Sunday, May 11, 2014

ఆదిపర్వము 4

మహాభారతానికి ఒక గమత్తు ఉంది, మొట్టమొదట ఒక కుక్క తో ప్రారంభం , చిట్ట చివర మళ్ళి ఒక కుక్క, మధ్యలో మహాభారతాన్ని ఒక మలుపు తిప్పింది ఒక కుక్కే, ఏకలవ్యుడు కుక్క నోట్లో ఐదు బాణాలు కొట్టి ఉండక పోతే భారతం ఒకలా ఉండేది, మహాభారతానికి కుక్క పాత్రకి అంత దగ్గర.  రామాయణం లో ఎప్పుడూ కుక్క మాంసం గురించి ప్రస్తావన వస్తుంది.  విశ్వామిత్రుడికి కి కోపం వస్తే చాలు  "కుక్క మాంసం తినే వాళ్లై బతకండి అంటూ ఉంటాడు .
కాబట్టి జనమేజయుడు యాగం దగ్గరకి ఒక కుక్క వచ్చింది. కుక్కకి ఒక లక్షణం  ఉంటుoది. కుక్క ఇంట్లో ఉండకూడదు అనడం లేదు, ఉండొచ్చు కానీ రాజద్వారం కనుక దాటి వచ్చింది అంటే, మీ ఇంట్లో ఉండే దేవతలు ఆ రోజు ఉపవాసం ఉండిపోతారు. దేవతలు ఉపవాసం ఉన్నటువంటి క్షోభ యజమా ని ని ఏప్పుడో అప్పుడు కట్టి కుడుపుతుంది. అది జాతక చక్రం చుస్తే తెలిసేది కాదు, ఆ ఉపాసన బలం ఉన్నవాళ్ళకి తెలుస్తుంది. 

ఎందుచేత అంటే శృంగ గిరికి పీఠాధిపత్యం చేసారు, చంద్రశేకరేంద్ర భారతీ స్వామివారు, ఆయన దగ్గరకి ఒక రోజు ఒకాయన వచ్చాడు, వెళ్లి  దిగులుగా కూర్చున్నాడు, ఆయన(చంద్రశేకరేంద్ర భారతీ స్వామివారు) మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమి అలా కూర్చున్నావ్ ? ఏమి చేస్తూ ఉంటావ్ అన్నారు ? "నేను రొజూ సాల గ్రామాల్ని ఆరాధన చేస్తూ ఉంటాను అన్నాడు " ఆయన అన్నారు "మీ ఇంట ఉన్న సాలగ్రామాలలో ఒకదాన్ని మీ నాన్న  గారు జీవించి ఉన్నoతకాలం, వేరుగా పూజ చేసి దానికి పెద్ద నైవేద్యం పెడుతూ ఉండేవారు, మీ నాన్న గారు శరీరం విడిచి 
పెట్టాక దానికి నువ్వు వేరు పూజ చేస్తున్నావా కొడుకు గా ? ఈయన ఏమి చెప్పలేదు ఆయనకి , అదే దివ్య ద్రుష్టి అని మనవి చేసేది.  ఆయన అన్నాడు "నిజామే మీరు ఎలా గ్రహించారో తెలీదు మా నాన్న గారు ఒక సాలగ్రామాన్ని ప్రత్యేకం గా పూజ చేసేవారు, వేరే వాటితో కలప కుండా , పూజ చేసి దానికి వేరే పెద్ద నైవేద్యం పెడుతూ ఉండేవారు.  మా నాన్న గారు చనిపోయి న తరువాత నేను ఆ సాలగ్రామాన్ని మిగత వాటిల్తో కలిపేశాను. అన్నిటికి కలిపి కాసిన్ని నీళ్ళు పోసేసి అన్నిటికి కలిపి నైవేద్యం పెడుతున్నాను. అప్పుడు చంద్రశేకరేంద్ర భారతీ స్వామివారు అన్నారు అందుకే నువ్వు బాధలో ఉన్నావ్ , ఆ సాలగ్రామం నృసింహ సాలగ్రామం అందుకే దాన్ని అన్నిటి తో కలిపి పూజ చెయ్యటానికి లేదు. దానికి వేరుగా పూజ చెయ్యాలి , దానికి వేరుగా  మహా నైవేద్యం  వేరుగా కొంచం  ఎక్కువగా పెట్టాలి, దాని యొక్క ఆకలి ఎక్కువ.  నువ్వు ఆ విధం గా చెయ్యక పోవటం వాల్ల , నీ ఇంట పూజా మందిరమున, నృసింహా సాలగ్రామం యొక్క వ్యధ నిన్ను కట్టి కుడుపుతుంది. అందుకు  నీ వ్యధ, ఇంటికి వెళ్లి నృసింహ సాలగ్రామం వేరుచేసి, వేరుగా పూజ చేసి వేరుగా నైవేద్యం పెట్టడం మొదలు పెట్టూ అన్నారు. ఆరధాన తెలిసి ఉండాలి . సరిగా ఉండాలి . విగ్రహం ఎంత ఉండాలో తెలిసి ఉండాలి . పెద్దలనడిగి పూజా మందిరం లో పెట్టుకోవాలి. ఇంట ఆకలితో ఉంటె ఎంత ప్రమాదం వస్తుందో. సీతమ్మ తల్లి ఏడుస్తూ కూర్చుంటే, ఆ కన్నీటి బిందువు భూమి మీద పడితే భూమి అంతా కాలి పోతుంది . ఆ కన్నీటి బిందువు కి కారణమైన రాక్షసులని నాశనం చేస్తుంది. ఆ కన్నీటి బిందువే అగ్ని హోత్రం గా తీస్కొని వెళ్లి పెట్టారు, ఆంజనేయ స్వామి , అంతే లంక కాలిపోయింది. ఒక్కొక్కరి బాధ , క్షోభ , కన్నీటి బిందువు కట్టి కుదిపెస్తాయి. ఒక్కొక్క దోషం జాతక చక్రానికి కూడా అందేది గా ఉండదు.  అటువంటి దోషాన్ని పట్ట గలిగిన వారు , మహాత్ములైన వారు మాత్రమే తమ అంతర్ ద్రుష్టి తో చూసి చెప్తారు. అది సాధ్యం అయ్యే పని కాదు అటువంటి మహాత్ములు అన్ని వేళలా  లభ్యమై మన గురించి మాట్లాడటానికి అవకాసం ఉన్దోచు ఉండక పొవచ్చు . కాబట్టి చేసే పని జాగ్రత్త గా చెయ్యాల్సి ఉంటుంది. 
కాబట్టి మహా భారతం లో ఒక కుక్క గురించి ప్రస్తావన చేసారు అంటే అంత తేలికగా మీరు స్వీకరించ కూడదు. కుక్క పరమ పవిత్రమైన ప్రాంగణం నందు ప్రవేసించ రాదు అది మీ పెంపుడు కుక్క అవ్వొచ్చు, మీరు భారతం వినడానికి రావొచ్చు , దానికి  వాకింగ్ అయిపోతుంది అని దాన్ని పట్టుకు గుళ్ళోకి  రాకూడదు. అది దోష భూయిష్టం, దాన్ని పట్టుకుని జనులు తిరగని చోటకి తీస్కుని వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఆ యజ్ఞ ప్రాంగణాని కి ఒక కుక్క వచ్చింది, అది దేవశూని , దేవతల కుక్క, కానీ కుక్క కుక్కే కదండీ, కాబట్టి యజ్ఞశాల  లో ప్రవేశం చేస్తుందేమో, యజ్ఞ భూమి యందు అది తిరుగాడితే, యజ్ఞ భూమి అపవిత్రం చేస్తుందేమో అన్న భావన చేత, ఈ జనమేజయుని తమ్ముళ్ళు, వాళ్ళు సాక్షాత్తు క్షత్రియులు రాజ కుమారులు, గొప్ప పరాక్రమము ఉన్నవారు శ్రుత సేనుడు , ఉగ్ర సేనుడు, భీమసేనుడు అని ముగ్గురి పేర్లు వెళ్ళు ముగ్గురు కలిసి ఆ దేవతల యొక్క ఆడ కుక్క సరమ అనే కుక్క యొక్క కొడుకు, ఒక చిన్ని మగ కుక్క పిల్ల సారమేయము దాని పేరు, దాన్ని కొట్టారు, ముగ్గురూ కలిసి కొట్టి తరిమారు. తరిమితే అది ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరకి వెళ్ళిపోయింది,అది ఆమెతో చెప్పింది "అమ్మ నేనేమి యజ్ఞ శాల లోకి వెళ్ళలేదమ్మా, ఏమిటి జరుగుతోంది అని అక్కడ ఇలా నిలబడి చూస్తున్నాను,జనమేజయుని ముగ్గరు తమ్ముళ్ళు వచ్చి నన్ను తరిమి తరిమి కొట్టారమ్మా నా వొళ్ళంతా హూనం అయిపొఇందమ్మా" అని ఏడ్చింది. ఇప్పుడు ఆ దేవశూని సరమ బయలు దేరి వచ్చింది, ఈలోగా యజ్ఞం పూర్తి అయిపొయింది, ఆయన కూర్చొని ఉన్నాడు జనమేజయుడు, ఆయన దగ్గర కి నేరుగా వెళ్లి "ఓ  క్షితినాధా ! ఓ భూమిని పరిపాలించే ప్రభువా , దయలేని వారై  నీతమ్ములు వివేకమునకు దూరంగా బతుకుతున్న వారు ఆలోచించక , నా కొడుకు చిన్ని కుక్క , అదేమీ దోషం చెయ్యలేదు అది ఎవ్వరిని  ముట్టుకోలేదు , దూరం నించి చూసింది అలా చుసిన కారణానికి , ముగ్గురు కలిసి నీ తముళ్ళు వెంటాడి వెంటాడి కొట్టారు అది దెబ్బలతో బాధ పడుతూ నా దగ్గరకి వచ్చింది.  రాజా నీకు ఒక విషయం చెప్పి వెల్లిపోదాం అని వచ్చాను, నీ తమ్ముళ్ళు కొట్టారని కాని , వాళ్ళని శిక్షించమని చెప్పను , కానీ ఒక్క మాట చెప్తా విను, ఈపని చెయ్యచ్చు ఈపని చెయ్య కూడదు అని మనస్సులో ఆలోచన చెయ్యకుండా భగవంతున్ని నమ్ముకుని బ్రతికే సాధులకు , బలహీనులైన వారి దగ్గర బలహీనులు కదా వాళ్ళేమి చేస్తారులే అని వాళ్ళ జోలికి వెళ్ళినా ఒక  ఫలితం ఉంటుంది రాజా అదేమితో తెలుసా కారణం లేని  భయం కలుగుతుంది. కారణమునకు దొరక కుండా వస్తుంది సుమా .ఇది గ్రహించుకో రాజా " అని వెళ్లిపోయింది కుంక. రాజు పురోహితున్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అన్నారు వ్యాస భగవానుడు , నన్నయ్య గారు. ఇది బాహ్యానికి చుస్తే అర్థం అయ్యీ అవ్వకుండా ఉన్నట్టు ఉంటుంది. దీనినే ఉత్కంఠ అంటారు.  అంటే ఏమైందో తెలుసుకోవాలని.  
మహాభారత ప్రారంభం లో వ్యాస భగవానుడు, నన్నయ్య గారు  ఒక మనుష్యేతర  పాత్ర ని ప్రవేశపెట్టారు.  ఉత్కంఠ కంఠo  ఇలా ఎత్తి చుసేట ట్టు గా మనలో ఒక రకమైన ఉత్సాహాన్ని , తెలుసుకోవాలి అనుకునే తతువంటి జిజ్ఞాస ని పెంచారు. ఎత్తిన కంఠo ఎప్పుడు దించాలని వాళ్ళ ఉద్దేశం అంటే 18 దో పర్వం ముగిసేవరకు, అప్పటికి నీకు ధర్మం మొత్తం తెలిసిపోతుంది.  తండ్రి తాపత్రయ పడ్డట్టు తాపత్రయ పడతారు ఋషులు , అందుకు మనం రుణ పడి పోయాం వాళ్ళకి.    ఇక్కడ  ఆoతర్యం ఏమిటంటే, కుక్క సాధు జంతువు, తనంత తాను మీద పడిపోయి కరిచేయ్యదు,యజమానిని నమ్ముతుంది , మీరు ప్రేమతో దాని దగ్గరకి వెళ్లి నిలబడితే, అది తోక ఊపి సంకేతిస్తుంది. లోకం లో కొన్ని  ప్రాణులు మీ మీద ప్రేమతో ఉన్నాయో లేదో తెలియదు, కానీ ప్రేమతో ఉన్నాయో లేదో తెలిసే జంతువులూ కొన్ని ఉన్నాయ్ అందులో కుక్క ఒకటి. దానిని తరమాలంటే చై అని ఒక అరుపు అరిస్తే పోతుంది. దానికొరకు ముగ్గురు రాకుమారులు  కోట్టాలటండి. ఇంతటి బలపరక్రమములు ఉన్న చంద్ర వంశం లో పాండవులకు వారసులుగా జన్మించిన వాలు , జనమేజయుని  సోదరులు ఒక కుక్క పిల్లని సిగ్గి లేకుండా తరుముతారా? ముగ్గురు రాజుల ఎదుట ఒక కుక్కపిల్ల ఎదురు నిన్చుంటుంది అని మీరు ఊహించ గలరా వెంటనే పారిపోతుంది.  ముగ్గురు రాజులు ఒక్కొక్కరు ఒక్కొక వైపు నించి, పారిపోవటాని కి కుడా  చోటు లేకుండా కొడుతుంటే , అది నన్ను వదిలిపెడితే బావుండు ,కుయ్యో కుయ్యో అని ఏడుస్తు పారిపోతే, ఏదో సాధించామని బహు సంతోషము తో యజ్ఞ శాల లో కూర్చున్న వాళ్ళని ఈశ్వరుడు ఎందుకు క్షత్రియుడిగా పుట్టించాడో ఆ బల పరక్రమలతో ఎవరిని రక్షించాలో తెలియక, ఎవరితో  యుద్దం  చెయ్యాలో  తెలియక అల్ప ప్రాణుల మీద పరాక్రమము చూపిన నీకు ఆ కుక్క ఎంత ఏడ్చిందో, ఆ ఏడుపు యొక్క ప్రతి ఫలం గా కారణం లేని ఆపద వస్తుంది. కారణం లేకుండా ఇంత బలం చుపించావ్ కాబట్టి. రాజా కట్టి కుడుపుతాయి, నీకు చెప్పే వాడు లేడు , నిన్ను ఎప్పటికప్పుడు దిద్దేవాడు వాడు లేడు , ఉంటె ఇలా జరిగి ఉండేది కాదు , ఇది ఆ కుక్క హృదయం.  అందుకని దెవశూని అల అన్నది.
ఈఘట్టం మహాభారతం లో ఆ నాటిది అని అనుకోకండి, మీరు సమాజం లో ఎప్పుడు ఎక్కడికి వెళ్లి నిలబడండి , ముగ్గురు మధ్య ఉంటారు. ఒకటి మీకన్నా తక్కువ వాళ్ళు , రెండు మీతో సమానులు , మూడు మీకన్నా అధికులు. నీకన్నా తక్కువారు కనబడితే కలియబడటం , అధికారుల దగ్గర నించి ఉంటుంది ఈ  స్థితి ఆ నాటి నించి ఈనాటి వరకు ఉంది. నీకన్నా బలహీనులు కనబడితే కలియబడకూడదు. నీతో సమానులు కనబడితే , వీడు వృద్ధి లోకి రావాలి అని కోరుకోవాలి. నీకన్నా అధికుడు కనపడితే ఈర్ష్య పడకూడదు, వారు ఎంత సాధన చేస్తే ఈ స్థితి కి వచ్చి ఉంటారో , వారిదగ్గర తెలుసుకుని నేను కూడా ఆ స్థితి ని పొందాలి అనుకోవాలి. పెద్ద వారిని చూసినప్పుడు వచ్చే అసుయ్యని పూజ్య భావన తో గెలవాలి. సమనుడి తో వచ్చే ఉదాసీనత ని వీడు ఇంకా వృద్ధి లోకి రావాలన్న ప్రేమతో గెలవాలి , నీకన్న తక్కువ  వా డి ని చూసినప్పుడు వాడుకుడా ఒకనాటికి ఈశ్వరుని అనుగ్రహం తో గొప్ప స్థితి ని పొందుతాడు, వాడిని గౌరవించడం చేత నేను ఈ స్థితి లో నిలబడ గలను తప్ప వాడిని అగౌరవ పరిస్తే నేను దిగజారి పోతాను అని తెలుసుకొని  ఉండాలి.   ఈ మూడు లేని  జీవితo అకారణం గా ఆపదల్ని తెచ్చి పెడుతుంది. అప్పుడు బాధ పడటం కన్నా నీజీవితన్ని దిద్దుకో, నీ ప్రవర్తన ని దిద్దుకో , నీ నడవడి దిద్దుకో , నువ్వు భూతముల (ప్రాణులు)పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్చుకో . నువ్వు భూతముల పట్ల ప్రేమతో , ముగ్గురి పట్ల ఎలా పరావతిo చాలో అల ప్రవతించడం నీకు వస్తే నీకు కారణం లేని ఆపదలు రావు. కారణం ఉన్న ఆపద అంటే, చేసిన కర్మకి ఫలితం ఉంటుంది. ఎప్పుడో తెలియక చేసావ్ ఫలితం ఉంటుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకుని నడుచుకున్తున్నావు కాబట్టి  పాము కరవ వలసిన వాడికి చీమ తో కరిపించి వదిలి  పెట్టేస్తాడు ఈశ్వరుడు. ఇప్పుడు వాడు మారాడు , భక్తి తో ఉన్నాడు కాబట్టి నేను చనకను అంటదు. నీ ప్రవర్తన మార కుండ నువ్వు ఈశ్వరుని మీద బిల్వ దళాలు వేసినంత మాత్రానా ఈశ్వరుడు నిన్నుకరుణిస్తాడు అని  అనుకోకూడ దు , ఆ బిల్వ దళాలు ఆయన  సృష్టి లోవే అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దానికి నీ ప్రజ్ఞ ఏమి లేదు, నీకు పుణ్యం ఇవ్వటానికి ఆయన నీ చేత ఇప్పించాడు అంతే. అందుకే బలవంతుడైన వాడు ఎవరిపట్ల ఆ బలాన్ని ప్రదర్శించాలి అంటే బలహీనులైన వారిని చనకుతున్న వాళ్ళని నిగ్రహించడానికి ఉపయోగించాలి తప్ప ,బలహీనులని చండాడటానికి ఉపయోగించ కూడదు. నీకు జీర్ణమయ్యే శక్తి ఉందికదా అని అదేపనిగా తినకూడదు , నీ శరీరానికి ఎంత కావాలో అంతే పుచ్చుకోవాలి . నీకు  నోరు ఉంది కదా అని ఏది  పడితే  అది మాట్లాడ కూడదు, ఏది వేదం ని సమర్థిస్తుందో అదే మాట్లాడాలి.
కాబట్టి "జనమేజయ తగినంత కారణం లేకుండా నీ బలాన్ని ఉపయోగించావు కాబట్టి కారణం లేని ఆపద వచ్ఛి పడుతుంది , నీవు గుండెలు బాదుకుంటావు.  నేను కాదు కదా చేసింది అనుకుంటున్నా వేమొ , "క్షితినాధ" నీ రాజ్యం ఎవరు చేసినా నీ మీదకే వస్తుంది. నీకు ఈ వ్యవస్థ ని చక్క దిద్ద వలసిన పూచి నీ మీద ఉంది , చంద్ర వంశం లో పుట్టావు ధర్మత్ముడివి నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్తున్నాను , నేను ఊరుకోవచ్చు కానీ ఆపద వస్తుంది , ఇంకా ఇంకా ఇలాంటి తప్పులు జరగకుండా నాలుగు మంచి మాటలు చెప్తే , మంచి వాడవైతే వింటావు , విని మార్చుకునే సంస్కార బలం నీకు లేకపోతే , అహంకారం అడ్డు వచ్చి తిరగాబడతావు. అది నీ పతనానికి హేతువు  అవుతుంది కాబట్టి నువ్వు ఏమి చేస్తావో నీ   ఇష్టం, నీ సంస్కారానికి వదిలేస్తున్నాను అంది .
పైకి చెప్పకుండా పూర్తి చేసి ,ఇంత చిన్న పద్యాన్ని మాత్రమే చెప్పి , ఇంత చిన్న పద్యాన్ని అనగా  ఒక గొప్ప సూక్తిని,
అది ఆ నాటి జనమేజయుడికే కాక ఆ నాటి నుండి ఈ నాటి వరకు సనా త న ధర్మం లో ఉన్న మనందరికీ కుడా హితమును చెప్పటమే, అందుకే మహాభారతం లో చెప్పని ధర్మం లేదు. భూత కారుణ్యము కన్నా ధర్మం ఈలోకం లో లేదు, అందుకే మొట్ట మొదట మహాభారతం మొదలు పెడుతూ ఈ భూతకారుణ్యం కి సంబంధించిన  ఘట్టం తో ప్రారంభం చేసారు.
 జనమేజయుడు పురోహితుణ్ని అన్వేషిస్తూ  బయలుదేరాడు, పురోహితుడు అన్న పదమునకు అర్థం ఏమిటంటే, పురము యొక్క హితం కోరే వాడు. రాజు ప్రజా సంక్షేమాన్ని కోరి తన భుజ బలం తో రాజ్యాన్ని రక్షిస్తాడు. పురోహితుడు రాజు , రాజుని ఆశ్రయించిన వాళ్ళు తప్పులు చెయ్యకుండా, ఆ తప్పుల రరూపం లో రాజుకి ఆపద , ప్రజలకి ఆపద రాకుండా ఎప్పటికప్పుడు రాజు యొక్క నడవడిని పరిశీలించి, ఎప్పటికప్పుడు కారణం చెప్తూ , మర్పులుచేపుతూ , జరగరాని దోషం జరిగితే, రాజు వరకు కూడా తేకుండా , ప్రాయశ్చిత్త కర్మలు ఆచరించి , తానూ గొప్ప   భక్తు డై  నిరంతరం ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ అగ్ని హోత్రం లో హవిస్సులు ఇస్తూ , హోమ కార్యం చేస్తూ పురం యొక్క హితము కొరకు తన తపస్సుని ధర పోసి , ఆ అక్షతలు పట్టుకువచ్చి "లోకా సమస్తా సుఖినోభవంతు "అంటూ సింహాసనం మీద కూర్చున్న రాజు మీద వేసి వెళ్తూ ఉంటాడు. అటువంటి పురోహితుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ రాజు వలన  తెలిసి కానీ తెలియక కాని చిన్న చిన్న అపరాధములు జరిగినా అవి సద్దుకుని విజయం కలుగుతుంది . అది పురోహితుని గొప్పతనం.
నేను యజ్ఞ శాల లో కూర్చున్నాను , ఇలా జరిగింది , సరమ వచ్చి చెప్పేదాకా నాకు తెలియదు, ఇలాంటివి జరగ కూడదు అంటే , నా చాటున కూడా , సరియైన మాటలు చెప్పే ఒక పురోహితుడు కావలి. ఇప్పుడు పురోహితున్ని వెత్తు కో వటా నికి , ఏ మంత్రి నో పిలిచి పురోహితుణ్ణి  చుడండి అనలేదు. తానూ బయలుదేరాడు. తనకి అత్యంత ముఖ్యమైన విషయం లో వ్యక్తిగత శ్రద్ద పెట్టాలి , పెట్టి తాను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈశ్వరుని పల్లకి పట్టుకున్నపుడు పదిమందినీ పిలవాలి . నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు మాత్రమే అన్నం తినాలి. ఆకలి వేసినప్పుడు అన్న తినడం ఎంత ముఖ్యమో నీ ఇంటి పురోహితున్ని ఎంచుకునే తప్పుడు నువ్వు శ్రద్ధ పెట్టటం అంత ముఖ్యం. కొన్ని కొన్ని విషయాలలో నువ్వు వ్యక్తి గతమైన శ్రద్ధ పెట్టక పోతే ఆ విషయానికి అర్థమే ఉండదు. తన తండ్రి శరీరం విడిచి పెట్టేస్తే శ్రాద్ధం తానే పెట్టాలి దానికి కి కూడా వరుడు ఇచ్చేస్తాను అనకూడదు.  కాబట్టి  భారతం నించి మనం ఏమి నేర్చుకుంటున్నాము అంటే అన్నిపనులు అస్తమానం అందరికి అప్ప చెప్పేవి కావు ,  కొన్ని మనం చెయ్యాల్సినవి మనం చేస్కోవాలి.
కనుక జనమేజయుడే పురోహితున్ని వరించడానికి బయలు దేరాడు. ఒక నదీ తీరం దగ్గర కి   వెళ్లి చూస్తున్నాడు. ఎందుకు వెళ్ళాలి నదీ తీరం దగ్గరకి అంటే , ఎక్కడ నది ఉన్నదో ఆ నదీతీరం దగ్గర పర్ణ శాల లు వేస్కుని ఉంటారు, ఎందుకని అంటే మూడు సంధ్యల లో ఆ పవిత్ర నదిలో స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకుని ఉంటారు. నీరు ఎక్కడ  ఉంటుందో అక్కడే  ధర్మ  కార్యాచరణ సాధ్యం అవుతుంది. అందుకే బాలకాండ లో రాముడు విశ్వామిత్రుడి తో కలిసి వెళ్తే , గురువర్యా ఇక్కడ నది ప్రవహిస్తుంది , మీరు ఇక్కడ ఉండండి అంటాడు. కాబట్టి నదీ  తీరం లో ఉంటారు అనుష్టానం తెలిసున్న వాళ్ళు . వాళ్ళ మనసులు పరిపక్వమై , వాళ్ళు చేసిన సత్కర్మల చేత రాజుని రాజ్యాన్ని మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు.  ఎందుకని కోరుకుంటారు అంటే, ఒక్కొకరికి ఒక్కొక్క లక్షణం క్షత్రియుడు మంచం మీద చచ్చి పోకూడదు భూమి మీద చచ్చి పోకూడదు అన్నది శాస్త్రం. ఆయన యుద్ద భూమి లో చనిపోయిన నాడే ఆయన జన్మ కు సార్ధకత అంది , ఆయన  మాంసం  తినొచ్చు, ఎందుకు తినొచ్చు , ఆయనకీ బలం ఉండాలి, నేను భారతం కాలం నాటి విశేషాలని వివరణ చేస్తున్నాను. నేను అల యుద్దాలు ఇప్పుడు చెయ్యమని చెప్పట్లేదు. మాంసం తిను దోషం లేదు. రామచంద్ర మూర్తి తిన్నారు, ఎందుకు తిన్నారు , బలంగా ఉండాలి , ఇప్పుడు ఈ బలం ఎందుకు ఉపయోగించాలి , బలహినున్ని చనకుతున్న బలవంతుణ్ణి    ని గ్రహించటానికి ఉపయోగ పడాలి. పురోహితులు ఎప్పుడూ ఏమి కోరుకుంటూ ఉంటారు అంటే బలవంతుడై , ధర్మాత్ముడై , యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ప్రజలని రక్షించాలని కోరుకునే రాజు పది కాలాలు బతికి ఉండాలని కోరుకుంటారు.
కాబట్టి అయ్యా తెలిసో తెలియకో అపచారములు జరుగుతున్నవి కనుక మీరు వచ్చి మాకు మంచి చెడులు చెప్పవలసింది అని అడిగినప్పుడు రాగలిగిన హృదయ సంస్కార బలం కలిగిన వాడు అక్కడ ఉంటాడు అని వెతుక్కోవాలి.  ఎక్కడ ఏది వెతుక్కోవలో అది వెతుక్కోవాలి. ఒక వస్తువు కోసం వేరొక చోట వెతుక్కో కూడదు కదా. కాబట్టి నది వొడ్డుకి వెళ్ళాడు. అంటే ఏ మహాత్ములు ఉండేచోట ఎక్కడ ఎలా ప్రవర్తించాలో , ఎక్కడ వెతుక్కోవలో , ఎలా మాట్లాడాలో ,  దేని వలన నీవు అభ్యున్నతిని పొందుతావో , నీకు దొరికే వస్తువు నీ జన్మని ఎలా తరిమ్పచేస్తుందో ఒక్కొక్క నాడు మహా భారతం మీకు వివరణ చేస్తుంది. నాకు వివరణ చేస్తుంది.



ఆయన అక్కడ ఉండేటటువంటి మునిపల్లె అంటే అక్కడ ఎవ్వరు కూడా సౌకర్యముల తో కూడిన ప్రాంగణము లు కట్టుకున్న వారు ఉండరు , రక్షణ వ్యవస్థ ధీటుగా ఏర్పాటు చేసిన వి ఉండవు, రాతి తో చేసిన నిర్మాణములు కాని , మట్టిని కాల్చి చేసిన నిర్మాణములు కాని వాళ్ళకి ఉండవు. పల్లెటూరు అన్న చోట చుడండి అన్ని పాకలు పందిళ్ళే ఉంటాయి. వైదికము గా  ఉంటాయి అన్ని. సనాతన ధర్మం లో మట్టిని కాల్చటం దోషం , కాల్చిన మట్టితో చేసిన ఇంటిలో ఉండడం అంతకన్నా దోషం . అందుకే పూర్వం అందరు ఏమి చేసేవాళ్ళంటే వెదురు బద్దలు నాటి పచ్చి మట్టిని కలిపి, ఆ పచ్చి మట్టిని మెత్తి గోడలుగా చేస్కొని , ఇప్పుడు పిట్ట  గోడ  లంత  ఎత్తు కట్టుకుని, దాని లోపలకి తొంగి చుస్తే ఏమి ఉండవు ఎత్తుకు పోవటానికి , ఆయన బాగా వేదం చేప్పిన చోట ఇచ్చిన పెద్ద అంచు పంచ ఒకటి ఆరేసుకుని మురిసిపోతుంటాడు, ఆయన దగ్గర కుడా ఎత్తుకుపోవటానికి   ఒకడు వచ్చాడనుకోండి. దొంగ రూపం లో ఈశ్వరుడు వచ్చాడని మురిసిపోతాడు. కాబట్టి ఆయనకి పెద్దగా రక్షణ వ్యవస్థ అక్కర్లేదు. దండెం మడిబట్ట , పెరట్లో నది , ఇంట్లో వెదురుతో చెయ్యబడిన పూజ మందిరం దాని మీద ఈశ్వరుడు. ఆయనకి నాలుగు కుండలు వాటిలో నీళ్ళు , ఒక ఆవు దాని పాలు, పెరుగు, నెయ్యి. అరణ్యం లో ఉండేవాళ్ళు పంతులు గారు అభిషేకం చేస్కొండి అని తీస్కొచ్చి ఇచ్చిన తేనే.  దొరికిన రెండు పళ్ళు . గుండె నిండా ఈశ్వరుడు. వాళ్ళు సంతోషం గా  పిట్ట గోడ అంత ఎత్తు మట్టి , దాని మీద వెదురు కర్రలు  పైన ఆకులతో అచ్చాదన, చుట్టూ దేవుని యొక్క మూర్తులు , అదంతా చక్కగా సున్నంతో పెట్టిన ముగ్గులు, ఇంటి ముందంతా ముగ్గులు , చుట్టూ కట్టిన తోరణాలు , ఎంత అందంగా ఉందొ వింటుంటే మనము అల ఉంటె బావుండు అనిపిస్తుంది. మునిపల్లె అంటే వారు    అటువంటి వైదిక జీవనం ఉన్న వారు. అనుస్టాపర్యంతం ధర్మము నందు ఉండే వారు. రాజు యొక్క హితము కొరకు తన యొక్క మoత్ర శక్తిని ధారా పొయ్య కలిగిన వాడు, పురము ఒక్క హితమును కోరువాడు అయిన వాడిని అక్కడ జనమేజయుడు వెతుకుతున్నాడు. వెతకగా వెతకగా శ్రుత స్రవాసుడు అనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయనకి లభించాడు. ఆయన కుమారుడు ఉన్నాడు , ఆయన పేరు సోమస్స్రవసుడు, కుమారుడు దిట్ట గొప్ప బలం ఉన్న వాడు , మంచి తపస్వి, తండ్రి కాదని కాదు , తండ్రికన్నా గొప్ప వాడు. తండ్రి ఎప్పుడూ కోరుకునేదేంటి అంటే , కొడుకు చేతిలో ఓడిపోవాలని , నాన్న గారికి తెలిసిన వైదిక ధర్మం కన్నా ధర్మం తెలియడం . అటువంటి కొడుకుని కాని మురిసిపోతున్న వాడు లోక హితము కొరకు దానం చేయు వాడు అటువంటి హృదయం ఉన్న వాడు. ఇప్పుడు తండ్రి దగ్గరకి వెళ్లి అడగాలి . నీవు ఏదైనా పెద్దగా మాట్లాడిన చిన్నగా మాట్లాడినా పెద్దల దగ్గర మాట్లాడాలి , పిల్లల జోలికి వెళ్ళకూడదు.
రామచంద్ర మూర్తి శివ ధనుస్సు భంగం చేసేయ్యగానే , జనకుడు నీళ్ళు పట్టుకుని వచ్చేసాడు, కన్యాదానం చేసేస్తాను అయ్యా శివ ధనుస్సు భంగం చేసేసావ్ కదా అన్నాడు. అంటే రాముడు అన్నాడు నేను క్షత్రియున్ని కాబట్టి శివ ధనుర్భంగం చేశాను, నువ్వు పిల్లని ఇస్తానంటే పుచేస్కోవటానికి నేను శివధనుర్భంగం చెయ్యలేదు, నువ్వు పిల్లని ఇస్తే ఏమవుతుంది నాకు పత్ని అవుతుంది. నాకు పత్నిగా నిర్ణయం చెయ్యవలసింది నేను కాదు నువ్వు కాదు, నాకు పత్నిగా ఎవరు ఉండాలో నిర్ణయించ వలసిన వాడు నా తండ్రి దశరధ మహారాజు , నేను ఇక్కడ ఉంటాను , మా నాన్న గారికి కబురు పంపించు , మా నాన్న గారికి చెప్పు నీ వంశం గురించి , ఆయనకి సంతోషం కలిగితే వస్తారు, వచ్చి స్నాతకం చేసి రామా స్వీకరించు సీత ని పత్నిగా అంటారు , మా నాన్న గారు అన్నారా పాణిగ్రహణం చేస్తాను. మీరందరూ చెప్పి మా నాన్న గారు అనలేదా నేను స్వీకరించను వదిలేస్తాను . నన్ను చది వించిన వాడు నాకు విద్యా బుద్దులు నేర్పినవాడు , విశ్వామిత్రుడు వచ్చి అడిగితే ఏడ్చిన వాడు,నామీద ఇంత ప్రేమ కలిగిన వాడు , నాకు ఎవరు భార్య గా వస్తే నేను సంతోషిస్తానో తెలియని వాడా ? నేనెందుకు స్వతంత్రించాలి , ఇవ్వడానికి నువ్వు ఎవరు పుచ్చుకోవటానికి నేను ఎవరు , మా నాన్నకి కబురుచేయ్ మా నాన్న చెప్తే నేను పుచ్చుకుంటాను అన్నాడు. ఎక్కడి ధర్మం అక్కడే.
కాబట్టి ఇప్పుడు జనమేజయుడు ఆ పిల్లవాని దగ్గరికి వెళ్లి నువ్వు నాకు పురోహితుడిగా రా అని అనకూడదు. తండ్రి గారిని వెళ్లి అడగాలి అయ్యా మీ అబ్బాయిని మా ఇంటికి పురోహితుడిగా పంపండి అని. ఎంత ధర్మమో చుడండి , ఎంత గొప్పగా ఉంటుందో చుడండి . కాబట్టి ఇప్పుడు జనమేజయుడు వెళ్లి సృత్స్రవసున్ని
" యమనియములు అనే గొప్ప అష్టాo గ  యోగములు తెలిసున్న వాడు , ఇంద్రియములను నిగ్రహించినటు వంటి వాడు , అపారమైన తపసంపత్తి కలిగిన వాడు పరమ నైస్టి కములైన జీవితము గడుపుతున్న వాడు . నియమములను పాటించు వాడు, నిత్య  నైమిక్తిక  కర్మలను నెరవేర్చేవాడు, వేద ప్రమాణములను పూర్తిగా నమ్మిన వాడు , భగవత్భక్తి కలిగిన వాడు, నిరంతరమూ జప హోమములను చేసేటటు వంటి వాడు ,అటువంటి మీ కుమారుడు మాకు పురోహితుడు గా వస్తే నా వంశం నిలబడుతుంది, నాకు రక్షణ కలుగుతుంది , నాకు రక్షణ కలిగితే నేను లోకానికి రక్షణ కల్పించ గలుగుతాను,కాబట్టి నాకు రక్షణ ఇవ్వగల్గిన వాడు నీ కొడుకు " ఇది విశ్వాసం అంటే , ఇది మాత్రం మీద నమ్మకం అంటే , ఇది వేదం మీద నమ్మకం అంటే "కాబట్టి నాకు నీ కొడుకుని కరుణిచి అనుగ్రహించ వలసినది" ఈలోకం లో ఏదైనా ఇస్తారు కన్న కొడుకుని "ఎవ్వరిస్తారు . "కాబట్టి నా మీద  దయతో ప్రేమతో నీ పుత్రుణ్ణి ఇవ్వవయ్య అని అడిగాడు . ఆయన చాలా  సంతోషించి , ఇది త్యాగం అన్న మాటకి అర్థం . నా కొడుకు యొక్క తపస్సు , నాకొడుకు యొక్క హోమం ,జపం నిజంగా నీ అభ్యున్నతికి ఈరాజ్యం రక్షణ కి పనికి వస్తే ఇంతకన్నా ఏమి కావలి ఇది  నోటితో అనక్కర్లేదు ఇది  సృత్స్రవసు ని యొక్క భావన . ఆయన  వెంటనే కుమారుణ్ణి పిలిచి నాయన ఇదిగో జనమేజయ మహారాజుతో బయలుదేరు, ఆయనకి పురోహితుడిగా ఉంది రాజుని రాజ్యాన్ని కూడా కాపాడు నీయొక్క వైదికమైన అనుష్టానం తో రక్షించుఅని జనమేజయునితో పురోహితునిగా పంపించాడు. పురోహితునితో కూడిన జనమేజయుడు సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. 


No comments:

Post a Comment