ఇంద్రుడు ని ప్రార్థించిన కద్రువకు దేవతల అనుగ్రం చేత ఆ చనిపోయిన పిల్లలందరినీ బ్రతికిన్చుకుంది. మళ్ళి ఆ పిల్లలందరినీ, గరుత్మంతునకు అప్పగించింది , మళ్ళి వాళ్ళను సూర్యమండలం వైపు తీస్కువెల్లొద్దు అన్నది. ఆయన ప్రతిరోజూ తీస్కేల్తున్నాడు తిప్పుతున్నాడు , ఒకనుకోక రోజున ఆయన మనసు కుంగిoది, ఏమిటిది నేను ఎందుకు ఇలా ఊడిగం చెయ్యటం, ఇంత శక్తి ఉంది ఇంత బలం ఉంది నేనేoదుకు ఈ పాముల్ని ఇలా తిప్పుతూ ఉండడం. పాముల్ని ఇలా తిప్పి నేను మాట పడ్డాను , అమ్మ ఎందుకు చేస్తుంది కద్రువ కి సేవ , నేనెందుకు చెయ్యాలి ఈ పాములకి సేవ? ఈ మాట పాముల్ని అదుగుదమనొ ,కద్రువని అదిగిదమనొ ఆయన అనుకోలేదు , అమ్మ ని అడుగుదాం అనుకున్నాడు. అలా వాళ్ళని ఎందుకు అడగలేదు అంటే వినత ఒప్పుకోదు అని మీరు గమనించాలి. పెద్దమ్మ వల్ల ఇబ్బంది వచ్చినా అది ఆసీర్వచనమే. నువ్వు పెద్దమ్మ ని అలా ధీకరించకూడదు. వాళ్ళ తో అలా ప్రవతించ కూడదు అని నేర్పింది వినత. అందుకనే గరుత్మంతుడు అంత స్థితికి చేరాడు. గరుత్మంతుడు వినత తో అంటున్నాడు , అమ్మ ! ఏమిటమ్మా ఈ ప్రారబ్దం ? నేను నా రెక్కల యొక్క వేగం తో వెళ్తూ , నా ముక్కు యొక్క చివరిభాగం తో పొడిస్తే కులపర్వతాలు ముక్కలైపోతాయమ్మా ధూళి కింద రాలిపోతై అమ్మా ! అంత బలం కలవాణ్ణి, అంత ప్రసిద్ధి పొందినవాణ్ణి ఇంత తేజస్సు ఉన్నవాణ్ణి. పనికిమాలిన పాములన్నీ వీపుమీద ఎక్కించుకుని విధులన్నీ తిరుగుతున్నాను , ఏమిటి ఈ ప్రారబ్దం, నువ్వు చుస్తే ఆ కరువకి సేవ చేస్తున్నావు . ఎందుకోచింది ఇదంతా , దీనికి కారణం ఏమిటో చెప్పవా తల్లి అని అన్నాడు. మనం ఎందుకు ఇలా చేస్తున్నాం నువ్వు కశ్యప ప్రజాపతి భార్యవి , ఆవిడ కశ్యప ప్రజాపతి భార్యనే మరి ఎందుకు మనం ఇద్దరం ఇలా ఉంటున్నాం , నాకు కారణం చెప్పమ్మా అన్నాడు. ఇప్పుడు ఆవిడకి ఉన్న ఒకే ఒక దుర్లక్షణం అతిశయం పోయింది దాస్యం లో , అతిశయం పోయి పరిణితి వచ్చింది. దాంతో ఆవిడా కొడుకుతో ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది, నాయన ఒకప్పుడు పందెం కాశాం , ఆ పందెం కాయటం అనే లక్షణమే తప్పు , కానీ పందెం కా శాం, ఓడిపోయం ఇదిగో నేను ఇలా దాస్యం చేస్తున్నాను. అంతే అనుకుంటున్నావా రెండు గుడ్లు పుట్టి నాయి నాకు , నీకు అన్న గారు ఒకడు ఉన్నాడు అరుణుడు, నేను కేవలం తల్లిని తొందరగా అవ్వలేక పోయాను అనే అతిశయము వలన అధోభాగం సరిగా ఏర్పడని పిల్లవాడు పుట్టాడు. వాడికి ఎంత బాధ వేస్తుంది , వాడు నన్ను శపించాడు 500 సంవత్సరములు దాస్యం చేస్తావు. ఈ రెండో
గుడ్డులోంచి పుట్టే పిల్ల వాడి వలన నీకు దాస్యం పోతుంది అన్నాడు. కాబట్టి నాయన అప్పటి నుండి నేను ఎదురు చూస్తున్నాను. నీ వలన నాకు దాస్యం పోతుంది అని నమ్మి ఉన్నాను. వృద్దిలోకి వచ్చిన పిల్లల వలన తల్లి తండ్రులు కష్టములనుండి బయట పడితే తల్లి తండ్రులకు సంతోషం సృష్టిలో ఉన్న మర్యాద కదా అని అంది ఆవిడ. అలా ఆ వినత గరుత్మంతుని తో చెప్తే , ఆయన ఆ పాముల దగ్గర కి వెళ్లి వాట్ని విహారానికి తీస్కెళ్ళి తీస్కొచి , ఒక చోట కుర్చుని, వాళ్ళతో ఒక మాట అన్నాడు , నేను మిమ్మల్ని సేవిస్తున్నాను , మా అమ్మ మీ అమ్మ ని సేవిస్తుంది , వీటన్నిటికి కారణం వాళ్ళిద్దరి మధ్య జరిగిన పందెం. నేను మీకు ఏమి చేస్తే నన్ను మా అమ్మ నీ దాస్యం నించి విముక్తి చేస్తారు అని అడిగాడు. అలా అంటే వాళ్ళు ఒక మాట అనొచ్చు పుట్టినప్పతినించి పినమ్మ అంత చేసింది , తమ్ముడు ఇంత చేసాడు , మన మధ్య ఈ అన్నా తమ్ముల సంభంధం ఇలా ఉండిపోతే చాలు అనొచ్చు , మన అమ్మలు అక్క చెల్లెళ్ళు కాబట్టి నువ్వేమి మాకు తేవక్కర్లేదు అనొచ్చు. ఈ క్షణం నించే నిన్ను మీ అమ్మ ని దాస్యం నించి విదిపిస్తున్నాం అనొచ్చు మనం మనం అన్న తమ్ములం అని ఒక మాట అనుంటే , భారతం ఒకలా ఉండేది. అలా అనేంత సంస్కారం కద్రువ నించి పిల్లలకి రాలేదు. ఆవిడ నేర్పలేదు వీళ్ళకి రాలేదు , కాబట్టి వీళ్ళకి కుడా వ్యాపారమే , వీడిని దాస్యం నించి విదిపించాలంటే , వీడి బలాన్ని అడ్డు పెట్టుకుని మనకి చాలా ముఖ్యమైనది తెచ్చుకుంటే బావుంటుందా? కాబట్టి వాళ్ళన్నారు . నీకు బలం ఉంది ,వేగం ఉంది , వెళ్ళ గలవ్ . కాబట్టి అమృతం పట్రా అన్నారు . అమృతం ఎందుకు ? వీళ్ళు తాగుతారు ట . వీళ్ళు తాగితే ఏమవుతుంది , వీళ్ళకి మృత్యువు ఉండదు అలా బ్రతికి ఉంటారు. వీళ్ళు వెయ్యి మంది ఉన్నారు , ఎక్కడికి కదలరు. ఆవిడకి ఇద్దరే పిల్లలు ఒకడు అరుణుడు , అతనికి అమ్మ ని చూడటానికి సమయం ఉండదు , ఎందుకంటే సూర్యుని రాధ సారధి కాబట్టి. ఇప్పుడు మిగిలింది ఈ ఒక్క పిల్లాడు , ఆమె కి మనశాంతి అంటే వీడిని చుస్కునే , ఇప్పుడు ఇతనిని అమృతం తెమ్మని పంపిస్తే ఎవరి మీదకి యుద్దానికి వెళ్ళాలి ? దేవలోకం లో ఇంద్రుడి మీదకి వెళ్ళాలి , దేవతా శక్తులు అంటే సామాన్య మైనవా? దేవతలు అందరూ కలిపి మట్టు పెట్టేస్తే ఈయన్ని , పోతే పోతాడు , మీకు నష్టం మాకేమవుతుంది పోతే ఒక దాసుడు పోతాడు, వస్తే ఇంక మాకు జర లేదు మరణం లేదు, ఇంక ఈయన లేకపోయిన , ఈయన ఉంటె ఏముంటాయొ అవన్నీ మాకు ఉంటై. ఎంత క్రూరమైన ఆలోచనో మీరు ఆలోచించండి . ఇలా ఆలోచించా అనే కనీస పరిణితి కానీ మర్యాద కానీ వాళ్ళకి లేవు, అప్పుడు గరుత్మంతుడు చాలా సంతోషంగా అని అంగీకరించాడు. ఆయన కి ఎందుకు సంతోషం , హమ్మయ్యా మా అమ్మ దాస్యం విడుదల అయిపోతుంది. ఇది రక్షించింది. మాతృ భక్తి ఉండే అదే శ్రీ రామ రక్ష, అమ్మ నోటి మాట యే అంగ రక్ష. అమ్మ దగ్గరకి వెళ్లి నమస్కరించి, అమ్మా నీ దాస్యం విడిపించడానికి వెళ్తున్ననమ్మా వాళ్ళు అమృతం అడిగారమ్మా పాములు, అమృతం తేవటానికి వెళ్తున్ననానమ్మ అని అన్నాడు. ఆవిడా హమ్మయ్య వీడు ఇంత బలవంతుడు , జాగ్రత్త గా తేగలడు , తెచేయ్యి అనలేదు. అమ్మ కున్న లక్షణం ఏమిటంటే ఆ మాట అమ్మ తప్ప ఇంకెవ్వరు అనలేరు. నాన్న నా ఆయుర్ధాయం కూడా పోస్కుని జీవించెయ్ రా అని దీవిస్తుంది. త్రికరణ శుద్ధి గా ఆ మాట అనేది అమ్మ ఒక్కతే.
అమృతం తెచేయ్యటం అంటే ఏ కాగితంమో కాలమో తేవటం కాదు , వాళ్ళు అస్త్రములు ,శస్త్రములు ప్రయోగిస్తారు, పిల్ల వాడి శరీరం ఎక్కడ సోక్కిపోతుందో , అమ్మ మనసు ఆవిష్కృతం చేస్తున్నారు నన్నయ్య గారు. ఆమె ఆశ్ర్వచనం చేస్తూ నాయనా , వాయువు సంతతము నీ రెక్కలను కాపాడు గాక. చంద్రుడు నీ వీపును రక్షించు గాక!, అగ్ని నీ శిరస్సు ని రక్షించు గాక !, సూర్యుడు నీ శరీరము అన్థతినీ రక్షించు గాక! అమ్మ చేసిన రక్ష ఏదైతే ఉందొ
అది సాక్షాత్తు పరబ్రహ్మము చేసిన ఆశీర్వచనమే. నాయన బయలుదేరు అన్నది . తప్పకుండా బయలు దేరుతాను కానీ అమ్మ అంత పెద్ద పనిమీద వెళ్ళేటప్పుడు కడుపు నిండా తిని వెళ్ళాలి కదమ్మా , ఆకలేస్తుంది , నా కడుపుకి సరిపడే అంత ఆహరం ఎక్కడ ఉందొ చెప్పమ్మా తిని బయలు దేరుతాం అన్నాడు.
గుడ్డులోంచి పుట్టే పిల్ల వాడి వలన నీకు దాస్యం పోతుంది అన్నాడు. కాబట్టి నాయన అప్పటి నుండి నేను ఎదురు చూస్తున్నాను. నీ వలన నాకు దాస్యం పోతుంది అని నమ్మి ఉన్నాను. వృద్దిలోకి వచ్చిన పిల్లల వలన తల్లి తండ్రులు కష్టములనుండి బయట పడితే తల్లి తండ్రులకు సంతోషం సృష్టిలో ఉన్న మర్యాద కదా అని అంది ఆవిడ. అలా ఆ వినత గరుత్మంతుని తో చెప్తే , ఆయన ఆ పాముల దగ్గర కి వెళ్లి వాట్ని విహారానికి తీస్కెళ్ళి తీస్కొచి , ఒక చోట కుర్చుని, వాళ్ళతో ఒక మాట అన్నాడు , నేను మిమ్మల్ని సేవిస్తున్నాను , మా అమ్మ మీ అమ్మ ని సేవిస్తుంది , వీటన్నిటికి కారణం వాళ్ళిద్దరి మధ్య జరిగిన పందెం. నేను మీకు ఏమి చేస్తే నన్ను మా అమ్మ నీ దాస్యం నించి విముక్తి చేస్తారు అని అడిగాడు. అలా అంటే వాళ్ళు ఒక మాట అనొచ్చు పుట్టినప్పతినించి పినమ్మ అంత చేసింది , తమ్ముడు ఇంత చేసాడు , మన మధ్య ఈ అన్నా తమ్ముల సంభంధం ఇలా ఉండిపోతే చాలు అనొచ్చు , మన అమ్మలు అక్క చెల్లెళ్ళు కాబట్టి నువ్వేమి మాకు తేవక్కర్లేదు అనొచ్చు. ఈ క్షణం నించే నిన్ను మీ అమ్మ ని దాస్యం నించి విదిపిస్తున్నాం అనొచ్చు మనం మనం అన్న తమ్ములం అని ఒక మాట అనుంటే , భారతం ఒకలా ఉండేది. అలా అనేంత సంస్కారం కద్రువ నించి పిల్లలకి రాలేదు. ఆవిడ నేర్పలేదు వీళ్ళకి రాలేదు , కాబట్టి వీళ్ళకి కుడా వ్యాపారమే , వీడిని దాస్యం నించి విదిపించాలంటే , వీడి బలాన్ని అడ్డు పెట్టుకుని మనకి చాలా ముఖ్యమైనది తెచ్చుకుంటే బావుంటుందా? కాబట్టి వాళ్ళన్నారు . నీకు బలం ఉంది ,వేగం ఉంది , వెళ్ళ గలవ్ . కాబట్టి అమృతం పట్రా అన్నారు . అమృతం ఎందుకు ? వీళ్ళు తాగుతారు ట . వీళ్ళు తాగితే ఏమవుతుంది , వీళ్ళకి మృత్యువు ఉండదు అలా బ్రతికి ఉంటారు. వీళ్ళు వెయ్యి మంది ఉన్నారు , ఎక్కడికి కదలరు. ఆవిడకి ఇద్దరే పిల్లలు ఒకడు అరుణుడు , అతనికి అమ్మ ని చూడటానికి సమయం ఉండదు , ఎందుకంటే సూర్యుని రాధ సారధి కాబట్టి. ఇప్పుడు మిగిలింది ఈ ఒక్క పిల్లాడు , ఆమె కి మనశాంతి అంటే వీడిని చుస్కునే , ఇప్పుడు ఇతనిని అమృతం తెమ్మని పంపిస్తే ఎవరి మీదకి యుద్దానికి వెళ్ళాలి ? దేవలోకం లో ఇంద్రుడి మీదకి వెళ్ళాలి , దేవతా శక్తులు అంటే సామాన్య మైనవా? దేవతలు అందరూ కలిపి మట్టు పెట్టేస్తే ఈయన్ని , పోతే పోతాడు , మీకు నష్టం మాకేమవుతుంది పోతే ఒక దాసుడు పోతాడు, వస్తే ఇంక మాకు జర లేదు మరణం లేదు, ఇంక ఈయన లేకపోయిన , ఈయన ఉంటె ఏముంటాయొ అవన్నీ మాకు ఉంటై. ఎంత క్రూరమైన ఆలోచనో మీరు ఆలోచించండి . ఇలా ఆలోచించా అనే కనీస పరిణితి కానీ మర్యాద కానీ వాళ్ళకి లేవు, అప్పుడు గరుత్మంతుడు చాలా సంతోషంగా అని అంగీకరించాడు. ఆయన కి ఎందుకు సంతోషం , హమ్మయ్యా మా అమ్మ దాస్యం విడుదల అయిపోతుంది. ఇది రక్షించింది. మాతృ భక్తి ఉండే అదే శ్రీ రామ రక్ష, అమ్మ నోటి మాట యే అంగ రక్ష. అమ్మ దగ్గరకి వెళ్లి నమస్కరించి, అమ్మా నీ దాస్యం విడిపించడానికి వెళ్తున్ననమ్మా వాళ్ళు అమృతం అడిగారమ్మా పాములు, అమృతం తేవటానికి వెళ్తున్ననానమ్మ అని అన్నాడు. ఆవిడా హమ్మయ్య వీడు ఇంత బలవంతుడు , జాగ్రత్త గా తేగలడు , తెచేయ్యి అనలేదు. అమ్మ కున్న లక్షణం ఏమిటంటే ఆ మాట అమ్మ తప్ప ఇంకెవ్వరు అనలేరు. నాన్న నా ఆయుర్ధాయం కూడా పోస్కుని జీవించెయ్ రా అని దీవిస్తుంది. త్రికరణ శుద్ధి గా ఆ మాట అనేది అమ్మ ఒక్కతే.
అమృతం తెచేయ్యటం అంటే ఏ కాగితంమో కాలమో తేవటం కాదు , వాళ్ళు అస్త్రములు ,శస్త్రములు ప్రయోగిస్తారు, పిల్ల వాడి శరీరం ఎక్కడ సోక్కిపోతుందో , అమ్మ మనసు ఆవిష్కృతం చేస్తున్నారు నన్నయ్య గారు. ఆమె ఆశ్ర్వచనం చేస్తూ నాయనా , వాయువు సంతతము నీ రెక్కలను కాపాడు గాక. చంద్రుడు నీ వీపును రక్షించు గాక!, అగ్ని నీ శిరస్సు ని రక్షించు గాక !, సూర్యుడు నీ శరీరము అన్థతినీ రక్షించు గాక! అమ్మ చేసిన రక్ష ఏదైతే ఉందొ
అది సాక్షాత్తు పరబ్రహ్మము చేసిన ఆశీర్వచనమే. నాయన బయలుదేరు అన్నది . తప్పకుండా బయలు దేరుతాను కానీ అమ్మ అంత పెద్ద పనిమీద వెళ్ళేటప్పుడు కడుపు నిండా తిని వెళ్ళాలి కదమ్మా , ఆకలేస్తుంది , నా కడుపుకి సరిపడే అంత ఆహరం ఎక్కడ ఉందొ చెప్పమ్మా తిని బయలు దేరుతాం అన్నాడు.
No comments:
Post a Comment