Monday, May 19, 2014

ఆదిపర్వం 7

గురువుగారికి దక్షిణ ని ఇచ్చే కార్యక్రమం పూర్తైన తరువాత , గురువుగారు అనుజ్ఞ ని ఇచ్చారు ఉదంకుడికి వెళ్లి తపస్సు చేసుకో అని, ఆయన తపస్సు ను ప్రారంభం చేసాడు. మీకు ముందు మనవి చేసినట్టు స్వభావము అని ఉంటుంది , ఈ స్వభవమునకు  బలము ఉంటుంది, బలహీనత ఉంటుంది.
శరీరములు పడిపోతూ ఉంటై, శరీరము పడిపోయినప్పుడు,  జీవుడు శరీరము విడిచి వెళ్ళిపోతాడు. 
రవీంద్రనాథ్ టాగూర్ గారు గీతాంజలి లో రాస్తారు , తల్లి పిల్లవాణ్ణి వాళ్ళో పడుకోపెట్టుకుని స్తన్యం ఇచ్చేటప్పుడు, కుడి స్థనన్ని వాడి నోట్లో పెట్టి, వాడి  కడుపు నిండకపోతే, అటు తోడ మీద నించి ఇటు తోడ వైపుకు మార్చుకునే వ్యవధి ఎలా ఉంటుందో , జీవుడు ఈ శరీరాన్ని విడిచి ఇంకో శరీరానికి వెళ్ళడం అలా ఉంటుంది. 
అలా వెళ్ళిపోయెటప్పుడు పెద్ద సమస్య అంత ఎక్కడ వస్తుంది అంటే, ఒక శరీరం వదిలి పెట్టి , ఆ శరీరాన్ని భోగ వస్తువుగా వాడుకుని, దేని మీద అనురక్తిని పెంచుకున్నాడో, ఆ వాసనని పట్టుకువేల్తాడు అదే ఇతర జన్మలలో కనిపిస్తుంది.  ఉదాహరణ కి ఒక శిశువు జన్మిస్తాడు , వాడు పెద్దవాడు అవుతాడు, వాడికి తెల్లని బట్టలు అంటే ఇష్టం , ఎప్పుడు తెల్లని బట్టలే కట్టుకుంటాడు , అది ముందు జన్మ నందు వ్యామోహాన్నిజయిoచిన వాడై ఉంటాడు.  అది గెలిచిన వాసనా బలం. 
అలాగే గెలవని వాసనా బలం అని ఉంటుంది. ఒక వస్తువు పైన వ్యామోహం ఉండిపోతుంది. ఆ వ్యామోహం కూడా జీవుదివెంట వస్తుంది. ఇందులో ఇబ్బంది ఏంటంటే, తాను ఇష్టపడిన వస్తువేదో ఆ వస్తువుని పొందడంలో ప్రతిబంధకం గా ఉన్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడిమీద దీర్ఘ కాలికమైన కోపమును కలిగి ఉండటం,ఇది పతన హేతువులలో ఒకటై కూర్చుంటుంది. ఏమవుతుంది అంటే , చిట్ట చివరికి ప్రాణోత్కర మణం అవుతున్నపుడు, ఎవరిమీదైతే క్రోధం పెంచుకున్నాడో ఆయన గుర్తొస్తాడు. మీరు గమనిస్తే మనసు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది , దానికి ఇష్టం లేని డి కనిపిస్తే ఆగిపోతుంది, ఇష్టమైన డి కనిపించినా ఆగిపోయి స్మరిస్తూ ఉంటుంది. మనసు బాగా పట్టుకునేది ఎక్కడ అంటే ఇష్టమైన చోట ఇష్టంలేని చోట, ఈ రెండు చోట్ల బాగా పట్టుకుంటుంది ,అప్పుడు ఏమవుతుంది అంటే శక్తి క్షీణించి పోతుంది. కోప్పడినప్పుడు క్షీణించిన శక్తి కన్నా ఆ వస్తువు లభించిన సుఖము నందు ఎక్కువ శక్తి క్షీనించిపోతుంది. దీర్ఘ కాలికం గా ఉండే కోపానికి క్రోదం అని పేరు. ఎక్కడ క్రోదం ఉంటుందో అక్కడ కుతంత్రానికి కి అవకాసం ఎక్కువ ఉంటుంది. వాడిని ఎలా పాడుచేయ్యాలి అని ఆలోచన మొదలు పెడుతుoది. అది జీవుడు పతనం అయిపోవటాని  అజ్ఞానం చేత మాయ చేత ఏర్పడే పెద్ద కందకం అది. దాన్ని దాటాక పోతే మళ్ళి ఎన్ని జన్మల తరువాత దాటుతాడో ఎవరికీ తెలియదు. అలా అంటుకుంది ఉండిపోతుంది. మీకు ముందు కనపడతాయి భారతంలో ఘట్టాలు. దీర్ఘ కాలం మనసులో ఉంటె అది ఎలా ఎలా అని మనసులో ఉంటున్నే ఉంటుంది దీర్గ కాలం , అదే  జరిగింది ఉదంకుడి విషయంలో 
ఇంత దర్సనం చేసాడు, గురుదక్షిణ కట్టాడు, గురువుగారి దగ్గర ఆశీర్వచనం పొందాడు. ధన్యుడు అయ్యాడు ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు , తపస్సు చేస్తున్నాడు. చేస్తున్నా అతడికి అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు తక్షకుడు, అప్పడు ప్రార్థన చేశాడు తక్షకుడి కోసం అది ప్రేమ చేత కాదు, లొంగ తీస్కోవటం కొరకు మనసులోంచి వచ్చిన ఒక రకమైన ప్రకోపం. అది పూర్తి పరిణితి వలన కాకపోయింది, దానివలన ఇప్పుడు అతనికి తక్షకుని మీద క్రోధం ఆవహించింది. నేను ఆనాడు పౌష్య మహారాజు దగ్గర నించి కుండలములను తెస్తుంటే, మద్యలో అతడు వాటిని అపహరించాడు, నాగ లోకానికి తీసుకుపోయాడు, నేను తర్వాత ఎంత కస్టపడి తెచ్చుకోవాల్సి వచ్చింది.  నన్నెంత బాధ పెట్టాడు. కాబట్టి తక్షకున్ని పాడుచెయ్యాలి. ఆ పని చెయ్యటానికి రెండు మార్గాలు ఉన్నాయ్ 
ఒకటి తానె పాడుచెయ్యవచ్చు తన తపస్సు చేత శాప వాక్కు ని విడిచి పెట్టడం నీకు ఈ కీడు జరుగుతుంది అని , కాని తానూ అలా చేస్తే తన తపస్సు క్షీణించి పోతుంది, ఆయన ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. 
క్రోదం లో వచ్చే ఆలోచనలు ఎలా అల్లుకుంటాయో  చుడండి. 
నిష్కారణం గా ఒక గురుదక్షిణ తెచుకుంటున్న వాడిని ని ఇబ్బంది పెట్టిన వాడిని ఎవరు శిక్షిoచాలి, రాజే. ఏ రాజు గురుదక్షిణ ఇవ్వటంలో సహకరించాడో ఆ రాజు ఇబ్బంది పెట్టిన వాడిని కూడా శిక్షించాలి. ఇప్పుడు నేనున్న ప్రాంతం జనమేజయుడి చేత పాలింప పడుతుంది , కాబట్టి నేను వెళ్లి జనమేజయుడికి ఫిర్యాదు చేస్తాను. ఇప్పుడు నా తపస్సు ఏమి పోదు కదా. ఇప్పుడు జనమేజయుడికి వెళ్లి ఫిర్యాదు చేస్తే రాజు తక్షకుడిని నాశనం చేస్తాడు.  ఒక్క తక్షకుడు మాత్రమే కాదు , తక్షకుడితో పాటుగా అటువంటి పాములన్నీ నాశనం అయిపోవాలి, అంత కక్ష ఎందుకు అంటే తాను ప్రార్ధన చేస్తే ఎవరూ కనపడలేదు గా . ఇటువంటి ఆలోచనలు వచ్చే ముందు ఒక్కొక్క సారి ఈశ్వర సంకల్పములు కూడా ఉంటాయి, అది ఆయా సందర్భం వచ్చినప్పుడు నేను మీకు వివరణ చేస్తాను. కాబట్టి ఇప్పుడు నేను జనమేజయుడి దగ్గరకి వెళ్లి ఆయన మనసు పాములన్నింటిని నాశనం చేసే విధంగా, ఆయన మనసులో ప్రచోదనం కలిగేట్టు మాట్లాడతాను అనుకున్నాడు. 
కోపంలో ఉన్నావాడు  వెంటనే మాట్లాడితే , నోటి నించి వచ్చే మాట అదుపు తప్పి ఉంటుంది, దానికి ఉచ్చ నీచములు ఉండవు.  మనసు ఇంకా అదుపు లో ఉంచుకుని మాట మాత్రమే వ్యగ్రత తో ఉంది తప్ప మనసు పూర్తి గా తమోగుణ రజో గుణము ల కు పూర్తి గా వశo అయిపో లేదు ఆయన అనటానికి గుర్తు ఏమిటంటే, దేనికి కోపం వచ్చిందో అదొక్కటే మాట్లాడుతాడు తప్ప నింద చెయ్యటం కాని నోటి వెంట పరుష వాక్యాలు విడిచి పెట్టడం కాని అలాంటివి రావు , అంటే అదుపులో ఉంది అని అర్థం. 
ఇప్పుడు ఆయన వెంటనే వెళ్లి జనమేజయుడికి విషయం అంతా చెప్పెశాడనుకోండి, అది ఏదో అతకని విధంగా తన కోపం అంతా వెల్లగక్కి నట్టు ఉంటుంది. కానీ అలా ఉండకూడదు ఇప్పుడు ఆయన కోపం వెళ్ళగక్కటం ప్రధానం కాదు. జనమేజయుడికి కోపం రావాలి తక్షకుడి మీద , తన కోపాన్ని జనమేజయుడి మనసులో పెట్టాలి. పెట్టి  నిజమే నేను తక్షకుడిని తక్షకుడి వంశాన్ని , నాగులని నాశనం చేసేట టు వంటి  బుద్ధి పుట్టాలి.  నేను వెళ్లి ఊరికే ఇలా చెప్తే ఏమయ్యా నీ మనసులో ఉన్న రాగద్వేషాలన్ని నాకు అంటించటానికి వచ్చావా  అందుకు నన్ను వాడుకోవటానికి  వచ్చావా అంటే అదొక అవమాన అవమానం. 
నేను మాట్లాడితే అలా కదయ్యా ఇలా జరిగిందేమో అని అనటానికి అవకాశం ఉండకూడదు అలా  రాజు మనసులో క్రోధం కలగాలి. కాబట్టి నేను ఎలా మాట్లాడితే ఆయన కి బుర్రకి ఎక్కుతుంది, ఇది బాగా సవధానం గా ప్రణాళికా నిర్మాణం చెయ్యటం. ఇది పైకి చూడటానికి అబ్బా ఎంత గొప్ప వ్యూహ రచన చేశాడంది అనిపిస్తుంది.  యదర్థమునకు  అవి జారుడు మెట్లు లాంటివి, ఆ జారుడు మెట్లు మీద ఉన్న వాడి జీవుడు జారిపోతాడు.  నిన్ను మోసం చేసినవాడు ఏ పాపాన్ని పొంది ఉన్నడో,మోసం చేసే వాడి పట్ల చేసే కుట్ర చేత నీవుకుడా అలాగే జారిపోతున్నావు.    ఇప్పుడు ఈశ్వరుడు శిక్ష వేస్తె ఇద్దరికీ సమానమైన శిక్ష వెయ్య వలసి ఉంటుంది.  నువ్వు చేసిన కర్మయే కాకుండా నీ మనసు లో ఇలా చేస్తే బాగుండు అన్న నీ మానసిక వికారానికి కూడా శిక్ష ఉంటుంది. 
క్రౌర్యము తో కూడిన ఆలోచనలు బ్రాహ్మణుడికి అసలు రాకూడదు. ఎందుకంటే ఆయన లోకానికి అంతటికి మార్గాన్ని చూపించ వలసి ఉంటుంది. వెంటనే ఉద్ధరించి అవతలవారిని సంస్కరించే టట్టు గా  ఉండాలి తప్ప, అవతల వారి ఆలోచనని ప్రోత్సహించ కూడదు. 
అటువంటి ఉదంకుడు ఇటువంటి క్రౌర్య ప్రణాళిక చెయ్య కూడదు.  ఆయన జారుడు మెట్ల మీద నిలబడ్డ వాడితో లెక్క.మీరు ఎప్పుడూ  ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీరు ఏ పని చేస్తున్నా నేను ఎప్పుడూ ఈశ్వరునకి జవాబుదారి అని  గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరుడు ఒక్కడు నా ఆలోచన సరళి ని గమనించ గలిగితే చాలు నాకు ఏ కితాబులు అవసరం లేదు. కృత యుగం లో ఉదంకుడి మనసులో వచ్చిన ఆలోచన కలి యుగం  వరకు నడిచింది. కృత యుగం లో ఆ నాడు కద్రువ ఇచ్చిన శాప ప్రభావం కలియుగం లో ఫలించడానికి ఈయన మాట కారణం అయ్యింది. అంటే దైవము యొక్క శాసనం అమలు కావటానికి ఇవాళ ఉదంకుడు కారణం అయ్యాడు.  రోజో  గుణ ప్రకోపం వలన ఇతను ని వాడుకోవలసి వచ్చింది , అదే రజో గుణ ప్రకోపం లేకపోతే ఇతను కారణం అయ్యేవాడు కాదు ,ఆ అపవాదు ఈయన పైన వచ్చేది కాదు. 
ఇప్పుడు ఆయన జనమేజయ మహారాజు దగ్గర కి వెళ్లి అంటున్నాడు, ఎంత గమ్మత్తు గా ఉంటదంటే మామూలు గా వెళ్లి మాట్లాడినా  అవతల వారి వలన ఒక ప్రయోజనాన్ని  సాధించు కోవాలని ప్రణాళిక వేసుకుని వచ్చిన ఆయన మాటలు చాలా పకడ్బందీ గా ఉంటై. కాబట్టి ఏమన్నాడంటే 
" మిత హిత సత్య వాఖ్యా " నువ్వు  చాలా  మితం గా మాట్లదేవడివి అన్నడనుకోండి ఎక్కువ మాటలు మాట్లాడుకుండా తను చెప్పింది ఒప్పెసుకుంటాడు అని అలా అన్నాడు. జనమేజయుడు తనాన్న మాటని వినేటట్టు ఆయన్ని సిద్దం చేస్తున్నాడు.
జనమేజయ నేను చాలా మంచివడినయ్యా నేను గురుదక్షిణ తేవటానికి వెళ్లి వస్తున్నాను , నేను పవిత్రమైన పని మీద ఉన్నాను అని తెలిసి కూడా, ఇది చెయ్య వలసిన పని, ఇది చెయ్యకూడని పని అని పూర్తిగా  మర్చిపోయి, పెద్దల పట్ల ఎలా ప్రవర్తిoచాలో పూర్తిగా విస్మరించి, కుటిల స్వభావుడై అవతల వారిని మోసం చెయ్యటమే తన ఆలోచన గా పెట్టుకున్న వాడై ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి నువ్వు శిక్ష వెయ్యాలి.
ఇప్పుడు రాజు మనసు ఎటువైపు వెళ్తుంది, ఆయన నిష్పాక్షపాతం గా ఆలోచన చేస్తాడు. పోన్లెండి జరిగింది ఏదో జరిగి పోయింది ,మీరు బ్రాహ్మణులు మీ మనసు వెన్నపూసలా ఉండాలి మీకంత కోపం ఉండకూడదు అని అన్నాడనుకోండి , ఈయన కోపం తీరదు.  రాజు మనసులో క్రుర్యం లేదు కాబట్టి పోన్లెండి అని వదిలేస్తే వదిలెయ్యొచ్చు లేదా తననుకున్నంత శిక్ష వేసి ఉండక పోవచ్చు.   ఆయన మనసు వ్యగ్రత  ఎలా ఉందంటే తక్షకుడు నశించాలి. తక్షకుడి తో సరిపోకూడదు , తక్షకుడి తో పాటు నాగులన్నీ నశించాలి. కాబట్టి ఇప్పుడు తనకి ఎంత కోపం ఉందొ అంత కోపం జనమేజయుడికి రావాలి. కాబట్టి ముందు  తనెందుకు వచ్చాడో తన గురించి చెప్పాడు. ఇప్పుడు ఇంకో మాట చెప్పాడు. ఆ తక్షకుడు నాకు మాత్రమే అపకారం  చెయ్య లేదు. మహానుభావుడు అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా దానం చేసిన వాడు నీ తండ్రి, భారత వంశాన్ని అంతటిని పెంచినవాడు, సకప్రజల ల యొక్క హితమును కోరి పరిపాలన చేసిన వాడు.  అర్జనుడితో సమానమైన వాడు. నీ తండ్రి పరిక్షిత్తు. పరిక్షిత్ మహారాజుని ఆ తక్షకుడు ఏమి చేసాడో తెలుసా ,భయంకరమైన తన యొక్క విషము అనే అగ్ని జ్వాలలకు చేత దహించి యమదర్మ రాజు సదననికి అతిదిగా పంపించాడు . లేకపోతే నీ తండ్రి ఇంకా ఎంత కాలం రాజ్యం చెయ్య వలసింది. నీ తండ్రిని ఆ తక్షకుడే పొట్టన పెట్టుకున్నాడు. ఈ మాట అనే  సరికి ఎంత కాదన్నా జనమేజయుడిలో తాను కోరిన స్పందన వస్తుంది.
తక్షకుడు ఎందుకు చంపాడు , ఒక బ్రాహ్మణ వక్కుకి చంపాడు. శృంగి అనబడే టటువంటి మహర్షి కుమారుడు ఒకడు శపించాడు. నేటికి ఏడవ రో జు  తక్షకుని యొక్క విషము చేత మరణిస్తావు అని శాప వాక్కు విడిచి పెట్టాడు. ఆ శాప వాక్కు నిజం అవ్వాలి కాబట్టి తక్షకుడు వచ్చి చంపాడు.
తక్షకుడు మీ నాన్న ని ఎందుకు చంపెశాడో తెలుసా, తక్షకుడికి మీ నాన్న గారికి ఏమి వైరం లేదు. ఎవరో ఒక బ్రాహ్మణుడు మారు పలక లేదని , మీ తండ్రి ఆయన మేడలో మృత సర్పాన్ని వేశాడు. తండ్రి మేడలో మృత సర్పం వేశాడన్న మాట కి నేటికి ఏడవరోజు నీవు తక్షకుడి చేత మరణిస్తావు అన్నాడు. అంటే ఇప్పుడు తక్ష్కుడికి రెండు మార్గాలు ఉన్నాయ్. శృంగి మాటకి చంపెయ్యటం , చంపకుండా ఉండటం. ఎందుకు చంపకుండా ఉండాలి మీ
నాన్న ఎంత గొప్ప వాడో ఇందాకే చెప్పను కదా. అర్జనుడితో సమానుడు , లోకమునంతతిని కూడా గొప్ప గా పరిపాలించిన వాడు. నిరంతరమూ పరమ భక్తితో యజ్ఞ యాగాది క్రతువులు చేసిన వాడు అటువంటి వాడిని ఒక బ్రాహ్మణుడు తక్షకుడు చంపుతాడు అన్నందుకు వెళ్లి చంపేశాడు తప్ప ఆ బ్రాహ్మణుడి దగ్గరకి వెళ్లి మద్యలో దొరికేది నేనా నీకు నేను చంపుతానని శాపవక్కు ఎందుకు విదిచిపెట్టావ్ ? నేనేనెందుకు చంపాలి పరిక్షిత్తు ని . పరిక్షిత్ లాంటి ప్రభువు శరీరం విడిచిపెడితే, ఈ లోకానికి మళ్ళి అంత ధర్మాత్ముడైన ప్రభువు ఎక్కడ ఉంటాడు? ఎందుకంత వాక్కు విదిచిపెట్టావ్ , నేను నీ మాట వినను , నేను కరవను, అలా కరవ కుండా ఉంటె నాకుకూడా శాప వాక్కు ఇస్తే ఇవ్వు , ధర్మ నిరతుడైన ప్రభువు కొరకు ప్రాణం ఇవ్వడానికైనా నేను సిద్దమే అని అనగలిగాడా ?తక్షకుడు.  తనలో ఉన్న క్రోదం ఏ స్థాయి లో ఉందొ అదే స్థాయిలో ఆయన లోకి కూడా పంపించేశాడు , ఇప్పుడు పరిష్కారం కూడా ఆయనే చెప్పేసాడు,   ప్రత్యేకించి ఇప్పుడు నేనేమి చెయ్యాలని జనమేజయుడు ఆలోచించకుండానే ఉదంకుడు పరిష్కారం కూడా చెప్పేసాడు. అతడు అన్నాడు, ఒక్క బ్రాహ్మణుని మాటకి తక్షకుడు మీ నాన్నని చంపేసాడు , నువ్వూ పదిమంది రుత్విక్కులని తీస్కోనివచ్చి , వారoదరు  కలిసి ఒక్కొక్క పాము పేరు చెప్పి స్వాహ అంటారు ఆ పాము పడిపోవాల్సిందే.  బ్రాహ్మణుడు చెప్పిన మాటకి తక్షకుడు మీ నాన్న ని చంపెయ్యవచ్చా , అదే బ్రాహ్మణుని మాటకి ఆ పాములు వచ్చి అగ్నిలో పడకూడద  ? మీకొక న్యాయం వారికొక న్యాయమునా ? వాళ్ళని వచ్చి పడిపోమ్మను, చిట్ట చివరికి తక్షకాయ స్వాహా అనమను ఆయన కూడా వచ్చి పడిపోతాడు అన్నాడు .  అప్పుడు పగ తీరుతుంది రాజా అన్నాడు.  తండ్రిని చంపిన వాడు అక్కడ హాయిగా తిరుగుతూ నాలాంటి బ్రహ్మ చరుల్ని ఇబ్బంది పెడుతుంటే నువ్వు ఇక్కడ చూస్తూ కుర్చుంటావా , కాబట్టి సర్ప యాగం చెయ్యి, రుత్విక్కులని పిలిపించు , పిలిపించి స్వాహా కరం తో పదగొట్టు పాములని అన్నాడు. ఇక్కడ రాజు ఒక మాట అనొచ్చు తక్షకాయ స్వాహా అని యాగం అన్నా చేయిస్తాను , లేకపోతే నేనే వెళ్లి తక్షకున్ని చంపుతాను. తక్షకుడు మా నాన్న ని చంపితే పాములన్నింటిని నేనెందుకు చంపటం అవేమి చేశాయి, అవేమి చంప లేదు గా మా నాన్న ని అవేమి ద్రోహం చెయ్యలెదుగ మా నాన్నని, నీకు వాళ్ళెవరు ద్రోహం చెయ్యలేదు కదా కాబట్టి తక్షకుడి జోలికి వెళ్తాను లే అన్నాడనుకోండి , తాని నాగలోకానికి వెళ్లి ప్రార్ధన చేసినప్పుడు వాళ్ళెవరు తనకి పలకలేదు అన్న కోపం ఎలా పోతుంది. అసలామాట రాకుండా  తాను  మాట్లాడాలి  అందుకే అన్నాడు ఏమి రాజా  పూర్వపు నీతి వినలేదా ఒక కులం లో ఒక దుర్మాగుడు   జన్మిస్తే మొత్తం కులం అంతా నాశనం అవుతుంది.  ఇంతటి దుర్మార్గుడు ,ధర్మాత్ముడైన పరిక్షిత్ నే చంపినటువంటి తక్షకుడు జన్మించిన కులం నశించిపోవద్దు. కాబట్టి ఆ పాములన్నీ పోవాల్సిందే . ఇవాళ తక్షకుడు రేపు నోట్లో  విషమున్న పాములు రేపు ఇంకొకళ్ళ జోలికి వేళ తాయి , కాబట్టి పమన్నది ఉండకూడదు. ఇలా ఉదంకుడు అంటే జనమేజయుడు ఒక్కమాట కూడా మాట్లాడినట్టు లేదు.  ఉత్తర క్షణము జనమేజయుడు నువ్వు చెప్పింది నిజమే నేను సర్ప యాగం చెయ్యాల్సిందే అని రుత్విక్కులని పిలిచి కూర్చోబెట్టి , మీరంతా సర్పయాగం చెయ్యండి . ఈ సర్ప యాగం చేత లోకంలో ఉండే నాగులన్ని కూడా ఈ అగ్నిహోత్రం లో పడిపోయి మరణించ వలసిందే అని సంకల్పం చేసేశాడు అంతే.
బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే చాలా కోపం వచ్చిన వ్యక్తి , చాలా కోపం లో ఏ ప్రణాళిక నిర్మాణం చెయ్యరాదు.
మహాభారతం లో ఏ ఒక్క విషయమైన   సమాజం లో ఏ కాలము నందైన ఏ ఒక్కరికైన అన్వయం కాదు అని చెప్పడానికి లేదు. నన్నయ్య గారు గుండెల మీద చెయ్యి వెస్కొని చెప్పారు.
ఇప్పుడు ఇదంతా వింటున్న వాళ్ళెవరు, నైమిశారణ్యం లో కూర్చున్న వాళ్ళు , వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. "అన్నన్నా ఎంత మాట అయ్యా జనమేజయుడు సర్పయాగం మొదలు పెట్టాడా ? అందులోకి వచ్చి పాములన్నీ రాలిపోతాయ , పాములన్నీ కాలిపోతయా ? అగ్నిహోత్రుడికి ఒక లక్షణం ఉంది , ఆయన హవ్యవాహనుడు,  ఏదైనా మంత్రం చెప్పి ఆయన లోకి బ్రాహ్మణులూ వేస్తే దేనికొరకు పుచ్చుకుంటాడు అంటే దేవతలకి పట్టుకెళ్ళటానికి పుచ్చుకుంటాడు. హవ్యం కానీ కవ్యం కానీ పిత్రుదేవతలకి ఇస్తే కవ్యం అంటారు, దేవతలకి ఇస్తే హవ్యం అంటారు. ఈ రెండిటిని వాళ్ళకి అందజేయ్య వయ్యా అంటే వాళ్ళకి  పట్టుకెళ్ళి ఇస్తాడు. అగ్నిహోత్రుడి ముఖంగా వెళ్తే అది ఎంగిలికాదు పవిత్రం అవుతుంది. మరిప్పుడు సర్పయాగం లోపడిన పాముల్ని ఎవరికీ పట్టుకెళ్ళి ఇవ్వటానికి , ఎవరికీ పట్టుకెళ్ళి ఇవ్వటానికి కాదు , ఏమి చెయ్యాలి , అగ్ని  కాల్చాలి , మరి అగ్ని హోత్రుడు తిరస్కరించడా ?
ఆయన ఎలా కాల్చాడు , జనమేజయుడు ఎలా చేసాడు? పోనీ ఈ జనమేజయుడు చేసిన సర్ప యాగం లో పాములన్నీ పడిపోతే పాములు ఉండకూడదు కదా , పాముల జాతి అంతరించి పోకుండా పాములు
ఉన్నాయి అంటే అన్ని పాములు పడలేదుగా కొన్ని పాములు ఉండి పోయాయి , కొన్ని పాములు ఉండిపోయాయి అంటే ఆ యాగం పూర్తి అవ్వలేదుగా, మద్యలో ఎక్కడో ఆగిపోయిoదన మాట , మరి అలా ఎలా ఆగిపోయింది యాగం? కోపం ఉన్న వాడు యాగం మొదలు పెడితే కోపం తీరేవరకు జరుగుతుంది.  మరి కోపం ఎలా తీరింది , పరిక్షిత్ బతికాడ లేదుకదా మరి ఎందుకు ఆగింది యాగం.  అయ్యా మాకు చాల ఆత్రుత గా ఉంది సుమా ఈ విషయాలన్నీ వినేయాలని, మాకు బాగా అర్థమయ్యే లాగా ఓ మహానుభావా సౌతి చెప్పు వింటాం అన్నారు వారంతా .
కాబట్టి ఆ సూతుని కుమారుడైన సౌతి (ఉగ్రశ్రవసుడు) అంతే అందంగా చెప్పటం మొదలు పెట్టాడు .
ఆయన భ్రుగు వంశం నించి మొదలు పెట్టాడు. ఆ భ్రుగువు ఆయన భార్య పులోమ వాళ్ళిద్దరూ ఆశ్రమం లో అన్యోన్యం గా జీవితం గడుపుతున్నారు. గృహస్తాశ్రమం లో జీవితం ఎలా ఉండాలో భ్రుగువు జీవితాన్ని అలా గడుపుతున్నాడు. గృహస్తాశ్రామము అన్న మాటకి అర్థం ఏమిటంటే నా భార్య ఇంట్లో నేను ఉంటున్నాను అని అర్థం అది ఎలా సంభవం అంటే , గృహము అంటే ఇల్లు , అప్పటివరకు తనకి ఇల్లు లేదు ఎందుకంటే గురువుగారి ఆశ్రమం లో కూర్చున్నాడు గురువుగారు చెప్పిన పాఠం వింటాడు , వేదాన్ని వల్లే వేస్తాడు , సంధ్యా వందనం చేస్తాడు, అగ్నిహోత్రంలో సమిధలు తీస్కోస్తాడు . గృహస్తాశ్రము నందు ఏమవుతుంది అంటే చాల నియమల్ని వదిలి పెట్టేస్తాడు. గృహము అంటే ఇల్లు , గృహస్తు అంటే ఇంటి యందు ఉన్న వాడు , ఎవరి ఇంటి యందు గృహిణి అంటే గృహము తనదిగా కలది. వ్యాపారం చేసి డబ్బు పట్టుకొచ్చాడు , ఆయన డి కాదు ఆవిడది. వేదాంతం లో ఆవిడదే ఆ డబ్బు . ఆవిడదైన ఐశ్వర్యం దగ్గరకి వెళ్లి ఈయన కూర్చున్నాడు ఆ ఇంట్లో . అందుకే ఆవిడ కుర్చోనిచ్చింది , అందుకే ఆడపిల్ల ఎప్పటికీ తండ్రిదే. ఆడపిల్ల గురించి మాట్లాడే అధికారం ఎప్పుడు తండ్రికి ఉంటుంది.  ఉభయ వంశాలని తరిమ్పచేస్తుంది. కాబట్టి అమ్మాయి ఇంట్లో అల్లుడు గారు ఉన్నారు తప్ప అల్లుడిగారి ఇంట్లో అమ్మాయి ఉంది అని వేదాంతం లో చెప్తే తప్పు అది. గృహస్తాశ్రామము అన్న మాటకి అర్ధం ఏమిటంటే ఆవిడ దైన ఇంట్లోకి ఈయన వెళ్తాడు.













  

No comments:

Post a Comment