Sunday, September 28, 2014

ఆదిపర్వం 17

అసలు యాగము అంటూ చేస్తే రెండు ప్రజనములు కొరకు చేస్తారు
ఒకటి ,యజమాని ఉండి  , ఏదో ప్రయోజనం కొరకు చేస్తే ఇహము , ఇక్కడ ప్రయోజనం నెరవేరుతుంది.
రెండు , ఇక్కడ ప్రయోజనం కొరకు కాదు అని చేస్తే ఊర్ధ్వ లోకాలలో నివసించ గల గొప్ప శక్తిని యాగము కృప చేస్తుంది. ఈ రెండూ కాదు లోక శాంతి అసలు భారత ప్రారంభం లో జనమేజయుడు అటువంటి యాగం తో ప్రారంభం భారతం.
ఇప్పుడు జనమేజయుడు చేసే  యాగం ఈ మూడిటి లో ఇందులోకి వస్తుంది, ఈ మూడి టి లో ఎందులోకి రాదు , ఇహము లేదు, పరము లేదు, లోకోపకారము లేదు , మిగిలనిది ఏమిటి అయ్యింది కక్ష, కక్ష కొరకు యాగము చెయొచ్చా , ఇన్ని చేసాడు, అంతటి అనుభవం ఏమైనట్టు ? ఇన్ని చేశాను అంటున్నావ్ , ఇంతమంది బ్రాహ్మణుల్ని ఆదరించాను అంటున్నావ్ , ఇన్ని యజ్ఞాలు చేసావు, ఇంత పరిపాలన చేసావు, తుట్ట తుదకు నీ మనసు యొక్క వ్యగ్రత కి లొంగిపోయావు , లొంగిపోయి ఆ యాగం దేని కొరకు చేస్తున్నావ్ అంటే ఎప్పుడో మీ నాన్న ని కరిచినటువంటి ఒక పాము యొక్క ఉద్దతి ని మనసులో స్మరణ చేసి, మొత్తం పాముల్ని చంపటానికి యాగం చేస్తున్నావ్. పోనీ అదైనా నీంతట నీకు కలిగిన సంకల్పమా , ఉదంకుడు వచ్చి ప్రచోదనం చేసాడు అటువంటి యాగం చెయ్యమని. ఉదంకుడు ఎందుకు చెయ్యాలి ఆయన కోపం ఆయన కి ఉంది.

తక్షకుడు ఎప్పుడో ఆ ఉదంకుడికి అడ్డం వచ్చాడు. గురు పత్నియొక్క యొక్క కోరికమేరకు , మహారాజు పౌష్యుని యొక్క భార్య కుండలములను తెస్తుంటే ఆయన అపహరించి తీస్కెళ్ళి ఇబ్బంది పెట్టాడు అని ,భూత దయ లేకుండా చేసే యాగం ఏ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆపుచేసేయి అన్నాడు అస్తీకుడు. చాలా గొప్ప విషయం ఏమిటంటే లోకంలో తనకి తట్టక పోయిన పెద్దలు చెప్పినప్పుడు వినగలగడం. ఇదొక్కటి ఉండటం చంద్ర వంశం లో పాండవుల ఆస్తి, వాళ్లకి తట్టక పోవచ్చు కానీ కృష్ణుడు చెప్తే వింటారు పాండవులు, అలా జనమేజయుడు విన్నాడు, విని ఉత్తర క్షణం లో యాగాన్ని ఆపు చేసేయండి అన్నాడు.

ఇప్పుడు యాగo ఆపుచేసిన తరువాత అది ఒక సంఘటన గా జనమేజయుడు విడిచి పెట్టి ఉంటె , వైశంపా యనుడు భారతం చెప్పడు. ఇక్కడ జనమేజయుడు ఒక్క సారి విచారణా స్థితి కి వెళ్ళాడు. అసలు నేను ఎందుకు చేశాను ఈ యాగం, నిజమే అస్తీకుడు చెప్పిన దాంట్లో నిజం ఉంది. కేవలం కక్ష తో చేశాను. ఈ కక్ష కి కారణం పోనీ తక్షకుడు నాకేమైనా అపకారం చేసాడా అంటే లేదు.

మా నాన్న గారిని మట్టుపెట్టాడని ఇప్పడు నేను యజ్ఞం చేసి, కొన్ని వేల లక్షల సర్పములనె కాల్చేసాను. మనిషి మనసులోకి కక్ష అన్నది ప్రేవేసిస్తే , అంతకుముందు విన్నవి, అంతకు ముందు నేర్చుకున్నవి, ఎంత తేలికగా కొట్టుకుపోయాయో కదా ,ఇంకో ఆలోచన లేకుండా యాగం చేసేసాను.

నాకు ఎవరూ అలా యాగం చెయ్యొద్దు అని చెప్పలేదు. ఆస్తీకుడు చెప్పగానే ఆపేసాను. కానీ నాకన్నా ముందు పుట్టి ఈ రాజ్యాన్ని పరిపాలించిన , పాండవులు కౌరవులు నాకు తండ్రులు, వాళ్ళకి చెప్పటానికి పరమ ధర్మ మూర్తి అయిన వ్యాసుడు ఉన్నాడు. సాక్షాత్తు ఆత్మ బంధువు, ఆ వ్యాస స్పర్స లేకుండా బిడ్డలు పుట్టలేదు. కాబట్టి ఆయన వంశ కర్త అయ్యి ఉన్నాడు. పెద్దరికం వహించి చెప్పటానికి భీష్ముడు ఉన్నాడు. అడగకుండా నే చెప్తాడు భీష్ముడు, మహా పురుషుడు ఆచార్యుడు ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు ఇంత మంది ఉండీ  మరి ఎవరు చెప్పింది వినకపోవటం చేత అంత పెద్ద యుద్ధం (కురుక్షేత్రం )జరిగింది ? వాళ్ళు కూడా ఎక్కడో మాట వినకుండా ఉండటం వలన ఇది జరిగింది. కాబట్టి వ్యాసుడు ఉండగా ఇది ఎలా జరిగింది అసలు ?

ఎవరు మాట వినపోవటం వల్ల జరిగింది. మాట వినకపోవటం కేవలం స్వభావ రిత్యా వినకపోవటం జరిగిందా ? అంత కన్నా ఇంకా వెనకాతల కారణం ఏమైనాఉందా ? ఒక వ్యక్తి స్వభావ రీత్యా మాట వినక పోయి ఉంటె , ఇంత మంది మహాత్ములు ఉన్న చోట ఆ ఒక్కడే పోయి ఉండాలి. అలా పోలేదు.

ఇనుప రజను మొత్తము ఐస్కాంతం ఆకర్షించి నట్టు , దుష్ట శక్తుల ను అన్నింటినీ దుర్యోధనుడు ఆకర్షించాడు. దేవతలు అందరు ఈశ్వరుని ముందు నించున్నట్టు దేవత శక్తులందు ఆవిర్భవించిన వాళ్ళు అందరూ పాండవుల వైపుకి  వెళ్లారు. మరి వాళ్లైన మాట విని ఉండాలి కదా? మరి పాండవులు ఎందుకు వినలేదు , వీళ్ళిద్దరికీ యుద్ధం ఎందుకు జరిగింది అసలు కురుక్షేత్రం లో ?

ఆస్తీకుడు చెప్పగా నే నేను విని యజ్ఞం ఆపినట్టు, వాళ్ళు కుడా వ్యాసుడి మాటొ , భీష్ముడి మాటో , విదురుడి మాటో అంత మంది మహానుభావులు ఉన్నారు ఆ సభలో , ఎక్కడ నించో తెచుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ నా అదృష్టం కొద్ది ఇక్కడ సభలో వ్యాసుడు ఉన్నాడు అడగటానికి. వాళ్ళు ఎప్పుడూ ధర్మం మాట్లాడుతూ నే ఉండాలి.
ఎక్కడ వచ్చింది దోషం. ఎక్కడ మాట వినకపోవటం అన్నది వచ్చింది. ఎవరెవరు మంచి మాటలు చెప్పారు , ఎవరెరు వినలేదు, ఎవరెవరు ఏ ఏ స్వభావముల చేత ,ఏ ఏ కరణముల చేత ఇంత భారత యుద్ధం జరగ వలసి వచ్చింది.
ఈ సంఘర్షణ లో ఏవో చాలా గొప్ప గొప్ప విషయాలే ఉంది ఉంటాయి.

ఇప్పడు కధ ని కధ గా చెప్పేవాడు కాదు కావాల్సింది , కధ లో ఉన్న ధర్మ సుక్ష్మముల తో చెప్పే వాడు కావలి.
అదృష్టం ఏంటంటే ,వ్యాసుడు ఉన్నాడు సభలో , యజ్ఞ పరీక్షకుడి గా కూర్చొని ఉన్నాడు. ఆ వ్యాసుడే మహాభారత రచన చేసిన వాడు , ఇతిహాస రచన, పెద్దలు మనం అడిగుతే చెప్పాలని లేదు . ఎందుకు చెప్పాలి అంటే కృప కలిగి చెప్పాలి. కృప ఎప్పుడు కలుగుతుంది, మన ఆర్తి అర్థం అయితే కృప కలుగుతుంది. ఏదో తెలుసుకోవాలన్న ఆర్తి అవతల వారి యందు ఉన్నది. అంతే గురువుగారు మాట్లాడటానికి అంత కన్నా ఇంకో విషయాన్నీ ప్రాతిపదిక గా తీస్కోరు.

కాబట్టి ఇప్పుడు నా ఆర్తి అర్థం అయితే మాట్లాడుతాడు. ఆయన యందు నా పూజ్య భావము కూడా ఆయన కి స్పష్టము కావలి అప్పుడే మాట్లాడుతాడు. ఈ కోణం లో జనమేజయుడు అడుగుతున్నాడు. ఆ సమయం లోనే మహాభారతం ప్రవచన రూపం లోకి మారింది.

ఇప్పడు జనమేజయుడు వ్యాసుని స్మరిస్తున్నాడు, సాక్షాత్తు పరబ్రహ్మమే రాసీ భూతమై నా ఎదుట కూర్చుంది. పరస మహర్షి యొక్క కుమారుడు , బ్రహ్మర్షుల లో ముఖ్యమైన వాడు, దయ కలిగిన వాడు , కురువంశము అంతటికీ కూడా పితామహ స్తనము నందు ఉన్నవాడు, జనమునంతటికి కూడా హితమును కల్పించటము అనేటటు వంటి మార్గము నందు, అష్టాదస పురాణములను , వేదములను విభామును చేసి , లోకమునకు నాలుగు మంచిమాటలు చెప్పి , జనాన్ని మంచి మార్గం లోకి మళ్ళించటం అనే మహా ప్రక్రియని , ప్రారంభం చేసిన మహా పురుషుడు, కృష్ణా జీనం కట్టుకున్న వాడు, నల్లని మేఘం ఎలా ఉంటుందో అటువంటి శరీరం కలిగిన వాడు, పేరుకి తగిన గుణములు కలిగిన వాడు, అప్పుడే ఉదయించిన సుర్యభింబం నుంచి వచ్చే కాంతి ఎలా ఉంటుందో , అటువంటి కాంతి తో మెరిసి పోతున్నటువంటి , ఎర్రని జటలతో మెరిసిపోతున్న టువంటి వాడు , రాగాద్వేషములు లేని వాడు, ఏ మాత్సర్యము లేని వాడు, ఇప్పుడు వ్యాసుడు , జనమేజయుని గుండెల్లో ఎలా ఉన్నాడో చెప్తున్నారు.

అటువంటి వ్యాసుని వంక చూసి జనమేజయుడు ప్రశ్న వేస్తున్నాడు. మునులందరి చేత నమస్కరింప బడే స్వరూపం కలిగిన వాడా ! పరమ ధర్మాత్ములు , సమస్త శస్త్రములు తెలిసున్న మీరు , కురువ్రుద్దులు , భీష్ముడు , వీరందరూ కలిసి రాజ్యాన్ని విభాగం చేసారు. ఇవ్వకుండా ఊరుకుని పంచుకోవటానికి దెబ్బలాడుకుంటే, అది వేరు. కానీ ఇక్కడ దెబ్బలాడు కోవ టానికి అవకాసం లేకుండా విభజించి ఇచ్చేసారు. ఎవరు విభజించారు , పరమ ధర్మాత్ములు విభజించారు , కాబట్టి ఇహ దెబ్బలాడుకోవటానికి ఏమి ఉండదు,

మీ మాట విని ఎవరికిచ్చిన రాజ్యం వాళ్ళు ఎందుకు పరిపాలించలేదు, వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నారు . అంటే తాను మాట వినటం వలన ఎంత గట్టేకేసాడో లోపల గుర్తొస్తుంది. ఎందుకు వాళ్ళు యుద్ధం చేస్తే అంత ప్రజక్షయం అయింది , ఎందుకు అంతమంది చచ్చిపోయారు? బంధువుల్లో ఇంత కలహం ఎందుకు వచ్చింది, వాళ్ళని ఎవరు ఆపలేక పోయారా? కాబట్టి నాకు అసలు ఈ గొడవలు ఎందుకు వచ్చాయి . ఎందుకు మాట వినలేదు మీ వంటి పెద్దలు ఉండగా? తెలియక తప్పు చెయ్యటం తప్పుకాదు , తెలిసున్న వారు చెప్పినప్పు దిద్దుకోవటం గొప్ప.

ఈ ప్రశ్న అడిగితే మహానుభావుడు వ్యాసుడు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. వైశంపాయనుడి వైపు చూసి నువ్వు చెప్పు అన్నట్టు గా సైగ చేసాడు.  అంటే ఆయన రచన చేసి కూర్చో పెట్టుకుని , మొట్ట మొదట తన శిష్యులకి చెప్పాడు. సుమంత్రుడు , పైలుడు , వైశంపాయనుడు , జైమిని వీళ్ళని కూర్చో పెట్టి చెప్పాడు.

ఇక ఇక్కడ నించి భారతం లో శ్రోత , వక్త మారుతున్నారు, ఇప్పటి వరకు ప్రవచనం చేసింది శౌతి , విన్నవారు , నైమిశారణ్యం లో మహర్షులు. ఇంకా ఇక్కడ నించి ప్రవచనం చేస్తున్న వాడు , వైశంపాయనుడు. వింటున్న వాడు జనమేజయుడు , కూర్చున్న వాడు వేదవ్యాసుడు.

మొట్ట మొదట భారతాన్ని వ్యాస సమక్షం లో ప్రవచనం చేసిన ఘనత వైశంపాయను కు దక్కింది. వైశంపాయను ఏ కారణం చేత వ్యాసుని యొక్క పాదాల దగ్గర నిలబడి , తడుము కో కుండా ,అంత గొప్ప గా భారతాన్ని చెప్పగలిగాడు. ఒకే ఒక్క కారణానికి చెప్పగలిగాడు , అది ఏమిటంటే తన గురించి ఒక్కపద్యం కూడా చెప్పక పోవటం వలన. ఇది భారతం లోని పరమ రహస్యం. ఇంత భారతం గురించి చెప్పిన వైశంపాయనుడు తన గురించి కానీ , తన తల్లి తండ్రుల గురించి కాని ఇంత భారతం చెప్పినటువంటి వాడు ఈ వైశంపాయనుడు అని ఎక్కడా చెప్పలేదు.

ఆయన భారతం చెప్పు అనగానే , గురువుగారి పాదాలమీద పది సాష్టాంగ నమస్కారం చేసాడు. చేసి గురువర్యా మీరు ఆనతి ఇచ్చారు అంటే , కార్యం జరిగిపోయినట్టే, ప్రవచనం చేస్తాను, మీరు శాసించినట్లే భారతం చెప్తాను. వ్యాసుడు గురించి చెప్పాడు తప్ప అసలు ఆయన గొప్ప తనం గురించి ఆయన ఎక్కడా మాట్లాడలేదు. సంక్షేపంగా ఒక్కసారి మహాభారతాన్ని  అంతట్ని ఒక్కసారి చెప్పేసాడు.

ఆర్తి కలిగిన శిష్యుడైతే ప్రశ్న వేస్తె వివరణ చెయ్యాలి. వేద వ్యాసుని యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. మహానుభావుడయ్య ఈ వ్యాసుడు , ఈయనే అష్టాదశ పురాణములను ఇచ్చాడు. ఈయనే పంచమ వేదమైన భారతాన్ని ఇచ్చాడు. ఈయనే వేద విభాగం చేసాడు , అటువంటి వ్యాస మహర్షి పనుపు న నేను, ఇదిగో ఈ భారతాన్ని ప్రవచనం చేస్తున్నాను. అదొక్కటే మాట , తన గురించి ఒక పద్యాన్ని వైశాపయనుడు చెప్పలేదు.

అంటే అసలు మహాభారతాన్ని వినేటటువంటి శ్రోత ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని వినాలి. వైశామపయనునకు అంత కీర్తి ఎలా కలిగింది , సొంతంగా ఎదీ చెప్పలేదు. వ్యాసుడు చెప్పిందే చెప్పాడు , కానీ వ్యాసుడు చెప్పింది చెప్పటం వల్ల నేను ధన్యుణ్ణి అని చెప్పుకుని శాశ్వతుడు అయిపోయాడు. తప్ప నేను ఫలానా అని చెప్పుకుని చెప్పలేదు.

భగవత్ సంభందమైన విషయాన్ని ప్రవచనం చేసే వాడికి ఉండవలసిన ఏకైక ఆ భగవంతుని యందు , నిరతిశయ భక్తి , భగవత్ కధ ను రచన చేసిన ఋషి పాదముల యందు భక్తి,తన గురించి తెలియవలసిన అవసరం లేదు.  ఇప్పుడు ఆయన భారత కధ ని ప్రారంభం చేస్తున్నాడు.

ఒకానొకప్పుడు ఇంద్రునితో సమానమైన బలపరాక్రమము కలిగిన రాజు వసువు అనే పేరుకల రాజు చేది రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. లోకంలో ఉండే మంచివారి చేత కీరితింప బడిన వాడు. ఆయన కూడా వేట నెపం మీద అడివికి వెళ్ళాడు. వెళ్లి జంతువులని వేటాడాడు. ఒక ఆశ్రమం లోకి వెళ్లి అక్కడ తపస్సు చేస్కున్తున్నటువంటి ఋషులని చూశాడు,

ఏముంటుంది ఆశ్రమం లో తాటాకుతో నేశిన కప్పు లేదా జనుముతో నేసిన కప్పు, వెదురుతో కట్టి మట్టితో అలికిన గోడలు, కర్రతో చేసిన ఒక ఆచమన పాత్ర, ఏదో కొద్దిగా కావలసిన సంబారములు, ఇన్ని పువ్వులు ఇన్ని పత్రాలు, కాస్త తేనే , నాలుగు పళ్ళు, ఇన్ని దుంపలు తప్ప ఇంకా భోగ వస్తువు అనేది ఏదీ ఉండదు.

ఇప్పడు రాజుకు నిర్వేదము కలిగింది. చేది రాజ్యాన్ని పరిపలించాను , ఇంద్రుడితో సమానం అనిపించుకున్న వాడ్ని , ఇంత బలపరాక్రమాలు ఉన్న వాడిని, కానీ ఏమిటి నేను సాధించింది, అంతపురాల్లో తిరిగాను , చలువరాతి మేడల్లో ఉన్నాను, హంస తూలికా తల్పాల మీద పడుకున్నాను , కానీ శాంతి ఒక్కటే లేదు. ఎప్పుడూ మనసులో బెంగే , మనసులో ఏదో పీడ గురించినటువంటి ఆలోచనే, ఈయనో పరమేస్వరున్ని ఒక్కణ్ణి నమ్ముకుని , ఇంత తేనే నాలుగు పళ్ళు ఇన్ని పువ్వులు , నాలుగు దుంపలు ఇంత పత్రీ పెట్టుకుని , హాయిగా ఈ కుటీరo లో ఈ ఆశ్రమం లోఎంత శాంతి తో ఉన్నాడు.

నేను రాజ దండం పట్టుకుంటే ,నా చాటున కొట్టుకుంటున్నారు అందరు. ఈయన అలా కుర్చుని , ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుంటే, సహజంగా జాతి వైరం ఉన్న జంతువులూ ,జాతి వైరాన్ని మరిచి చెలిమి చేసి తిరుగుతున్నాయి, ఈయన తపః ప్రభావానికి , ఇది మనసు శాంతిగా గడపటం అంటే ఇది.

ఏమిటి నేను పొందింది ఆ రాచ రికంలో ,ఆ ఐశ్వర్యం లో  వద్దు అని , నేను చేసింది నాకు దేనికి పనికి వచ్చింది అన్న భావన కలిగింది. కలిగి ఆయన కూడా శైన్యాన్ని దూరం గా పెట్టేసి , ఆ అస్త్రాలు శస్త్రాలు అవతల పారేసి, వీటి గొడవ ఇక వద్దని , ప్రశాంతం గా కుర్చుని తపస్సు చేస్కోవటం మొదలుపెట్టాడు.

చాలా చిత్రమైన విషయం కదండీ, మార్పు రావటాన్ని మాట్లాడుతుంది భారతం అని మీరు గుర్తుపట్టాలి. ఇప్పడు ఆయనదగ్గరకి దేవతా గణములతో కూడినటువంటి వాడై ఇంద్రుడు వచ్చాడు , వచ్చి ఒక గొప్ప విమానాన్ని ఒక దాన్ని ఆయన దగ్గర పెట్టాడు.  ఉన్నవి కాకా కొత్త వి ఇచ్చాడు, ఇచ్చి అన్నాడు నీవు నాకు స్నేహితుడవు. కేవలం భూమి మీద గొప్పతనం కాదు ఈ విమానం లో నువ్వు స్వర్గ లోకానికి వస్తావు.

కాసేపు ఒకటి రెండు రోజులు ఉండి వెళ్ళు, ఇప్పడు ఇంద్రుడు ఈయన శాంతికి మించి ఇవన్ని ఇస్తున్నాడు , ఇప్పుడు శాంతి ఉంటుందా , ఇంకా కొత్త అల్లర్లు మొదలవుతాయా ? కొత్త అల్లరే ప్రారoభం అవుతుంది. బాహ్యం లో గొప్ప వైభావాన్నే కృప చేస్తున్నాడు.

ఇప్పడు ఇంద్రుడు ఒక దివ్య విమానం తో పాటు నీ శరీరానికే ఒక దివ్యత్వం ఇచ్చేస్తున్నాను అన్నాడు. వాడని పద్మాలతో కూడిన మాల ఒకటి నీకు ఇస్తున్నాను, అది వేస్కుని ఉంటె నీకు శత్రువులైన రాజులు, నీ మీద విడిచి పెట్టె బాణములు నీ శరీరానికి వచ్చి తగలవు, అది నిన్ను అలా కాపాడుతుంది, ఆ పద్మాలు ఎన్నటికీ వాడిపోవు,అలాగే అవి ఎప్పుడూ గుబాళిస్తూ ఉంటుంది, అటువంటి మాల ఇస్తున్నాను.

దీనితో పాటుగా దుష్ట శిక్షణ , శిష్ట రక్షణా చెయ్యటానికి ఒక వెదురు కర్ర ఒకటి ఇస్తున్నాను, అదొక దివ్యమైన కర్ర. కాబట్టి ఇవన్నీ ఇస్తున్నాను . కాబట్టి నువ్వు చక్కగా హాయిగా కాలం గడుపు అన్నాడు. ఇప్పుడు ఆయన దేవేంద్రుడు, ఏ సంవత్సరం లో ఏ తిధి నాడు తనకి ఇవన్ని ఇచ్చాడో జ్ఞాపకం పెట్టుకుని, ఆ తిధి నాడు ఒక ఉత్సవం చేస్తూ ఉండే వాడు.

ఈ విమానాన్ని , ఈ మాలని , ఈ వేనుస్టి ఇంద్రుడు నాకు కృప చేసిన రోజని , ఇంద్రోచ్చవము అని చేస్తుండే వాడు. ఈయన్ని చూసి ఈ ఇంద్రోచ్చవాన్ని పక్కన ఉన్న రాజులు కూడా ప్రారంభం చేసారు , చిత్రం ఏమిటంటే, పరమేస్వరున్ని ఉద్దేసించి ఇంద్రుణ్ణి ఇద్దేసించి ఈ ఇంద్రోచ్చవం ఎవరు చేస్తారో,అటువంటి రాజులందరికీ కుడా ఆయుర్దాయం పెరుగుతుంది. సంతతి వృద్ధి లోకి వస్తారు.

ఎప్పుడూ కుడా వారు పరిపాలించే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. కాబట్టి ఆ ఉత్సవం చేసి అందరూ సుఖముగా ఉన్నారు. ఆ ఇంద్రుడు ఇచ్చిన వరముతో ఈ వసువుకి బృహద్రదుడు , మణివాహనుడు, సౌబలుడు , యదువు , రాజన్యుడు అనబడే ఐదుగురు కుమారులు జన్మించారు. పరమ సంతోషం గా ఉన్నాడు , ఇంద్రోత్సవం చేస్తున్నడు , పక్క రాజులు కూడా నేర్చుకున్నారు. ఆనందంగా కాలం గడిచి పోతుంది.

ఈ కాలం గడిచి పోతున్న రోజులలోనే ఒక చిత్రమైన సంఘటనల పరంపర ఒకటి జరిగింది. ఈయన రాజధాని నగరానికి చాలా దగ్గరలో సూక్తి మతి అని ఒక నది ప్రవహిస్తూ ఉండేది. సాధారణగా రాజుగారి కోటకి చాల దగ్గరలో ఏదో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. కందకాలలో నీటిని నింపటానికి, తోటలో చెట్ల కి నీరు పెట్టటానికి నది ఒడ్డునే కోట కడతారు, కాబట్టి అక్కడ ఆ శుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉంది.

నదిని స్త్రీ వాచకం తో పిలుస్తారు, సముద్రాన్ని పుం వాచకం తో పిలుస్తారు. ఈ నది అలా ప్రవహిస్తూ వెళ్తుంటే, ఆ నది యొక్క అందచందాలని చూసింది ఒక పర్వతం, ఆ పర్వతం పేరు కోలాహలము. ఆ పర్వతానికి నది నచ్చింది. ఈవిడ మీద మనసు పెంచుకున్నాడు. అలా ఉంటుందా లోకం లో అని మీరు అనుకోకూడదు, జీవుడు అని ఒకడు ఉంటాడు. అసలు యదర్దమునకు జీవుడు సుఖ దుఃఖాలని అనుభవించటానికే శరీరం వస్తుంది.

ఈ శరేరాన్ని ఈశ్వరుడు ఎలా ఇస్తాడు అంటే , పాపం తియ్యాలి , పుణ్యం తీసేయ్యాలి. ఈ రెండు ఎలా తీస్తాడు? శరీరాన్ని ఇస్తారు , ఇచ్చి జీవుణ్ణి ఇందులో పెడతాడు. జీవుడు కనపడదు, శరీరం కనిపిస్తుంది. వీళ్ళు జీవుడు స్థాయి లో మాట్లాడుతున్నారు అని మీరు అర్థం చేస్కోవాలి. అందుకని ఈ కోలాహలం అన్న పర్వతానికి , శుక్తి మతి అన్న నది నచ్చింది.

ఆ కోలాహలం అనే పర్వతం అమాంతం లేచి వచ్చి , ఈ శుక్తిమతి అనే నదికి అడ్డంగా కూర్చుంది. అనగా స్త్రీ పురుష సంభందం గా అనుభవించింది అని ఒక మాట అంటే దోషం ఏమి లేదు. కానీ బలత్కారము ఆ నదిని అనుభవించింది ఆ కోలాహలం అనే పర్వతం. ఆ శుక్తిమతి పొందిన పరితపాన్ని రాజు అర్థం చేస్కున్నాడు. రాజు అంటే ఎవరు , క్షితి నాధుడు. లోకంలో ఏ జీవికి బాధ కలిగినా ఆయన తీర్చాలి. అందుకని ఆయన వెళ్లి ఆయన కాలు తో తన్నాడు కోలాహలo అన్న పర్వతాన్ని, అది ఎగిరి ఎక్కడో పడింది.

ఆ వసువు కి ఉన్న బలం అలాంటిది. ఆయన ఇంద్రుడు ఇచ్చిన విమానం లో పైన తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన్ని ఉపరిచర వసువు అని పిలిచారు. ఆ ఉపరిచర వసువు కాలితో తంతే ఆ కోలాహలం అన్న పర్వతం ఎక్కడో పడింది. అంటే మీరు ఒకటి గమనించాలి. ఏదో కధ కింద చదవటం కాదు. రాజు అనగా ఎంత ధర్మాన్ని పాటించి ప్రాణుల యొక్క బాధ ని చూస్తూ ఉంటాడో, సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని రాజు ఎలా చూడాలో చెప్తోంది.

ఆ పర్వతo ఆ నదితో సంఘమించడం చేత ఆ నదికి ఒక కొడుకు పుట్టాడు, ఒక కూతురు పుట్టింది. వాళ్ళు మనుష్య శరీరం తో పుట్టారు , ఇది ఈశ్వరాజ్ఞ. ఇప్పుడు ఆ పుట్టిన కొడుకు పేరు సుపదుడు. ఆ పుట్టిన ఆడపిల్ల పేరు గిరిజ . ఆ నది అన్నది మహానుభావుడు ఆ ఉపరిచర వసువు వచ్చి ఆ కోలాహలం అన్న పర్వతాన్ని కాల్తో తన్నాడు కాబట్టి ఆ పర్వతం ఎక్కడో పడింది. నాకు ఆ కోలాహలం అన్న పర్వతం వల్ల ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. వీళ్ళని రాజుకి ఇచ్చేస్తాను అని రాజుకి ఇచ్చేసింది.

రాజు ఈ గిరిక యొక్క అండ చందాలు చూసి ఆమెని పెళ్లి చేస్కున్నాడు. ఈ పిల్లవాడు ఉన్నదే సుపదుడు వీడిని తన సేనాపతిగా నియామకం చేసాడు. మీరు ఇక్కడ కొంచం విశాల హృదయం తో వినవలసి ఉంటుంది. వ్యాసుడు , నన్నయ గారు ఇంత తక్కువగా రాయవలసిన అగత్యం లేని వాళ్ళు అన్న పవిత్ర హృదయం తో వినవలసి ఉంటుంది.

ఈ గిరిక అందచందాల మీద రాజు మనసు నిలబడింది. ఎప్పుడు నిలబడింది , ఆమె రుతుమతి అయ్యి ఉన్నది ఒకసారి, అప్పుడు ఉపరిచర వసువు యొక్క పితృదేవతలు పిలిచి  నీ భార్య ఋతుమతి అయ్యి ఉన్నది , అందుకని నీవు వెళ్లి ఆమెకి మంసాహరమును తెచ్చి పెట్టు.









Thursday, September 25, 2014

ఆదిపర్వం 16

ఇప్పుడు జరకత్కారుడు , జరత్కారువు పెళ్లి చేస్కున్నారు. ఇప్పుడు  జరత్కారువు కత్తి మీద మనిషి ఎలా నడుస్తాడో , అలా రేయనక పగలనక ,భర్తని అనువర్తిస్తూ కాలం గడుపుతుంది. అపారమైన అనురాగం తో ఆయన ని అనువర్తించిన కారణo చేత, భర్త యొక్క అనురాగమును పొందినదై ఆయన యొక్క అనురాగము యొక్క ఫలితముగా ఆమె గర్భం దాల్చింది. ఇప్పుడు ఆమె గర్భం తో ఉన్నప్పుడు ఎలా ఉందొ చెప్తున్నారు ననయ్య గారు, సూర్యుడు అనే బిడ్డను తూర్పు దిక్కు అన్న కాంత ఎలా ఉంటుందో గర్భిణి అయిన జరత్కారువు అలా ఉందిట.  ఇక్కడ ఈవిడ గర్భం పండి పిల్లడు పుడితే పాములకి అలుముకున్న చీకట్లు పోతాయి. జరత్కారు వంశం లో ఒక్క వేరు పట్టుకుని వేలాడుతున్న తాత తండ్రులు ఊర్ధ్వ లోకాలకి వెళ్ళిపోతారు. అందుకని పూర్వ దిక్కుతో పోల్చారు ఆమె ని.

ఒక నాడు ఆయన కృష్ణా చీనాన్ని వేస్కుని భార్య తోడ మీద తల పెట్టుకుని , నిద్ర పోతున్నాడు. సూర్యాస్తమయం అయిపోతుంది, ఆశ్రమం లో అందరూ సంధ్యా వందనం చేస్కున్తున్నారు. సంధ్యా వందనం అత్యంత ప్రధానం. సూర్యాస్తమయ సమయం లో ఎట్టి పరిస్థితుల్లో నిద్ర పోకూడదు. కాబట్టి నిద్రపోతున్నాడు ఒక తప్పు , సంధ్యా వందనం చెయ్యట్లేదు ఇంకో తప్పు.

లేపకపోతే వేళకి సంధ్యావందనం చెయ్యాలి కదా. చేస్తానని నీకు తెలుసు కదా , నేను నిద్రపోతున్నాను అని తెలిసి కూడా నన్ను లేపక పోవటం నన్ను అగౌరవ పరచటం కాదా?మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపో అంటే. 
రెండు నిద్రపోతున్న వాడిని నిద్ర లేపటం కన్నా మహా పాపం ఈ లోకం లో ఇంకొకటి లేదు. అందుకే నిద్ర పోతున్న వాడిని నిద్ర లేపితే ధర్మ కార్యం చెప్పి నిద్ర లేపాలి. యెదీ చెప్పకుండా నిద్ర లేపితే , మహా పాపాన్ని తీస్కెళ్ళి నిద్ర లేపిన వాడి ఖాతా లో వేస్తారు. 

ఇప్పుడు ధర్మ కార్యం కోసం లేపితే తప్పులేదు , కానీ నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావు అని కోప్పడితే జరత్కారుడు? సరే అలా కోప్పడినా పరువలేదు, లేపుతాను , ఎందుకని ఆయన ధర్మం నిలబెట్టిన దానిని అయ్యాను. కాబట్టి నిద్ర లేపెస్తాను , ఆయన్ని నిద్ర లేపి ఆశ్రమం లో అందరూ సంధ్యా వందనం చేస్కున్తున్నారు. నువ్వు కుడా సంధ్యా వందనం చేస్కోవాలి కదా లేవండి నిద్ర అన్నది. అంటే ఆయన దిగ్గున నిద్ర లేచాడు. అంటే ప్రతి చిన్న విషయాన్నీ ఎందుకు చుపిస్తారంటే , ధర్మం ఎంత గొప్పదో తెలియ చెప్పటానికి. 

ఇప్పుడు ఆయన లేచి అన్నాడు ,దేనికి లేపావు నిద్రపోతున్న వాడిని? నిద్రపోతున్న వాడిని లేపటం తప్పని నీకు తెలియదా ? అంటే నా పట్ల అగౌరవం కాదా అన్నాడు. ఆవిడ అంది కాదు ధర్మం చెడిపోతుంది. అవతల సూర్యాస్తమయం అయిపోతుంది . సంధ్యావందనం చెయ్యాలి మీరు అన్నది. కాబట్టి నేను మిమల్ని నిద్రలేపక పోతే మీ ధర్మం పాడవుతుంది కాబట్టి నిద్ర లేపాను , ఇందులో అగౌరవo ఎక్కడ ఉంది. అన్నది.
ఆయన ఏమన్నాడో తెల్సా  ఏమిటి నేను నిద్రపోతుండగా నేను లేచి సంధ్యావందనం చెయ్యక ముందు సూర్యుడు అస్తమించడమే? జరత్కారుడు నిద్రపోతున్నాడు , కాబట్టి నేను అస్తమిస్తే జరత్కారుడి ధర్మానికి భంగం వస్తుంది అని సూర్యుడు అలా ఉండిపోతాడు అంతే  అన్నాడు జరత్కారుడు. నా తపో ప్రభావం అటువంటిది, నేను నిద్ర లేచే వరకు సూర్యుడు అస్తమించడు అన్నాడు జరత్కారుడు. నా శక్తిని సూర్యుడు అంత లేక్కకట్టినవాడు.

అటువంటి సూర్యుడు నా శక్తి ని లెక్క కట్టి అస్తమించలేదు , నువ్వు మాత్రం సూర్యుడు అస్తమిస్తాడు నిద్రలే అని నన్ను నిద్రలేపావు. అంటే నా శక్తి ని అంత తక్కువ అంచనా వేసావు , ఇది నాకు అగౌరవo కాదా? కాబట్టి నువ్వు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపో నేను ఆశ్రమానికి వెళ్తాను అన్నాడు. ఇంకా చెప్పాడు నీ కడుపులో అగ్నిహోత్రుడు , సూర్యుడు కలిసిన తేజోవంతుడు పెరుగుతున్నాడు. ఆ బిడ్డడు చాలు మన జీవితాలు తరించిపోతాయి అన్నాడు.

అస్తీకుడు అని పేరున్న పిల్లవాడు ఆ యొక్క జరత్కారువు యొక్క గర్భం లోనించి పుట్టాడు.  ఆయన పూర్ణమైన తేజస్సు కలిగినవాడు , అసలు పాపము తనకి అంటని వాడు. భవభందములకు చిక్కని వాడు , పుడుతూ నే అటు తల్లి వైపు వాళ్ళని ఇటు తండ్రి వైపు వాళ్ళని తరింపచేసిన వాడు. ఎందుకని ఇప్పుడు జరత్కారుడికి పిల్లలు పుట్టారు కాబట్టి ఆ ఒంటి వేరు పట్టుకుని వేలాడుతున్న వారు ఉర్త్వ లోకాలకి వెళ్ళిపోయారు. ఇటు జరత్కారువు కి పిల్లడు పుట్టాడు కాబట్టి సర్పయాగం లో పడిపోయే పాములైన మేనమామ లు అందరు బతికి పోయారు.

కాబట్టి పుట్టీ పుట్టకుండానే ఇరువంశాలని ఉద్ధరించిన మహా పురుషుడు , ఆస్తీకుడు. ఆయన చవనుడి యొక్క కుమారుడైన ప్రమతి దగ్గర విద్యాభ్యాసం అంతా చేసాడు. విద్యాభ్యాసం చేసి సర్వ శాస్త్రములు తెలుసుకున్న తరువాత, ఈయన పరమ సంతోషం తో పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఇప్పుడు కధ ఇంకోవైపుకి వెళ్తుంది.

ఇప్పుడు ఉదంకుడు , జనమేజయుడి దగ్గరకి వెళ్లి తన కోపాన్ని జనమేజయుడికి ఆపాదించాడు.
ఇప్పుడు జనమేజయుడు మంత్రులతో అన్నాడు, ఈ ఉదంకుడు నా తండ్రిని తక్షకుడు చంపాడు అంటున్నారు , అసలు ఆ కధ ఏమిటో చెప్పండి అన్నాడు.

అప్పుడు ఆ మంత్రులు లేచి అన్నారు , నీ తండ్రి అయిన పరిక్షిత్తు , విరాట రాజు కుమార్తె అయిన ఉత్తర ని అభిమన్యుడు  వివాహం చేస్కున్నప్పుడు, వారిరువురికి పుట్టిన వాడు  పరీక్షిత్. ఆ పరీక్షిత్ నీ తాత అయినటవంటి  అర్జునిడి తో సమానం, వంశం లో పోలికలు ఎలా వస్తాయి అంటే ఎక్కడో ముత్తాత అయిన పాండురాజు కి వేట అంటే ఇష్టం , అదే ఇష్టం పరీక్షిత్  కి ఉంది, అందుకే ఆ వేటకు వెళ్లి తపస్సు చేస్కుంటున్న ఋషి మెడలో చచ్చిపోయిన పామును వేసాడు.


పరిక్షితుడు 60 సంవత్సరములు ధర్మార్థ కామములు తప్పకుండా రాజ్యం చేసినటువంటి మహానుభావుడు. అటువంటివాడు , నీ వంటి సత్పుత్రుణ్ణి కన్నాడు. అటువంటి వాడు సింహాసనం మీద కుర్చుని, పాద పీఠo మీద పాదములు పెడితే , అన్య  దేశ రాజుల యొక్క కిరీటములు నీ తండ్రి , పాదముల యందు తలలు వంచి నమస్కరిస్తే వాళ్ళ కిరీటముల లోని మణులు నీ తండ్రి పాదములకు నీరాజనములు పట్టేవి.  అంత కీర్తి గడించిన మహానుభావుడు.

కానీ మీ వంశం లో ఉన్నటువంటి మీ ముత్తాత పాండురాజుకు ఉన్నటువంటి, బలహీనత లాగే మీ తండ్రి కూడా వేటాడటం కోసం అని చెప్పి, అరణ్యం లోకి ప్రవేశించి వేటాడుతుండగా ,ఒక లేడి కనిపించి ఆ లేడిని ఎలా అయినా వేటాడి పట్టుకోవాలని, తన పరివారం అంతా వెనకపడిపోయినా తాను ఒక్కడే ఉండి, ఆ లేడి ని తీస్కోస్తానని ఆ లేడి వెంట పరిగెడుతూ , బాణాన్ని విదిచిపెడుతూ , బాణం తగిలన లేడి పరీక్షిత్ కి దక్కకుండా , శమీకుని  యొక్క ఆశ్రమం లోకి వెళ్ళిపోతే, ఆ శమీకుని ఆశ్రమం లోకి వెళ్లి ,కన్నులు మూసుకుని అంతర్ముఖుడై ,ధ్యానం లో ఉన్న శమీక మహర్షిని , ఇటు గా లేడి పర్గేట్టిందా అని శామీకున్ని అడిగితే , బహిర్ముఖుడు కాదు కాబట్టి, జవాబు చెప్పక పోతే ఉద్దతిచేత ఆకలి చేత , దప్పిక చేత కలిగిన టువంటి ప్రకోపం చేత చచ్చి పోయిన పాముని ధనస్సు యొక్క మూపుతో




 ఆ శమీకుని మెడలో వేస్తె ఆ శమీకుని కుమారుడు అయిన శృంగి కి ఈ విషయం తెలిసి నా తండ్రిని ఇంత అగౌరవ పరుస్తాడా దేశమునేలే రాజు అని నేటికి ఏడవ రోజు , తక్షకుని యొక్క విషాగ్ని చేత , తండ్రి మూపురమున విష సర్పాన్ని వేసిన పరీక్షిత్ తక్షకుని యొక్క అగ్ని జ్వాలల యందు కాలి బూడిద అవుగాక అని శాప వాక్కు విడిచి పెట్టి తండ్రి దగ్గరకి వచ్చి, అభివాదం చేసి గోత్ర నామాలు చెప్పుకుని , భూమి మీద పడి నమస్కరిస్తున్న సమయంలో ఆ మహానుభావుడైన శమీకుడు కన్నులు విప్పి , తన కొడుకైన శృంగిని చూసి ఏ రా  బాధ గా ఉన్నావ్ అని అడిగితే, నాన్న గారు మీ మోపు మీద పరీక్షిత్ మృత సర్పాన్ని విడిచిపెడితే నేటికి ఏడవ నాడు ఆయన మరణించాలి అని శాప వాక్కు విడిచి పెట్టాను అని చెప్తే.

శమీకుడు చూసి ,ఎంత పని చేసావురా ! చంద్ర వంశం లో పుట్టిన మహా పురుషుడు , రాజ్యమును ధర్మము గా పరిపాలిస్తున్న వాడు, అందరినీ కాపాడే ప్రభువుని , నీ యొక్క వ్యగ్రమైన వాక్కు చేత అర్థాయుశ్కున్ని చేసి పడగోడుతున్నావ్ ! కోపం అనేది రానేకూడదు , కోపం వస్తే ఎన్ని ఉపద్రవాలో వస్తాయి అని ఆ రోజున శృంగితో శమీకుడు అన్నాడు.

క్రోధము ఆవహించిన వాని యొక్క తపస్సు చెడిపోతుంది. క్రోధము వలన అణిమాది సిద్దులు గుణములు అన్నీ నశించి పోతాయి. క్రోధము ధార్మికమైన పనులు చెయ్య నివ్వదు. క్రోధము ఉన్న వాడు ఇక తపస్వి ఎలా అవుతాడు.
ఓర్పు లేని తపస్సు , అలాగే పరాకుగా ఉండక పోవటం వల్ల ఐశ్వర్యం నిలబడక పోవటం అనేటటు వంటి లక్షణం. ధర్మం విదిచిపెట్టిన రాజుకి రాజ్యం ఎలా నశిస్తుందో. అది పగిలిపోయిన కుండలో పోసిన నీరు కారిపోయినట్టే. ఎంత తప్పు పని చేసావు రా ! అని గౌరముఖుడు అనే ఒక మునిని పిలిచి, నేటికి ఏడవ రోజు మరణించాలని నా కొడుకు రాజుకు శాపం ఇచ్చాడు ,వెంటనే, భద్రతా ఏర్పాట్లు చేస్కుని , మంత్ర తంత్రములు తెలిసున్న బ్రాహ్మణుల్ని పక్కన పెట్టుకుని , ఎంత మాత్రమూ పరాకు లేకుండా, తనకి తను రక్షించుకొమ్మని , పరీక్షిత్ మహారాజుకి నా వాక్కు గా చెప్పండి అని, ఆ గౌరముఖుడనే  మునిని రాజుదగ్గరకి పంపిస్తే, ఆయన వెళ్లి పరిక్షిత్  కి చెప్తే

శమీక మహర్షి , కొడుకు ని అడిగాడు ఆ రోజున, నీ శాపాన్ని వెనక్కి తియ్యలేవా అని . నాన్న గారు నేనేమీ చెయ్యలేను , ఇప్పటికే నేను ఇచ్చిన శాపవాక్కు , తక్షకుడి లో ప్రచోదనం చేసి , బయలుదేరిపోయి ఉంటాడు , కరవటానికి పరిక్షిత్తు ని అన్నాడు. ఆ మాట చెప్పినట్టుగానే , మహానుభావుడు బయలు దేరాడు , బయలుదేరి  గబగబా వచ్చేస్తున్నాడు. వచ్చి ఇంక పరిక్షిత్తు ని కాటు వెయ్యాలి , అది ఏడవ రోజు, ఇంక ఆ ఒక్క రోజు దాటి పోయిoదా, పరిక్షిత్తు బతికేస్తాడు.

ఇప్పుడు పరిక్షిత్తు ఒక పెద్ద ఒంటి స్తంభం మెడ కట్టుకుని , మంత్ర తంత్రములు తెలిసున్న వాళ్ళని పక్కన పెట్టుకుని, ఆయన బోలెడంత మంది వడ్రగుల్ని కార్మికుల్ని పిలిపించుకుని , ఒంటి స్థంబం మేడ కట్టించుకుని, అందులో తన బ్రుత్యుల్ని చుట్టూ పెట్టుకుని , విషాన్ని విరగొట్ట గల మంత్రాలు తెలిసున్న బ్రాహ్మణుల్ని తన వెంట పెట్టుకుని, అందులోనే ఉంటూ , నేను ఏడూ రోజులయ్యే వరకు కిందకు దిగి రానని, కూర్చున్నాడు, కుర్చుని ఉండగా ఏడవరోజు వచ్చింది.

బయలుదేరాడు , ఎవరు , తక్షకుడు ఆయన్ని కరుస్తాను అని. ఈలోగా బ్రహ్మ గారు ఏమి చేసారంటే, లోకంలో పాములు ఎవరిని పడితే వారిని కరిచేస్తున్నాయి, కరిస్తే వాళ్ళు చనిపోతున్నారు. పాము కరిస్తే చనిపోకుండా ఉండ టానికి నేను కశ్యపుడు అనే ఋషి కి పాము యొక్క విషాన్ని విరగొట్ట గల మంత్రాన్ని ఉపదేశం చేస్తాను అని, సాక్షాత్తు గా చతుర్ముఖ బ్రహ్మ గారే కశ్యప ప్రజాపతికి ఉపదేశం చేసారు.

ఆ కశ్యప మహర్షి ఎంత గొప్ప వాడంటే, తక్షకుడు కాటువేసి పరిక్షిత్తు మరనిన్చేలోపు, రాజుని నేను రక్షిస్తాను అని కశ్యపుడు బయలుదేరాడు. ఇద్దరూ బయలు దేరారు , వృద్ద బ్రాహ్మణ వేషం లో తక్షకుడు ఉన్నాడు, కశ్యపుడు వెళ్తున్నాడు , ఇద్దరూ కలుసుకున్నారు , కలుసుకున్న తరువాత , అడిగాడు. ఏమయ్యా నువ్వు ఎవరు ? ఎక్కడికి వెళ్తున్నావు అంటే కశ్యపుడు అన్నాడు

రాజుని ఇవ్వాళా ఏడవ రోజు తక్షకుడు కారుస్తాడు , కరిచినప్పుడు , నేను ఆయన ని విషం పోగొట్టి బ్రతికించడానికి వెళ్తున్నాను అన్నాడు. పిచ్చి వాడా నువ్వు ఆ కోరిక విడిచి పెట్టు , వజ్రాయుధం తగిలిన వాడు బ్రతుకుతాడెమో కాని , తక్షకుడు కరిచిన వాడు బ్రతకడు అన్నాడు. నేనే తక్షకున్ని , నేను ఒక్క సరి కరిస్తే  బూది కుప్ప గా పడిపోతాడు , మనిషి బ్రతికి ఉండటం కాదు. కాబట్టి నువ్వు బ్రతికిన్చాలేవు అన్నాడు. అంటే కశ్యపుడు అన్నాడు బూది కుప్ప గా నువ్వు చేసినా నేను బ్రతికించ గలను అన్నాడు.

అయితే ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది , దాని కొమ్మలు ఎంత వరకు వ్యపించాయో తెలియట్ల, పచ్చటి చెట్టు నేను మొదట్లో కారుస్తాను , బూడిద కుప్ప గా పడిపోతుంది, బ్రతికించు చూస్తాను అన్నాడు. తక్షకుడు . కాటు వేశాడు, అది బూడిద కుప్ప కింద పడిపోయింది చెట్టు. వెంటనే ఈ కశ్యప రుషి , బ్రహ్మ గారు తనకి ఉపదేశం చేసిన మంత్రాన్ని జపం చేసి ప్రయోగించాడు. వెంటనే ఆ మర్రి చెట్టు మళ్ళి వచ్చింది. వచ్చేటప్పటికి  తక్షకుడు ఆశ్చర్య పోయాడు.

అయితే ఈ విషయం హస్తినాపురం లో ఎలా తెలిసింది అంటారేమో , ఒక వ్యక్తి అరణ్యం లోకి వచ్చి ఆ మర్రి చెట్టు ఎక్కి ఎండు  పుల్లలు ఎరుకుంటున్నాడు, అకస్మాత్తు గా తక్షకుడు ఆ చెట్టుని కరవటం లో ఈ వ్యక్తి కుడా కాలి బుడిదైపోయి కింద పడిపోయాడు. మళ్ళి కశ్యప ఋషి మాత్ర ప్రభావం చేత చెట్టుతో పాటు ఆయన కుడా బ్రతికాడు. ఆయన తరువాత పరిగెత్తుకుంటూ హస్తినా పురం వెళ్లి ఈ విషయం అంత చెప్పాడు.

ఇప్పుడు తక్షకుడు అన్నాడు , నేను కాటు వెయ్యటం అనేది , పరమ సత్యం, నువ్వెందుకు ఆయన్ని బ్రతికించాలి అనుకుంటున్నావ్! ఒకటి మహానుభావుడు కాబట్టి బ్రతికిస్తావు. రెండు రాజుని బ్రతికిస్తే , రాజు అపారమైన ధనం ఇస్తాడు. రాజు ఎంత ధనం ఇస్తాడో అంత కన్నా అధికమైన ధనం ఇస్తాను నువ్వు , బ్రతికంచ వద్దు అన్నాడు తక్షకుడు. కశ్యప ఋషి కన్నులు ముస్కుని అంతర్ముఖుడై చూశాడు . రాజుకి మరణము తధ్యము అని తెల్సిపోయింది. ఋషి వాక్కు జరగక మానదు , కాబట్టి ఇప్పుడు తక్షకుడు ఇచ్చిన డబ్బు పట్టుకుని కశ్యపుడు వెళ్ళిపోయాడు.

ఇప్పుడు తక్షకుడు ఈ ఒంటి స్థంభం మేడలోకి లోకి ప్రవేశించాలి, ఇప్పుడు తన సోదరులైన పాముల్ని కొందరిని పిలిచి, మీరు బ్రాహ్మణ కుమారుల వేషాలు వేస్కుని , ఋగ్వేద , యజుర్వేద మంత్రాలు చెప్తూ వెళ్ళండి, కొన్ని పువ్వులు పళ్ళు పట్టుకుని వెళ్లి ప్రసాదం రాజా , నీకు రక్ష గా ఇస్తున్నాము అని చెప్పి ఇవ్వండి. వేదం చదువుతున్న బ్రాహ్మణ కుమారులని చుస్తే రాజు కాదనడు , తీస్కుంటాడు.

అంటే వాళ్ళు అలాగే వెళ్లారు , వెళ్తే రాజు ప్రసాదం , కదా అని పుచ్చుకున్నాడు, ఆయన ఆ పళ్ళు తన చుట్టూ ఉన్నమంత్రులకి ఇస్తున్నాడు.  ఇస్తూ చాలా ధైర్యంగా ఆయన ఆ మంత్రులతో ఒక మాట అన్నాడు. అదిగో సూర్యుడు పశ్చిమ దిక్కున అస్తమిస్తున్నాడు , కాబట్టి ఏడవ రోజు పూర్తయింది , ఇంకా తక్షకుడు నన్నేమి చెయ్యడు. ఇది బ్రాహ్మణ ప్రసాదం. కాబట్టి మీరు తినండి అని వారందరికి ఇచ్చాడు, ఒక పండు తీసి నేను తింటాను అని ఆ పండుని ఇలా విప్పాడు.

విప్పీ విప్పగానే నల్లటి గుడ్లతో ఒక పురుగు , కనపడింది. ఆ పురుగు మెల్లగా ఎర్రటి రక్త వర్ణం తో పాము అయ్యింది.
ఆ పాము తక్షకుడు. అది వెంటనే రాజుని కరచి, పెద్ద స్వరూపాన్ని పొంది, అగ్నిహోత్రాన్ని చిమ్మి అక్కడ ఉన్నటువంటి , మేడని కుడా కాల్చేసి, దూకి పారిపోయింది. అలా నీ తండ్రి చచ్చి పోయాడయ్యా అన్నారు మంత్రులు  జనమేజయుడితో.

ఇప్పుడు జనమేజయుడు చాలా వ్యగ్రత పొందాడు. నిజంగా కూడా తక్షకుడు యుక్తాయుక్త విచక్షణ లేని పాము. ఒక బ్రాహ్మణ వాక్కు ఫలించాలని తక్షకుడు ఇంత పన్నాగం పన్ని, మీ నాన్న ని చంపేసాడు, మీ నాన్న మంచితనాన్ని దేన్నీ పరిగణ లోకి తీస్కోకుండా చంపేసాడు. బ్రాహ్మణ వాక్కు కి అంత గౌరవమ్ ఇచ్చాడుగా నువ్వూ బ్రాహ్మణుల్ని తీస్కొచ్చి యాగం చెయ్యి. యాగం చేసి మొత్తం పాముల సంతతి అంతటినీ అగ్నిహోత్రం లో పారేయి. తక్షకున్ని కూడా పడగొట్టు. కాబట్టి నువ్వు ప్రతీకారం చెయ్యవలసిందే చెయ్యి అన్నారు.

అనగానే అయితే యాగ శాల నిర్మాణం చెయ్యండి అన్నాడు జనమేజయుడు. ఋత్విక్కు ల్ని పిలవండి , నేను యాగ దీక్ష తీస్కున్తున్నాను అన్నాడు. దీక్షా అన్న మాట యాగామునకే వర్తిస్తుంది. కాబట్టి నేను దీక్షితున్ని అవుతున్నాను అన్నాడు. యాగశాల నిర్మాణం చేసారు.

యాగ శాల నిర్మాణం చేసినా , ఇల్లు కట్టినా వస్తూ అన్నది , దాని యొక్క ప్రభావం దానికి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. ఎవరు ఎన్ని మాటలు చెప్పిన , మనం శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళం అయినప్పుడు మనం అలాగే మాట్లాడవలసి ఉంటుంది, అలాగే పాటించ వలసి ఉంటుంది.

అందులో ఒక పౌరాణికుడు , ఒక శాస్త్రము తెలిసున్న మహానుభావుడు వచ్చి జనమేజయుడితో అన్నాడు, ఈ యాగ శాల నిర్మాణం లో దోషం ఉంది, ఈ యాగ శాల నిర్మాణం లో దోషం ఉండుట వలన నువ్వు ఎంత గొప్ప బ్రాహ్మణుల్ని తీస్కొచ్చినా ఎంత గొప్ప యాగ సంబరాలు నువ్వు తీస్కోచ్చినా , ఈ యాగం మధ్యలో ఒక బ్రాహ్మణుడి వలన ఆగిపోతుంది, అన్నాడు

జనమేజయుడు లక్ష్య పెట్టలేదు , లక్ష్య పెట్టకుండా ఆయన ఆ యాగం చెయ్యటం కోసం అని చెప్పి సిద్ధ పడ్డాడు. జనమేజయుడి యొక్క భార్య , కాశీ రాజు యొక్క కుమార్తె అయిన వపుస్టమ. ఆ వపుస్టమ తో కలిసి ,( భార్య లేని వాడు యాగం చెయ్యటానికి అనర్హుడు. ) ఆ సర్పయాగం చెయ్యటానికి కూర్చున్నాడు.

బ్రాహ్మణులూ అందరు కూర్చున్నారు. కుర్చుని ఒక్కొక్క పాము పేరు చెప్పి పిలుస్తున్నారు. ఒక్కొక్క పేరు చెప్పి ఋత్విక్కులు పిలుస్తుంటే బ్రహ్మదండం పడ్డట్టు గా పడిపోతున్నాయి.

ఒక పడగ పాము , మూడు పడగల పాము, మూడు పడగల పాము , తొమ్మిది పడగల పాము పెక్కు తలలు కలిగిన పాములు , పసుపురంగు కలిగిన పాములు , తెల్లరంగు పాములు , ఎర్ర రంగు పాములు, నల్ల పాములు , పొడుగు పాములు , పొట్టి పాములు, లావు పాములు సన్న పాములు , ఇన్ని రకాల పాములు , ఆకాశం లో గిర గిరా తిరుగుతూ విషాన్ని చిమ్ముతూ అగ్నిహోత్రంలో పడిపోయి, తలలు పగిలిపోతుంటే , పెట్టేల్లున శబ్దం చేస్తూ ,అరుస్తూ విషం చిమ్ముతూ అగ్నిహోత్రం లో కాలిపోతుంటే దిక్చక్రమ్ అంతా సర్పముల యొక్క వింత శబ్దములతో నిండిపోయింది ట. 



అలా అందరూ చిత్ర విచిత్రము గా ఇదేమి యాగం అని చూస్తుండగా, ఆకాశం లోంచి రంగురంగుల పాములు , అనేక తలల పాములు వచ్చి ఆ యాగం లో పడిపోయి, అగ్నిహోత్రం లో కాలిపోతున్నాయి. తక్షకుడు భయపడిపోయి, దేవేంద్రుడు ఆయనకీ స్నేహితుడు , వెళ్లి రక్షించు! , రక్షించు!రక్షించు ! అని వెళ్లి ఇంద్రుడి చాటున దాక్కున్నాడు. 

ఇంద్రుడు బ్రహ్మ గారు చెప్పినట్టు కొన్ని పాములు బ్రతుకుతాయి అని విని ఆగు తక్షకా ! కంగారుపడకు , ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆ యాగాన్ని ఆపుతాడు , నువ్వు బ్రతుకుతావు, బెంగాపెట్టుకోకు అలా కూర్చో అని ఆ తక్షకున్ని ఇంద్రలోకం లో కూర్చోపెట్టాడు. 

ఇంతలో మహానుభావుడు వాసుకి గబ గబా పరిగెత్తుకుంటూ చెల్లెలు దగ్గరకి వెళ్ళాడు. వెళ్లి అమ్మ ఈ జనమేజయుడు చేస్తున్న యజ్ఞం లో మా సోదరులమైన మా జాతి అంతా పడిపోతుంది , ఇప్పటికే కొన్ని లక్షల పాములు కాలిపోయాయి. వెంటనే నా మేనల్లుడైన ఆస్తీకున్ని పమ్పించమ్మా, నీ పేరు జరత్కారువు, నిన్ను జరత్కారుడికి ఇచ్చి వివాహం చేసింది, మీ ఇద్దరికీ పుట్టే పిల్లాడి వల్ల, సర్ప జాతిని కాపాడ టానికి , కాబట్టి వెంటనే నీ కొడుకును పంపు అన్నాడు. 

మీరు బెంగ పెట్టుకోకండి , పడిపోయిన కద్రువ పుత్రులు పడిపోయారు , మిగిలిన వారిని రక్షించే భారం నాది అన్నాడు ఆస్తీకుడు బయలుదేరి, జనమేజయుడు చేస్తున్న ఆ సర్ప యాగ శాల లోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే మహా తేజోమూర్తి ఆ ఆస్తీకుడు నడిచి వస్తు ఉంటె, రజూ ఋత్విక్కులు అందరూ ఆయన వంక చూస్తున్నారు.  


ఆస్తికుడు అన్నాడు , మహానుభావా జనమేజయ, నీవు చంద్రవంశం లో పెద్ద రాజువై , ప్రజలందరినీ దయతో, ధర్మంతో పరిపాలన చేస్తూ , ఆనాడు ధర్మరాజు , నాభాగు , భగీరధుడు, దశరధుడు, మాంధాత , రాముడు, రఘుమహారాజు , అర్జునుడు ఎలా పరిపాలన చేసారో అలా పరిపలించావయ్యా. 

నాయనా! ఈ భూమండలం అంతటికీ నువ్వు చక్రవర్తి వి అయిన తరువాత, నీ రాజ్య పరిపాలన లో నువ్వు అనేక యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ రుత్విక్కులని పిలిచి నువ్వు ఇచ్చిన సంభావనల చేత ఆ యజ్ఞ దీక్షితులైన రుత్విక్కులకి నువ్వు ఇచ్చిన దక్షిణ ల చేత, బ్రాహ్మణులూ అంత ఎంతో తృప్తి పొంది ఉన్నారు . (ఈ స్తోత్రం లో ఒక రహస్యం ఉంది , దాన్ని చివర మీకు చెప్తాను ). 

నువ్వు ఇక్కడ నిమంత్రణం చేసిన ఋత్విక్కులు ఉన్నారే , వాళ్ళు ఆగ్రహించినా అనుగ్రహించినా, ఏదైనా చెయ్య గలిగిన టువంటి సమర్ధులు. ఒకనుకోకనాడు బ్రహ్మ గారు చేసిన యజ్ఞo ఉందే పూర్వ దిక్కున , ఆ చేసినటువంటి , యజ్ఞం ఉండే ఆ యజ్ఞం కన్నా , ఇవ్వాళ నువ్వు చేసే యజ్ఞం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఋత్విక్కులు గొప్పవాళ్ళయ్యా! ఓ కురువంశ వర్ధనా నువ్వు చేసే ఈ యాగం ఎంత గొప్పదో తెల్సా , ఒకనాడు మహారాజైన నలుడు చేసిన యజ్ఞం, ధర్మ రాజు చేసిన రజసూయ యాగం, ప్రయాగ లో బ్రహ్మ గారు చేసిన యజ్ఞం , పాశం చేతిలో పెట్టుకునే వరుణుడు చేసిన యజ్ఞo, కృష్ణుడు చేసిన యజ్ఞం, చంద్రుడు చేసిన యజ్ఞం , నువ్వు చేసిన యజ్ఞం , ఇవయ్యా యజ్ఞాలంటే. 

ఎంత గొప్ప యజ్ఞం చేశావయ్యా , అసలు యజ్ఞాలు అంతటికి నీ యజ్ఞం ఎంత గొప్పదో తెలుసా! ఒక మహానుభావుడు  ఇక్కడ కుర్చుని ఉన్నాడు ఈ యజ్ఞం లో .  మహానుభావుడు , అపారమైన విద్వత్తు కలిగినవాడు, మూడు లోకముల యందు ఖ్యాతి గడించిన వాడు , కృష్ణ ద్వైపాయనుడు అన్న పేరు కలిగిన వాడు, వేదవ్యాసుడు , శిష్య ప్రసిష్యులతో వచ్చి ఈ యాగం లో కుర్చుని ఈ యజ్ఞాన్ని అంతటిని పరీక్షిస్తున్నాడు. అంతటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు అంటే ఈ యాగం ఎంత గొప్పదో వేరే చెప్పాలా నాయన అన్నాడు. 

నువ్వు చేసే యాగాలలో అగ్నిహోత్రుడు సంతతము నీ పక్కన కుర్చుని హవిస్సులు  స్వీకరిస్తూ ,కుడిపక్కకి తిరిగేతతువంటి జ్వాలలు కలవాడై. నీ కోర్కెలను ఈడేర్చే వాడు అగుగాక ! నీవు అంత కీర్తి వంతుడవు అవుగాక! అని ఆశీర్వచనం చేసాడు. 

ఇంత కీర్తి కల వంశం లో పుట్టిన వాడివి , ఇంత దయాళువు వి, ఇంత పేరు తెచ్చుకున్నవాడివి, ఇంతమంది పెద్దల్ని కూర్చోపెట్టి యాగం చేస్తున్నవాడివి. ఇంత దాన ధర్మాలు చేస్తున్న వాడివి, ఏదో నిమిత్తం లేకుండా బొంది పోతుందా. ఏదో కారణానికి తండ్రి పడిపోవాల్సి వచ్చింది పడిపోయాడు. ఆ నింద కాక పోతే వేరొ కారణానికి వెళ్ళిపోతాడు. దానికి మనసులో క్రౌర్యమ్ పెట్టుకుని, నీ కీర్తికి మచ్చ తెచ్చుకుంటావా ? చెయ్యవచ్చా ఇలాంటి యాగాలు. 

జనమేజయుడు అన్నాడు మహానుభావా  నీ దివ్యమైనటు వంటి వాక్కులు , తేజస్సు, చుస్తే చాల సంతోషం గా ఉంది అయ్యా నీకు ఏమి కావలి చెప్పు ఇచ్చేస్తాను అన్నాడు. వెంటనే ఆస్తికుడు అన్నాడు " నీవు నా బంధువులు అయిన సర్పములన్ని ఇలా కాలి పోయి మరణించ కుండా, వాళ్ళ మనోవేదన తీరేటట్టు గా నేను సంతోషించే టట్టు గా నీవు దయతో, ప్రాణులపట్ల కక్ష పెంచుకోవటం అనేదే విషం, ప్రాణుల పట్ల దయ పెంచుకోవటమే అమృతం. కాబట్టి నాయనా నువ్వు వేరుగా అమృతం తాగాక్కర్లేదు, దయ తో ఉండటమే అమృతం తాగటం. కాబట్టి ఆ కక్ష అన్న దాన్ని పక్కన పెట్టి , దయా అన్న దాన్ని నీ మనసులోకి తెచ్చుకో. 

ఎందుకు ఇంత మందిని కాల్చాలి . ఒకణ్ణి చంపినందుకు ఇంతమందిని చంపటమా అన్న భావన తో అలోచించి నీకు చంపబుద్ధి వెయ్యదు. కాబట్టి పరమ దయతో ఈ యజ్ఞాన్ని ఇంతటితో ఇంక ఆపు చేసేయి. చనిపొఇన వాళ్ళు చనిపోయారు ఇంక ఇప్పటికైనా ఆపితే , నా బంధు కులం, నా తల్లి వైపు బంధువులు సర్పాలు , మిగిలిన వాళ్ళు సంతోషిస్తారు. 

ఇటువంటి మహా మూర్తి , తేజోశాలి అయిన వాడు తపో మంటపం లోకి వచ్చి, నాకు ఇది కావలి అని అడిగితే అది ఇచ్చినంత మాత్రం చేత అక్షయమైన ఫలితాలని ఇస్తుంది. అంతటి మహానుభావుడు వచ్చి యాచించటమే గొప్ప, అటువంటి వాడు వచ్చి యాచించ టం కన్నా అదృష్టం ఏమి ఉంటుందయ్యా. ఇవ్వాళా నువ్వు యాగం ఒకందుకు మొదలుపెట్టావ్ , నీ అదృష్టం పండి ఆయన ఒకందుకు వచ్చాడు. ఆయన మనసులో పుట్టిన కోర్కె తీర్చి నువ్వు ఈ యాగం ఆపేయి. ఆయన మనసు సంతోషించినదా నువ్వు అపారమైన పుణ్యాన్ని పొందుతావు. 

కొడుకు అంత పుణ్యం చేసాడా , నీ తండ్రి ఉన్నత గతులు పొందుతాడు. ఇంక ఇంతకన్నా ఏమి కావలి , కాబట్టి ఆపెసేయి యాగాన్ని అన్నాడు. వెంటనే ఆ యాగాన్ని ఆపు చేసారు. కానీ అప్పటికే అక్కడ ఉన్న ఋత్విక్కులు చెప్పిన మంత్రాలకి తక్షకుడు అగ్నిహోత్రాన్ని వెదజల్లుతూ , ఇంద్రుడి సింహాసనం నించి వేరైపోయి, ఆయన ఆ మంత్రం శక్తి కి ఆగలేక , వచ్చి హోమ గుండం లో పడిపోతున్నాడు. 

వెంటనే ఆస్తికుడు అలా ఉండు నువ్వేమి భయపడక్కర్లేదు, అందులో పడక్కర్లేదు యాగాగ్ని యందు అన్నాడు. ఆస్తికుని మాట యొక్క ప్రభావానికి , తక్షకుడు , అగ్ని యందు పడకుండా తప్పుకుని పక్కకు పడ్డాడు. పడి బ్రతికి పోయాడు, ఆ కారణం చేత ఇప్పటికి ఎక్కడ ఆస్తీకుని యొక్క కధ ని చెప్పుకుంటారో, ఎక్కడ ఆస్తీక మహర్షిని తలుచుకుంటారో, అక్కడ ఎంత విషపూరితమైన సర్పములు తలలు దిన్చేస్తాయిట. 

ఆస్తీకుని కధ విన్నవారికి, భక్తితో ఆయన ని నమస్కరించిన వారికి పాములు రావు. ఎవరైతే  ఆ జరత్కారుడికి  ఈ జరత్కారువు కి పుట్టిన ఈ ఆస్తీకుని వలన ఉభయ వంశములు తరించి , సర్ప యాగం లో పాములు పడకుండా రక్షింప బడి నటువంటి వారికి పాముల వంటి పాపములు తొలగి వారు భగవంతుణ్ణి చేరటానికి , భగవంతుని అనుగ్రహం పొందటానికి యోగ్యమైన స్థితిని పొందుతారు అని ఫలశ్రుతి చెప్పారు. 

మహోత్క్రుష్ట మైనటువంటి జనమేజయ సర్ప యాగం ఆస్తీక మహర్షి వల్ల అగింతువంటి సందర్భాన్ని, కద్రువ కృత యుగం లో ఇచ్చిన శాపం కలియుగం లో ఎలా కట్టి కుడిపిందో , బ్రహ్మ గారు అన్న వాక్కు నిజమై ఆస్తీకుడు అనేటువంటి ఒక మహా పురుషుడు యాగాన్ని ఆపి, దుష్ట సర్పములు నశించిన తరువాత మిగిలిన పాములు ఎలా బ్రతికయో,ఈ కధలో చెప్పబడింది. 

అంటే ఒక్కసారి మహా పురుషులైన వారు కోపం తో కానీ , అనుగ్రహం తో కాని ఒక వాక్కు ని విడిచి పెట్టేసారు అది ఎప్పుడో అప్పుడు అనుభవం లోకి వచ్చి తీరుతుంది అని మనకి అనేకమైన ధర్మ సూక్ష్మములతో కూడినటువంటి ఈ కధా భాగాన్ని మహానుభావుడు మనకి అందించి నన్నయ్య భట్టారకుడు మానని కృతార్ధులని చేసారు. 














Friday, September 12, 2014

ఆదిపర్వం 15

గరుత్మంతుడు అమృతాన్ని తీస్కుని వచ్చినా , పాములు ఆ అమృతాన్ని పొందలేని స్థితి ని  విన్న ఆది శేషుడు,ఆయన  కుడా కద్రువ యొక్క సంతానములో ఒక్కడే కానీ ఆయన తీవ్రమైన పరితాపాన్ని పొందాడు. మా అమ్మా నా సోదరులు కుడా చాలా ప్రవర్తించ కూడని విధానం లో ప్రవర్తిస్తున్నారు, ఆ వినతని ఆమె కుమారుడైన గరుత్మంతుణ్ణి మిక్కిలి ఖేదమునకు గురిచేసారు. అటువంటి సోదరులతో నేను కలిసి ఉండను అనుకున్నాడు.

అయితే ధర్మ పక్షపాతి అయినటువంటి వ్యక్తి కి ఎప్పుడూ  ఈశ్వర అనుగ్రహం ఉంటుంది. ఎవరితో కలిసి ఉన్నాడు ఎవరితో విడిపోయాడు అన్న దానికి ప్రాతిపదిక ధర్మం అయితే, దానికి భగవంతుని కృప ఉంటుంది. ఆది శేషుని యొక్క ఖేదం , సోదరులమీద ఎందుకు అంటే వారు సరియైన  ప్రవర్తన కలిగిన వారు కారు అని  కా బట్టి ఆయన చతుర్ముఖ బ్రహ్మ గారి గురించి తపస్సు చేసారు. ఆ తపస్సు కూడా ఒక్క చోట చేసిన తపస్సు కాదు , ఆయనా గంధ మాదన పర్వతం దగ్గర మొదలుపెట్టి  భదరి క్షేత్రం లో హిమాలయలమీద , గోకర్ణం లో పుష్కరార ణ్యం లో అత్యంత పుణ్య క్షేత్రాల లో తపస్సు చేసాడు.

ఆయన తపస్సు చేస్తే ఆయన తపస్సుకి మెచ్చి చతుర్ముఖ బ్రహ్మ గారు ప్రత్యక్షం అయ్యారు, అయ్యి ఏమి కావలి అని  అడిగారు. అప్పుడు ఆయన బ్రహ్మ గారి వైపు చూసి ఇలా అన్నాడు "నా తల్లి కద్రువా , నా సోదరులు కలిసి వినత ను గరుత్మంతుని అనేక ఇబ్బందులు  పెట్టారు. ఆ సోదరులలో  ఒకడనైన నాకు కూడా ఆ పాపం లో కొంత వస్తుంది. కాబట్టి నాకు ఇంక ఈ శరీరం లో ఉండాలి అని లేదు , కాబట్టి ఈ శరీరాన్ని విడిచి పెట్టాలి అంటే ఆత్మ హత్య చేస్కోవాలి. అది మహా పాతకం చెయ్యకూడదు , కాబట్టి నేను తపస్సు చేసి ఈ శరీరాన్ని విడిచి పెట్టాలి  అనుకుంటున్నాను. నేను చేసి ఉండకపోవచ్చు మా అమ్మ మాట విని మా తమ్ములు చేసిన పనికి నాకు కూడా పాపం కలిగి ఉండొచ్చు, కాబట్టి నేను ఆ పాపం నుండి వినుర్ముక్తుడను అవుతాను అన్నాడు.

అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు ఒక చిరునవ్వు నవ్వి , నీవు నిత్య సత్య నిరతుండవు, నీకు సత్యమునందు , ధర్మం నందు తాపత్రయం ఉంది. ఎప్పుడైతే నీకు అలాంటి భావన ఉందో అప్పుడే నీ పాపం కాలిపోయింది. నిత్య సత్య ధర్మ వ్రతుడైన వాడు ,  దేనినైన భరించే స్థితి ని  పొందుతాడు. ఆదిశేషుడు సోదరులు ఇలా ప్రవర్తిస్తునారు అని  ఆయన కి ఉన్న బాలానికి ఆయనే చంపెయ్యోచ్చు వారిని కానీ చంపలేదు  భరించాడు, ఇంత భరించగల శక్తి ఉందే , అది పనికి రావాలి ఇప్పుడు. దేవతలు దాన్ని వాడుకోవాలి, అంతే కానీ నువ్వు శరీరం వదిలేస్తే ఏమి వస్తుంది, అందుకని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నేను ఒక బృహత్కర కార్యం చెప్తాను , నువ్వు ఈ భూమండలాన్ని అంతటినీ నీ పడగల మీద భరించి ఉంచు అన్నాడు బ్రహ్మ గారు.

భూమికి ఎప్పుడు బరువు అవుతుంది అంటే , ధర్మ నిరతిని ప్రజలు విడిచి పెట్టేసినా , సత్య నిష్టను వదిలి పెట్టినా , భూమికి బరువు అవుతుంది. భూమి ఎవరికి చెప్తుoది అంటే రక్షణ చెయ్య గలిగిన వాడు స్థితి కారుడు  విష్ణువు కాబట్టి ఆయనకి చెప్తుంది. నేను ఈ భూభారమును అంటే పాపం ను మొయ్యలేక పోతున్నాను అంటుంది. అప్పుడు ఈశ్వరుడు ఏమి చేస్తాడు అంటే అవతార స్వీకారం చేస్తాడు. ఎవరు అధర్మం పెచ్చరిల్ల టానికి కారణం అయ్యి ఉన్నారో  వారిని చనకుతారు.

కాబట్టి ఇప్పుడు భూమి భారము ను పంచుకోవటానికి ఎవరు సమర్ధుడు, సత్య ధర్మం యందు ఉన్న వారు భూమి తో ఉంటె , భూమాత సంతోషిస్తుంది , వాళ్ళు ఉన్నారు అని. అంత సత్య ధర్మ వ్రతుడవైన నువ్వు ఈ భూ భారము ను మొయ్య టానికి అర్హుడవు, కాబట్టి నీ పడగల చేత ఈ భారమును వహించు అని ఆయన ఒక సలహా చెప్పారు బ్రహ్మ గారు   నీ సోదరులు కేవలము పాములే కాదు గరుత్మంతుడు కూడా నీకు సోదరుడే మిగిలిన పాముల విషయం పక్కన    పెట్టు. పుణ్యాత్ముడు , ధర్మాత్ముడు , గొప్ప ఈశ్వర విభూతి కలిగిన వాడితో సంభంధాన్ని ఎన్నడూ విడిచి పెట్టుకోవద్దు. ఇది ఏనాటికి అందరికి తెలియవలసిన విషయం. ప్రయత్న పూర్వకం గా నువ్వు గరుత్మంతుని తో నువ్వు చెలిమి చెయ్యి అని చెప్పి , ఆదిసేషుణ్ణి భూ భారం  వహిoచటానికి నియత్రించారు బ్రహ్మ గారు. అప్పటి నించి ఆయన ఆ భూ భారమును వహిస్తున్నాడు.

అందరూ అన్నతమ్ములే కానీ భగవంతుని స్మరిస్తూ ఆయన తో సంబంధం పెట్టుకున్న వారు ఇద్దరు తల్లి శాపం నించి తప్పుకున్నారు , ఒకరు ఆదిశేషుడు , ఇంకొకరు వాసుకి.
క్షీర సాగర మదనం అప్పుడు మందర పర్వతాన్ని కవ్వం గా చేసుకుని చిలకటానికి ఒక తాడు కావాల్సి వచ్చింది. అప్పుడు వాసుకిది చాలా పెద్ద శరీరం కాబట్టి , వాసుకి ని చుట్టారు మందర పర్వతానికి.  అది అంత తేలికైన విషయం కాదు , పర్వతం కి వేసి తిప్పుతుంటే అది ఎంత బాధ కలుగుతుందో శరీరానికి , కానీ వారి కోరిక మేరకు , అమృతం పుట్టటం కోసం ,శారీరకం గా అంత డస్సి పోయి, ఈశ్వరుని కొరకు తన శరీరం అంత బడలి పోవటానికి స్వీకరించాడు.

అమ్రుతోత్పాదనం అయిన తరువాత ,దేవతలు  బ్రహ్మ గారికి చెప్పారు, ఈయన ఎంత కష్ట పడ్డాడో తెలుసా మహానుభావుడు . ఎంత బడలిపోయాడో ఆ వొళ్ళంతా ఎంత కంది పోయిoదో. అయినా ఒర్చుకున్నాడు మాకు అమృతం ఇవ్వటానికి , ఈయనని ఏదైనా కృప  చెయ్యాలి అన్నారు , అంటే బ్రహ్మ గారు అన్నారు వీళ్ళ అమ్మ శాపం ఉంది, పాములన్నీ జనమేజయుడు చేసే యాగం లో పడి మరణించాలి. కానీ ఇతను చేసిన దైవ సేవ వలన ఇతన్ని మినహా ఇస్తున్నాను అన్నాడు. ఇతనికి అలా యాగం లో పడి మరణించ వలసిన అగత్యము ఇతనికి కలగదు.

ఆదిశేషుడు బ్రహ్మ గారిదగ్గర వరం పొందాడు , ఆయన బ్రహ్మ గారి యొక్క ఆజ్ఞ అవుదల దాలుస్తు ఉండి పోయాడు.
ఇవతల నా సోదరులకు వచ్చే ఆపద గురించి ఆయన ఆలోచించట్లేదు ,జనమేజయుడు ఏదో ఒక రోజు మొదలు పెట్టేస్తాడు సర్పయాగాన్ని, ఎప్పుడు కృత యుగం లో ఇచ్చింది ఆవిడా శాపం , ఎప్పుడు చేసాడు యజ్ఞం , కలియుగ ప్రారంభం లో చేసాడు యజ్ఞం. ఒక్క సారి ఇచ్చిన శాప వాక్కు కట్టి కుడుప వలసిందే. ఆదిశేషుడు పట్టించు కోడు, అవతల పాములు పట్టించు కోవట్లేదు, ఎప్పుడు సర్ప యాగం జరుగుతుందో అని ఆందోళన తో వాసుకు ఏడుస్తున్నాడు.

ఐరవతాధులు అన్న పాముల జాతిని పిలిచి ఆయన తన బాధ వ్యక్తం చేస్తున్నాడు. వాళ్ళు దుoదుడుకు  స్వభావం కలిగిన వారు. వాళ్ళకి ఎంత మంచి మాట చెప్పినా తలకి ఎక్కదు. ఒకడు చెప్తే తలకి ఎక్కించు కొని వాడే భూమికి భారం. వాళ్ళన్నారు ఏమిటన్నయ్యా అంత బెంగ పెట్టుకుంటావు , యాగం చేసేది ఆయన అయితే , పాడుచేయ్యటం మనకి రాదా ? బోలెడు మార్గాలు ఉన్నాయి యాగం పాడుచెయ్యాటానికి.

జనమేజయుడికి బ్రాహ్మణులు అంటే భక్తి కాబట్టి ,మనం బ్రాహ్మణ వేషాల తో వెళ్దాం. వెళ్తే బ్రాహ్మణులు వచ్చారని స్వాగతం చెప్పి కూర్చోబెట్టి ఏమిటి అంటాడు. చాలా తప్పు ఇలాంటి యాగం చెయ్యకూడదు , చేశావా నీకు రెండూ  పోతాయి , ఇహము  పోతుoది  పరము పోతుంది. ఇక్కడా సుఖం ఉండదు , పైలోకాల లో సుఖం ఉండదు , రెండు పోయే యాగం ఎందుకు చేస్తావ్? అని మనం చెప్తాం , బ్రాహ్మణ భక్తి తో యాగం చెయ్యటం మానేస్తాడు.

ఒక వేళ వినకపోతే మన లోనే కోoదరిని ఆoతరoగికుల మంత్రుల వేషాలు వేయిద్దాం, కామ రూపులం కాబట్టి , మంత్రుల మాట కాదనడుగా. వెళ్లి పరమ ప్రేమతో జనమేజయా ఇటువంటి యాగం చెయ్యొద్దు అని చెప్దాం, వింటాడు.

ఇంకా వినలేదు అనుకో యాగం మొదలు పెట్టి ఋత్విక్కులు కూర్చుంటారు. భక్ష్యం , భోజ్యం , లేహ్యము , చోష్యము. తినేవి తాగేవి నాకేవి ,చప్పరించేవి , ఇవన్ని ఉంటాయిగా , వాటన్నిటి మీదా పాకేద్దాం మనందరం. మనదరం పాకేస్తే విష తుల్యం అయిపోతుంది , దాన్ని హవిస్సు గా ఇవ్వరు గా. అక్కడ హవిస్సు పాత్ర ఉంటుంది , నేతి పాత్ర ఉంటుంది ,వాటన్నింటి మీదా పాకేద్దాం.  అంతేకాదు ఒజ్జలు అంటే ఉపాధ్యాయుడు వాళ్ళు కుర్చుని ఉంటారు యాగం చేద్దాం అని వెళ్లి వాళ్ళ మీద పడదాం పడి తలలెత్తి బుస్స్ అందాం వాళ్ళు లేచి పారిపోతారు. ఇంక దీక్షాభంగం అవుతుంది, ఇంకా యాగం జరగదు. ఏమిటన్నయ్యా బాధ పడతావు వదిలేయి అన్నారు

అందులో ఉన్న కొంతమంది పెద్దలు అన్నారు, మీరు చాలా తేలికగా చేస్తున్నారు రా , ఒక సారి బ్రాహ్మణుడు మత్రోచ్చాటనం చేసి మనం అందులో పడిపోవాలి అన్న సంకల్పం చేసిన వెంటనే అపకారం చెయ్యటానికి వెళ్ళిన మనం ఎక్కడ ఉన్నామో వెతుక్కుంటూ వస్తాయి అగ్ని కీలలు తినటానికి. నువ్వు వాళ్ళ మీద పాకటం కాదు నీ మీదకి అగ్ని పాకుతుంది. ఎందుకంటే అగ్ని కి వ్యాపించే గుణం ఉంది అందుకే అశ్వ శబ్దం తో పిలుస్తారు దాన్ని. నువ్వు నేను దాని మీద పాకటం ఏమిటి , బ్రాహ్మణుల మీద పడటం ఏమిటి ఎమన్నా మతి  ఉందా నువ్వు చేసే ఆలోచనకి , ఏమీ బావోలేదు నువ్వు చెప్పిన ఆలోచన.

వాసుకి తెల్లబోయి వింటున్నాడు , ఎలా దీనికి పరిష్కారం ఏమిటి, మరి వీళ్ళు ఎలా రక్షింపబడతారు. అందులో ఎలా పుత్రుడు అని ఒక పాము , హఠాత్తు గా లేచి  ఒక మాట అన్నాడు. కద్రువ మనందరికీ శాపం పెట్టిన రోజు రాత్రి ఆమె వడిలో తల పెట్టుకుని , నిద్ర రాక పోయిన, నిద్ర వచ్చినట్టు గా నటించి పడుకుని ఉన్నాను. ఆ సమయం లో ఒక ఆశ్చర్య కరమైన సంఘటన జరిగింది.

బ్రహ్మ గారి దగ్గరకి దేవతలంతా వెళ్లారు , వెళ్లి మహా పరాక్రమ వంతులు కదా పాములు. అంత పరాక్రమ వంతులైన జాతిని తన అధర్మానికి , తన అసత్యానికి, చనిపోమ్మని కద్రువ ఎలా శపించిందయ్యా, ఆవిడ ఇచ్చిన వాక్కు కి పాముల జాతంతా నశించి పోవటమే? ఇంత బలవంతులైన పాములు అగ్నిలో పడిపోవాల్సిందే? అందులో ఆదిశేషుడు ఉన్నాడు , వాసుకి ఉన్నాడు, మహానుభావులు ఉన్నారు , వెళ్ళందరూ కూడా మడిసి పోతారా అని అడిగారు దేవతలు.

అడిగితే బ్రహ్మ గారు అన్నారు , అసలు కద్రువ నోటివెంట ఆ మాట వచ్చే లాగా ప్రేరణ ఎందుకు చేసామో తెలుసా మీకు క్రురాకారుల , జగత్తు కి అపకారం చేస్తాయి, అటువంటి పాముల యొక్క పాపపు నడక ,నడత నేను భరించ లేక పోతున్నాను అని భూదేవి ఏడుస్తుంది. అందుకు అవన్నీ నశించిపోవాలి , అవన్నీ నశించి పోవటనికే కద్రువ నోటి వెంట ఆ మాట వచ్చింది. కాబట్టి అవన్నీ నశించి పోవటం దేవతలకి ప్రీతీ కరమే, కాబట్టి మీరేమి బెంగ పెట్టుకోవద్దు. అని

ఇందులో దేవతా సర్పములు కొన్ని ఉన్నాయి, దేవతలకి , మనుష్యులకు ఉపకారం చేసే వి కొన్ని ఉన్నాయి, అవన్నీ ఆ అగ్నిలో పడిపోకుండా ఒకానొకప్పుడు వాసుకి చెల్లెలైన జరత్కారువు వేరొక మునిశ్రేష్టుడైన జరత్కారువు ని వివాహం చేస్కుంటుంది. ఇద్దరి పేరూ కూడా జరత్కారువే , వారిద్దరికీ కూడా అస్తీకుడు అనే ఒక ముని పుడతాడు. ఆ ముని వెళ్లి  జనమేజయుడి యొక్క సర్ప యాగాన్ని ఆపు చేస్తాడు. పాప భూయిస్ట మైన సర్పము లు అన్ని అప్పటివరకు అగ్నిలో పడి కాలిపోతాయి. ఆ తర్వాత కొన్ని కొన్ని సర్పములు , దేవతలతో చెలిమి చేసినవి, పుణ్యం చేసినవి, లోకోపకారం చెయ్యవలసిన పాములు కొన్ని మిగిలి పోతాయి. ఆ విధం గా వాటి సంఖ్య ని తగ్గించేస్తాం. లేకపోతే వాటి సంఖ్య ద్విగుణీకృతo అయిపోతే ఈలోకం లో ప్రాణులు ఏమి మిగలవు. భయం తో చాలా భీభత్స  వాతావరణం ఏర్పడుతుంది . అందుకే ఈ ఏర్పాటు చేసింది. అన్నారు బ్రహ్మ గారు.

కాబట్టి ఇప్పుడు ఆ అస్తీకుడు పుట్టడానికి ,ఆ జరత్కారువు ఎక్కడ ఉన్నాడు , జరకారువు దొరికితే , వాసుకి చెల్లెలైన జరత్కారువు ని ఇచ్చి పెళ్లి చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఆయన వైపుకి కధ తిరిగింది. ఆయన యయావర వంశము నందు శ్రేష్టుడు బ్రహ్మ చారి గొప్ప నియమ పాలనం చేసే వాడు. ఇంక ఎంత ఘోరమైన బ్రహ్మ చర్యం అంటే ఆయన ఊర్థ్వ రేతస్కుడు. ఆయన భార్య అన్న మాటని కూడా స్మరణ లోకి రానివ్వలేదు.  అంత గొప్పగా శాస్త్రాధ్యయనం చేశాడు , అంత గొప్ప తపస్సు చేసాడు. కానీ బ్రహ్మ చారిగా తపస్సు చెయ్యటం చాల గొప్ప పని , కానీ ఇవి ఎంత వరకూ పనికి వస్తాయి, ఒక వయస్సు వరకు, ఒక వయసు తర్వాత వివాహం నేను చేస్కోవటమా చేస్కోక పోవటమా అన్న విషయం లో నాకు స్వేచ్చ ఉండదు.

సనాతన ధర్మం లో ఎట్టి పరిస్థితులలో, మీరు వివాహం చేస్కో కుండా ఉండరాదు , ఎందుకంటే , దాని వలన మీరు రుణపడిపోతారు. తండ్రికి కొడుకు పుట్టీ పుట్ట గానే ఋణ పడిపోతాడు, ఆయన నన్ను ఎలా కన్నడో అలాగే నేను ఒక కొడుకుని కనాలి. కంటే తప్ప ఆ ఋణం పోదు, ఒక వేళ తండ్రి శరీరం విడిచి పెట్టేసినా, పితృదేవతలు చూస్తూ ఉంటారు ,వీడు కన్నడా కొడుకుని అని.

ఇప్పడు ఆ జరత్కారువు అనుకున్నాడు , ఇప్పుడు భార్యని స్వీకరిస్తే , పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే మాయ కమ్ముతుంది. అసలు నేను పాణిగ్రహణం చెయ్యను, నాకు భార్య  వద్దు,  గృహస్తాశ్రమం వద్దు అని పెళ్లి చేస్కోకుండా ఉండిపోయాడు. ఒకరోజు ఎందుకో ఈశ్వరుని యొక్క అనుగ్రహం , ఒక ప్రాంతం లో తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్న సమయం లో అక్కడ నీటి తో కూడిన ఒక చిన్న సరస్సు ఒకటి ఉంది.  అక్కడ అవురు గడ్డి తో చెయ్య బడ్డ  దుబ్బులు కొన్ని ఉన్నాయి. ఆ దుబ్బుల యొక్క వేరులు ఎలుకలు కోరికేసాయి. ఒకే ఒక వేరు ఉంది . అసలే అది గడ్డి దుబ్బు , ఆ గడ్డిదుబ్బు కి ఉన్నది ఒక్క వేరు ఆ గడ్డి దుబ్బుకి గడ్డి పరకలు చాలా ఉంటై కదండీ, ఆ పరకలన్ని పట్టుకుని కొంత మంది తల కిందులు గా వేలాడుతూ సూర్య కిరణాలూ తింటున్నారు.

వాళ్ళని చూసి ఈయన అన్నాడు , అబ్బో ఇదొక గొప్ప తపస్సు లా ఉంది. ఒకవేరు ఉన్న గడ్డి దుబ్బుకున్న గడ్డి పరకల కి వేలాడుతూ ఇంతమంది సూర్యకిరణాలు తింటున్నారు . గడ గడ వణికిపోతూ ఉన్నారు , తలలు కంపిస్తున్నాయి , నాడులు పైకి వచ్చి ఉన్నాయి. ఇంత గొప్ప తపస్సు ఎలా చేస్తున్నారు , దీని గొప్పతనం ఏంటో నాకు చెప్తే నేనూ  చేస్తాను అన్నాడు.

 ఆ తల కిందులుగా  వేలాడుతున్న వారు అన్నారు, మా వంశం లో జరత్కారువు అనబడే వాడు ఒకడు పుట్టాడు. వాడు పెళ్లి చేస్కోను అని భీష్మి చాడు , ఆ కారణం చేత ఇలా తిరగేసి కట్ట బడ్డాo. ఆ వేరులు ఆ పిల్లవాడు పెళ్లి చేస్కోకుండా ఉన్నకొద్ది ,యమ ధర్మ రాజు ఎలక రూపం లో కోరికేస్తునాడు ఆ వేర్లని, ఇప్పుడు మా పుణ్యం , మేము చేసిన తపస్సు మమల్ని రక్షించ కుండా పోతుంది. మేము చాలా ధార్మికం గా జీవించాం , మేము చాలా గొప్ప తపస్సు చేసాం కాని, ఉపయోగం ఏముంది , మా వంశం లో పుట్టిన వాడు పెళ్లి చేస్కోవటం మానేసాడు , దానివల్ల ఇంకొక్క వేరు ఉండిపో యింది.

అంటే ఇంకా వాడు పెళ్లి చేసుకుని కొడుకుని కనటానికి చాలా కొంచం సమయమే మిగిలి ఉంది, వాడుకనుక ఈ కొంత సమయo కూడా పెళ్లి చేస్కోకుండా ఉండి పోతే, యమధర్మ రాజు ఈ వేరు కూడా కోరికేస్తాడు, కోరక గానే అంతే వేగం తో మేము అధో లోకములకి వెళ్లి పోతాము. ఇక మాకు ఊర్ధ్వ లోక వాసం ఉండదు. మేము చెయ్యని పాపానికి , మేము చెయ్యని నేరానికి, ఒక ధూర్థుడైన కొడుకు , పెళ్లి చేస్కోకుండా ఉండి పోయి మేము లోకాన్ని ఉద్ద రిస్తున్నాన ని చెప్పు కుంటున్న వాడి వల్ల మేము ఇంతటి నేరాన్ని పొందాము.

వాడు తప్పస్సు చెయ్యక్కర్లేదు ఇంకోటీ చెయ్యకర్లేదు ,వాడు గృహస్తాశ్రమం స్వీకరించి , వాడి ధర్మం వాడు చేసి ఉంటె, మేమందరం తరించే వాళ్ళo కాబట్టి నాయనా నువ్వెవరో మా యందు ప్రీతీ కలిగిన బందువు మాట్లాడినట్టు మాట్లాడవు , నీకు ఎప్పుడైనా ఆ జర్కారువు అన్న వాడు కనపడితే వాడికి చెప్పవయ్యా మా బతుకు
ఇలా ఉంది అని అన్నారు.

అంటే ఆయన అన్నాడు , అయ్యయ్యో మీరు వెతక మన్న జరకారువు ఎవరో కాదు ,నేనే , మీరే నా తాత తండ్రులు, నేను ఎంత అపరాధం చేశాను , ఏమిటో ఇన్నాళ్ళు పెల్లిచేస్కో కుండ ఉండిపోవటo గొప్ప అని ఇలా ఉండిపోయాను. కాబట్టి నేను పెల్లిచేస్కుంటాను . మిమ్మల్ని చూసి భాద పడ్డాను , నేను పెళ్లి చేస్కోక పోవటం వలన ఎంత ప్రమాదం వచ్చింది అని ఇప్పుడు అర్థం అయ్యింది. కాబట్టి నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి నేను వివాహం చేస్కుంటాను. చేస్కుని తప్పకుండా సంతానాన్ని కాంటాను, నేను సంతానాన్ని కంటే మీరు ఉర్థ్వ లోకాలకి  వెళ్తారు. కాబట్టి ఈ ఒక్క వేరు కోరక బడే లోపలే నేను వివాహం చేస్కుంటాను.

ఇప్పుడు ఆయన తండ్రి తాతలు అంటున్నారు, యజ్ఞాలే చెయ్యనీ , యాగాలే చెయ్యని , ఘోర నిష్ట తో తపస్సులే చెయ్యనీ వివాహము చేసుకుని సంతానము ని కానని వాడిని ,ఎట్టి పరిస్థితుల లో స్వర్గ ద్వారము చూడ నివ్వరు. కాబట్టి వివాహం చేస్కోవలసిందే.

ఇప్పుడు ఆ జరత్కారువు ఆయన తండ్రి తాతల తో అంటున్నాడు, నేను వివాహం చేస్కుంటాను కాని నాది ఒక్క కోరిక నాకు ఎ పేరు ఉందొ ఆ పేరే ఉన్న పిల్ల దొరికితే చేస్కుంటాను అన్నాడు. ఇప్పుడు జరత్కారువు అనే పిల్ల కోసం తిరుగుతున్నాడు దేశం అంతా , ఇలా వెతుక్కుంటుంటే వాసుకి చూసాడు, ఆ వాసుకి జరత్కారుడి తో మాట్లాడుతున్నాడు.

నువ్వు  బ్రహ్మచారి వి కనుక, ఏమిటో తెలుసా భిక్ష , మీది అద్భతమైన వంశం , నిశ్చితార్దం చేస్కునే ముందు ఈ మాటలు చెప్పి చేస్కోవాలి. మీ వంశం చాలా గొప్పది , మా వంశము చాలా గొప్పది, ఇవ్వాళ  మా వంశం ధన్యత
 చెందింది మీ వంశం తో వియ్యం పొందటం వలన, నా చెల్లెలు ఉంది ఆమె పేరు జర్కరువు, నీ పేరు జరత్కారుడు, ఇద్దరి పేర్లు ,గుణములు కలిసాయి, అన్నిటికన్నా ప్రధానము ఏది అంటే వివాహంలో గుణములు కలవాలి. ఇప్పుడు ఇద్దరి పేర్లు , గుణాలు కలిసాయి పెళ్లి చేస్కుంటాను అన్నాడు జర్కారువు. కానీ  ఎన్నాళ్ళు నువ్వు






Wednesday, September 10, 2014

ఆదిపర్వం 14 (అమ్రుతాపహరణం)

అమ్రుతాపహరణం కొరకు గరుత్మంతుడు , స్వర్గం వైపుకు బయలుదేరాడు. స్వర్గలోకానికి వెళ్లేసరికి దేవేంద్రుడి సభ జరుగుతుంది. ఆ దేవేంద్ర సభలో కొన్ని దుశ్శకునములు కనపడ్డాయి అన్నారు. ఏమిటి అవి అంటే , అకస్మాత్తుగా నిప్పు రవ్వ లు పడ్డాయి, దానితో పాటుగా వజ్రాయుధం యొక్క అంచులు మొక్కవోయాయి, దిక్కులన్ని కూడా కాంతి విహినం అయిపోయాయి, అకస్మాత్తుగా  దిక్పా లకుల మనస్సులలో  భయము , ఉద్వేగము కలిగాయి. వెంటనే దేవేంద్రుడు బృహస్పతి వంక చూసాడు , గురువుగారు ఇన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, దుశ్శకునములు కనపడుతున్నాయి, ఎందువలన ఇలా కనపడుతున్నాయి అని అడిగారు.
అంటే బృహస్పతి అన్నాడు "నా యనా ఇంద్రా ! కశ్యప ప్రజాపతి పుత్ర్కమేష్టి చేస్తే పుట్టిన వాడు , అపర తేజోవంతుడు, వాలఖిల్యుల యొక్క వరం చేత పుట్టిన పిల్లవాడు అత్యుగ్రమైన ప్రాణులైన నిషాదులందరినీ  ఒక్క క్షణం లో మింగినటువంటి మహానుభావుడు, ఏనుగును తాబేటిని రోహిణి యొక్క కొమ్మ మీద పెట్టినప్పుడు ,అది విరగాబోతుంటే రెండు పదములతో ఏనుగుని , తాబేలుని , ముక్కుతో వలఖిల్యులున్న కొమ్మని ముక్కుతో పట్టుకుని వెళ్లి వలఖిల్యులని రక్షించిన తెజోముర్తి, తన తల్లి దాస్యం పోగాట్టటం కోసమని, అమృతాన్ని పాములకి ఇవ్వడం కోసమని.
కామ రూప సంపన్నుడు , అంటే ఆయన అనుకుంటే చిన్న వాడు అయిపోతాడు, లేదా ఇం కా   పెరిగి పోతాడు , ఇంకో రూపం ధరిస్తాడు. అన్ని శక్తులు ఉన్నటువంటి వాడు , అష్ట సిద్దులు ఉనటువంటి వాడు. కామా గమనుడు అతడు అమృత భాoడం కోసం స్వర్గలోకం వస్తున్నాడు, అతన్ని నువ్వు గెలవలేవు ఇంద్రా అన్నాడు బృహస్పతి.
అతను వాలఖిల్యుల అనుగ్రహం తో పుట్టిన వాడు అన్నాడు. అనగానే వాలఖిల్యుల అనుగ్రహం తోటి ఎందుకు పుట్ట వలసి వచ్చింది గరుత్మన్తుండు అని అడిగాడు ఇంద్రుడు.
ఆ వాలఖిల్యులు బ్రహ్మ గారి పుత్రులు, ఇంద్రుడు కశ్యప ప్రజాపతి కుమారుడు , కశ్యప ప్రజాపతికి అదితి అన్న భార్య యందు పుట్టిన వాడు. ఇంద్రుడు , వాలఖిల్యులు కూడా కశ్యప ప్రజాపతి చేసే యజ్ఞానికి వెళ్లారు , ఎప్పుడు చేశాడు యజ్ఞం , ముందు చెప్పినట్టు వినత , కద్రువ పిల్లలు కోరుకునప్పుడు , దైవానుగ్రహం కోరి పుత్ర కామేష్టి చేసాడు. యజ్ఞం చేసేటప్పుడు వీళ్ళందరూ వెళ్లారు , యజ్ఞం చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది. యజ్ఞం చేసే వాడు దీక్షితుడై ఉంటాడు.పీటల మీద నించి లేవకూడదు.  ఆయన మీద ప్రేమ ఉన్నవారు , ఆయన కి సహకరించాలి. వాలఖిల్యులు అంగుస్ట మాత్రమే ఉన్నా వారు బ్రహ్మ పుత్రులు ,మహాతేజోవంతులు , ఆజన్మ బ్రహ్మ చారులు ,అయినప్పటికీ  కశ్యప యజ్ఞం చేస్తున్నాడు , మనం మనకి తోచిన సాయం చెయ్యాలి అనుకున్నారు. దానికి కోసం వాళ్ళు కాసిని పువ్వులు కోసి , దర్భలు కోసి , మోదుగ పుల్లలు కోసి, అవి అగ్నిహోత్రం లో వేస్తారు , ఇంత ఉన్నవాళ్లు ఎన్ని పుల్లల కట్టలు ఎత్తుతారు. మీరు ఏమి చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు , ఎంత ప్రేమ తో చేస్తున్నారు అనేది ముఖ్యం.
ఇప్పుడు ఇంద్రుడు కూడా  పుల్లల కట్ట  సమిధల కట్టా , తనూ ఎందుకు చెయ్యాలి , ధర్మానికి చేస్తున్నాడు. తండ్రిగారు యజ్ఞం చేస్తుంటే కొడుకు చెయ్యక ఎవరు చేస్తారు.
ఇప్పుడు వలఖిల్యులని చూసి ఇంద్రుడు  వీళ్ళు ఎంత వాళ్ళు తెచ్చే సమిధలు ఎన్ని దీనికి అంత అగరపు అంత అలుపునా అని వీలు తెచ్చేవి ఏ మూలకి వస్తాయి అని ఇంద్రుడు పక పక నవ్వాడు. అప్పుడు ఆ వాలఖిల్యులు అన్నారు నువ్వు ఇంద్రుడివి అని కదా నవ్వావు , నీకంటే గొప్ప వాడు , యుద్దము నందు గెలవబడని వాడు , ఆయన ముందు ఎవరు యుద్ధం లో గెలవలేరు. స్వత్తఃసిద్దంగా అణిమాది అష్ట సిద్దులూ సాధించుకున్న వాడు, అటువంటి మహా పురుషుడు ఒకడు ఇప్పుడు ఈ పుత్రా కామేష్టి వలన కశ్యప ప్రజాపతి కి పుత్రుడిగా జన్మించు గాక
అన్నారు. ఈ ఇంద్రుడి కి ఇంద్రుడు అవుతాడు. వెంటనే కశ్యప ప్రజాపతి ధర్మమ్  చుడండి ఆయన అన్నాడు ఈ ఇంద్రుడు తన భుజ బాల శక్తి తో లోకాన ఉండే ప్రనులన్నింటిని కాపాడుతున్నాడు. ఇంద్రుడు అని మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మ గారు నిర్ణయం చేసారు , (ఒక పెద్ద వారు నిర్ణయం చేసినప్పుడు ఎంత గౌర్వమ్థొ ఆ నిర్ణయాన్ని అవుదల దాల్చాలో చుడండి) ఒక ఇంద్రుడు ఉండగా మళ్ళి ఇప్పుడు పుట్టబోయే పిల్లవాడిని ఇంద్రుణ్ణి చేస్తే బ్రహ్మగారు నోచ్చుకోరటయ్యా అని ఎవరిమానన వారు ఇంత మంది ఇంద్రుళ్ళ లో ఎవరు ఏది చెయ్యాలి అని పరమేస్టి కి ఎంత తలపోటు ?  కాబట్టి వద్దు , కానీ మీ మాట వృధా పోరాదు , ఈ పుట్ట బోయే పిల్లవాడు పక్షులకు ఇంద్రుడు అవుగాక అని అన్నాడు.
కాబట్టి శరీరం పక్షి శరీరం అయినా ఇంద్రుడు గెలవలేడు , అన్ని గుణములు కలవాడు.  ఇప్పుడు వలఖిల్యులలో కూడా గొప్పతనం ఎక్కడ ఉంది అంటే , వాళ్ళు పెంకితనానికి పోకుండా వొప్పుకుని తదాస్తు అన్నారు.  అందుకే ఉత్తముడైన వాడి కోపం ఒక్క క్షణం ఉంటుంది.
ఇప్పుడు ఈ కధ నీకు తెలియంది కాదు కదా అని బృహస్పతి ఇంద్రుడితో చెప్తున్నాడు. కాబట్టి వాలఖిల్యుల అనుగ్రహం తో పుట్టిన వాడు ,  అమృతాపహరణా ని కి వస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఆపగలవు, ఆపలేవు అని బృహస్పతి చెప్పా వలసిన మాట చెప్పేసారు. ఇప్పుడు ప్రయత్నం పురుష లక్షణం. కాబట్టి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తే , అమృతం అమృతాన్నే పండిస్తుంది మహాభారతం లో. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు కొంత మంది రక్షకులని పిలిపించి  అమృత భాండానికి రక్షణ చేస్తూ గరుత్మంతుని తో యుద్ధం చెయ్యండి అని అన్నాడు. ఆయన కుడా వెళ్ళాడు. ఆ అమృత భాండా న్ని రక్షణ చేసే వాళ్ళు సామాన్య మైన టువంటి వారు కాదు గొప్ప బాహు బలము కలిగిన తువంటి వాళ్ళు ,  బాగా  వాడి అయిన కడ్గాలు పట్టు కున్న వాళ్ళు,   నల్ల ని పచ్చ ని యెర్రని మెరిసి పోతున్నటు వంటి కవచములు కట్టుకున్న వాళ్ళు. వాళ్ళందరూ కూడా గరుత్మంతునితో యుద్ధాన్ని ప్రారంభం చేసారు. ఆయన కి వేరే ఆయుధం అక్కర్లేదు ఆయన ముక్కూ , రెక్కలే చాలు.
 ఇప్పుడు యుద్ధం మొదలైంది. ఆ గరుత్మంతుడు, ఆయన రెక్కలని అల్లారుస్తూ, ఆ స్వర్గలోకం లో ఒక్కసారి విహరించి , వాళ్ళని తన రెక్కలతో కొట్టి ముక్కుతో వాళ్ళని పొడుస్తుంటే, అక్కడ ఒక్కసారి ,పిడుగులు కొన్ని వేల పిడుగులు  పడితే గాలి  ఎలా వస్తుందో  అలా   ఉంది అక్కడ వాతావరణం. తెల్లటి మబ్బులు గాలికి కొట్టబడితే ఎలా ఉంటాయో అలా అక్కడ కాపు కాస్తున్న వీరులందరినీ చెదరగోట్టాడు. ఆయన రెక్కల చేత కొట్టబడి, ముక్కు తో పోడవ బడి, శరీరము నుండి  రక్త దారాలు కారుతుండగా ,వారందరూ కూడా ఇంద్రుడి వెనకకు వెళ్లి దాక్కున్నారు, సాత్యులు పూర్వ దిక్కుకు పారిపోయారు, వసువులు రుద్రులు దక్షిణ దిక్కు కు పారిపోయారు. డబ్బు లేని వారు దక్షిణ కొరకు ఆశ్రయించి నట్టు దక్షిణ దిక్కుని ఆశ్రయించారు అన్నారు. ఆదిచ్యులు , ఆస్వినులు వారందరూ ఉత్తర దిక్కు కు పారిపోయారు. ఇంకా మిగిలినటువంటి , అగ్ని , వాయువు , యముడు మిగిలనుటువంటి దేవతలు, శరీరము నకు కారుతున్నతువంటి ఆ రక్తము కారుతుండగా ఆ దేవలోకం విడిచి పెట్టి పారిపోయారు.
ఇప్పుడు ఆ అమృత భాండం దగ్గరకు వెళ్లి ఆ అమృత భాండం తీస్కొని వెళ్ళటానికి ఉద్యుక్తుడు అయ్యాడు. దానిపైన పదునైన ఆకులు కలిగిన ఒక చక్రం తిరుగుతుంది. ఆ చక్రం కింద రెండు పాములు ఉన్నాయ్ , ఆ రెండు పాముల నోటిలోనించి అగ్నిహోత్రాన్ని వేదజల్లుతున్నై. ఆ అగ్ని హోత్రం ఎలా పైకి లేస్తుంది అంటే, తలపైకి ఎత్తి ఏదో  అందిన మధురపదార్థం నాకుతున్నట్టు , వాటి నోట్లోనించి అగ్నిహోత్రం పైకి ఎగజిమ్ముతూ ఆకాశాన్ని  నాకుతుంది.
చూసాడు మహానుభావుడు, ఒక్క సారి భూమి మీదకి వచ్చి సమస్త జలాశయాల్లో ఉన్న నీటి ని తన దోసిట పట్టి, అకస్మాత్తుగా దేవలోకం వెళ్లి , ఆ చక్రం మధ్య గా వస్తున్న అగ్ని హోత్రం మీద ఇన్ని నదుల నీళ్లన్నీ పోసేసాడు. ఇప్పుడు ఆ అగ్ని హోత్రం చల్లరిపొయింది అది గరుత్మంతుని బలం అంటే, ఆ బలాన్ని స్మరించి దాన్ని వింటే చాలు అంత గొప్ప రక్షణ కలుగుతుంది.
 ఆయన కామరూపం కలిగిన వాడు కదండీ , ఆ చక్రం కింద ఉండి  ,  భయంకరం గా అగ్ని చూస్తున్న ఆ నగుల్ని చూసాడు. ఆ పైన తిరుగుతున్నా చక్రాన్ని చూసాడు.  సుక్ష్మ రూపాన్ని పొంది, చక్రం పైనించి కాకుండా చక్రం కిందనించి కిందకి దూరాడు.
కిందకి దూరి,  తన వైపే చూస్తూ అగ్నిహోత్రం విడిచిపెట్ట టానికి ప్రయత్నిస్తున్న ఆ నగుల కన్నులలో ధూళి పడి వాటికి కన్నులు కనపడకుండా ఆ రెక్కల్ని అల్లర్చి నందుకు ,కన్నులు కనపడక ఆ పాములు చెల్లా చెదురై పోయాయి.
ఇప్పుడు ఆ అమృత భండాన్ని పట్టుకుని , భూలోకం వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఆయన వేల్లిపోతున్నప్పుడు శ్రీ మహా విష్ణువు ఎదురువచ్చారు, ఎదురు వచ్చి అన్నారు
ఒక్కడు ఇంత మందిని జయించి ఆ అమృత భండాన్ని గైకొని, వెళ్లి పోతూ వెళ్ళిపోతూ  దేవాసురులు అందరూ కూడా తగలనుకునే అమృతం తనకి  చిక్కి నా  ఒక్క చుక్క కూడా ముక్కు పెట్టి తాగకుండా, అమ్మని దాస్యం నించి విడిపించటానికి మాట ఇచ్చిన ప్రకారం అన్నల కి ఇచ్చేయటం కోసం పట్టుకెళ్ళి పోతు అలోలుడై (అమృతం మీద లౌల్యమ్ పొందకుండా ) వెళ్ళిపోతున్న మహా పురుషుడు, కాబట్టి నేను చాలా సంతోషించాను నీకు ఏమివరం కావాలో కోరుకో అన్నాడు, నీ బలానికి నీ మనోజవానికి , నీ అలౌల్యానికి నీ సద్భావనకి , అమ్మని దస్యo నించి విడిపించాలి అని ఇంత కష్ట పడ్డ నిన్ను చూసి చాల సంతోషించాను గరుత్మంతా నీకు ఏమి కావలి కోరుకో అన్నారు శ్రీ మహా విష్ణువు.

అంటే గరుత్మంతుడు అన్నారు ఆయనకి నమస్కారం చేసి అన్నాడు అమృతం తాగితే వ్రుధప్యం రాదు, మృత్యువు రాదు , కానీ నువ్వు చాలా ఉద్దతి తో ఉన్న రాక్షసులను నిగ్రహించాగాలిగిన ధర్మ స్వరూపుడ వైనటు వంటి నారాయణా! నన్ను అనుగ్రహించి , ఈ అమృతాన్ని తాగకుండానే ,  మరణo  రాకుండా వరం ఇయ్యి , నువ్వు రాక్షస విద్వంసం చేస్తూ ఉంటావు , నీ ముందు నిలబడాలి, అప్పుడు ఏమవుతుంది , ఈ బలం ఈ జవం నువ్వు చేసే రాక్షస సంహారానికి పనికి వస్తే ఈ ఉండిపోయిన బలానికి ఒక సార్ధకత, కాబట్టి నాకు జరా మరణముల తో సంభంధం లేని జీవితం తో నీ సన్నిధి ని నిలబడే అదృష్టాన్ని కృపచెయ్యి అని అడిగాడు.

ఇప్పుడు ఆ గరుత్మంతుడు కోరుకున్న వరాన్ని ఇచ్చారు కానీ ఇంద్రుడు మాత్రం తన కర్తవ్య నిర్వహణ తానుచేయ్యాలి కదా , అక్కడ ఉన్న రక్షకులు ఒడిపోయారు.   అందుకని తన వజ్రాయుధం తీసాడు, ఆ వజ్రాయుధపు అంచులు మెరిసిపోతున్నై, అది గరుత్మంతునికి దగ్గరగా వెళ్ళింది , గరుత్మంతుడు ఒక నవ్వు నవ్వి అన్నాడు , నువ్వు  వచ్చావ్ మంచిదే, పాపం ఇంద్రుడు విడిచిపెట్టాడు , నువ్వు వచ్చావు, నీ బలం ఇతరుల మీద చూపించు, నా మీద చూపిస్తే నీకు ఏమి వస్తుంది. నువ్వు ఏమి చెయ్యలేవు, కాని నువ్వు ఏమీ చెయ్యలేక పోయావ్ అనుకో, నీకు కాదు అవమానం , ఎవరికి అవమానమో తెలుసా, నిన్ను దేనితో తయారు చేసారో తెలుసా దదీచి మహర్షి ఎముకలతో తాయారు చేసారు.
దదీచి మహర్షి ఎముకలు దేనితో తయారుచెయ్య బడ్డాయో తెలుసా, బ్రహ్మ జ్ఞానంతా యముకల్లో దాచుకున్నాడు దదీచి మహార్షి, అంత గొప్ప ఎముకలతో చేయ్యబడింది వజ్రాయుధం, ఇప్పుడు వచ్చిన వజ్రాయుధం ఏమీ చెయ్యలేక పోతె ఈ అవమానం ఎవరికి వెళ్తుంది , దదీచి మహర్షి యముకకి వెళ్తుంది . అందుకని ఒక పని చేయి ఒక ఈక ముక్కని తెంపి వెళ్ళిపో అన్నాడు గరుత్మంతుడు.  ఇప్పుడు ఆ వజ్రాయుధం ఆయన మాట మన్నించి ఒక ఈక ముక్కని కోసి వెల్లిపొయింది.
వెళ్లి పోతే అక్కడ ఉన్న ఋషులు మహర్షులు అన్నారు , అమ్మ బాబోయి ఆ రెక్కలేమి ఆ ఈకలేమి , ఆ బలమేమి కాబట్టి ఈయనని మేము సుపర్ణుడు అని కీర్తిస్తున్నాం అన్నారు. అప్పుడు గరుత్మంతునికి సుపర్ణుడు అని బిరుదు నామం వచ్చింది.

ఆ వజ్రాయుధం వెనక్కి వచ్చింది , ఆయన వెళ్ళిపోతున్నాడు అమృత భాండం పట్టుకుని, ఇంద్రుడు పరుగు పరుగు న వచ్చి మహానుభావా ! ఏమి బలం ఏమి   పరాక్రమం, ఏమి శౌర్యమ్, లోకం లో ఇంకేవారికైనా ఉందా , కాబట్టి నీతో నేను స్నేహం చెయ్యాలనుకుంటున్నాను, మనమిద్దరం శత్రువులం కాదు ఇంక నించి. అసలు యదార్ధానికి ఇద్దరూ కశ్యప ప్రజాపతి   బిడ్డలే  కదండీ!

నీకు అమృతం అవసరo  లేదు అంటున్నావు. అమృతం వాళ్ళ ఏమి వస్తుందో అది వచ్చేసింది మహా విష్ణువు వలన. నిన్ను చుస్తే నువ్వు అమరుడవు, అజరుడవు, నీకు వృద్దాప్యం రాదు, నిన్ను ఎవ్వరూ కుడా వోడించ లేరు అజితుడవు. అమేయుడవు, నీ బలం ఇంత అని లెక్క పెట్టటం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి నీకు అమృతం ఎందుకు అక్కర్లేదు, అక్కర్లేని అమృతాన్ని నువ్వు పట్టుకేల్తే వచ్చేఉపద్రవం ఏమిటో తెలుసా , నువ్వు ఎవరికో అమృతం పట్టుకేల్తున్నావు , వాళ్ళు అమృతం తగేస్తారు, వాళ్ళు  ఎటువంటి వాళ్ళో  తెలీదు , నువ్వు ఎవరికి ఇస్తావో  తెలియదు. వాళ్ళు  దేవత లు నిగ్రహించ టానికి వీలు లేని వాళ్ళు అయిపోతారు.

ఇప్పుడు వాళ్ళు పాపబుద్ధి కలిగిన వాళ్ళు  అధర్మాచరణ కలిగిన వాళ్లై , నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళు తాగేస్తే , వాళ్ళని మేము నిగ్రహించ లేకపోతే , ఆ సంతానం లోకం లో పెరిగిపోతే ,   అధర్మo  జడలు విప్పి  నాట్యం చేస్తే , ఇప్పుడు అమృతము నువ్వు ఇచ్చిన కారణం చేతే లోకం లో ధర్మం పాడైపోతే. నీకు ఇన్ని గుణాలు ఉన్నా, నువ్వు చేసిన తప్పు వలన లోకం లో ధర్మం పాడైపోలా కాబట్టి దేనికి పట్టుకేల్తున్నావు నాకు చెప్పు , నీకు ఏమి కావలి కోరుకో అది నేను ఇస్తాను , కానీ ఈ అమృత భాండం తీస్కెళ్ళి ఇవ్వకు , ఉపద్రవం వస్తుంది అన్నాడు. నేను  అమ్మని దాస్యం నించి విడిపించుకోవటానికి అమృతం తెచ్చిఇస్తానని పాములకి మాట ఇచ్చాను అని చెప్పాడు. తెచ్చి ఇమ్మని అడిగారు, తగించమని అనలేదు , కాబట్టి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే నా దాస్యం వదిలి పోతుంది. నువ్వేమి చేస్తావ్ అందకూడని వాళ్ళకి అందకూడదు అని కదా నువ్వు అనుకుంటున్నావ్, కాబట్టి నేను పట్టుకెళ్ళి అక్కడ పెడతాను , పెట్టి స్నానం చేసి వచ్చి తాగండి అని చెప్తాను. వాళ్ళు స్నానం చెయ్యటానికి వెళ్లి నప్పుడు అమృతం తెచ్చేస్కో నీ బలం తోటి మా అమ్మ దాస్యం పోతుంది, అయుగ్యులు వాళ్ళైతే వాళ్ళకి అందకుండా నువ్వు చేస్కో.
అంటే ఇంద్రుడు అన్నాడు చాలా బావుoది అలానే చేద్దాం

నువ్వు పట్టుకెళ్ళి అమృత భాండం వాళ్ళదగ్గర పెట్టి స్నానం చేసి వచ్చి తాగండి అని చెప్పు ఆ తర్వాత కాగల కార్యం గందర్వులు చుస్కుంటారు. మేము చుస్కుంటాం. అని ఆయన అన్నాడు. గరుత్మంతుని బలం గురించి బృహస్పతి చెప్తే విన్నాను , ఇప్పుడు యుద్ధం మాత్రమే చూసాను, మహానుభావా ! నీ శక్తి ఎంతో నాకు చెప్పు అన్నాడు ఇంద్రుడు. సుందరకాండ లో హనుమ ఎలా చెప్పుకోరో అలాగే గరుత్మంతుడు కూడా చెప్పుకోడు.

ఆయన అన్నాడు లోకం లో ఎక్కడైనా తనని తాను పొగుడుకోవటం, ఇతరుల్ని నింద చెయ్యటం ,ఈ రెండూ చెయ్యొచ్చా రెండూ చంపటం , చావటం తో సమానం, కాబట్టి అలా నాబలం ఇంత అని ఎలా చెప్పుకుంటాను , చెప్పకూడదు, కానీ నువ్వు పెద్దవాడివి దేవలోకాధిపతి వి పెద్ద వారు అడిగితే చెప్పాలి , నా బలాన్ని వినయం తో చెప్తున్నాను తప్ప అతిశయం తో మాత్రం కాదు , నువ్వు అడిగావని చెప్తున్నాను అంతే.

నా బలం ఎటువంటిదో  చెప్తున్నాను విను స్థావర జగమముల తో అంటే కదిలే ప్రాణులతో కదలని వాటితో ఉన్న ఈ భూమండలాన్ని అంతటిని కుడా   ఎత్తేసి నా రెక్కల మీద పెట్టుకుని తిప్పేస్తాను. ఈ సముద్ర గర్భం లో రత్నాలు ఉంటాయి , నేను సముద్రం దెగ్గరకి వెళ్లి రెక్కలు ఇలా అల్లరిస్తే ఆ సముద్రంలోని నీళ్ళు రత్నములతో సహా భూమి మీద పడిపోతాయి, చెల్లా చెదురై పడిపోతాయి భూమి మీద. ఇంకేమి ఉండవ్ అక్కడ చూడటానికి. మూడులోకములను క్షణం లో తిరిగి వచ్చేస్తా అది నా బలం , అంత కన్నా ఏమి చెప్పమంటావు బాగుండదు.

ఇంద్రుడు తెల్లబోయి, చాలా సంతోషించి మహానుభావా ! నేను కూడా నీకు ఒక వరo ఇవ్వాలనుకుంటున్నాను. దేవతలకు అదొక లక్షణం , వాళ్ళు ప్రసన్నమై కనపడితే వరం ఇవ్వకుండా ఉండరు.
 ఇప్పుడు ఇంద్రుడు గరుత్మంతునికి వరం ఇచ్చే స్థితి లో ఉన్నాడా , ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు పుచ్చుకోకుండా వెళ్ళిపోవచ్చా గరుత్మంతుడు, దేవతలు కనపడిన తరువాత అడిగి తీరాలి , లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు , అది వాళ్ళ ధర్మం, వాళ్ళ ధర్మo  తప్పితే అసహ్యం గా ఉంటుంది, కాబట్టి  అడగాలి , అడగటానికి ఇంద్రుడు అనుగ్రహిస్తే కానీ పొందలేనిది ఏముంది ఆయన కి ? శ్రీమన్నారాయణుని కే ధ్వజం అయిన వాడు , అమృతం తాగకుండానే , జరా మరణములు లేని వాడు , సహజం గానే ఇంత బలం ఉన్న వాడు, ఇటువంటి వాడికి ఇంద్రుడు ఏమి ఇవ్వాలి కనక.
కానీ వినయం ఉన్న వాడు అడగ గలిగింది అడిగాడు , గరుత్మంతుడు. అది ఆయన వినయం అంటే.  నువ్వు వరం అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను.
మా అమ్మని అంత బాధ పెట్టారు, పిన్నమ్మా అని జాలి చూపించలేదు. పాపం మా అమ్మ అంత ఊడిగం చేస్తుంటే ప్రేమతో వద్దులెమ్మా అక్కర్లేదు దాస్యం అని వదిలిపెట్ట లేదు. నేను పుట్టిన తరువాత నాతో కూడా దాస్యం చేయించు కున్నారు. నేనే బాధ తో వెళ్లి ఆడితే పోన్లే తమ్ముడు దీనికి నువ్వేదో వెళ్లి తీస్కువస్తే దాస్యం నించి విముక్తి పొందాలా అక్కర్లేదు లే, హాయి గా ఇవ్వాళ నించి నువ్వు ఎప్పుడూ మాకు తమ్ముడివే, అని అనలేదు. కారణం లేకుండా వైరం  పెట్టుకుని , మా బలాన్ని వాళ్ళ ఉన్నతి కి ఉపయోగించుకోవాలని కోరుకున్నారు, అది నాకు కడుపులో నిప్పు కణిక గా మిగిలిపొయింది. పోరు నష్టం పొందు లాభం. కాబట్టి ఇప్పుడు నిన్ను నేను అడుగుతున్నాను , ఈ  లోకాల లో ఎక్కడ ఉన్న పాములైన నాకు  ఆహారం అయిపోవాలి. కాబట్టి నాకు ఆ వరం ఇవ్వు అన్నాడు.

నేను ఆ పాముల్ని ఆహారం గా చేస్కోవటానికి నేను వరం ఇవ్వకర్లేదు , నేనే తినెయ్య గలను. అయినా నిన్ను ఎందుకు అడుగు తున్ననో తెలుసా , ఈ భువనముల అన్నిటికి నీకు ఆధిపత్యం ఉంది , పాములు అక్కడ తిరుగుతూ ఉంటాయి. నేను వెళ్లి తింటాను . అప్పుడు అవి నిన్ను ప్రార్ధిస్తే నువ్వు వచ్చి నా పరిపాలన లో ఉన్నాయి , అవి నన్ను ప్రార్ధించాయి , నువ్వు అలా తినేయోచ్చా అని అడుగొచ్చు , నీ పరిపాలన లో ఉన్నదాన్ని నేను తినే ముందు నీ అనుమతి అడిగితే గురవం గా ఉంటుంది. కాబట్టి వరం రూపం లో నీ అనుమతి పుచ్చు కుంటే, నువ్వు జోక్యం చేస్కోవు. అప్పుడు నువ్వు నా మీదకి యుద్దానికి రావక్కర లేదు,  నేను నిన్ను ఒడిoచక్కర లేదు, పది మాట్లు ఇంద్రుణ్ణి ఓడించొచ్చు , కానీ నువ్వు దేవలోకా ధిపతివి, నాకన్నా ముందు పుట్టిన వాడివి , నిన్ను అస్తమానం అగౌరవమ్ చేసి నాకేమి గౌరవమ్ అయ్యా . కాబట్టి నేను నిన్ను అనుమతి ఎందుకు అడిగానో తెలుసా భవిష్య త్తు లో పది మాట్లు నేను నీ జోలికి వచ్చానాన్న అపనింద నాకు రాకూడదు.

కాబట్టి చాలా సంతొషించి తప్పకుండా , నీకు ఆహరం గా ఇచ్చేస్తున్నాను తినేసేయి అన్నాడు.

ఇప్పుడు గరుత్మంతుడు అమృత భండాన్ని తెచ్చి దర్బలతో చెయ్య బడిన ఒక చిన్న చాప లాంటిది ఉంది అక్కడ. దాని మీదా ఆ అమృత భండాన్ని పెట్టాడు. పాములన్నీ గబా గబా సంతోషం గా వచ్చి తగేస్తాం అన్నాయి.

అప్పుడు గరుత్మంతుడు అన్నాడు. చంద్రుడు , సూర్యుడు , అగ్ని , వాయువు సాక్ష్యులు గా చెప్తున్నాను , ఇంద్రుడి చేత రక్షింప బడే అమృతాన్ని ఇమ్మని అడిగారు. నేను పట్టుకోచ్చి మీకు ఇచ్చను , కాబట్టి మా దాస్యం వదిలిపో యిందా ? వదిలిపొయింది అన్నాయి పాములు. ఇంక నించి నేను మా అమ్మా మీకు దాసులం కాము అన్నాడు గరుత్మంతుడు , కాదు అని ఒప్పుకున్నాయి పాములు.

ఈ అమృతాన్ని మీరు అలా ఎలా పడితే అలా వచ్చి తాగేయ్య కూడదు. స్నానం చేసి , చక్కగా ఆభరణములు అవి పెట్టుకుని వచ్చి తగేయండి, అలాగే తాగేస్తాం తమ్ముడు అన్నాయి పాములు. చాల సంతోషం మీకు ఆ అదృష్టం ఉంటె తాగెయ్యండి అని మనసులో అనుకున్నాడు గరుత్మంతుడు. ఆయన వెంటనే ఆయన మూపున అమ్మని కూర్చో పెట్టుకుని అమ్మా నీ దాస్యం అయిపొయింది అన్నాడు, ఎంత సంతోష పడిపోయిందో ఆ తల్లి. ఆ రెక్కలు అల్లారుస్తూ అమ్మని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు.

వెళ్ళు గబా గబా స్నానం చేద్దాం అని సముద్రం దగ్గరకి వెళ్లారు . వెళ్లి స్నానం చేసి వస్తున్నారు. గరుత్మంతుడు  వెళ్లి పోతూ వెళ్ళిపోతూ ఇతరులకి కనపడ కుండా ,తనకి మాత్రమే కనపడే టట్టు నించున్న ఇంద్రుణ్ణి చూసి ఒక నమస్కారం చేసి సౌజ్ఞ చేసి (వాళ్ళకి చెప్పాను , మీ పని మీరు చూస్కోండి అని) వెళ్ళిపోయాడు.
వాళ్ళు స్నానానికి వెళ్లారు , ఇంద్రుడు వచ్చి మాళ్ళి అమృత భండాన్ని పట్టుకు పోయి , రక్షణ లో పెట్టేసాడు. ఈయనంటే తెగలిగాడు , వాళ్ళు తెచ్చుకో గలరా ? వాళ్ళు తెచ్చుకో లేరు , అక్కర్లేని పేరాస లకి  పోవటం అంటే అదే.
ఇప్పుడు వాళ్ళు స్నానం చేసి వచ్చారు, అమృత భాండం అక్కడ లేదు.

అమృత భాండం అక్కడ లేదు కాబట్టి , ఆ భాండం పెట్టిన ఈ ధర్బలు నాకేద్దాం అనుకున్నారు. నాకారు . నాకితే ఆ దర్బల యొక్క అంచులు , చాలా సూది గా పదునుగా ఉంటాయి, నాలుకలు అన్నీ చీరుకు పోయి రెండు నాలుకలు అయ్యాయి.
 అప్పటినించి పాములన్నింటికి ద్విజిహ్వులు అని అప్పటినించి పెరోచింది. కాబట్టి అలా పాములకి  దక్కింది ఏమిటి అంటే రెండు నాలుకలు అయిపోయాయి. గరుత్మంతుడికి దక్కింది ఏమిటి అంటే , శ్రీ మహా విష్ణువుకి ద్వాజమై, ఆయన కి వాహనమై , అమృతం తాగ కుండా జరా మరణములు లేని వాడై , మహానుభావుడై , లోకములకు ఎన్నో ధర్మములు నేర్పిన వాడై , తల్లి దాస్యము విడిపించిన వాడై ,  ప్రయోజకుడై , తల్లితండ్రుల యొక్క ఆనందమునకు కారకుడై, దేవతల చేత కీర్తింప బడిన వాడై, స్మరించినంత మాత్రం చేత , కధ విన్నంత మాత్రం చేత, ఆయన అనుగ్రహంతో మన ని అందరిని కూడా రక్షించే స్వభావము కలిగిన మహా పురుషుడు అయ్యాడు.

అందుకే ఎక్కడ గరుత్మంతుని కధ చెప్తారో, అక్కడ శ్రీ మహా విష్ణువు , దేవతలు కూడా ప్రీతీ చెందుతారుట. ఎవరైతే ఈ గరుత్మంతుని యొక్క కధ ని వింటున్నారో, వాళ్ళందరికీ కూడా అధికమైన తువo టి  శ్రీ , సంపదా అంటే ఇస్వర్యం , ఇతరులకు ఉపయోగపడే సంపదా పొందుతారు, ఇతరుల కష్టమును , తమ యొక్క శక్తి తో తొలగ తోయ గలిగినటు వంటి మంచి బుద్ది , ఎవరు వచ్చి నిలబడితే హమ్మయ్య ఈయన ఉన్నాడు  చాలు అని  పది మంది సంతోషిస్తారో అలా ప్రయోజకుడు కాగలిగినటువంటి వ్యవస్థ ఈ సౌపరాఖ్యానమును, ఎవరు వింటున్నారో , ఎవరు చదువు తున్నారో , అటువంటి వాళ్ళ అందరికీ కలిగుతుంది అని మహానిభావుడు , రుషితుల్యుడు అయినటువంటి, నన్నయ్య గారు తన నోటితో అని అంతే కాదు, ఈ కధ ని పరమ భక్తి   తో  విని చేతులు జోడించి నమస్కరించిన వారందరికి పాపములు అన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. వాళ్ళు అమృతమును తాగిన వారితో సమానం అవుతారు.ఈశ్వరునుగ్రహము కలుగుతుంది అని ఫలశ్రుతి చెప్పారు.





















                 

Monday, September 8, 2014

ఆదిపర్వం 13

భగవంతుని అనుగ్రహం ఉంటే నోటి వెంట పలక వలసిన పలుకు పలుకుతుంది, భగవంతుని అనుగ్రహం లేకపోతే ఆ సమయానికి పలక వలసిన పలుకు విస్మ్రుతిని ని పొందుతుంది. వాళ్ళు(పాములు ) మాకు అమృతం తెచ్చి ఇవ్వు అన్నారు , అక్కడితో అయిపొయింది ఆయన (గరుత్మంతుని ) కర్తవ్యమ్. నువ్వు మాతో అమృతం తాగించు అంటే కధ ఇంకోలా ఉండేది. వాళ్ళు అలా అని వుంటే , వాళ్ళు అమృతం తాగే వరకు ఉండే కర్తవ్యమ్ అంతా , గరుత్మంతుని మీద ఉండేది. ఇవ్వటానికి తాగించడానికి మద్య లోని పూచీ వాళ్ళ మీదకి వెళ్ళింది. అక్కడే వాళ్ళు నిలబెట్టుకోలేక పోయారు . ఇది ఈశ్వరుడు ముందే చేసిన సంకల్పం.
ఇప్పుడు గరుత్మంతుడు తల్లి దగ్గర ఆశీర్వచనం తీస్కుని , తల్లి నేను అమృతం తీస్కుని రావటానికి వెళ్తాను అంతకన్నా ముందు నాకు ఆకలిగా ఉంది,  నేను తినటానికి సరిపడే ఆహరం ఎక్కడ ఉందో చెప్పమ్మా అన్నాడు. దేవతల తో యుద్ధం చెయ్యాలి అంటే బలం ఉండాలి మనసుకి జవం ఉండాలి. ఈ రెండూ నిలబడాలి అంటే నీరసం రాకుండా ఉండాలి, అది రాకుండా ఉండాలంటే కడుపునిండా తిని ఉండాలి , నువ్వు అమ్మవి కాదు , అన్నం గురించి అడిగితే నిన్ను అడగాలి. నేను కడుపు నిండా తినాలని అనుకుంటున్నాను , నాకు ఆహరం ఎక్కడ దొరుకుతుంది అమ్మా అన్నాడు. అప్పుడు ఆవిడ ఏది పడితే అది తినేసేయి అని ఆవిడ భోధ చెయ్య లేదు, ఆవిడ పరమ ధార్మికమైన మాట ఒకటి చెప్పింది.  సముద్రం లో బోయలు ఉన్నారు , వారు నిషాదులు. వారు ధర్మము ని తప్పి ఉగ్రమైన స్థితి లో ఉన్నారు.
 ఆ ఉగ్రమైన స్థితి లో వారు సముద్ర గర్భం లో ఉంటూ, భూమి మీదకి వచ్చి , భూమి మీద ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని చనకుతున్నారు. కాబట్టి ఆ సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ నిషాదుల సంఖ్యా అపరిమిత , అంతా ఇంతా అని చెప్పటానికి లేదు. ఆ సముద్రం లో ఉన్న వారిని ఒక క్షణం లో తినేయి అంది అంటే ఆ లెక్కలేనoత మంది నిషాదుల్ని ఆయన ఎంత సేపట్లో తినగాలడో ఆవిడకి తెలుసు. ఆహరం తీస్కునే టప్పుడు రుచి యందు లౌల్యమ్ ఉండకూడదు , అలా అని రుచి లేని ఆహరం తినమని శాస్త్రం చెప్పదు , కాని దానియందు లౌల్యము తో ఇంకా అదే పనిగా ఆ ప్రీతీ తో తినకూడదు.
కాబట్టి క్షణం లో తినేసేయి , కానీ ఒకటి గుర్తుంచుకో అందులో బ్రాహ్మణుడు ఉండవచ్చు, నువ్వు బ్రాహ్మణున్ని కుడా తినేశావు అని గుర్తు ఏమిటో తెలుసా, కంఠo  వరకి వెళ్లి ఆ కంఠo  నుంచి దాటి వెళ్ళడు.  నిప్పు కణిక కంఠo లో పెట్టుకున్నట్టు మండుతాడు , కక్కేయి బయటకి, తప్ప ఆయన్ని మింగకు , ఎందువలనా అంటే ఆయన అధర్మము తో ఉన్న బ్రాహ్మణుడు కాడు , అధర్మం తో ఉన్నవాడు అయితే వాడూ పోతాడు లోపలకి.  అలా ధర్మం తో కూడిన బ్రాహ్మణున్ని మింగావా ఆయనకి కోపం వస్తుంది, కోపం వచ్చిందా నోటి వెంట కోపం తో కూడిన వాక్కు బయటకి వస్తుంది. పరమ ధార్మికుడైన బ్రాహ్మణునికి కోపం వస్తే ఆయనే శస్త్రం అయిపోతాడు. అస్త్రం వేరు శస్త్రం వేరు, శస్త్రన్ని మీరు మీ బలం తో గుచ్చ వలసి ఉంటుంది. అస్త్రం అనేది మంత్రం తో ప్రయోగించేది.
కాబట్టి బ్రాహ్మణుడు శస్త్రం అవుతాడు (కత్తి , గొడ్డలి ) , ఆయనే లోపలి వెళ్లి బ్రాహ్మణున్ని తిన్న పాపం కట్టి కుడిపి విషం అయి చంపేస్తాడు. కాబట్టి తినకు. అతడు అగ్నిహోత్రం అయ్యి కాల్చేస్తాడు. అంతటి ఉత్తముడైన బ్రాహ్మణుణ్ణి  గౌరవిస్తే సంతోషిస్తాడు. ఆ సంతోషం నీకు ఈస్వరానుగ్రహాన్ని తీస్కోచేస్తుంది. ఆయన గురువై నీకు ఎంత ప్రీతీ కలగలో నీకు అభ్యున్నతి ని కలగచేస్తాడు , సరే అమ్మా నువ్వు చెప్పింది జ్ఞాపకం ఉంచుకుoటాను, అని చెప్పాడు, బయలుదేరాడు. వెంటనే బయలుదేరి ఆ సముద్రం దగ్గరకి వెళ్ళాడు , అక్కడా ఆ నిషాదులందరినీ కూడా తన నోటి సంపుటములతో పట్టుకొని, ఒక్కసారి లోపాలకి మింగేసాడు , అందులో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. తల్లి పరాకుగా చెప్పటం ఎంత   మంచిదైనదో చుడండి.
ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు నిప్పు కణిక అడ్డు పడినట్టు , గొంతుకు అడ్డు పడ్డాడు. అప్పుడు గరుత్మంతుడు నోరు తెరచి , నేను మిమ్మల్ని మింగటం లేదు కాబట్టి మీరు బయటకి వచ్చేసేయ్యండి అన్నాడు.  లోపల నించి బ్రాహ్మణుడు మాట్లాడాడు. దయ ఉన్నవాడు , ధర్మం ఉన్న వాడు అనటానికి గుర్తు అది. నేను బ్రాహ్మణున్ని , నువ్వు నన్ను బయటకి రమ్మని అంటున్నావు , కానీ నేను రాను , నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నా భార్యగా ఒక బోయ వనిత ఉంది నాతో, అంటే ఒక బోయ వనితని వివాహం చేస్కున్నాడు, అది అధర్మమా అంటే , నేను మీతో మనవి చేశాను, కొన్ని కొన్ని ప్రత్యెక కరణముల యందు బ్రాహ్మణుడు నాలుగు వర్ణముల వారినీ వివాహం చేస్కుంటారు అని కాబట్టి ఈమె ని వివాహo  చేస్కోవటం ఆయన యందు దోషం కాదు , ఇప్పుడు నా భార్య కూడా ఉంది నాతో , ఆమెని విడిచి నన్ను ఒక్కన్నే రమ్మంటావా ? నా భార్య తో రమ్మంటావా  అంటూ యశ స్సు   కోరుకునే వాడా చెప్పు అన్నాడు.
ఇప్పుడు గరుత్మంతుడు అన్నాడు , బోయలు అపవిత్రంగా ,అధార్మికం గా ఉన్నారు అని కదా నేను వాళ్ళని మింగేశాను , లేకపోతే వాళ్లజోలికి కూడా వెళ్ళమనదు  వినత. అపవిత్రులైన పవిత్రులైన  వారితో కలిసి ఉంటె ఎప్పటికో ఒకప్పటికి పవిత్రులు అవుతారు. కాబట్టి ఇప్పుడు నీతో కుడి ఉన్నదే నీ భార్య , ఆమెని విడవ మని నీకు ఎందుకు చెప్తాను ధర్మం. కాబట్టి నువ్వు నీ భార్య తో కలిసి బయటకి వచ్చేయి  అన్నాడు , అప్పుడు బ్రహ్మణుడు ఆయన భార్య తో కలిసి బయట కి వచ్చేశాడు.
పైకి చెప్పటానికి ఆయన ఆహారం తిన్నట్టు గా ఉంటుంది. లోపల ఇంత ధర్మ స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది మహాభారతం. ఇప్పుడు బయటకి వచ్చిన బ్రాహ్మణుడు పరమ సంతోషాన్ని పొందాడు, ఏమి చెప్పింది వినత ,. ఆ సంతోషమే నీ కార్యము నెరవేరటానికి హేతువు అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు కార్యం నడిచిపోతుంది అని గుర్తా కాదా , అమృతాపహరణం చేసేస్తాడా చెయ్యడా ? చేసేస్తాడు , ముందే తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన నిషాదులన్దరిని తినేసి ఒక్కసారి పైకి ఎగిరాడు , ఆకలి తీరలేదు, అమ్మ తినమంది కానీ అనంతమైన ఈ నిషాదుల్ని తినటం వలన ఆయన కి ఏమీ ఆకలి తీరలేదు. ఇంకా ఆకలి  వేస్తోంది.  అర్థాకలి మరీ ఘోరం. మళ్ళి అమ్మని అడగటం ఎందుకని , ఈయన ఆ దగ్గరలో ఉన్న కశ్యప ప్రజాపతి దగ్గరకి వెళ్ళాడు.
వెళ్లి అడిగాడు , అయ్యా నేను అమ్రుతపహరణం కి వెళ్తున్నాను , అమ్మ ని దాస్యం నించి విముక్తి చెయ్యటానికి, నాకు ఆకలి తీరలేదు కాబట్టి , ఏది నేను తినాలో మీరు చెప్పండి అని అడిగాడు గరుత్మంతుడు. ఒక కార్యం నిమిత్తం వేల్తునప్పుడు దానికి ముందు ఎటువంటి పదార్ధం తినాలో అటువంటి పదార్థం ఏమిటి అని పెద్దలని అడిగి తిని వెళ్ళటం చాలా మంచిది.
అప్పుడు కశ్యప    ప్రజాపతి అన్నాడు "నాయన ఇక్కడికి  దగ్గర లో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు లో ఒక తాబేలు ఉంటుంది , వోడ్దున ఒక ఏనుగు ఉంటుంది. నీటిలో తాబేలుకి ఒడ్డు నున్న ఏనుగుకి యుద్ధం ఎందుకు , అవి రెండూ ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటాయి. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు  అంటే వొంట్లో  బలం ఉంది , ఆ బలం ఎందుకు అంటే తినటం వల్ల వచ్చింది.  అవి తిని అలా కొట్టుకుంటూ ఉంటై . ఇద్దర్లో ఎవరూ ఎవరికీ లొంగరు , ఆ ఇద్దరినీ గజ కచ్చపములు  అని పిలుస్తారు. అవి ఎవరో నీకు తెలుసా , విభావసుడు , సుప్రతీకుడు అనే అన్న దమ్ములు ఉండే వారు, అందులో విభావాసుడు అన్నగారు ఆయన తమకు పిత్రార్జితమైన ఆస్థి ని అన్న అయిన విభావసుడు తన దగ్గర ఉంచుకొని , తమ్ముణ్ణి జాగ్రత్త గా చుస్కున్తున్నాడు. ఒకానొకప్పుడు తమ్ముడికి కోరిక పుట్టింది , ఆస్తి పంచుకొందాం అని ఇప్పుడు సుప్రతీకుడు అన్న అయిన విభావసుడు దగ్గరకి వెళ్లి మన తాతలు  తండ్రులు సంపాదించింది ఏదైతే ఉందొ దాన్ని ధర్మ బద్ధం గా రెండు భాగములు చేసేసేయి ఇద్దరం అనుభవిద్దాం అన్నాడు, దానికి విభావాసుడు అంగీకరించలేదు.  వాటా లు  వేసు కో వటం ఏమిటి ? పంచుకోవటం ఏమిటి , ఇప్పుడు నీకు వచ్చిన ఉపద్రవం ఏమిటి అని అడిగాడు, కలిసి ఉందాం అన్నాడు. తమ్ముడు అధిక్షేపించాడు. అన్నగారికి కోపం వచ్చి నువ్వు చాలా మధొన్మత్తుడ వై మాట్లాడుతున్నావు, కాబట్టి నువ్వు ఏనుగు అయిపోవుదువు గాక! అని శపించాడు. తమ్ముడికి కోపం వచ్చి నేను పంచి ఇమ్మంటే ఇవ్వలేదు కనుక నువ్వు తాబేలువి అయిపో అన్నాడు. ఇద్దరి శాప వాక్కుల కి ఇద్దరు గజకచ్చపములు అయ్యారు.
ఈ తాబేలు 3 ఆమడల ఎత్తు , పది ఆమడల వెడల్పు, అంత పెద్దదా తాబేలు. ఏనుగు 6 ఆమడల ఎత్తు 12 ఆమడల వెడల్పు. అంత పెద్ద పెద్ద ప్రాణులు రెండూ, ఇవి దేబ్బలడుకుంటూ ఉంటాయి. వీళ్ళ గొడవ ఎప్పుడో అప్పుడు అగిపొవలా, కాబట్టి పరిష్కారం లేని ఈ సమస్యకి పరిష్కారం నువ్వు చేసెయ్యి. నువ్వెళ్ళి తినేయి వాళ్ళిద్దరిని అన్నాడు కశ్యపుడు. అంటే సరే నాన్నగారు తినేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయన కి పెద్ద విషయం ఏమి కాదు చేసేస్తాడు. కానీ కశ్యప ప్రజాపతి ఎందుకు చెప్పినట్టు?
ఎందుకు వెళ్తున్నాడు గరుత్మoతుడు, అమ్రుతాపహరణం చెయ్యటానికి, ఎందుకు అంటే అన్నల కోసం. వాళ్ళకెందుకు అమృతం , గరుత్మంతుడు తేరగా దొరికాడు కాబట్టి.
ఇందులో మీరు ఒక విషయం గమనించుకోవాలి, కలిసి ఉన్న వాళ్ళు విడిపోవటం అన్న మాట తెచ్చుకోకూడదు. విడిపోవటం అంటూ జరిగితే , విడిపోవటం అత్యంత ప్రేమతో , అత్యంత మర్యాద తో జరిగితే ఇద్దరూ వృద్దిలోకి వస్తారు.  అలా కాకుండా పోరుబాట లో విడిపోయారు అనుకోండి , ఇద్దరు వృద్దిలోకి రారు. ఎందుకంటే దేబ్బలాడుకోవటం అంటూ జరిగాక, ఇంక కలిసి  ఉండటం ఉండదు , దేప్పిపోడుపులే ఉంటాయి. అందుకే ఏది పంచుకున్నా ప్రేమతో పంచుకోవాలి కాని పోరు మాత్రం కాదు. పోరు నష్టం పొందు లాభం.
అలా ఐశ్వర్యం కోసం దెబ్బలాడు కున్న ఇద్దరు నీకు ఆహారం అవుతున్నారు. ఇద్దరూ కలిసి మూడో వాడి చేతిలో చస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇద్దరికీ బుద్ది వస్తుంది . ఇద్దరం కలిసుంటే ఈ పని చేసుండే వాడా వీడు అన్న భావం వస్తుంది . ఇక అక్కడిదితో ఆ వైరం పోతుంది. అని చెప్తే అప్పుడు బయలు దేరాడు గరుత్మంతుడు . ఇప్పుడు తనకీ ఒక విషయం అర్థం అవుతుంది కదూ.
ఇప్పుడు ఆ రెండు గజకచ్చపాలని రెక్కలతో కొట్టాడు, అవి హతాశులై పోయాయి.  ఇప్పుడు అకస్మాత్తు గ గాలిలోకి ఎగిరాడు. ఇప్పుడు ఈ మూడు కూర్చుంటే సహించ గలిగే చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. అలా వెళ్ళటం లో అలభము అనే ఒక వనం వైపుకి వెళ్ళాడు. అక్కడ రోహిణము  అనే ఒక చెట్టు ఉంది , అది ఒక దివ్య ప్రాణి , వాటికి ఆ లక్షణం ఉంటుంది. అది గరుత్మంతుని పిలిచింది. నా కొమ్మ 100
ఆమడల పొడవు ఉంది నువ్వు వచ్చి నా కొమ్మ మీద పెట్టుకుని తిను అని చెప్పింది. ఆయన అంత వేగం తో వాటిని ఆ కొమ్మ పైన పెట్టుకుని తింటానికి ఉద్యుక్తుడు అవుతున్నాడు. ఈ లోపల ఆ కొమ్మ విరిగి పడిపోతుంది విరిగి పోతే వచ్చే నష్టం ఏముంది , మళ్ళి వీటిని రెండింటిని పట్టుకుని ఎగిరిపోవచ్చు, కానీ దానికి వలకిల్యులు వేలాడుతున్నారు,  వాకిల్యులు ఆశ్చర్యకరమైన జననం ఉన్న వారు పౌరాణిక వాంగ్మయం లో ఎక్కువగా కనపడతారు. భారతం లో కాదు కాని బ్రహ్మ వైవర్త పురాణం లో వాలకిల్యుల గురించి విశేషం గా వర్ణన చేస్తారు. వారు స్వయం గా బ్రహ్మ కి పుత్రులు, వారు ఆజన్మ బ్రహ్మ చారులు , వాళ్ళు ఊర్ధ్వ రేతస్కులు , వాళ్ళ శరీరాలు కూడా  బొటన వేలు ఎంత  ఉంటుందో అంతే ఉంటారు.  అంగుష్ట మాత్ర శరీరులు, కానీ అపారమైన వాగ్బలం ఉన్నవారు. వారి తప్పస్శక్తి వలన వారు నోరు తెరచి ఒక మాట అంటే అయిపోతుంది అంతే. వాళ్ళు తలకిందులు గా వేలాడుతూ , సూర్య కిరణాలూ ఆహారముగా తింటూ తపస్సు చేస్తున్నారు. అలంటి కొన్ని వేల మంది , తేనే పట్టు పట్టి నట్టు ఆ కొమ్మకి పట్టుకుని ఉన్నారు. వాళ్ళు అంగుస్ట మాత్రమే ఉండడం తో ఈయన కుర్చుని కొమ్మ విరిగిపోయే టప్పుడు కనపడ్డారు, ఇప్పుడు ఆయన కొమ్మని వదిలేశా డంటే , వలకిల్యుల శరీరాలన్నీ శిధిలమై పోతై , అంతటి మహాత్ములు కానీ నలిగిపోయారా , ఉపద్రవం వస్తుంది. వాళ్ళు పడిపోకూడదని  రెండు కాళ్ళ తో ఏనుగు తాబేలుని పట్టుకుని ముక్కుతో కొమ్మ పట్టుకుని, ఆకాసంలో కి ఎగిరిపోయాడు . ఆ అయన బలం , తేజస్సు , శక్తి మీరు చుడండి. ఇప్పుడు ఉపద్రవమే వచ్చింది , ఆయన వెంటనే గంధమాదన పర్వతం దగ్గరకి వెళ్ళాడు , అక్కడ కశ్యపుడు తపస్సు చేస్కున్తున్నాడు .
ఇప్పుడు గరుత్మంతుడు , నాన్నగారు ఉపద్రవం వచ్చింది , మీరు ఆహరం తినమన్నారు, నేను అవి కొమ్మమీద పెడితే కొమ్మ విరిగిపొయింది. ఆ కొమ్మకి వాలకిల్యులు ఉన్నారు. ఏమి చెయ్యాలి అని అడిగారు. ఇప్పుడు కశ్యపుడు ఆ వలకిల్యుల వైపు చూసి ప్రార్థించాడు. నా కొడుకు ధార్మికుడు, ఒక మహా కార్యం కోసం బయలు దేరాడు , ఈలోపు ఉపద్రవం వచ్చింది. కనుక మీరు అనుగ్రహించి , అనుకోకుండా చేసిన పనే తప్ప కావాలని చేసిన అపకారం కాదు, ఆహారం కోసం ఆ కొమ్మ పిలిస్తే వెళ్ళాడు , ఆగుతుంది అని ఆ చెట్టు అనుకుంది. కానీ అది విరిగి పోయింది , కాబట్టి మీరే ఆ కొమ్మని విడిచి పెట్టి కిందకి దిగిపోయి, ఆ కొమ్మని భూమికి బాగా దగ్గర గా తీస్కోస్తాడు , మీరు కొమ్మ దిగిపోయి, వేరొక ప్రదేశానికి వెళ్లి తపస్సు చేస్కొండి , అప్పుడు నా కొడుకు ఎక్కడో ఈ రెంటిని పెట్టుకొని తింటాడు.
ఇప్పుడు కశ్యపుడు చేసిన ప్రార్థన కి ఆ వాలఖిల్యులు దిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు 100 ఆమడలు ఉన్న ఆ కొమ్మ ఎక్కడైనా  పడేస్తే కింద ఎవరైనా నలిగి  పోవచ్చు, కబట్టి ఇప్పుడు ఆ కొమ్మని బ్రాహ్మణులూ మనుష్యులు లేని ప్రాంతం ఏది ఉందొ చెప్పండి అక్కడ పారేస్తాను అని అడిగాడు నాన్న గారిని గరుత్మంతుడు. అందుకు కశ్యపుడు నువ్వు హిమాలయ పర్వతముల యందు నిష్పురుశము అని ఒక కొండ ఉంది , ఈ కొమ్మ ని అక్కడ కి నువ్వు వెళ్ళు అక్కడ ఏ ఆపదా కలుగదు అక్కడ పడేయి అన్నాడు కశ్యపుడు. ఆ నిష్పురుష పర్వతం అక్కడ నించి లక్ష యోజనముల దూరం ఉంది అక్కడ నించి ఆ గంధమాదన పర్వతం నించి. ఒక్క క్షణం లో ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు , అంటే ఆయన గమన శక్తి అటువంటిది, ఆ కొమ్మని అక్కడ పారేసి , ఆ హిమాలయా పర్వత శికరం
ఈ రెండిటిని పెట్టుకుని చక్కగా ఆరగించేసాడు.  అంటే ముందు ఇతరుల హితములు చూస్కుని తినాలి తప్పా నీ హితమును నువ్వు చూస్కొని తినెయ్య కూడదు. ఇతర భూతముల హితములు చుసిన తర్వాతే తానూ తినాలి.
 












Thursday, September 4, 2014

ఆదిపర్వం 12

ఇంద్రుడు ని ప్రార్థించిన కద్రువకు దేవతల అనుగ్రం చేత ఆ చనిపోయిన పిల్లలందరినీ బ్రతికిన్చుకుంది. మళ్ళి ఆ పిల్లలందరినీ, గరుత్మంతునకు అప్పగించింది , మళ్ళి వాళ్ళను సూర్యమండలం వైపు తీస్కువెల్లొద్దు అన్నది. ఆయన ప్రతిరోజూ తీస్కేల్తున్నాడు తిప్పుతున్నాడు , ఒకనుకోక రోజున ఆయన మనసు కుంగిoది, ఏమిటిది నేను ఎందుకు ఇలా ఊడిగం చెయ్యటం, ఇంత శక్తి ఉంది ఇంత బలం ఉంది నేనేoదుకు ఈ   పాముల్ని ఇలా తిప్పుతూ ఉండడం. పాముల్ని ఇలా తిప్పి నేను మాట పడ్డాను , అమ్మ ఎందుకు చేస్తుంది కద్రువ కి సేవ , నేనెందుకు చెయ్యాలి ఈ పాములకి సేవ? ఈ మాట పాముల్ని అదుగుదమనొ ,కద్రువని అదిగిదమనొ ఆయన అనుకోలేదు , అమ్మ ని అడుగుదాం అనుకున్నాడు. అలా వాళ్ళని ఎందుకు అడగలేదు అంటే వినత ఒప్పుకోదు అని మీరు గమనించాలి. పెద్దమ్మ వల్ల ఇబ్బంది వచ్చినా అది ఆసీర్వచనమే. నువ్వు పెద్దమ్మ ని అలా ధీకరించకూడదు. వాళ్ళ తో అలా ప్రవతించ కూడదు అని  నేర్పింది వినత. అందుకనే గరుత్మంతుడు అంత స్థితికి చేరాడు.  గరుత్మంతుడు వినత తో అంటున్నాడు , అమ్మ ! ఏమిటమ్మా ఈ ప్రారబ్దం ? నేను నా రెక్కల యొక్క వేగం తో వెళ్తూ , నా ముక్కు యొక్క చివరిభాగం తో పొడిస్తే కులపర్వతాలు ముక్కలైపోతాయమ్మా  ధూళి కింద రాలిపోతై అమ్మా ! అంత  బలం కలవాణ్ణి, అంత ప్రసిద్ధి పొందినవాణ్ణి ఇంత తేజస్సు ఉన్నవాణ్ణి. పనికిమాలిన పాములన్నీ వీపుమీద ఎక్కించుకుని విధులన్నీ తిరుగుతున్నాను , ఏమిటి ఈ ప్రారబ్దం, నువ్వు చుస్తే ఆ కరువకి సేవ చేస్తున్నావు . ఎందుకోచింది ఇదంతా , దీనికి కారణం ఏమిటో చెప్పవా తల్లి అని అన్నాడు. మనం ఎందుకు ఇలా చేస్తున్నాం నువ్వు కశ్యప ప్రజాపతి భార్యవి , ఆవిడ కశ్యప ప్రజాపతి భార్యనే మరి ఎందుకు మనం ఇద్దరం ఇలా ఉంటున్నాం , నాకు కారణం చెప్పమ్మా అన్నాడు.  ఇప్పుడు  ఆవిడకి ఉన్న ఒకే ఒక దుర్లక్షణం అతిశయం పోయింది దాస్యం లో , అతిశయం పోయి పరిణితి  వచ్చింది. దాంతో ఆవిడా కొడుకుతో ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది, నాయన ఒకప్పుడు పందెం కాశాం , ఆ పందెం కాయటం అనే లక్షణమే తప్పు , కానీ పందెం కా శాం, ఓడిపోయం ఇదిగో నేను ఇలా దాస్యం చేస్తున్నాను. అంతే అనుకుంటున్నావా రెండు గుడ్లు పుట్టి నాయి నాకు , నీకు అన్న గారు ఒకడు ఉన్నాడు అరుణుడు, నేను కేవలం తల్లిని తొందరగా అవ్వలేక పోయాను అనే అతిశయము వలన అధోభాగం సరిగా ఏర్పడని పిల్లవాడు పుట్టాడు.  వాడికి ఎంత బాధ వేస్తుంది , వాడు నన్ను శపించాడు 500 సంవత్సరములు దాస్యం చేస్తావు. ఈ రెండో
గుడ్డులోంచి  పుట్టే పిల్ల వాడి వలన నీకు దాస్యం  పోతుంది  అన్నాడు. కాబట్టి నాయన అప్పటి నుండి నేను ఎదురు చూస్తున్నాను.  నీ వలన నాకు దాస్యం పోతుంది అని నమ్మి ఉన్నాను.  వృద్దిలోకి వచ్చిన పిల్లల వలన తల్లి తండ్రులు కష్టములనుండి బయట పడితే తల్లి తండ్రులకు సంతోషం సృష్టిలో ఉన్న మర్యాద కదా అని అంది ఆవిడ. అలా ఆ వినత గరుత్మంతుని తో చెప్తే , ఆయన ఆ పాముల  దగ్గర కి వెళ్లి వాట్ని విహారానికి   తీస్కెళ్ళి  తీస్కొచి , ఒక చోట కుర్చుని, వాళ్ళతో ఒక మాట అన్నాడు , నేను మిమ్మల్ని సేవిస్తున్నాను , మా అమ్మ మీ అమ్మ ని సేవిస్తుంది , వీటన్నిటికి కారణం వాళ్ళిద్దరి మధ్య జరిగిన పందెం. నేను మీకు  ఏమి  చేస్తే నన్ను మా అమ్మ నీ దాస్యం నించి విముక్తి చేస్తారు అని అడిగాడు. అలా అంటే వాళ్ళు ఒక మాట అనొచ్చు పుట్టినప్పతినించి పినమ్మ అంత చేసింది , తమ్ముడు ఇంత చేసాడు , మన  మధ్య ఈ అన్నా తమ్ముల సంభంధం ఇలా ఉండిపోతే చాలు అనొచ్చు , మన అమ్మలు అక్క చెల్లెళ్ళు కాబట్టి నువ్వేమి మాకు తేవక్కర్లేదు అనొచ్చు. ఈ క్షణం నించే నిన్ను మీ అమ్మ ని దాస్యం నించి విదిపిస్తున్నాం అనొచ్చు మనం మనం అన్న తమ్ములం అని ఒక మాట అనుంటే , భారతం ఒకలా ఉండేది. అలా అనేంత సంస్కారం కద్రువ నించి పిల్లలకి రాలేదు.  ఆవిడ నేర్పలేదు వీళ్ళకి రాలేదు , కాబట్టి వీళ్ళకి  కుడా వ్యాపారమే , వీడిని దాస్యం నించి  విదిపించాలంటే , వీడి బలాన్ని అడ్డు పెట్టుకుని మనకి చాలా ముఖ్యమైనది తెచ్చుకుంటే బావుంటుందా? కాబట్టి వాళ్ళన్నారు . నీకు బలం ఉంది ,వేగం ఉంది , వెళ్ళ గలవ్ . కాబట్టి అమృతం పట్రా అన్నారు . అమృతం ఎందుకు ? వీళ్ళు  తాగుతారు ట . వీళ్ళు తాగితే  ఏమవుతుంది , వీళ్ళకి మృత్యువు ఉండదు అలా బ్రతికి ఉంటారు. వీళ్ళు వెయ్యి మంది ఉన్నారు , ఎక్కడికి కదలరు. ఆవిడకి ఇద్దరే పిల్లలు ఒకడు అరుణుడు , అతనికి అమ్మ ని చూడటానికి సమయం ఉండదు , ఎందుకంటే సూర్యుని రాధ సారధి కాబట్టి. ఇప్పుడు మిగిలింది ఈ ఒక్క పిల్లాడు , ఆమె కి మనశాంతి అంటే వీడిని చుస్కునే , ఇప్పుడు ఇతనిని అమృతం తెమ్మని పంపిస్తే ఎవరి మీదకి యుద్దానికి వెళ్ళాలి ? దేవలోకం లో ఇంద్రుడి మీదకి వెళ్ళాలి , దేవతా శక్తులు అంటే సామాన్య మైనవా? దేవతలు అందరూ కలిపి మట్టు పెట్టేస్తే ఈయన్ని , పోతే పోతాడు , మీకు నష్టం మాకేమవుతుంది పోతే ఒక దాసుడు పోతాడు, వస్తే   ఇంక మాకు జర లేదు మరణం లేదు, ఇంక ఈయన లేకపోయిన , ఈయన ఉంటె ఏముంటాయొ అవన్నీ మాకు ఉంటై. ఎంత క్రూరమైన ఆలోచనో మీరు ఆలోచించండి . ఇలా ఆలోచించా అనే కనీస పరిణితి కానీ మర్యాద కానీ వాళ్ళకి లేవు, అప్పుడు గరుత్మంతుడు చాలా సంతోషంగా అని అంగీకరించాడు. ఆయన కి ఎందుకు సంతోషం , హమ్మయ్యా మా అమ్మ దాస్యం విడుదల అయిపోతుంది. ఇది రక్షించింది. మాతృ భక్తి ఉండే అదే శ్రీ రామ రక్ష, అమ్మ నోటి మాట యే అంగ రక్ష. అమ్మ దగ్గరకి వెళ్లి నమస్కరించి, అమ్మా నీ దాస్యం విడిపించడానికి వెళ్తున్ననమ్మా వాళ్ళు అమృతం అడిగారమ్మా పాములు, అమృతం తేవటానికి వెళ్తున్ననానమ్మ అని అన్నాడు.  ఆవిడా హమ్మయ్య వీడు ఇంత బలవంతుడు , జాగ్రత్త గా తేగలడు , తెచేయ్యి అనలేదు. అమ్మ కున్న లక్షణం ఏమిటంటే ఆ మాట అమ్మ తప్ప ఇంకెవ్వరు అనలేరు. నాన్న నా ఆయుర్ధాయం కూడా పోస్కుని జీవించెయ్ రా అని దీవిస్తుంది. త్రికరణ శుద్ధి గా ఆ మాట అనేది అమ్మ ఒక్కతే.
అమృతం తెచేయ్యటం అంటే ఏ కాగితంమో కాలమో తేవటం కాదు , వాళ్ళు అస్త్రములు ,శస్త్రములు  ప్రయోగిస్తారు, పిల్ల వాడి శరీరం ఎక్కడ సోక్కిపోతుందో , అమ్మ మనసు ఆవిష్కృతం చేస్తున్నారు నన్నయ్య గారు. ఆమె ఆశ్ర్వచనం చేస్తూ నాయనా , వాయువు సంతతము నీ రెక్కలను కాపాడు గాక. చంద్రుడు నీ వీపును రక్షించు గాక!, అగ్ని నీ శిరస్సు ని రక్షించు గాక !, సూర్యుడు నీ శరీరము అన్థతినీ రక్షించు గాక! అమ్మ చేసిన రక్ష ఏదైతే ఉందొ
అది సాక్షాత్తు పరబ్రహ్మము చేసిన ఆశీర్వచనమే. నాయన బయలుదేరు అన్నది . తప్పకుండా బయలు దేరుతాను కానీ అమ్మ అంత పెద్ద పనిమీద వెళ్ళేటప్పుడు కడుపు నిండా తిని వెళ్ళాలి కదమ్మా , ఆకలేస్తుంది , నా కడుపుకి సరిపడే అంత ఆహరం ఎక్కడ ఉందొ చెప్పమ్మా తిని బయలు దేరుతాం అన్నాడు.