అసలు యాగము అంటూ చేస్తే రెండు ప్రజనములు కొరకు చేస్తారు
ఒకటి ,యజమాని ఉండి , ఏదో ప్రయోజనం కొరకు చేస్తే ఇహము , ఇక్కడ ప్రయోజనం నెరవేరుతుంది.
రెండు , ఇక్కడ ప్రయోజనం కొరకు కాదు అని చేస్తే ఊర్ధ్వ లోకాలలో నివసించ గల గొప్ప శక్తిని యాగము కృప చేస్తుంది. ఈ రెండూ కాదు లోక శాంతి అసలు భారత ప్రారంభం లో జనమేజయుడు అటువంటి యాగం తో ప్రారంభం భారతం.
ఇప్పుడు జనమేజయుడు చేసే యాగం ఈ మూడిటి లో ఇందులోకి వస్తుంది, ఈ మూడి టి లో ఎందులోకి రాదు , ఇహము లేదు, పరము లేదు, లోకోపకారము లేదు , మిగిలనిది ఏమిటి అయ్యింది కక్ష, కక్ష కొరకు యాగము చెయొచ్చా , ఇన్ని చేసాడు, అంతటి అనుభవం ఏమైనట్టు ? ఇన్ని చేశాను అంటున్నావ్ , ఇంతమంది బ్రాహ్మణుల్ని ఆదరించాను అంటున్నావ్ , ఇన్ని యజ్ఞాలు చేసావు, ఇంత పరిపాలన చేసావు, తుట్ట తుదకు నీ మనసు యొక్క వ్యగ్రత కి లొంగిపోయావు , లొంగిపోయి ఆ యాగం దేని కొరకు చేస్తున్నావ్ అంటే ఎప్పుడో మీ నాన్న ని కరిచినటువంటి ఒక పాము యొక్క ఉద్దతి ని మనసులో స్మరణ చేసి, మొత్తం పాముల్ని చంపటానికి యాగం చేస్తున్నావ్. పోనీ అదైనా నీంతట నీకు కలిగిన సంకల్పమా , ఉదంకుడు వచ్చి ప్రచోదనం చేసాడు అటువంటి యాగం చెయ్యమని. ఉదంకుడు ఎందుకు చెయ్యాలి ఆయన కోపం ఆయన కి ఉంది.
తక్షకుడు ఎప్పుడో ఆ ఉదంకుడికి అడ్డం వచ్చాడు. గురు పత్నియొక్క యొక్క కోరికమేరకు , మహారాజు పౌష్యుని యొక్క భార్య కుండలములను తెస్తుంటే ఆయన అపహరించి తీస్కెళ్ళి ఇబ్బంది పెట్టాడు అని ,భూత దయ లేకుండా చేసే యాగం ఏ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆపుచేసేయి అన్నాడు అస్తీకుడు. చాలా గొప్ప విషయం ఏమిటంటే లోకంలో తనకి తట్టక పోయిన పెద్దలు చెప్పినప్పుడు వినగలగడం. ఇదొక్కటి ఉండటం చంద్ర వంశం లో పాండవుల ఆస్తి, వాళ్లకి తట్టక పోవచ్చు కానీ కృష్ణుడు చెప్తే వింటారు పాండవులు, అలా జనమేజయుడు విన్నాడు, విని ఉత్తర క్షణం లో యాగాన్ని ఆపు చేసేయండి అన్నాడు.
ఇప్పుడు యాగo ఆపుచేసిన తరువాత అది ఒక సంఘటన గా జనమేజయుడు విడిచి పెట్టి ఉంటె , వైశంపా యనుడు భారతం చెప్పడు. ఇక్కడ జనమేజయుడు ఒక్క సారి విచారణా స్థితి కి వెళ్ళాడు. అసలు నేను ఎందుకు చేశాను ఈ యాగం, నిజమే అస్తీకుడు చెప్పిన దాంట్లో నిజం ఉంది. కేవలం కక్ష తో చేశాను. ఈ కక్ష కి కారణం పోనీ తక్షకుడు నాకేమైనా అపకారం చేసాడా అంటే లేదు.
మా నాన్న గారిని మట్టుపెట్టాడని ఇప్పడు నేను యజ్ఞం చేసి, కొన్ని వేల లక్షల సర్పములనె కాల్చేసాను. మనిషి మనసులోకి కక్ష అన్నది ప్రేవేసిస్తే , అంతకుముందు విన్నవి, అంతకు ముందు నేర్చుకున్నవి, ఎంత తేలికగా కొట్టుకుపోయాయో కదా ,ఇంకో ఆలోచన లేకుండా యాగం చేసేసాను.
నాకు ఎవరూ అలా యాగం చెయ్యొద్దు అని చెప్పలేదు. ఆస్తీకుడు చెప్పగానే ఆపేసాను. కానీ నాకన్నా ముందు పుట్టి ఈ రాజ్యాన్ని పరిపాలించిన , పాండవులు కౌరవులు నాకు తండ్రులు, వాళ్ళకి చెప్పటానికి పరమ ధర్మ మూర్తి అయిన వ్యాసుడు ఉన్నాడు. సాక్షాత్తు ఆత్మ బంధువు, ఆ వ్యాస స్పర్స లేకుండా బిడ్డలు పుట్టలేదు. కాబట్టి ఆయన వంశ కర్త అయ్యి ఉన్నాడు. పెద్దరికం వహించి చెప్పటానికి భీష్ముడు ఉన్నాడు. అడగకుండా నే చెప్తాడు భీష్ముడు, మహా పురుషుడు ఆచార్యుడు ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు ఇంత మంది ఉండీ మరి ఎవరు చెప్పింది వినకపోవటం చేత అంత పెద్ద యుద్ధం (కురుక్షేత్రం )జరిగింది ? వాళ్ళు కూడా ఎక్కడో మాట వినకుండా ఉండటం వలన ఇది జరిగింది. కాబట్టి వ్యాసుడు ఉండగా ఇది ఎలా జరిగింది అసలు ?
ఎవరు మాట వినపోవటం వల్ల జరిగింది. మాట వినకపోవటం కేవలం స్వభావ రిత్యా వినకపోవటం జరిగిందా ? అంత కన్నా ఇంకా వెనకాతల కారణం ఏమైనాఉందా ? ఒక వ్యక్తి స్వభావ రీత్యా మాట వినక పోయి ఉంటె , ఇంత మంది మహాత్ములు ఉన్న చోట ఆ ఒక్కడే పోయి ఉండాలి. అలా పోలేదు.
ఇనుప రజను మొత్తము ఐస్కాంతం ఆకర్షించి నట్టు , దుష్ట శక్తుల ను అన్నింటినీ దుర్యోధనుడు ఆకర్షించాడు. దేవతలు అందరు ఈశ్వరుని ముందు నించున్నట్టు దేవత శక్తులందు ఆవిర్భవించిన వాళ్ళు అందరూ పాండవుల వైపుకి వెళ్లారు. మరి వాళ్లైన మాట విని ఉండాలి కదా? మరి పాండవులు ఎందుకు వినలేదు , వీళ్ళిద్దరికీ యుద్ధం ఎందుకు జరిగింది అసలు కురుక్షేత్రం లో ?
ఆస్తీకుడు చెప్పగా నే నేను విని యజ్ఞం ఆపినట్టు, వాళ్ళు కుడా వ్యాసుడి మాటొ , భీష్ముడి మాటో , విదురుడి మాటో అంత మంది మహానుభావులు ఉన్నారు ఆ సభలో , ఎక్కడ నించో తెచుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ నా అదృష్టం కొద్ది ఇక్కడ సభలో వ్యాసుడు ఉన్నాడు అడగటానికి. వాళ్ళు ఎప్పుడూ ధర్మం మాట్లాడుతూ నే ఉండాలి.
ఎక్కడ వచ్చింది దోషం. ఎక్కడ మాట వినకపోవటం అన్నది వచ్చింది. ఎవరెవరు మంచి మాటలు చెప్పారు , ఎవరెరు వినలేదు, ఎవరెవరు ఏ ఏ స్వభావముల చేత ,ఏ ఏ కరణముల చేత ఇంత భారత యుద్ధం జరగ వలసి వచ్చింది.
ఈ సంఘర్షణ లో ఏవో చాలా గొప్ప గొప్ప విషయాలే ఉంది ఉంటాయి.
ఇప్పడు కధ ని కధ గా చెప్పేవాడు కాదు కావాల్సింది , కధ లో ఉన్న ధర్మ సుక్ష్మముల తో చెప్పే వాడు కావలి.
అదృష్టం ఏంటంటే ,వ్యాసుడు ఉన్నాడు సభలో , యజ్ఞ పరీక్షకుడి గా కూర్చొని ఉన్నాడు. ఆ వ్యాసుడే మహాభారత రచన చేసిన వాడు , ఇతిహాస రచన, పెద్దలు మనం అడిగుతే చెప్పాలని లేదు . ఎందుకు చెప్పాలి అంటే కృప కలిగి చెప్పాలి. కృప ఎప్పుడు కలుగుతుంది, మన ఆర్తి అర్థం అయితే కృప కలుగుతుంది. ఏదో తెలుసుకోవాలన్న ఆర్తి అవతల వారి యందు ఉన్నది. అంతే గురువుగారు మాట్లాడటానికి అంత కన్నా ఇంకో విషయాన్నీ ప్రాతిపదిక గా తీస్కోరు.
కాబట్టి ఇప్పుడు నా ఆర్తి అర్థం అయితే మాట్లాడుతాడు. ఆయన యందు నా పూజ్య భావము కూడా ఆయన కి స్పష్టము కావలి అప్పుడే మాట్లాడుతాడు. ఈ కోణం లో జనమేజయుడు అడుగుతున్నాడు. ఆ సమయం లోనే మహాభారతం ప్రవచన రూపం లోకి మారింది.
ఇప్పడు జనమేజయుడు వ్యాసుని స్మరిస్తున్నాడు, సాక్షాత్తు పరబ్రహ్మమే రాసీ భూతమై నా ఎదుట కూర్చుంది. పరస మహర్షి యొక్క కుమారుడు , బ్రహ్మర్షుల లో ముఖ్యమైన వాడు, దయ కలిగిన వాడు , కురువంశము అంతటికీ కూడా పితామహ స్తనము నందు ఉన్నవాడు, జనమునంతటికి కూడా హితమును కల్పించటము అనేటటు వంటి మార్గము నందు, అష్టాదస పురాణములను , వేదములను విభామును చేసి , లోకమునకు నాలుగు మంచిమాటలు చెప్పి , జనాన్ని మంచి మార్గం లోకి మళ్ళించటం అనే మహా ప్రక్రియని , ప్రారంభం చేసిన మహా పురుషుడు, కృష్ణా జీనం కట్టుకున్న వాడు, నల్లని మేఘం ఎలా ఉంటుందో అటువంటి శరీరం కలిగిన వాడు, పేరుకి తగిన గుణములు కలిగిన వాడు, అప్పుడే ఉదయించిన సుర్యభింబం నుంచి వచ్చే కాంతి ఎలా ఉంటుందో , అటువంటి కాంతి తో మెరిసి పోతున్నటువంటి , ఎర్రని జటలతో మెరిసిపోతున్న టువంటి వాడు , రాగాద్వేషములు లేని వాడు, ఏ మాత్సర్యము లేని వాడు, ఇప్పుడు వ్యాసుడు , జనమేజయుని గుండెల్లో ఎలా ఉన్నాడో చెప్తున్నారు.
అటువంటి వ్యాసుని వంక చూసి జనమేజయుడు ప్రశ్న వేస్తున్నాడు. మునులందరి చేత నమస్కరింప బడే స్వరూపం కలిగిన వాడా ! పరమ ధర్మాత్ములు , సమస్త శస్త్రములు తెలిసున్న మీరు , కురువ్రుద్దులు , భీష్ముడు , వీరందరూ కలిసి రాజ్యాన్ని విభాగం చేసారు. ఇవ్వకుండా ఊరుకుని పంచుకోవటానికి దెబ్బలాడుకుంటే, అది వేరు. కానీ ఇక్కడ దెబ్బలాడు కోవ టానికి అవకాసం లేకుండా విభజించి ఇచ్చేసారు. ఎవరు విభజించారు , పరమ ధర్మాత్ములు విభజించారు , కాబట్టి ఇహ దెబ్బలాడుకోవటానికి ఏమి ఉండదు,
మీ మాట విని ఎవరికిచ్చిన రాజ్యం వాళ్ళు ఎందుకు పరిపాలించలేదు, వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నారు . అంటే తాను మాట వినటం వలన ఎంత గట్టేకేసాడో లోపల గుర్తొస్తుంది. ఎందుకు వాళ్ళు యుద్ధం చేస్తే అంత ప్రజక్షయం అయింది , ఎందుకు అంతమంది చచ్చిపోయారు? బంధువుల్లో ఇంత కలహం ఎందుకు వచ్చింది, వాళ్ళని ఎవరు ఆపలేక పోయారా? కాబట్టి నాకు అసలు ఈ గొడవలు ఎందుకు వచ్చాయి . ఎందుకు మాట వినలేదు మీ వంటి పెద్దలు ఉండగా? తెలియక తప్పు చెయ్యటం తప్పుకాదు , తెలిసున్న వారు చెప్పినప్పు దిద్దుకోవటం గొప్ప.
ఈ ప్రశ్న అడిగితే మహానుభావుడు వ్యాసుడు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. వైశంపాయనుడి వైపు చూసి నువ్వు చెప్పు అన్నట్టు గా సైగ చేసాడు. అంటే ఆయన రచన చేసి కూర్చో పెట్టుకుని , మొట్ట మొదట తన శిష్యులకి చెప్పాడు. సుమంత్రుడు , పైలుడు , వైశంపాయనుడు , జైమిని వీళ్ళని కూర్చో పెట్టి చెప్పాడు.
ఇక ఇక్కడ నించి భారతం లో శ్రోత , వక్త మారుతున్నారు, ఇప్పటి వరకు ప్రవచనం చేసింది శౌతి , విన్నవారు , నైమిశారణ్యం లో మహర్షులు. ఇంకా ఇక్కడ నించి ప్రవచనం చేస్తున్న వాడు , వైశంపాయనుడు. వింటున్న వాడు జనమేజయుడు , కూర్చున్న వాడు వేదవ్యాసుడు.
మొట్ట మొదట భారతాన్ని వ్యాస సమక్షం లో ప్రవచనం చేసిన ఘనత వైశంపాయను కు దక్కింది. వైశంపాయను ఏ కారణం చేత వ్యాసుని యొక్క పాదాల దగ్గర నిలబడి , తడుము కో కుండా ,అంత గొప్ప గా భారతాన్ని చెప్పగలిగాడు. ఒకే ఒక్క కారణానికి చెప్పగలిగాడు , అది ఏమిటంటే తన గురించి ఒక్కపద్యం కూడా చెప్పక పోవటం వలన. ఇది భారతం లోని పరమ రహస్యం. ఇంత భారతం గురించి చెప్పిన వైశంపాయనుడు తన గురించి కానీ , తన తల్లి తండ్రుల గురించి కాని ఇంత భారతం చెప్పినటువంటి వాడు ఈ వైశంపాయనుడు అని ఎక్కడా చెప్పలేదు.
ఆయన భారతం చెప్పు అనగానే , గురువుగారి పాదాలమీద పది సాష్టాంగ నమస్కారం చేసాడు. చేసి గురువర్యా మీరు ఆనతి ఇచ్చారు అంటే , కార్యం జరిగిపోయినట్టే, ప్రవచనం చేస్తాను, మీరు శాసించినట్లే భారతం చెప్తాను. వ్యాసుడు గురించి చెప్పాడు తప్ప అసలు ఆయన గొప్ప తనం గురించి ఆయన ఎక్కడా మాట్లాడలేదు. సంక్షేపంగా ఒక్కసారి మహాభారతాన్ని అంతట్ని ఒక్కసారి చెప్పేసాడు.
ఆర్తి కలిగిన శిష్యుడైతే ప్రశ్న వేస్తె వివరణ చెయ్యాలి. వేద వ్యాసుని యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. మహానుభావుడయ్య ఈ వ్యాసుడు , ఈయనే అష్టాదశ పురాణములను ఇచ్చాడు. ఈయనే పంచమ వేదమైన భారతాన్ని ఇచ్చాడు. ఈయనే వేద విభాగం చేసాడు , అటువంటి వ్యాస మహర్షి పనుపు న నేను, ఇదిగో ఈ భారతాన్ని ప్రవచనం చేస్తున్నాను. అదొక్కటే మాట , తన గురించి ఒక పద్యాన్ని వైశాపయనుడు చెప్పలేదు.
అంటే అసలు మహాభారతాన్ని వినేటటువంటి శ్రోత ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని వినాలి. వైశామపయనునకు అంత కీర్తి ఎలా కలిగింది , సొంతంగా ఎదీ చెప్పలేదు. వ్యాసుడు చెప్పిందే చెప్పాడు , కానీ వ్యాసుడు చెప్పింది చెప్పటం వల్ల నేను ధన్యుణ్ణి అని చెప్పుకుని శాశ్వతుడు అయిపోయాడు. తప్ప నేను ఫలానా అని చెప్పుకుని చెప్పలేదు.
భగవత్ సంభందమైన విషయాన్ని ప్రవచనం చేసే వాడికి ఉండవలసిన ఏకైక ఆ భగవంతుని యందు , నిరతిశయ భక్తి , భగవత్ కధ ను రచన చేసిన ఋషి పాదముల యందు భక్తి,తన గురించి తెలియవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన భారత కధ ని ప్రారంభం చేస్తున్నాడు.
ఒకానొకప్పుడు ఇంద్రునితో సమానమైన బలపరాక్రమము కలిగిన రాజు వసువు అనే పేరుకల రాజు చేది రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. లోకంలో ఉండే మంచివారి చేత కీరితింప బడిన వాడు. ఆయన కూడా వేట నెపం మీద అడివికి వెళ్ళాడు. వెళ్లి జంతువులని వేటాడాడు. ఒక ఆశ్రమం లోకి వెళ్లి అక్కడ తపస్సు చేస్కున్తున్నటువంటి ఋషులని చూశాడు,
ఏముంటుంది ఆశ్రమం లో తాటాకుతో నేశిన కప్పు లేదా జనుముతో నేసిన కప్పు, వెదురుతో కట్టి మట్టితో అలికిన గోడలు, కర్రతో చేసిన ఒక ఆచమన పాత్ర, ఏదో కొద్దిగా కావలసిన సంబారములు, ఇన్ని పువ్వులు ఇన్ని పత్రాలు, కాస్త తేనే , నాలుగు పళ్ళు, ఇన్ని దుంపలు తప్ప ఇంకా భోగ వస్తువు అనేది ఏదీ ఉండదు.
ఇప్పడు రాజుకు నిర్వేదము కలిగింది. చేది రాజ్యాన్ని పరిపలించాను , ఇంద్రుడితో సమానం అనిపించుకున్న వాడ్ని , ఇంత బలపరాక్రమాలు ఉన్న వాడిని, కానీ ఏమిటి నేను సాధించింది, అంతపురాల్లో తిరిగాను , చలువరాతి మేడల్లో ఉన్నాను, హంస తూలికా తల్పాల మీద పడుకున్నాను , కానీ శాంతి ఒక్కటే లేదు. ఎప్పుడూ మనసులో బెంగే , మనసులో ఏదో పీడ గురించినటువంటి ఆలోచనే, ఈయనో పరమేస్వరున్ని ఒక్కణ్ణి నమ్ముకుని , ఇంత తేనే నాలుగు పళ్ళు ఇన్ని పువ్వులు , నాలుగు దుంపలు ఇంత పత్రీ పెట్టుకుని , హాయిగా ఈ కుటీరo లో ఈ ఆశ్రమం లోఎంత శాంతి తో ఉన్నాడు.
నేను రాజ దండం పట్టుకుంటే ,నా చాటున కొట్టుకుంటున్నారు అందరు. ఈయన అలా కుర్చుని , ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుంటే, సహజంగా జాతి వైరం ఉన్న జంతువులూ ,జాతి వైరాన్ని మరిచి చెలిమి చేసి తిరుగుతున్నాయి, ఈయన తపః ప్రభావానికి , ఇది మనసు శాంతిగా గడపటం అంటే ఇది.
ఏమిటి నేను పొందింది ఆ రాచ రికంలో ,ఆ ఐశ్వర్యం లో వద్దు అని , నేను చేసింది నాకు దేనికి పనికి వచ్చింది అన్న భావన కలిగింది. కలిగి ఆయన కూడా శైన్యాన్ని దూరం గా పెట్టేసి , ఆ అస్త్రాలు శస్త్రాలు అవతల పారేసి, వీటి గొడవ ఇక వద్దని , ప్రశాంతం గా కుర్చుని తపస్సు చేస్కోవటం మొదలుపెట్టాడు.
చాలా చిత్రమైన విషయం కదండీ, మార్పు రావటాన్ని మాట్లాడుతుంది భారతం అని మీరు గుర్తుపట్టాలి. ఇప్పడు ఆయనదగ్గరకి దేవతా గణములతో కూడినటువంటి వాడై ఇంద్రుడు వచ్చాడు , వచ్చి ఒక గొప్ప విమానాన్ని ఒక దాన్ని ఆయన దగ్గర పెట్టాడు. ఉన్నవి కాకా కొత్త వి ఇచ్చాడు, ఇచ్చి అన్నాడు నీవు నాకు స్నేహితుడవు. కేవలం భూమి మీద గొప్పతనం కాదు ఈ విమానం లో నువ్వు స్వర్గ లోకానికి వస్తావు.
కాసేపు ఒకటి రెండు రోజులు ఉండి వెళ్ళు, ఇప్పడు ఇంద్రుడు ఈయన శాంతికి మించి ఇవన్ని ఇస్తున్నాడు , ఇప్పుడు శాంతి ఉంటుందా , ఇంకా కొత్త అల్లర్లు మొదలవుతాయా ? కొత్త అల్లరే ప్రారoభం అవుతుంది. బాహ్యం లో గొప్ప వైభావాన్నే కృప చేస్తున్నాడు.
ఇప్పడు ఇంద్రుడు ఒక దివ్య విమానం తో పాటు నీ శరీరానికే ఒక దివ్యత్వం ఇచ్చేస్తున్నాను అన్నాడు. వాడని పద్మాలతో కూడిన మాల ఒకటి నీకు ఇస్తున్నాను, అది వేస్కుని ఉంటె నీకు శత్రువులైన రాజులు, నీ మీద విడిచి పెట్టె బాణములు నీ శరీరానికి వచ్చి తగలవు, అది నిన్ను అలా కాపాడుతుంది, ఆ పద్మాలు ఎన్నటికీ వాడిపోవు,అలాగే అవి ఎప్పుడూ గుబాళిస్తూ ఉంటుంది, అటువంటి మాల ఇస్తున్నాను.
దీనితో పాటుగా దుష్ట శిక్షణ , శిష్ట రక్షణా చెయ్యటానికి ఒక వెదురు కర్ర ఒకటి ఇస్తున్నాను, అదొక దివ్యమైన కర్ర. కాబట్టి ఇవన్నీ ఇస్తున్నాను . కాబట్టి నువ్వు చక్కగా హాయిగా కాలం గడుపు అన్నాడు. ఇప్పుడు ఆయన దేవేంద్రుడు, ఏ సంవత్సరం లో ఏ తిధి నాడు తనకి ఇవన్ని ఇచ్చాడో జ్ఞాపకం పెట్టుకుని, ఆ తిధి నాడు ఒక ఉత్సవం చేస్తూ ఉండే వాడు.
ఈ విమానాన్ని , ఈ మాలని , ఈ వేనుస్టి ఇంద్రుడు నాకు కృప చేసిన రోజని , ఇంద్రోచ్చవము అని చేస్తుండే వాడు. ఈయన్ని చూసి ఈ ఇంద్రోచ్చవాన్ని పక్కన ఉన్న రాజులు కూడా ప్రారంభం చేసారు , చిత్రం ఏమిటంటే, పరమేస్వరున్ని ఉద్దేసించి ఇంద్రుణ్ణి ఇద్దేసించి ఈ ఇంద్రోచ్చవం ఎవరు చేస్తారో,అటువంటి రాజులందరికీ కుడా ఆయుర్దాయం పెరుగుతుంది. సంతతి వృద్ధి లోకి వస్తారు.
ఎప్పుడూ కుడా వారు పరిపాలించే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. కాబట్టి ఆ ఉత్సవం చేసి అందరూ సుఖముగా ఉన్నారు. ఆ ఇంద్రుడు ఇచ్చిన వరముతో ఈ వసువుకి బృహద్రదుడు , మణివాహనుడు, సౌబలుడు , యదువు , రాజన్యుడు అనబడే ఐదుగురు కుమారులు జన్మించారు. పరమ సంతోషం గా ఉన్నాడు , ఇంద్రోత్సవం చేస్తున్నడు , పక్క రాజులు కూడా నేర్చుకున్నారు. ఆనందంగా కాలం గడిచి పోతుంది.
ఈ కాలం గడిచి పోతున్న రోజులలోనే ఒక చిత్రమైన సంఘటనల పరంపర ఒకటి జరిగింది. ఈయన రాజధాని నగరానికి చాలా దగ్గరలో సూక్తి మతి అని ఒక నది ప్రవహిస్తూ ఉండేది. సాధారణగా రాజుగారి కోటకి చాల దగ్గరలో ఏదో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. కందకాలలో నీటిని నింపటానికి, తోటలో చెట్ల కి నీరు పెట్టటానికి నది ఒడ్డునే కోట కడతారు, కాబట్టి అక్కడ ఆ శుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉంది.
నదిని స్త్రీ వాచకం తో పిలుస్తారు, సముద్రాన్ని పుం వాచకం తో పిలుస్తారు. ఈ నది అలా ప్రవహిస్తూ వెళ్తుంటే, ఆ నది యొక్క అందచందాలని చూసింది ఒక పర్వతం, ఆ పర్వతం పేరు కోలాహలము. ఆ పర్వతానికి నది నచ్చింది. ఈవిడ మీద మనసు పెంచుకున్నాడు. అలా ఉంటుందా లోకం లో అని మీరు అనుకోకూడదు, జీవుడు అని ఒకడు ఉంటాడు. అసలు యదర్దమునకు జీవుడు సుఖ దుఃఖాలని అనుభవించటానికే శరీరం వస్తుంది.
ఈ శరేరాన్ని ఈశ్వరుడు ఎలా ఇస్తాడు అంటే , పాపం తియ్యాలి , పుణ్యం తీసేయ్యాలి. ఈ రెండు ఎలా తీస్తాడు? శరీరాన్ని ఇస్తారు , ఇచ్చి జీవుణ్ణి ఇందులో పెడతాడు. జీవుడు కనపడదు, శరీరం కనిపిస్తుంది. వీళ్ళు జీవుడు స్థాయి లో మాట్లాడుతున్నారు అని మీరు అర్థం చేస్కోవాలి. అందుకని ఈ కోలాహలం అన్న పర్వతానికి , శుక్తి మతి అన్న నది నచ్చింది.
ఆ కోలాహలం అనే పర్వతం అమాంతం లేచి వచ్చి , ఈ శుక్తిమతి అనే నదికి అడ్డంగా కూర్చుంది. అనగా స్త్రీ పురుష సంభందం గా అనుభవించింది అని ఒక మాట అంటే దోషం ఏమి లేదు. కానీ బలత్కారము ఆ నదిని అనుభవించింది ఆ కోలాహలం అనే పర్వతం. ఆ శుక్తిమతి పొందిన పరితపాన్ని రాజు అర్థం చేస్కున్నాడు. రాజు అంటే ఎవరు , క్షితి నాధుడు. లోకంలో ఏ జీవికి బాధ కలిగినా ఆయన తీర్చాలి. అందుకని ఆయన వెళ్లి ఆయన కాలు తో తన్నాడు కోలాహలo అన్న పర్వతాన్ని, అది ఎగిరి ఎక్కడో పడింది.
ఆ వసువు కి ఉన్న బలం అలాంటిది. ఆయన ఇంద్రుడు ఇచ్చిన విమానం లో పైన తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన్ని ఉపరిచర వసువు అని పిలిచారు. ఆ ఉపరిచర వసువు కాలితో తంతే ఆ కోలాహలం అన్న పర్వతం ఎక్కడో పడింది. అంటే మీరు ఒకటి గమనించాలి. ఏదో కధ కింద చదవటం కాదు. రాజు అనగా ఎంత ధర్మాన్ని పాటించి ప్రాణుల యొక్క బాధ ని చూస్తూ ఉంటాడో, సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని రాజు ఎలా చూడాలో చెప్తోంది.
ఆ పర్వతo ఆ నదితో సంఘమించడం చేత ఆ నదికి ఒక కొడుకు పుట్టాడు, ఒక కూతురు పుట్టింది. వాళ్ళు మనుష్య శరీరం తో పుట్టారు , ఇది ఈశ్వరాజ్ఞ. ఇప్పుడు ఆ పుట్టిన కొడుకు పేరు సుపదుడు. ఆ పుట్టిన ఆడపిల్ల పేరు గిరిజ . ఆ నది అన్నది మహానుభావుడు ఆ ఉపరిచర వసువు వచ్చి ఆ కోలాహలం అన్న పర్వతాన్ని కాల్తో తన్నాడు కాబట్టి ఆ పర్వతం ఎక్కడో పడింది. నాకు ఆ కోలాహలం అన్న పర్వతం వల్ల ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. వీళ్ళని రాజుకి ఇచ్చేస్తాను అని రాజుకి ఇచ్చేసింది.
రాజు ఈ గిరిక యొక్క అండ చందాలు చూసి ఆమెని పెళ్లి చేస్కున్నాడు. ఈ పిల్లవాడు ఉన్నదే సుపదుడు వీడిని తన సేనాపతిగా నియామకం చేసాడు. మీరు ఇక్కడ కొంచం విశాల హృదయం తో వినవలసి ఉంటుంది. వ్యాసుడు , నన్నయ గారు ఇంత తక్కువగా రాయవలసిన అగత్యం లేని వాళ్ళు అన్న పవిత్ర హృదయం తో వినవలసి ఉంటుంది.
ఈ గిరిక అందచందాల మీద రాజు మనసు నిలబడింది. ఎప్పుడు నిలబడింది , ఆమె రుతుమతి అయ్యి ఉన్నది ఒకసారి, అప్పుడు ఉపరిచర వసువు యొక్క పితృదేవతలు పిలిచి నీ భార్య ఋతుమతి అయ్యి ఉన్నది , అందుకని నీవు వెళ్లి ఆమెకి మంసాహరమును తెచ్చి పెట్టు.
ఒకటి ,యజమాని ఉండి , ఏదో ప్రయోజనం కొరకు చేస్తే ఇహము , ఇక్కడ ప్రయోజనం నెరవేరుతుంది.
రెండు , ఇక్కడ ప్రయోజనం కొరకు కాదు అని చేస్తే ఊర్ధ్వ లోకాలలో నివసించ గల గొప్ప శక్తిని యాగము కృప చేస్తుంది. ఈ రెండూ కాదు లోక శాంతి అసలు భారత ప్రారంభం లో జనమేజయుడు అటువంటి యాగం తో ప్రారంభం భారతం.
ఇప్పుడు జనమేజయుడు చేసే యాగం ఈ మూడిటి లో ఇందులోకి వస్తుంది, ఈ మూడి టి లో ఎందులోకి రాదు , ఇహము లేదు, పరము లేదు, లోకోపకారము లేదు , మిగిలనిది ఏమిటి అయ్యింది కక్ష, కక్ష కొరకు యాగము చెయొచ్చా , ఇన్ని చేసాడు, అంతటి అనుభవం ఏమైనట్టు ? ఇన్ని చేశాను అంటున్నావ్ , ఇంతమంది బ్రాహ్మణుల్ని ఆదరించాను అంటున్నావ్ , ఇన్ని యజ్ఞాలు చేసావు, ఇంత పరిపాలన చేసావు, తుట్ట తుదకు నీ మనసు యొక్క వ్యగ్రత కి లొంగిపోయావు , లొంగిపోయి ఆ యాగం దేని కొరకు చేస్తున్నావ్ అంటే ఎప్పుడో మీ నాన్న ని కరిచినటువంటి ఒక పాము యొక్క ఉద్దతి ని మనసులో స్మరణ చేసి, మొత్తం పాముల్ని చంపటానికి యాగం చేస్తున్నావ్. పోనీ అదైనా నీంతట నీకు కలిగిన సంకల్పమా , ఉదంకుడు వచ్చి ప్రచోదనం చేసాడు అటువంటి యాగం చెయ్యమని. ఉదంకుడు ఎందుకు చెయ్యాలి ఆయన కోపం ఆయన కి ఉంది.
తక్షకుడు ఎప్పుడో ఆ ఉదంకుడికి అడ్డం వచ్చాడు. గురు పత్నియొక్క యొక్క కోరికమేరకు , మహారాజు పౌష్యుని యొక్క భార్య కుండలములను తెస్తుంటే ఆయన అపహరించి తీస్కెళ్ళి ఇబ్బంది పెట్టాడు అని ,భూత దయ లేకుండా చేసే యాగం ఏ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆపుచేసేయి అన్నాడు అస్తీకుడు. చాలా గొప్ప విషయం ఏమిటంటే లోకంలో తనకి తట్టక పోయిన పెద్దలు చెప్పినప్పుడు వినగలగడం. ఇదొక్కటి ఉండటం చంద్ర వంశం లో పాండవుల ఆస్తి, వాళ్లకి తట్టక పోవచ్చు కానీ కృష్ణుడు చెప్తే వింటారు పాండవులు, అలా జనమేజయుడు విన్నాడు, విని ఉత్తర క్షణం లో యాగాన్ని ఆపు చేసేయండి అన్నాడు.
ఇప్పుడు యాగo ఆపుచేసిన తరువాత అది ఒక సంఘటన గా జనమేజయుడు విడిచి పెట్టి ఉంటె , వైశంపా యనుడు భారతం చెప్పడు. ఇక్కడ జనమేజయుడు ఒక్క సారి విచారణా స్థితి కి వెళ్ళాడు. అసలు నేను ఎందుకు చేశాను ఈ యాగం, నిజమే అస్తీకుడు చెప్పిన దాంట్లో నిజం ఉంది. కేవలం కక్ష తో చేశాను. ఈ కక్ష కి కారణం పోనీ తక్షకుడు నాకేమైనా అపకారం చేసాడా అంటే లేదు.
మా నాన్న గారిని మట్టుపెట్టాడని ఇప్పడు నేను యజ్ఞం చేసి, కొన్ని వేల లక్షల సర్పములనె కాల్చేసాను. మనిషి మనసులోకి కక్ష అన్నది ప్రేవేసిస్తే , అంతకుముందు విన్నవి, అంతకు ముందు నేర్చుకున్నవి, ఎంత తేలికగా కొట్టుకుపోయాయో కదా ,ఇంకో ఆలోచన లేకుండా యాగం చేసేసాను.
నాకు ఎవరూ అలా యాగం చెయ్యొద్దు అని చెప్పలేదు. ఆస్తీకుడు చెప్పగానే ఆపేసాను. కానీ నాకన్నా ముందు పుట్టి ఈ రాజ్యాన్ని పరిపాలించిన , పాండవులు కౌరవులు నాకు తండ్రులు, వాళ్ళకి చెప్పటానికి పరమ ధర్మ మూర్తి అయిన వ్యాసుడు ఉన్నాడు. సాక్షాత్తు ఆత్మ బంధువు, ఆ వ్యాస స్పర్స లేకుండా బిడ్డలు పుట్టలేదు. కాబట్టి ఆయన వంశ కర్త అయ్యి ఉన్నాడు. పెద్దరికం వహించి చెప్పటానికి భీష్ముడు ఉన్నాడు. అడగకుండా నే చెప్తాడు భీష్ముడు, మహా పురుషుడు ఆచార్యుడు ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు ఇంత మంది ఉండీ మరి ఎవరు చెప్పింది వినకపోవటం చేత అంత పెద్ద యుద్ధం (కురుక్షేత్రం )జరిగింది ? వాళ్ళు కూడా ఎక్కడో మాట వినకుండా ఉండటం వలన ఇది జరిగింది. కాబట్టి వ్యాసుడు ఉండగా ఇది ఎలా జరిగింది అసలు ?
ఎవరు మాట వినపోవటం వల్ల జరిగింది. మాట వినకపోవటం కేవలం స్వభావ రిత్యా వినకపోవటం జరిగిందా ? అంత కన్నా ఇంకా వెనకాతల కారణం ఏమైనాఉందా ? ఒక వ్యక్తి స్వభావ రీత్యా మాట వినక పోయి ఉంటె , ఇంత మంది మహాత్ములు ఉన్న చోట ఆ ఒక్కడే పోయి ఉండాలి. అలా పోలేదు.
ఇనుప రజను మొత్తము ఐస్కాంతం ఆకర్షించి నట్టు , దుష్ట శక్తుల ను అన్నింటినీ దుర్యోధనుడు ఆకర్షించాడు. దేవతలు అందరు ఈశ్వరుని ముందు నించున్నట్టు దేవత శక్తులందు ఆవిర్భవించిన వాళ్ళు అందరూ పాండవుల వైపుకి వెళ్లారు. మరి వాళ్లైన మాట విని ఉండాలి కదా? మరి పాండవులు ఎందుకు వినలేదు , వీళ్ళిద్దరికీ యుద్ధం ఎందుకు జరిగింది అసలు కురుక్షేత్రం లో ?
ఆస్తీకుడు చెప్పగా నే నేను విని యజ్ఞం ఆపినట్టు, వాళ్ళు కుడా వ్యాసుడి మాటొ , భీష్ముడి మాటో , విదురుడి మాటో అంత మంది మహానుభావులు ఉన్నారు ఆ సభలో , ఎక్కడ నించో తెచుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ నా అదృష్టం కొద్ది ఇక్కడ సభలో వ్యాసుడు ఉన్నాడు అడగటానికి. వాళ్ళు ఎప్పుడూ ధర్మం మాట్లాడుతూ నే ఉండాలి.
ఎక్కడ వచ్చింది దోషం. ఎక్కడ మాట వినకపోవటం అన్నది వచ్చింది. ఎవరెవరు మంచి మాటలు చెప్పారు , ఎవరెరు వినలేదు, ఎవరెవరు ఏ ఏ స్వభావముల చేత ,ఏ ఏ కరణముల చేత ఇంత భారత యుద్ధం జరగ వలసి వచ్చింది.
ఈ సంఘర్షణ లో ఏవో చాలా గొప్ప గొప్ప విషయాలే ఉంది ఉంటాయి.
ఇప్పడు కధ ని కధ గా చెప్పేవాడు కాదు కావాల్సింది , కధ లో ఉన్న ధర్మ సుక్ష్మముల తో చెప్పే వాడు కావలి.
అదృష్టం ఏంటంటే ,వ్యాసుడు ఉన్నాడు సభలో , యజ్ఞ పరీక్షకుడి గా కూర్చొని ఉన్నాడు. ఆ వ్యాసుడే మహాభారత రచన చేసిన వాడు , ఇతిహాస రచన, పెద్దలు మనం అడిగుతే చెప్పాలని లేదు . ఎందుకు చెప్పాలి అంటే కృప కలిగి చెప్పాలి. కృప ఎప్పుడు కలుగుతుంది, మన ఆర్తి అర్థం అయితే కృప కలుగుతుంది. ఏదో తెలుసుకోవాలన్న ఆర్తి అవతల వారి యందు ఉన్నది. అంతే గురువుగారు మాట్లాడటానికి అంత కన్నా ఇంకో విషయాన్నీ ప్రాతిపదిక గా తీస్కోరు.
కాబట్టి ఇప్పుడు నా ఆర్తి అర్థం అయితే మాట్లాడుతాడు. ఆయన యందు నా పూజ్య భావము కూడా ఆయన కి స్పష్టము కావలి అప్పుడే మాట్లాడుతాడు. ఈ కోణం లో జనమేజయుడు అడుగుతున్నాడు. ఆ సమయం లోనే మహాభారతం ప్రవచన రూపం లోకి మారింది.
ఇప్పడు జనమేజయుడు వ్యాసుని స్మరిస్తున్నాడు, సాక్షాత్తు పరబ్రహ్మమే రాసీ భూతమై నా ఎదుట కూర్చుంది. పరస మహర్షి యొక్క కుమారుడు , బ్రహ్మర్షుల లో ముఖ్యమైన వాడు, దయ కలిగిన వాడు , కురువంశము అంతటికీ కూడా పితామహ స్తనము నందు ఉన్నవాడు, జనమునంతటికి కూడా హితమును కల్పించటము అనేటటు వంటి మార్గము నందు, అష్టాదస పురాణములను , వేదములను విభామును చేసి , లోకమునకు నాలుగు మంచిమాటలు చెప్పి , జనాన్ని మంచి మార్గం లోకి మళ్ళించటం అనే మహా ప్రక్రియని , ప్రారంభం చేసిన మహా పురుషుడు, కృష్ణా జీనం కట్టుకున్న వాడు, నల్లని మేఘం ఎలా ఉంటుందో అటువంటి శరీరం కలిగిన వాడు, పేరుకి తగిన గుణములు కలిగిన వాడు, అప్పుడే ఉదయించిన సుర్యభింబం నుంచి వచ్చే కాంతి ఎలా ఉంటుందో , అటువంటి కాంతి తో మెరిసి పోతున్నటువంటి , ఎర్రని జటలతో మెరిసిపోతున్న టువంటి వాడు , రాగాద్వేషములు లేని వాడు, ఏ మాత్సర్యము లేని వాడు, ఇప్పుడు వ్యాసుడు , జనమేజయుని గుండెల్లో ఎలా ఉన్నాడో చెప్తున్నారు.
అటువంటి వ్యాసుని వంక చూసి జనమేజయుడు ప్రశ్న వేస్తున్నాడు. మునులందరి చేత నమస్కరింప బడే స్వరూపం కలిగిన వాడా ! పరమ ధర్మాత్ములు , సమస్త శస్త్రములు తెలిసున్న మీరు , కురువ్రుద్దులు , భీష్ముడు , వీరందరూ కలిసి రాజ్యాన్ని విభాగం చేసారు. ఇవ్వకుండా ఊరుకుని పంచుకోవటానికి దెబ్బలాడుకుంటే, అది వేరు. కానీ ఇక్కడ దెబ్బలాడు కోవ టానికి అవకాసం లేకుండా విభజించి ఇచ్చేసారు. ఎవరు విభజించారు , పరమ ధర్మాత్ములు విభజించారు , కాబట్టి ఇహ దెబ్బలాడుకోవటానికి ఏమి ఉండదు,
మీ మాట విని ఎవరికిచ్చిన రాజ్యం వాళ్ళు ఎందుకు పరిపాలించలేదు, వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నారు . అంటే తాను మాట వినటం వలన ఎంత గట్టేకేసాడో లోపల గుర్తొస్తుంది. ఎందుకు వాళ్ళు యుద్ధం చేస్తే అంత ప్రజక్షయం అయింది , ఎందుకు అంతమంది చచ్చిపోయారు? బంధువుల్లో ఇంత కలహం ఎందుకు వచ్చింది, వాళ్ళని ఎవరు ఆపలేక పోయారా? కాబట్టి నాకు అసలు ఈ గొడవలు ఎందుకు వచ్చాయి . ఎందుకు మాట వినలేదు మీ వంటి పెద్దలు ఉండగా? తెలియక తప్పు చెయ్యటం తప్పుకాదు , తెలిసున్న వారు చెప్పినప్పు దిద్దుకోవటం గొప్ప.
ఈ ప్రశ్న అడిగితే మహానుభావుడు వ్యాసుడు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. వైశంపాయనుడి వైపు చూసి నువ్వు చెప్పు అన్నట్టు గా సైగ చేసాడు. అంటే ఆయన రచన చేసి కూర్చో పెట్టుకుని , మొట్ట మొదట తన శిష్యులకి చెప్పాడు. సుమంత్రుడు , పైలుడు , వైశంపాయనుడు , జైమిని వీళ్ళని కూర్చో పెట్టి చెప్పాడు.
ఇక ఇక్కడ నించి భారతం లో శ్రోత , వక్త మారుతున్నారు, ఇప్పటి వరకు ప్రవచనం చేసింది శౌతి , విన్నవారు , నైమిశారణ్యం లో మహర్షులు. ఇంకా ఇక్కడ నించి ప్రవచనం చేస్తున్న వాడు , వైశంపాయనుడు. వింటున్న వాడు జనమేజయుడు , కూర్చున్న వాడు వేదవ్యాసుడు.
మొట్ట మొదట భారతాన్ని వ్యాస సమక్షం లో ప్రవచనం చేసిన ఘనత వైశంపాయను కు దక్కింది. వైశంపాయను ఏ కారణం చేత వ్యాసుని యొక్క పాదాల దగ్గర నిలబడి , తడుము కో కుండా ,అంత గొప్ప గా భారతాన్ని చెప్పగలిగాడు. ఒకే ఒక్క కారణానికి చెప్పగలిగాడు , అది ఏమిటంటే తన గురించి ఒక్కపద్యం కూడా చెప్పక పోవటం వలన. ఇది భారతం లోని పరమ రహస్యం. ఇంత భారతం గురించి చెప్పిన వైశంపాయనుడు తన గురించి కానీ , తన తల్లి తండ్రుల గురించి కాని ఇంత భారతం చెప్పినటువంటి వాడు ఈ వైశంపాయనుడు అని ఎక్కడా చెప్పలేదు.
ఆయన భారతం చెప్పు అనగానే , గురువుగారి పాదాలమీద పది సాష్టాంగ నమస్కారం చేసాడు. చేసి గురువర్యా మీరు ఆనతి ఇచ్చారు అంటే , కార్యం జరిగిపోయినట్టే, ప్రవచనం చేస్తాను, మీరు శాసించినట్లే భారతం చెప్తాను. వ్యాసుడు గురించి చెప్పాడు తప్ప అసలు ఆయన గొప్ప తనం గురించి ఆయన ఎక్కడా మాట్లాడలేదు. సంక్షేపంగా ఒక్కసారి మహాభారతాన్ని అంతట్ని ఒక్కసారి చెప్పేసాడు.
ఆర్తి కలిగిన శిష్యుడైతే ప్రశ్న వేస్తె వివరణ చెయ్యాలి. వేద వ్యాసుని యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. మహానుభావుడయ్య ఈ వ్యాసుడు , ఈయనే అష్టాదశ పురాణములను ఇచ్చాడు. ఈయనే పంచమ వేదమైన భారతాన్ని ఇచ్చాడు. ఈయనే వేద విభాగం చేసాడు , అటువంటి వ్యాస మహర్షి పనుపు న నేను, ఇదిగో ఈ భారతాన్ని ప్రవచనం చేస్తున్నాను. అదొక్కటే మాట , తన గురించి ఒక పద్యాన్ని వైశాపయనుడు చెప్పలేదు.
అంటే అసలు మహాభారతాన్ని వినేటటువంటి శ్రోత ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని వినాలి. వైశామపయనునకు అంత కీర్తి ఎలా కలిగింది , సొంతంగా ఎదీ చెప్పలేదు. వ్యాసుడు చెప్పిందే చెప్పాడు , కానీ వ్యాసుడు చెప్పింది చెప్పటం వల్ల నేను ధన్యుణ్ణి అని చెప్పుకుని శాశ్వతుడు అయిపోయాడు. తప్ప నేను ఫలానా అని చెప్పుకుని చెప్పలేదు.
భగవత్ సంభందమైన విషయాన్ని ప్రవచనం చేసే వాడికి ఉండవలసిన ఏకైక ఆ భగవంతుని యందు , నిరతిశయ భక్తి , భగవత్ కధ ను రచన చేసిన ఋషి పాదముల యందు భక్తి,తన గురించి తెలియవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన భారత కధ ని ప్రారంభం చేస్తున్నాడు.
ఒకానొకప్పుడు ఇంద్రునితో సమానమైన బలపరాక్రమము కలిగిన రాజు వసువు అనే పేరుకల రాజు చేది రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. లోకంలో ఉండే మంచివారి చేత కీరితింప బడిన వాడు. ఆయన కూడా వేట నెపం మీద అడివికి వెళ్ళాడు. వెళ్లి జంతువులని వేటాడాడు. ఒక ఆశ్రమం లోకి వెళ్లి అక్కడ తపస్సు చేస్కున్తున్నటువంటి ఋషులని చూశాడు,
ఏముంటుంది ఆశ్రమం లో తాటాకుతో నేశిన కప్పు లేదా జనుముతో నేసిన కప్పు, వెదురుతో కట్టి మట్టితో అలికిన గోడలు, కర్రతో చేసిన ఒక ఆచమన పాత్ర, ఏదో కొద్దిగా కావలసిన సంబారములు, ఇన్ని పువ్వులు ఇన్ని పత్రాలు, కాస్త తేనే , నాలుగు పళ్ళు, ఇన్ని దుంపలు తప్ప ఇంకా భోగ వస్తువు అనేది ఏదీ ఉండదు.
ఇప్పడు రాజుకు నిర్వేదము కలిగింది. చేది రాజ్యాన్ని పరిపలించాను , ఇంద్రుడితో సమానం అనిపించుకున్న వాడ్ని , ఇంత బలపరాక్రమాలు ఉన్న వాడిని, కానీ ఏమిటి నేను సాధించింది, అంతపురాల్లో తిరిగాను , చలువరాతి మేడల్లో ఉన్నాను, హంస తూలికా తల్పాల మీద పడుకున్నాను , కానీ శాంతి ఒక్కటే లేదు. ఎప్పుడూ మనసులో బెంగే , మనసులో ఏదో పీడ గురించినటువంటి ఆలోచనే, ఈయనో పరమేస్వరున్ని ఒక్కణ్ణి నమ్ముకుని , ఇంత తేనే నాలుగు పళ్ళు ఇన్ని పువ్వులు , నాలుగు దుంపలు ఇంత పత్రీ పెట్టుకుని , హాయిగా ఈ కుటీరo లో ఈ ఆశ్రమం లోఎంత శాంతి తో ఉన్నాడు.
నేను రాజ దండం పట్టుకుంటే ,నా చాటున కొట్టుకుంటున్నారు అందరు. ఈయన అలా కుర్చుని , ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుంటే, సహజంగా జాతి వైరం ఉన్న జంతువులూ ,జాతి వైరాన్ని మరిచి చెలిమి చేసి తిరుగుతున్నాయి, ఈయన తపః ప్రభావానికి , ఇది మనసు శాంతిగా గడపటం అంటే ఇది.
ఏమిటి నేను పొందింది ఆ రాచ రికంలో ,ఆ ఐశ్వర్యం లో వద్దు అని , నేను చేసింది నాకు దేనికి పనికి వచ్చింది అన్న భావన కలిగింది. కలిగి ఆయన కూడా శైన్యాన్ని దూరం గా పెట్టేసి , ఆ అస్త్రాలు శస్త్రాలు అవతల పారేసి, వీటి గొడవ ఇక వద్దని , ప్రశాంతం గా కుర్చుని తపస్సు చేస్కోవటం మొదలుపెట్టాడు.
చాలా చిత్రమైన విషయం కదండీ, మార్పు రావటాన్ని మాట్లాడుతుంది భారతం అని మీరు గుర్తుపట్టాలి. ఇప్పడు ఆయనదగ్గరకి దేవతా గణములతో కూడినటువంటి వాడై ఇంద్రుడు వచ్చాడు , వచ్చి ఒక గొప్ప విమానాన్ని ఒక దాన్ని ఆయన దగ్గర పెట్టాడు. ఉన్నవి కాకా కొత్త వి ఇచ్చాడు, ఇచ్చి అన్నాడు నీవు నాకు స్నేహితుడవు. కేవలం భూమి మీద గొప్పతనం కాదు ఈ విమానం లో నువ్వు స్వర్గ లోకానికి వస్తావు.
కాసేపు ఒకటి రెండు రోజులు ఉండి వెళ్ళు, ఇప్పడు ఇంద్రుడు ఈయన శాంతికి మించి ఇవన్ని ఇస్తున్నాడు , ఇప్పుడు శాంతి ఉంటుందా , ఇంకా కొత్త అల్లర్లు మొదలవుతాయా ? కొత్త అల్లరే ప్రారoభం అవుతుంది. బాహ్యం లో గొప్ప వైభావాన్నే కృప చేస్తున్నాడు.
ఇప్పడు ఇంద్రుడు ఒక దివ్య విమానం తో పాటు నీ శరీరానికే ఒక దివ్యత్వం ఇచ్చేస్తున్నాను అన్నాడు. వాడని పద్మాలతో కూడిన మాల ఒకటి నీకు ఇస్తున్నాను, అది వేస్కుని ఉంటె నీకు శత్రువులైన రాజులు, నీ మీద విడిచి పెట్టె బాణములు నీ శరీరానికి వచ్చి తగలవు, అది నిన్ను అలా కాపాడుతుంది, ఆ పద్మాలు ఎన్నటికీ వాడిపోవు,అలాగే అవి ఎప్పుడూ గుబాళిస్తూ ఉంటుంది, అటువంటి మాల ఇస్తున్నాను.
దీనితో పాటుగా దుష్ట శిక్షణ , శిష్ట రక్షణా చెయ్యటానికి ఒక వెదురు కర్ర ఒకటి ఇస్తున్నాను, అదొక దివ్యమైన కర్ర. కాబట్టి ఇవన్నీ ఇస్తున్నాను . కాబట్టి నువ్వు చక్కగా హాయిగా కాలం గడుపు అన్నాడు. ఇప్పుడు ఆయన దేవేంద్రుడు, ఏ సంవత్సరం లో ఏ తిధి నాడు తనకి ఇవన్ని ఇచ్చాడో జ్ఞాపకం పెట్టుకుని, ఆ తిధి నాడు ఒక ఉత్సవం చేస్తూ ఉండే వాడు.
ఈ విమానాన్ని , ఈ మాలని , ఈ వేనుస్టి ఇంద్రుడు నాకు కృప చేసిన రోజని , ఇంద్రోచ్చవము అని చేస్తుండే వాడు. ఈయన్ని చూసి ఈ ఇంద్రోచ్చవాన్ని పక్కన ఉన్న రాజులు కూడా ప్రారంభం చేసారు , చిత్రం ఏమిటంటే, పరమేస్వరున్ని ఉద్దేసించి ఇంద్రుణ్ణి ఇద్దేసించి ఈ ఇంద్రోచ్చవం ఎవరు చేస్తారో,అటువంటి రాజులందరికీ కుడా ఆయుర్దాయం పెరుగుతుంది. సంతతి వృద్ధి లోకి వస్తారు.
ఎప్పుడూ కుడా వారు పరిపాలించే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. కాబట్టి ఆ ఉత్సవం చేసి అందరూ సుఖముగా ఉన్నారు. ఆ ఇంద్రుడు ఇచ్చిన వరముతో ఈ వసువుకి బృహద్రదుడు , మణివాహనుడు, సౌబలుడు , యదువు , రాజన్యుడు అనబడే ఐదుగురు కుమారులు జన్మించారు. పరమ సంతోషం గా ఉన్నాడు , ఇంద్రోత్సవం చేస్తున్నడు , పక్క రాజులు కూడా నేర్చుకున్నారు. ఆనందంగా కాలం గడిచి పోతుంది.
ఈ కాలం గడిచి పోతున్న రోజులలోనే ఒక చిత్రమైన సంఘటనల పరంపర ఒకటి జరిగింది. ఈయన రాజధాని నగరానికి చాలా దగ్గరలో సూక్తి మతి అని ఒక నది ప్రవహిస్తూ ఉండేది. సాధారణగా రాజుగారి కోటకి చాల దగ్గరలో ఏదో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. కందకాలలో నీటిని నింపటానికి, తోటలో చెట్ల కి నీరు పెట్టటానికి నది ఒడ్డునే కోట కడతారు, కాబట్టి అక్కడ ఆ శుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉంది.
నదిని స్త్రీ వాచకం తో పిలుస్తారు, సముద్రాన్ని పుం వాచకం తో పిలుస్తారు. ఈ నది అలా ప్రవహిస్తూ వెళ్తుంటే, ఆ నది యొక్క అందచందాలని చూసింది ఒక పర్వతం, ఆ పర్వతం పేరు కోలాహలము. ఆ పర్వతానికి నది నచ్చింది. ఈవిడ మీద మనసు పెంచుకున్నాడు. అలా ఉంటుందా లోకం లో అని మీరు అనుకోకూడదు, జీవుడు అని ఒకడు ఉంటాడు. అసలు యదర్దమునకు జీవుడు సుఖ దుఃఖాలని అనుభవించటానికే శరీరం వస్తుంది.
ఈ శరేరాన్ని ఈశ్వరుడు ఎలా ఇస్తాడు అంటే , పాపం తియ్యాలి , పుణ్యం తీసేయ్యాలి. ఈ రెండు ఎలా తీస్తాడు? శరీరాన్ని ఇస్తారు , ఇచ్చి జీవుణ్ణి ఇందులో పెడతాడు. జీవుడు కనపడదు, శరీరం కనిపిస్తుంది. వీళ్ళు జీవుడు స్థాయి లో మాట్లాడుతున్నారు అని మీరు అర్థం చేస్కోవాలి. అందుకని ఈ కోలాహలం అన్న పర్వతానికి , శుక్తి మతి అన్న నది నచ్చింది.
ఆ కోలాహలం అనే పర్వతం అమాంతం లేచి వచ్చి , ఈ శుక్తిమతి అనే నదికి అడ్డంగా కూర్చుంది. అనగా స్త్రీ పురుష సంభందం గా అనుభవించింది అని ఒక మాట అంటే దోషం ఏమి లేదు. కానీ బలత్కారము ఆ నదిని అనుభవించింది ఆ కోలాహలం అనే పర్వతం. ఆ శుక్తిమతి పొందిన పరితపాన్ని రాజు అర్థం చేస్కున్నాడు. రాజు అంటే ఎవరు , క్షితి నాధుడు. లోకంలో ఏ జీవికి బాధ కలిగినా ఆయన తీర్చాలి. అందుకని ఆయన వెళ్లి ఆయన కాలు తో తన్నాడు కోలాహలo అన్న పర్వతాన్ని, అది ఎగిరి ఎక్కడో పడింది.
ఆ వసువు కి ఉన్న బలం అలాంటిది. ఆయన ఇంద్రుడు ఇచ్చిన విమానం లో పైన తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన్ని ఉపరిచర వసువు అని పిలిచారు. ఆ ఉపరిచర వసువు కాలితో తంతే ఆ కోలాహలం అన్న పర్వతం ఎక్కడో పడింది. అంటే మీరు ఒకటి గమనించాలి. ఏదో కధ కింద చదవటం కాదు. రాజు అనగా ఎంత ధర్మాన్ని పాటించి ప్రాణుల యొక్క బాధ ని చూస్తూ ఉంటాడో, సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని రాజు ఎలా చూడాలో చెప్తోంది.
ఆ పర్వతo ఆ నదితో సంఘమించడం చేత ఆ నదికి ఒక కొడుకు పుట్టాడు, ఒక కూతురు పుట్టింది. వాళ్ళు మనుష్య శరీరం తో పుట్టారు , ఇది ఈశ్వరాజ్ఞ. ఇప్పుడు ఆ పుట్టిన కొడుకు పేరు సుపదుడు. ఆ పుట్టిన ఆడపిల్ల పేరు గిరిజ . ఆ నది అన్నది మహానుభావుడు ఆ ఉపరిచర వసువు వచ్చి ఆ కోలాహలం అన్న పర్వతాన్ని కాల్తో తన్నాడు కాబట్టి ఆ పర్వతం ఎక్కడో పడింది. నాకు ఆ కోలాహలం అన్న పర్వతం వల్ల ఒక కొడుకు ఒక కూతురు పుట్టారు. వీళ్ళని రాజుకి ఇచ్చేస్తాను అని రాజుకి ఇచ్చేసింది.
రాజు ఈ గిరిక యొక్క అండ చందాలు చూసి ఆమెని పెళ్లి చేస్కున్నాడు. ఈ పిల్లవాడు ఉన్నదే సుపదుడు వీడిని తన సేనాపతిగా నియామకం చేసాడు. మీరు ఇక్కడ కొంచం విశాల హృదయం తో వినవలసి ఉంటుంది. వ్యాసుడు , నన్నయ గారు ఇంత తక్కువగా రాయవలసిన అగత్యం లేని వాళ్ళు అన్న పవిత్ర హృదయం తో వినవలసి ఉంటుంది.
ఈ గిరిక అందచందాల మీద రాజు మనసు నిలబడింది. ఎప్పుడు నిలబడింది , ఆమె రుతుమతి అయ్యి ఉన్నది ఒకసారి, అప్పుడు ఉపరిచర వసువు యొక్క పితృదేవతలు పిలిచి నీ భార్య ఋతుమతి అయ్యి ఉన్నది , అందుకని నీవు వెళ్లి ఆమెకి మంసాహరమును తెచ్చి పెట్టు.