Monday, September 8, 2014

ఆదిపర్వం 13

భగవంతుని అనుగ్రహం ఉంటే నోటి వెంట పలక వలసిన పలుకు పలుకుతుంది, భగవంతుని అనుగ్రహం లేకపోతే ఆ సమయానికి పలక వలసిన పలుకు విస్మ్రుతిని ని పొందుతుంది. వాళ్ళు(పాములు ) మాకు అమృతం తెచ్చి ఇవ్వు అన్నారు , అక్కడితో అయిపొయింది ఆయన (గరుత్మంతుని ) కర్తవ్యమ్. నువ్వు మాతో అమృతం తాగించు అంటే కధ ఇంకోలా ఉండేది. వాళ్ళు అలా అని వుంటే , వాళ్ళు అమృతం తాగే వరకు ఉండే కర్తవ్యమ్ అంతా , గరుత్మంతుని మీద ఉండేది. ఇవ్వటానికి తాగించడానికి మద్య లోని పూచీ వాళ్ళ మీదకి వెళ్ళింది. అక్కడే వాళ్ళు నిలబెట్టుకోలేక పోయారు . ఇది ఈశ్వరుడు ముందే చేసిన సంకల్పం.
ఇప్పుడు గరుత్మంతుడు తల్లి దగ్గర ఆశీర్వచనం తీస్కుని , తల్లి నేను అమృతం తీస్కుని రావటానికి వెళ్తాను అంతకన్నా ముందు నాకు ఆకలిగా ఉంది,  నేను తినటానికి సరిపడే ఆహరం ఎక్కడ ఉందో చెప్పమ్మా అన్నాడు. దేవతల తో యుద్ధం చెయ్యాలి అంటే బలం ఉండాలి మనసుకి జవం ఉండాలి. ఈ రెండూ నిలబడాలి అంటే నీరసం రాకుండా ఉండాలి, అది రాకుండా ఉండాలంటే కడుపునిండా తిని ఉండాలి , నువ్వు అమ్మవి కాదు , అన్నం గురించి అడిగితే నిన్ను అడగాలి. నేను కడుపు నిండా తినాలని అనుకుంటున్నాను , నాకు ఆహరం ఎక్కడ దొరుకుతుంది అమ్మా అన్నాడు. అప్పుడు ఆవిడ ఏది పడితే అది తినేసేయి అని ఆవిడ భోధ చెయ్య లేదు, ఆవిడ పరమ ధార్మికమైన మాట ఒకటి చెప్పింది.  సముద్రం లో బోయలు ఉన్నారు , వారు నిషాదులు. వారు ధర్మము ని తప్పి ఉగ్రమైన స్థితి లో ఉన్నారు.
 ఆ ఉగ్రమైన స్థితి లో వారు సముద్ర గర్భం లో ఉంటూ, భూమి మీదకి వచ్చి , భూమి మీద ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని చనకుతున్నారు. కాబట్టి ఆ సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ నిషాదుల సంఖ్యా అపరిమిత , అంతా ఇంతా అని చెప్పటానికి లేదు. ఆ సముద్రం లో ఉన్న వారిని ఒక క్షణం లో తినేయి అంది అంటే ఆ లెక్కలేనoత మంది నిషాదుల్ని ఆయన ఎంత సేపట్లో తినగాలడో ఆవిడకి తెలుసు. ఆహరం తీస్కునే టప్పుడు రుచి యందు లౌల్యమ్ ఉండకూడదు , అలా అని రుచి లేని ఆహరం తినమని శాస్త్రం చెప్పదు , కాని దానియందు లౌల్యము తో ఇంకా అదే పనిగా ఆ ప్రీతీ తో తినకూడదు.
కాబట్టి క్షణం లో తినేసేయి , కానీ ఒకటి గుర్తుంచుకో అందులో బ్రాహ్మణుడు ఉండవచ్చు, నువ్వు బ్రాహ్మణున్ని కుడా తినేశావు అని గుర్తు ఏమిటో తెలుసా, కంఠo  వరకి వెళ్లి ఆ కంఠo  నుంచి దాటి వెళ్ళడు.  నిప్పు కణిక కంఠo లో పెట్టుకున్నట్టు మండుతాడు , కక్కేయి బయటకి, తప్ప ఆయన్ని మింగకు , ఎందువలనా అంటే ఆయన అధర్మము తో ఉన్న బ్రాహ్మణుడు కాడు , అధర్మం తో ఉన్నవాడు అయితే వాడూ పోతాడు లోపలకి.  అలా ధర్మం తో కూడిన బ్రాహ్మణున్ని మింగావా ఆయనకి కోపం వస్తుంది, కోపం వచ్చిందా నోటి వెంట కోపం తో కూడిన వాక్కు బయటకి వస్తుంది. పరమ ధార్మికుడైన బ్రాహ్మణునికి కోపం వస్తే ఆయనే శస్త్రం అయిపోతాడు. అస్త్రం వేరు శస్త్రం వేరు, శస్త్రన్ని మీరు మీ బలం తో గుచ్చ వలసి ఉంటుంది. అస్త్రం అనేది మంత్రం తో ప్రయోగించేది.
కాబట్టి బ్రాహ్మణుడు శస్త్రం అవుతాడు (కత్తి , గొడ్డలి ) , ఆయనే లోపలి వెళ్లి బ్రాహ్మణున్ని తిన్న పాపం కట్టి కుడిపి విషం అయి చంపేస్తాడు. కాబట్టి తినకు. అతడు అగ్నిహోత్రం అయ్యి కాల్చేస్తాడు. అంతటి ఉత్తముడైన బ్రాహ్మణుణ్ణి  గౌరవిస్తే సంతోషిస్తాడు. ఆ సంతోషం నీకు ఈస్వరానుగ్రహాన్ని తీస్కోచేస్తుంది. ఆయన గురువై నీకు ఎంత ప్రీతీ కలగలో నీకు అభ్యున్నతి ని కలగచేస్తాడు , సరే అమ్మా నువ్వు చెప్పింది జ్ఞాపకం ఉంచుకుoటాను, అని చెప్పాడు, బయలుదేరాడు. వెంటనే బయలుదేరి ఆ సముద్రం దగ్గరకి వెళ్ళాడు , అక్కడా ఆ నిషాదులందరినీ కూడా తన నోటి సంపుటములతో పట్టుకొని, ఒక్కసారి లోపాలకి మింగేసాడు , అందులో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. తల్లి పరాకుగా చెప్పటం ఎంత   మంచిదైనదో చుడండి.
ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు నిప్పు కణిక అడ్డు పడినట్టు , గొంతుకు అడ్డు పడ్డాడు. అప్పుడు గరుత్మంతుడు నోరు తెరచి , నేను మిమ్మల్ని మింగటం లేదు కాబట్టి మీరు బయటకి వచ్చేసేయ్యండి అన్నాడు.  లోపల నించి బ్రాహ్మణుడు మాట్లాడాడు. దయ ఉన్నవాడు , ధర్మం ఉన్న వాడు అనటానికి గుర్తు అది. నేను బ్రాహ్మణున్ని , నువ్వు నన్ను బయటకి రమ్మని అంటున్నావు , కానీ నేను రాను , నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నా భార్యగా ఒక బోయ వనిత ఉంది నాతో, అంటే ఒక బోయ వనితని వివాహం చేస్కున్నాడు, అది అధర్మమా అంటే , నేను మీతో మనవి చేశాను, కొన్ని కొన్ని ప్రత్యెక కరణముల యందు బ్రాహ్మణుడు నాలుగు వర్ణముల వారినీ వివాహం చేస్కుంటారు అని కాబట్టి ఈమె ని వివాహo  చేస్కోవటం ఆయన యందు దోషం కాదు , ఇప్పుడు నా భార్య కూడా ఉంది నాతో , ఆమెని విడిచి నన్ను ఒక్కన్నే రమ్మంటావా ? నా భార్య తో రమ్మంటావా  అంటూ యశ స్సు   కోరుకునే వాడా చెప్పు అన్నాడు.
ఇప్పుడు గరుత్మంతుడు అన్నాడు , బోయలు అపవిత్రంగా ,అధార్మికం గా ఉన్నారు అని కదా నేను వాళ్ళని మింగేశాను , లేకపోతే వాళ్లజోలికి కూడా వెళ్ళమనదు  వినత. అపవిత్రులైన పవిత్రులైన  వారితో కలిసి ఉంటె ఎప్పటికో ఒకప్పటికి పవిత్రులు అవుతారు. కాబట్టి ఇప్పుడు నీతో కుడి ఉన్నదే నీ భార్య , ఆమెని విడవ మని నీకు ఎందుకు చెప్తాను ధర్మం. కాబట్టి నువ్వు నీ భార్య తో కలిసి బయటకి వచ్చేయి  అన్నాడు , అప్పుడు బ్రహ్మణుడు ఆయన భార్య తో కలిసి బయట కి వచ్చేశాడు.
పైకి చెప్పటానికి ఆయన ఆహారం తిన్నట్టు గా ఉంటుంది. లోపల ఇంత ధర్మ స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది మహాభారతం. ఇప్పుడు బయటకి వచ్చిన బ్రాహ్మణుడు పరమ సంతోషాన్ని పొందాడు, ఏమి చెప్పింది వినత ,. ఆ సంతోషమే నీ కార్యము నెరవేరటానికి హేతువు అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు కార్యం నడిచిపోతుంది అని గుర్తా కాదా , అమృతాపహరణం చేసేస్తాడా చెయ్యడా ? చేసేస్తాడు , ముందే తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన నిషాదులన్దరిని తినేసి ఒక్కసారి పైకి ఎగిరాడు , ఆకలి తీరలేదు, అమ్మ తినమంది కానీ అనంతమైన ఈ నిషాదుల్ని తినటం వలన ఆయన కి ఏమీ ఆకలి తీరలేదు. ఇంకా ఆకలి  వేస్తోంది.  అర్థాకలి మరీ ఘోరం. మళ్ళి అమ్మని అడగటం ఎందుకని , ఈయన ఆ దగ్గరలో ఉన్న కశ్యప ప్రజాపతి దగ్గరకి వెళ్ళాడు.
వెళ్లి అడిగాడు , అయ్యా నేను అమ్రుతపహరణం కి వెళ్తున్నాను , అమ్మ ని దాస్యం నించి విముక్తి చెయ్యటానికి, నాకు ఆకలి తీరలేదు కాబట్టి , ఏది నేను తినాలో మీరు చెప్పండి అని అడిగాడు గరుత్మంతుడు. ఒక కార్యం నిమిత్తం వేల్తునప్పుడు దానికి ముందు ఎటువంటి పదార్ధం తినాలో అటువంటి పదార్థం ఏమిటి అని పెద్దలని అడిగి తిని వెళ్ళటం చాలా మంచిది.
అప్పుడు కశ్యప    ప్రజాపతి అన్నాడు "నాయన ఇక్కడికి  దగ్గర లో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు లో ఒక తాబేలు ఉంటుంది , వోడ్దున ఒక ఏనుగు ఉంటుంది. నీటిలో తాబేలుకి ఒడ్డు నున్న ఏనుగుకి యుద్ధం ఎందుకు , అవి రెండూ ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటాయి. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు  అంటే వొంట్లో  బలం ఉంది , ఆ బలం ఎందుకు అంటే తినటం వల్ల వచ్చింది.  అవి తిని అలా కొట్టుకుంటూ ఉంటై . ఇద్దర్లో ఎవరూ ఎవరికీ లొంగరు , ఆ ఇద్దరినీ గజ కచ్చపములు  అని పిలుస్తారు. అవి ఎవరో నీకు తెలుసా , విభావసుడు , సుప్రతీకుడు అనే అన్న దమ్ములు ఉండే వారు, అందులో విభావాసుడు అన్నగారు ఆయన తమకు పిత్రార్జితమైన ఆస్థి ని అన్న అయిన విభావసుడు తన దగ్గర ఉంచుకొని , తమ్ముణ్ణి జాగ్రత్త గా చుస్కున్తున్నాడు. ఒకానొకప్పుడు తమ్ముడికి కోరిక పుట్టింది , ఆస్తి పంచుకొందాం అని ఇప్పుడు సుప్రతీకుడు అన్న అయిన విభావసుడు దగ్గరకి వెళ్లి మన తాతలు  తండ్రులు సంపాదించింది ఏదైతే ఉందొ దాన్ని ధర్మ బద్ధం గా రెండు భాగములు చేసేసేయి ఇద్దరం అనుభవిద్దాం అన్నాడు, దానికి విభావాసుడు అంగీకరించలేదు.  వాటా లు  వేసు కో వటం ఏమిటి ? పంచుకోవటం ఏమిటి , ఇప్పుడు నీకు వచ్చిన ఉపద్రవం ఏమిటి అని అడిగాడు, కలిసి ఉందాం అన్నాడు. తమ్ముడు అధిక్షేపించాడు. అన్నగారికి కోపం వచ్చి నువ్వు చాలా మధొన్మత్తుడ వై మాట్లాడుతున్నావు, కాబట్టి నువ్వు ఏనుగు అయిపోవుదువు గాక! అని శపించాడు. తమ్ముడికి కోపం వచ్చి నేను పంచి ఇమ్మంటే ఇవ్వలేదు కనుక నువ్వు తాబేలువి అయిపో అన్నాడు. ఇద్దరి శాప వాక్కుల కి ఇద్దరు గజకచ్చపములు అయ్యారు.
ఈ తాబేలు 3 ఆమడల ఎత్తు , పది ఆమడల వెడల్పు, అంత పెద్దదా తాబేలు. ఏనుగు 6 ఆమడల ఎత్తు 12 ఆమడల వెడల్పు. అంత పెద్ద పెద్ద ప్రాణులు రెండూ, ఇవి దేబ్బలడుకుంటూ ఉంటాయి. వీళ్ళ గొడవ ఎప్పుడో అప్పుడు అగిపొవలా, కాబట్టి పరిష్కారం లేని ఈ సమస్యకి పరిష్కారం నువ్వు చేసెయ్యి. నువ్వెళ్ళి తినేయి వాళ్ళిద్దరిని అన్నాడు కశ్యపుడు. అంటే సరే నాన్నగారు తినేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయన కి పెద్ద విషయం ఏమి కాదు చేసేస్తాడు. కానీ కశ్యప ప్రజాపతి ఎందుకు చెప్పినట్టు?
ఎందుకు వెళ్తున్నాడు గరుత్మoతుడు, అమ్రుతాపహరణం చెయ్యటానికి, ఎందుకు అంటే అన్నల కోసం. వాళ్ళకెందుకు అమృతం , గరుత్మంతుడు తేరగా దొరికాడు కాబట్టి.
ఇందులో మీరు ఒక విషయం గమనించుకోవాలి, కలిసి ఉన్న వాళ్ళు విడిపోవటం అన్న మాట తెచ్చుకోకూడదు. విడిపోవటం అంటూ జరిగితే , విడిపోవటం అత్యంత ప్రేమతో , అత్యంత మర్యాద తో జరిగితే ఇద్దరూ వృద్దిలోకి వస్తారు.  అలా కాకుండా పోరుబాట లో విడిపోయారు అనుకోండి , ఇద్దరు వృద్దిలోకి రారు. ఎందుకంటే దేబ్బలాడుకోవటం అంటూ జరిగాక, ఇంక కలిసి  ఉండటం ఉండదు , దేప్పిపోడుపులే ఉంటాయి. అందుకే ఏది పంచుకున్నా ప్రేమతో పంచుకోవాలి కాని పోరు మాత్రం కాదు. పోరు నష్టం పొందు లాభం.
అలా ఐశ్వర్యం కోసం దెబ్బలాడు కున్న ఇద్దరు నీకు ఆహారం అవుతున్నారు. ఇద్దరూ కలిసి మూడో వాడి చేతిలో చస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇద్దరికీ బుద్ది వస్తుంది . ఇద్దరం కలిసుంటే ఈ పని చేసుండే వాడా వీడు అన్న భావం వస్తుంది . ఇక అక్కడిదితో ఆ వైరం పోతుంది. అని చెప్తే అప్పుడు బయలు దేరాడు గరుత్మంతుడు . ఇప్పుడు తనకీ ఒక విషయం అర్థం అవుతుంది కదూ.
ఇప్పుడు ఆ రెండు గజకచ్చపాలని రెక్కలతో కొట్టాడు, అవి హతాశులై పోయాయి.  ఇప్పుడు అకస్మాత్తు గ గాలిలోకి ఎగిరాడు. ఇప్పుడు ఈ మూడు కూర్చుంటే సహించ గలిగే చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. అలా వెళ్ళటం లో అలభము అనే ఒక వనం వైపుకి వెళ్ళాడు. అక్కడ రోహిణము  అనే ఒక చెట్టు ఉంది , అది ఒక దివ్య ప్రాణి , వాటికి ఆ లక్షణం ఉంటుంది. అది గరుత్మంతుని పిలిచింది. నా కొమ్మ 100
ఆమడల పొడవు ఉంది నువ్వు వచ్చి నా కొమ్మ మీద పెట్టుకుని తిను అని చెప్పింది. ఆయన అంత వేగం తో వాటిని ఆ కొమ్మ పైన పెట్టుకుని తింటానికి ఉద్యుక్తుడు అవుతున్నాడు. ఈ లోపల ఆ కొమ్మ విరిగి పడిపోతుంది విరిగి పోతే వచ్చే నష్టం ఏముంది , మళ్ళి వీటిని రెండింటిని పట్టుకుని ఎగిరిపోవచ్చు, కానీ దానికి వలకిల్యులు వేలాడుతున్నారు,  వాకిల్యులు ఆశ్చర్యకరమైన జననం ఉన్న వారు పౌరాణిక వాంగ్మయం లో ఎక్కువగా కనపడతారు. భారతం లో కాదు కాని బ్రహ్మ వైవర్త పురాణం లో వాలకిల్యుల గురించి విశేషం గా వర్ణన చేస్తారు. వారు స్వయం గా బ్రహ్మ కి పుత్రులు, వారు ఆజన్మ బ్రహ్మ చారులు , వాళ్ళు ఊర్ధ్వ రేతస్కులు , వాళ్ళ శరీరాలు కూడా  బొటన వేలు ఎంత  ఉంటుందో అంతే ఉంటారు.  అంగుష్ట మాత్ర శరీరులు, కానీ అపారమైన వాగ్బలం ఉన్నవారు. వారి తప్పస్శక్తి వలన వారు నోరు తెరచి ఒక మాట అంటే అయిపోతుంది అంతే. వాళ్ళు తలకిందులు గా వేలాడుతూ , సూర్య కిరణాలూ ఆహారముగా తింటూ తపస్సు చేస్తున్నారు. అలంటి కొన్ని వేల మంది , తేనే పట్టు పట్టి నట్టు ఆ కొమ్మకి పట్టుకుని ఉన్నారు. వాళ్ళు అంగుస్ట మాత్రమే ఉండడం తో ఈయన కుర్చుని కొమ్మ విరిగిపోయే టప్పుడు కనపడ్డారు, ఇప్పుడు ఆయన కొమ్మని వదిలేశా డంటే , వలకిల్యుల శరీరాలన్నీ శిధిలమై పోతై , అంతటి మహాత్ములు కానీ నలిగిపోయారా , ఉపద్రవం వస్తుంది. వాళ్ళు పడిపోకూడదని  రెండు కాళ్ళ తో ఏనుగు తాబేలుని పట్టుకుని ముక్కుతో కొమ్మ పట్టుకుని, ఆకాసంలో కి ఎగిరిపోయాడు . ఆ అయన బలం , తేజస్సు , శక్తి మీరు చుడండి. ఇప్పుడు ఉపద్రవమే వచ్చింది , ఆయన వెంటనే గంధమాదన పర్వతం దగ్గరకి వెళ్ళాడు , అక్కడ కశ్యపుడు తపస్సు చేస్కున్తున్నాడు .
ఇప్పుడు గరుత్మంతుడు , నాన్నగారు ఉపద్రవం వచ్చింది , మీరు ఆహరం తినమన్నారు, నేను అవి కొమ్మమీద పెడితే కొమ్మ విరిగిపొయింది. ఆ కొమ్మకి వాలకిల్యులు ఉన్నారు. ఏమి చెయ్యాలి అని అడిగారు. ఇప్పుడు కశ్యపుడు ఆ వలకిల్యుల వైపు చూసి ప్రార్థించాడు. నా కొడుకు ధార్మికుడు, ఒక మహా కార్యం కోసం బయలు దేరాడు , ఈలోపు ఉపద్రవం వచ్చింది. కనుక మీరు అనుగ్రహించి , అనుకోకుండా చేసిన పనే తప్ప కావాలని చేసిన అపకారం కాదు, ఆహారం కోసం ఆ కొమ్మ పిలిస్తే వెళ్ళాడు , ఆగుతుంది అని ఆ చెట్టు అనుకుంది. కానీ అది విరిగి పోయింది , కాబట్టి మీరే ఆ కొమ్మని విడిచి పెట్టి కిందకి దిగిపోయి, ఆ కొమ్మని భూమికి బాగా దగ్గర గా తీస్కోస్తాడు , మీరు కొమ్మ దిగిపోయి, వేరొక ప్రదేశానికి వెళ్లి తపస్సు చేస్కొండి , అప్పుడు నా కొడుకు ఎక్కడో ఈ రెంటిని పెట్టుకొని తింటాడు.
ఇప్పుడు కశ్యపుడు చేసిన ప్రార్థన కి ఆ వాలఖిల్యులు దిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు 100 ఆమడలు ఉన్న ఆ కొమ్మ ఎక్కడైనా  పడేస్తే కింద ఎవరైనా నలిగి  పోవచ్చు, కబట్టి ఇప్పుడు ఆ కొమ్మని బ్రాహ్మణులూ మనుష్యులు లేని ప్రాంతం ఏది ఉందొ చెప్పండి అక్కడ పారేస్తాను అని అడిగాడు నాన్న గారిని గరుత్మంతుడు. అందుకు కశ్యపుడు నువ్వు హిమాలయ పర్వతముల యందు నిష్పురుశము అని ఒక కొండ ఉంది , ఈ కొమ్మ ని అక్కడ కి నువ్వు వెళ్ళు అక్కడ ఏ ఆపదా కలుగదు అక్కడ పడేయి అన్నాడు కశ్యపుడు. ఆ నిష్పురుష పర్వతం అక్కడ నించి లక్ష యోజనముల దూరం ఉంది అక్కడ నించి ఆ గంధమాదన పర్వతం నించి. ఒక్క క్షణం లో ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు , అంటే ఆయన గమన శక్తి అటువంటిది, ఆ కొమ్మని అక్కడ పారేసి , ఆ హిమాలయా పర్వత శికరం
ఈ రెండిటిని పెట్టుకుని చక్కగా ఆరగించేసాడు.  అంటే ముందు ఇతరుల హితములు చూస్కుని తినాలి తప్పా నీ హితమును నువ్వు చూస్కొని తినెయ్య కూడదు. ఇతర భూతముల హితములు చుసిన తర్వాతే తానూ తినాలి.
 












No comments:

Post a Comment