరుడికి బాలభోగం చేసిన ఫలితం ఆమె ఖాతా లో వేస్తాడు. అందుకే ఆడదానిగా తరించడం తేలిక పురుషుడిగా తరించడం చాల కష్టం నిజానికి, అందునా భర్త విశేషమైన భక్తి తత్పరుడైతే, ఆయన చేసే పూజలలో సగం వంతు భార్య ఖాతా లో పడిపోతుంది, ఆవిడా ఇంకొంత చెస్కుదనుకోండి, ఈయన కన్నా ఆవిడ పుణ్యమే ఎక్కువ ఉంటుంది నిజానికి.
పౌష్య మహాదేవి అంత పతివ్రత , భర్తని అంత గా అనువర్తించింది. ఆయన పుష్యాభిషేకాన్ని పొందాడు కాబట్టి పౌష్యుడు అని పేరొచ్చింది ఆయనకి. కాబట్టి అటువంటి పతివ్రత యొక్క కుండలములకు ఆ శక్తి ఉంటుంది , కాబట్టి ఆ కుండలములు అడిగి తెచ్చి పెట్టు అన్నది. ఇప్పుడు గురువు గారు ఒప్పుకోవాలా. గురువు నిశబ్దం గా ఉంటె గురువుపత్ని ఆజ్ఞ గురువుగారి ఆజ్ఞే. ఇక్కడ మహాభారతం ఏమి చెప్తుంది అంటే, గురు గారితో సమానం గా సేవించాలి అని చెప్తుంది.
ఇప్పుడు ఆవిడ తీసుకురా కుండలములు అంటే ఆయన బయలు దేరాడు. ఎంతో దూరం కాదు. దగ్గరలో నే ఉంది పౌష్యుని రాజ్యం. ఆ వెళ్తుండగా ఒక ఆశ్చర్య కర సంఘటన జరిగిoది. ఒక దివ్య పురుషుడు, మనుష్య తేజస్సు తో పోల్చలేని తేజస్సు తో ఒక వ్యక్తి, ఒక ఎద్దు మీద కూర్చొని ఉన్నాడు. మాములు గా ఉన్న ఎవరో ఒక వ్యక్తి ఒక ఎద్దు మీద కుర్చుని దీని పేడ తిను అంటే ఛా అవతలికి పో అంటాడ లేదా , కాని ఆ వ్యక్తి దివ్య మైన తేజస్సు తో ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క తేజస్సు చూడగానే ఆయన చుట్టూ ఉన్న వలయం చూడగానే, ఈయన సామాన్యుడు కాదు , ఈయన మనుష్యుల కన్నా బిన్నమైన జాతికి చెందిన వాడు. దేవతా స్వరూపుడు ,కాబట్టి ఈయన మాట నేను అవుదల దాల్చాల్సిందే అనే టటు వంటి ప్రచోదనం కలిగే టట్టు ఆయన ఉన్నాడు. స్వభావము గురువుగారి మాటలు విన్నందు వలన వచ్చిన వినయాన్ని మింగేస్తుంది. అప్పుడు తన స్వభావం తో ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఆ దివ్య తేజస్సు కలిగిన వ్యక్తి వంక చూసాడు. ఆ వ్యక్తి ఇది గో నేను ఎక్కిన ఎద్దు పేడ వేసింది. ఈ పేడ కొద్దిగా తిను అన్నాడు. తిన్నాడు. ఆయన దివ్యత్వం అంగీకరించి నప్పుడు,ఆయన ఎందుకు అంత గొప్పగా ఉన్నాడో తెలియదు కానీ గురువుగారిని అడుగుదాం తరువాత, ప్రస్తు తానికి ఆయన మాట విందాంఅని కాస్త పేడ తీస్కొని తినేసాడు. ఆ బయలు దేరు. వెళ్ళిపోయాడు. తర్వాత పౌష్య మహారాజు దగ్గరకి వెళ్ళాడు. పౌష్య మహారాజు అడిగాడు ఏమిటి దేనికి వచ్చావు అని అడిగాడు, అప్పుడు ఉదంకుడు అన్నాడు నేను గురుదక్షిణ ఇవ్వటానికి బయలు దేరి వచ్చాను అన్నాడు. మా అమ్మ వంటి గురుపత్ని నీ భార్య యొక్క కుండలములు అడిగింది అన్నాడు.
ఇవచ్చా రాజు అంటే రాజుకి రెండు కర్తవ్యములు ఉంటాయి. ఒకటి
ఆశ్రమం లో విద్యాభ్యసించి బ్రహ్మ చర్యం విడిచి పెట్టి గృహస్తాశ్రమం లో కి వెళ్లేవా డికి పెళ్లి ఖర్చు పెట్టుకోవాల్సిన భాద్యత రాజుదే. నిజమైన స్నాతకము అంటే అప్పటివరకు కాటుక పెట్టుకోకూడదు, అప్పటివరకు తల దువ్వుకో కూడదు, అప్పటివరకు పూల దండ వేస్కోకూడదు తాంబూలం తినకూడదు, అద్దం చుస్కోకూడదు. ఇన్ని నియములు పాటించిన వాడు అన్ని విడిచి పెడతాడు. ఇవన్ని పాటించిన వాడు బ్రహ్మ చర్యం విడిచి పెట్టి గృహస్తాశ్రమం లోకి వస్తాడు. గురువుగారి కి గురుదక్షిణ ఇవ్వవలసి వస్తే , ఏముంటుంది శిష్యుని దగ్గర ఏముంటుంది, ఇవ్వటానికి అందుకని రాజు దగ్గరకి వెళ్తాడు. రాజా నేను ఇవి చడువుకున్నాను, ఇప్పుడు నేను గురుదక్షిణ ఇవ్వాలి అంటాడు , ఏది నువ్వు చదువు కున్న వాటిలో రెండు మాటలు చెప్పు అంటాడు, చెప్తే శేభాష్ వీడు బాగా చదువుకున్నాడు వీడికి గురుదక్షిణ కట్ట దానికి డబ్బు ఇవ్వండి అంటదు. రాజా నేను గృహస్తాశ్రమం లోకి వెళ్తున్నాను , బ్రహ్మచర్యం విడిచిపెట్టి అంటాడు అప్పుడు రాజు అయితే ఇదిగో ద్రవ్యం ఇస్తున్నాను వెళ్లి పెళ్లి చేస్కో అంటాడు. కాబట్టి గురుదక్షిణ కోసం రాజుని ఆశ్రయించాలి కాబట్టి ఆ గురుదక్షిణ తన భార్య కుండలములే అయినా రాజు తన ధర్మం తాను నెరవేర్చాలి, మహా భారతం అంతా ధర్మమే మాట్లాడుతుంది. కాబట్టి రాజు ఇప్పుడు తన భార్య కుండలములను పట్టుకు వెళ్ళు అని చెప్పాలి, ఆవిడ తన భర్త ఏది చెప్తే అది చేస్తుంది పతివ్రత, ఆవిడ ధర్మం ఆవిడ చెయ్యాలి. ఇప్పుడు భర్త చెప్పాడు కాబట్టి ఇచ్చెయ్యాలి, కాబట్టి పట్టుకెళ్ళు అన్నాడు రాజు. నువ్వు వెళ్లి అడుగు ఆవిడ ఇస్తుంది అన్నాడు రాజు. ఇప్పుడు పౌష్య ని యొక్క భార్య , రాణిగారి యొక్క అంతఃపురం లోకి వెళ్ళాడు , అలా వెళ్ళో చ్చా , అంటే ఆయన చదువుకున్న వేదం అటువంటిది . ప్రతి ఒక్కరికి ఐదుగురు తల్లులు ఉంటారు, ఐదుగురు తల్లుల్లో రాజు భార్య ఒకతె. గురువుగారికి గురుదక్షిణ కట్టటానికి వచ్చిన వాడు , గురుదక్షిణ కట్టటం అంటే చదువు పూర్తి అయ్యింది. చదువు పూర్తైన వాడికి ఏమి తెలిసి ఉండాలి దేశాన్ని ఏలే రాజు భార్య తల్లితో సమానం. రాణి వాసం లోకి వెళ్లి చుస్తే మాత్రం బిడ్డడు తల్లిని ఎలా చూస్తాడో అలా చూస్తాడు . కాబట్టి ఇప్పుడు రాణి వాసం లో కి వెళ్లి చుస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి. ఒక గురువు దగ్గర చదువుకున్న వాడి మీద రాజుకి అంత గౌరవం ఉండేది. సంస్కారం చదువు ఎంత విడదీయ్య రానివిగా ఉండేవో భారతం చెప్తుంది. సంస్కారం లేని చదువు ఈ జాతి ఊహించలేదు. సంస్కారం లేని విద్యావంతుడు "జ్ఞాన ఖలుని లోని శారద వోలె" ఉంటాడని ఊహించలేదు.
ఇప్పుడు ఉదంకుడు రాణివాసం లోకి వెళ్ళాడు . రాణిగారు ఏరి అని అడిగాడు, రాణివాసం లో అదిగో గదిలో కూర్చున్నారు అన్నారు వెళ్లి మాట్లాడు అన్నారు. వెళ్లి చూసాడు కనపడలేదు. అదిగో అక్కడే ఉన్నారు అంటారు పరిచారికలు. వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నా ఆసనం కనపడుతుంది, ఆవిడ కనపడట్లేదు. అదేవిటి కనపడట్లేదు ఇందులో ఏదో మాయ ఉంది. ఇప్పుడు ఆవిడ కనపడక పోతే ఎవరిని వెళ్లి అడగాలి, ఆయన్ని అడగాలి కాబట్టి తిన్నగా రాజుగారి దగ్గరకి వెళ్లి మహారాజా! నేను రాణివాసం లో మహారాణి వారికోసం వెతికాను నాకు కనపడట్లేదు అన్నాడు. ఎట్లా కుండలములు తీస్కొని వెళ్ళను అని అడిగాడు. అప్పుడు మహారాజు ఓ భూవినుత! నువ్వు అన్ని గురువుగారిదగ్గర చదువుకున్న వాడివి , అందరిచేత గురవింప బడ వలసిన వాడివి, నేను నిన్ను ఒక మాట అనకూడదు , నువ్వు అపవిత్రుడవు అని నేను అనకూడదు కానీ నీవు అపవిత్రం గా ఉన్నావు అన్న విషయం నువ్వు తెలుసుకోవటానికే నేను వెళ్లి రాణిగారి దగ్గర కుండలాలు తీస్కో అన్నాను. ఎందుకు అన్నానో తెలుసా అవి పవిత్రమినవి అయిత్ర్ అవి పుచ్చుకునే వాడివి నువ్వు ఎలా ఉండాలి , నువ్వూ పవిత్రం గానే ఉండాలి. నువ్వు పవిత్రంగా లేనప్పుడు , పవిత్రమైన వాటిని పుచ్చుకోవటానికి నీకు ఏమి అర్హత ఉంది. అని నేను అనచ్చా , అనకూడదు అందుకని నేను అనలేక పోయను. కానీ నీకు ఒక విషయం చెప్తున్నాను విను నా భార్య మహా పవిత్రురాలు , మహా పతివ్రత , సౌచము లేనివారికి కనపడదు, నీకు సౌచమ్ లేదు , కాబట్టి కనపడలేదు. అందుకని నువ్వు సౌచుడ వై వెళ్ళు, అప్పుడు ఆయన ఆలోచించాడు నాకు ఎక్కడ సౌచమునకు అంతరము వచ్చింది , అప్పుడు ఆయన కి గుర్తు కు వచ్చింది ఆ.. పేడ తిన్నాను. ఆచమనం చెయ్యలేదు.
స్నానం చేసే వీలు లేనప్పుడు ఎక్కడకైన ముఖ్యమైన పనికి వెళ్ళవలసి వచ్చిన ప్పుడు ఒకసారి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని ఒక్కసారి ఆచమనం చెయ్యాలి, ఆచమనం చేస్తే మళ్ళి సౌచమ్ మొదలు అవుతుంది . నేను ఆచమనo చెయ్యలేదు పేడ తిన్న తరువాత, అక్కడ వచ్చింది నాకు అసౌచమ్ అని అనుకుని వెంటనే కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కొని మూడుమార్లు ఆచమనం చేసాడు. ఆ ఆచమనం చెయ్యడానికి కారణం అందుకు వచ్చింది. అది లోపలి సౌచన్ని తీస్కువచ్చి పెడుతుంది, బాహ్య సౌచమ్ స్నానం వలన వస్తుంది. ఇప్పుడు ఆయన తిన్న పదార్ధము వలన అసౌచమ్ ఎదిఅయితే ఉందొ అందువలన ఆవిడ కనపడలేదు. అంటే ఆచార కాండ యొక్క ప్రాముఖ్యం నన్నయ్య గారు మనకి పెద్ద పీట వేసి చూపిస్తున్నారు. ఆచమనం చేసి వెళ్ళాడు , వెళ్ళగానే ఆ పౌష్య మహారాణి కనపడింది. ఆవిడ అంది నాయన ! ఇదిగో కుండలములు అడిగావ్ , గురుదక్షిణ గా ఇస్తాను అంటున్నావ్ , ఇదిగో తీస్కెళ్ళు, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, తక్షకుడు అనే ఒక సర్పరాజు ఉన్నాడు , ఆయన మహాబలవంతుడు ,మాయావి ఎప్పటినించో ఈ కుండలములను తస్కరించాలని కోరుకుంటున్నాడు, ఎందుకు తస్కరించ లేక పోయాడు, పరమ పవిత్ర, పతివ్రతా అయిన నేను ఉన్న చోటికి ఎలా రాగలదు , అపవిత్రమైన ఆలోచనలు ఉన్న వాడు, రాలేడు . ఇప్పుడు నువ్వు పట్టుకెళ్తున్నావ్ , చూసావా గబుక్కుని లోపలకి వచ్చావ్ , ఆచమనం చెయ్యకుండా. అలా ఏమాత్రం నీదగ్గర దోషం వచ్చిన వీటిని తీసుకుపోతాడు. తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా నేను ఇచ్చను కుండలములు, నీవు నీ శ్రద్దని నిలపలేక పోవటం చేత , గురుదక్షిణ చెల్లించలేని వాడివి అవుతావు. చాలా జాగ్రత్త గా వెళ్ళు అని పరాకు చెప్పింది ఆవిడ. ఇప్పుడు చాల సంతోషం గా ఆ కుండలాలు తీస్కున్నాడు. రాజుగారి దగ్గర కి వెళ్లి ఇంక సెలవు తీస్కుంటాను అని చెప్పాడు. రాజుగారు అన్నారు నాయన చాలా దూరం నించి వచ్చావు , వేళ దాటి పోయింది, మద్యాహ్నం అయ్యింది , కాస్త భోజనం చేసి బయలు దేరు . బ్రహ్మచారి వి ఇంటికి వచ్చావు.
బ్రహ్మ చారి , సన్యాసి వీళ్ళిద్దరూ ఆహరం కొరకు గృహస్తు మీద ఆధారపడతారు. కాబట్టి గృహస్తు యొక్క ధర్మం ఏమిటంటే వాళ్ళిద్దరికీ బిక్ష పెట్టాలి. తాను గృహస్తు పిలిస్తే తింటాను అన్నాడు. కాబట్టి కూర్చున్నాడు భోజనం అంతా పెట్టారు. భోజనం మొదలు పెడుతుంటే అందులో ఒక తల వెంట్రుక వచ్చింది.
లోకం లో దేని వెంట్రుకా పవిత్రం కాదు ఒక్క ఏనుగు వెంట్రుక వినా, ఎనుగ వెంట్రుక కి ఉన్న శక్తి ఎమితన్తెఅది ద్రుష్టి దోషాన్ని తీసేస్తుంది.
కాబట్టి ఆయన భోజనం లో వెంట్రుక చూసాడు. వెంట్రుక అనేది అత్యంత హేయము , ఉత్తర క్షణం లో ఆ పదార్ధాన్ని విసర్జించ వలసి ఉంటుంది. ఇప్పుడు ఏమైంది అంటే అర్థాకలి తో లేచి పోయాడు , బ్రహ్మ చారి ఉత్తరాపోసన పట్టేయాలి. ఆ పదార్థము తినకూడదు , అది దూష్యము తింటే. బ్రహ్మచారి అర్థాకలి తోలేచి పోతే బాధ కదండీ.పిల్ల వాడు కదు , ఆకలి శ్రద్ద తో పెట్టొద్దు అన్నం పెట్టినప్పుడు, ఇప్పుడు అర్థాకలితో లేచిపోయను, ఒకసారి లేచి పోయాను మళ్లి ఎప్పుడో సాయంత్రం తింటాను , ఎంత దూరం నడవాలి ఈ ఆకలి తోటి, ఎంత ఇబ్బంది పెట్టావ్ నన్ను. ఆయన కి కోపం వచ్చి నీకు ద్రుష్టి పోవుగాక అన్నాడు పౌష్య మహారాజుని. అనగానే పౌష్యమహారాజు అన్నాడు నీవు బ్రహ్మ చరివి నేను గృహస్తుని , నీకు భోజనం పెట్టడం నా ధర్మమే , నేను వండా నా లేక కావాలని వెంట్రుక వేసి పెట్టాన , పొరపాటున వెంట్రుక వచ్చింది "సర్వేంద్రియానం నయనం ప్రధానం " ద్రుష్టి ఎంత ముఖ్యం , ద్రుష్టి లేనివాడు రాచరికం ఏమి చేస్తాడు. ఇప్పుడు నాతో పోలేదు , మొత్తం రాజ్యమే సంకట స్థితిలోకి వెళ్ళింది. నీకు వచ్చిన కోపానికి నువ్వు నన్ను మాత్రమే శిక్షించలేదు అమాయకమైన ప్రజల ను కుడా శిక్షించావు, ఇది పౌష్యు డి యొక్క హృదయం. ఇప్పుడు నువ్వు పరిధి దాటావు కాబట్టి, నీకు శాప వాక్కు ఇవ్వాలి. నీకు సంతానము కలుగకుండు గాక అని శపించాడు. ఇప్పుడు ఏమైంది పుస్తకాలు చదువుకున్నాడు , ఋషి ఋణం తీరింది. యజ్ఞాలు చేస్తాడు, హోమాలు చేస్తాడు దేవతల ఋణం తీరింది. సంతానము కలుగదు పితృ ఋణం తీరదు. ఒక ఋణం ఉండిపోయిన వాడికి స్వర్గ లోక ద్వారం కూడా చూడలేడు. ఉన్నత లోకాలు పొందలేడు. నువ్వు నన్ను అంత దూరం తీస్కేళ్ళావు కాబట్టి నిన్నింత దూరం తీస్కెళ్ళాను. కాబట్టి ఇద్దరిలో స్వభావాలు బయటకి వచ్చాయి. ధర్మం లేదు అనుకోకండి ఉంది. స్వభావము అనేది దుందుడుకు గా రజోగుణ తమోగుణ ప్రకోపం తో ధర్మాన్ని నొక్కేసి అంత దూరం తీస్కెళ్ళి పోతుంది. నువ్వు చదువుకున్న చదువు నిన్ను ఉన్నత లోకాలని చేరనివ్వదు. వాక్కు యొక్క శక్తి ఎంతో గొప్పది . తపశ్శక్తి ఉన్న వాడు తొందర పడి శాప వాక్కు విడిచి పెడితే అవతల వాడు ఎంత బాధ పడవలసి ఉంటుందో కూడా తెలిసి ఉండాలి లేదా అంత తపో నిష్టా గరిస్టు లైన వారి నోటి వెంట ఇలాంటి వాక్కు వచ్చింది అంటే దాని వెనక ఏదో బలీయ మైన కారణం ఏదో తరుము కుంటూ వచ్చి ఉండోచ్చు.
కాబట్టి నీ శాపవాక్కు ఉపసంహారం చెయ్యి అన్నాడు పౌష్య మహారాజు , నేను ఉపసంహారం చేస్తాను , నువ్వు నీ శాపాన్ని ఉపసంహారం చెయ్యి అన్నాడు ఉదంకుడు. అప్పుడు రాజు స్వభావము గురించి మాట్లాడాడు. త్రికరణ సుద్ది గా స్వభావాన్ని గురించి మాట్లాడే వాడు ఉండడు. పైకి ఒకలా ఉంటాడు లోపల ఇంకోలా ఉంటారు . స్వభావము చెప్పడం చాల కష్టం.
బ్రాహ్మణుల మనసు నవనీతం లా ఉంటుంది , అప్పుడే తీసిన వెన్న ముద్ద లా ఉంటుంది. పలుకో చాల కఠినమ్ గా ఉంటుంది. మాట అలా మాట్లాడాడు అంటే , అవతల వారిని దిద్ద డానికే మాట్లాడుతాడు తప్ప , వారి స్వభావం చాల మంచిది, అమృత హృదయులు బ్రాహ్మణులు. వాక్కు క ఠి నంగా వచ్చినా మళ్ళి దాన్ని తిప్పి అనుగ్రహిచ గలిగిన
గుణం బ్రాహ్మణుడికి సహజం గా ఉంటుంది . రాజుయందు మాట మధురంగా ఉంటుంది ,మనసు వజ్రంలా కాఠిన్యము తో ఉంటుంది. మాట మంచిగా ఉన్నా మనసు కఠినo కాబట్టి తియ్యలేడు శాప వాక్కు. కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివి కాబట్టి నువ్వు తియ్యి తియ్యలేను అన్నాడు.
No comments:
Post a Comment